అనుమతి పత్రాలు లేని 8 ఇసుక ట్రాక్టర్ల పై కేసులు నమోదు.

అనుమతి పత్రాలు లేని 8 ఇసుక ట్రాక్టర్ల పై కేసులు నమోదు.

ఎస్ఐ జి శ్రవణ్ కుమార్.

చిట్యాల, నేటి ధాత్రి :

 

 

చిట్యాల మండల కేంద్రంలో ఎటువంటి అనుమతి పత్రాలు లేని కాల్వపల్లి, అందుకు తండా, నేరేడుపల్లి గ్రామాలకు చెందిన ఎనిమిది ఇసుక ట్రాక్టర్ల పై కేసు నమోదు చేసి ఎమ్మార్వో ముందు ఉంచగా, ఎమ్మార్వో వాటిపై జరిమానా విధించిన తర్వాత వాటిని వదిలివేయడం జరిగింది
ఇకముందు ఎవరైనా అనుమతి పత్రాలు లేకుండా ఇసుక అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని చిట్యాల ఎస్సై జి శ్రవణ్ కుమార్ తెలిపారు,
అలాగే మైనర్ డ్రైవింగ్ చేస్తే ఓనర్ పై కూడా కేసు నమోదు చేస్తామని, వాహనాలకు తప్పకుండా నంబర్ ప్లేట్లు ఉండాలని డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version