మహిళా అభివృద్ధితోనే ఆర్థిక అభివృద్ధి…

మహిళా అభివృద్ధితోనే ఆర్థిక అభివృద్ధి

◆:- బీమా పథకాలపై అవగాహన

◆:- సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం

◆:- ఎస్బిఐ సీజీఎం సహదేవన్ రాధాకృష్ణన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకుంటూ మహిళలు ఆర్థిక అభివృద్ధి చెందాలని ఎస్బిఐ హైదరాబాద్ సర్కిల్ సీజీఎం (చీఫ్ జనరల్ మేనేజర్ ) సహదేవన్ రాధాకృష్ణన్, డీజీఎం జితేంద్ర కుమార్ శర్మ లు అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జన సురక్ష పై నిర్వహించిన అవగాహన సదస్సుకు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జన్ ధన్, సురక్ష, జీవన్ జ్యోతి, గ్యాస్ సబ్సిడీ, దీన్ దయాళ్, అంత్యోదయ యోజన, కిసాన్ సమ్మన్ నిధి, పీఎంకిసాన్, సుకన్య సమృద్ధి పథకం, బేటీ బచావో బేటీ పడావో తదితర పథకాలపై మహిళా సంఘాలకు అవగాహన కల్పించారు. ప్రతి ఖాతాదారుడు బీమా చేయించుకోవాలని వారు సూచించారు. ప్రతి ఖాతాదారు తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవాలని తెలిపారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని మహిళా సంఘాలకు విజ్ఞప్తి చేశారు. డిజిటల్ అరెస్టు వంటి మోసాలను నమ్మకూడదని, అలాంటి సంఘటనలు జరిగితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంఢీ హైదరాబాద్ రాజీవ్ కుమార్, సంగారెడ్డి ఆర్‌ఎం ఆర్‌బిఓ పపాసాహెబ్ సిరాజ్ బాషా, ఝరాసంగం ఎంపీడీవో మంజుల, వివిధ బ్యాంకుల బ్రాంచ్ మేనేజర్లు, జహీరాబాద్, ఝరాసంగం, కోహిర్, మొగుడంపల్లి, న్యాల్‌కల్, రాయికోడ్ తదితర మండలాలకు చెందిన ఐకెపి సిబ్బంది, మహిళా సంఘాల నాయకులు, సభ్యులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అంతకుముందు కేతకి సంగమేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

చిట్యాల కళాశాలలో బేటి బచావో బేటి పడావో అవగాహన…

ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు భేటీ బచావో బేటి పడావో పై అవగాహన కార్యక్రమం.

చిట్యాల ,నేటి ధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం రోజున జిల్లా మహిళా సాధికారత ఆధ్వర్యంలో డ్రగ్స్ పై మరియు బాల్య వివాహాల పైన బేటి బచావో బేటి పడావో కార్యక్రమం కళాశాల ప్రిన్సిపల్ శ్రీదేవి అధ్యక్షతన విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించినారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐసిడిఎస్ సూపర్వైజర్ జయప్రద పాల్గొని మాట్లాడుతూ విద్యార్థినిలు బాల్యవివాహాలను చేసుకోవద్దని బాగా చదువుకొని ఉన్నత స్థానంలో ఉండాలని అన్నారు, ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లల నిష్పత్తి తగ్గిపోతుందని అమ్మాయిల పైన వివక్షత చూపిస్తున్నారని కాబట్టి అమ్మాయిలు బాగా చదువుకొని సమాజంలో మంచి గుర్తింపు పొందాలని వారికి ఈ సమాజంలో ఎన్నో రక్షణ చట్టాలు వచ్చాయని వాటిని ఉపయోగించుకోవాలన్నారు అలాగే ఏదైనా సమస్య వస్తే 1098కి ఫోన్ చేసి తెలపాలన్నారు, ఈ కార్యక్రమంలో లెక్చరర్ యుగంధర్ కళావతి అనూష మమత మరియు అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version