రామకృష్ణాపూర్ పట్టణంలోని గణేష్ మండపాలలో అన్నప్రసాద వితరణ..
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పట్టణంలోని భగత్ సింగ్ నగర్ హట్స్ ఏరియాలో సిద్ది గణేష్ మండలి గణపతి మండపం వద్ద నవరాత్రుల సందర్భంగా గురువారం కమిటి సభ్యులు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ చేశారు. జవహర్ నగర్ లక్ష్మీ గణేష్ మండలి నిర్వాహకులు సైతం అన్న ప్రసాద వితరణ చేపట్టారు.
క్యాతనపల్లి మున్సిపల్ కమీషనర్ రాజు,ఆర్కేపి ఎస్సై రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు,టిపిసిసి సభ్యులు పి రఘునాథ్ రెడ్డి, సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, బింగి శివ కిరణ్, ఎర్రబెల్లి రాజేష్ లు విఘ్నేశ్వరుడిని దర్శించుకున్నారు. పట్టణంలోని భక్తులు అన్నదాన ప్రసాద వితరణలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.