“మెట్‌పల్లి రైతుల ఆందోళన: అక్రమ మోరంపై చర్యలు కోరింత”…

మెట్ పల్లి

ఆగస్టు 22 నేటి ధాత్రి

 

 

మెట్ పల్లి పట్టణ రైతులు ఆర్డీవో కి అక్రమంగా మొరం తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందించారు అనంతరం రైతులు మాట్లాడుతూ పట్టణ శివారు వెంకట్రావుపేట రేగుంట లో ఉన్న మా పొలాల తోవలో గుండు గుట్టలను నిత్యం జెసిబి లతో కొంతమంది గ్రూపులుగా ఏర్పడి నిత్యం మూడు నాలుగు జెసిబి లు 20 పైగా ట్రాక్టర్లతో మొరము తరలిస్తూ ఉన్నారు .
ఈ అక్రమ మోరం తీసుకెళ్లేటప్పుడు అతివేగంగా రావడం రాత్రింబవళ్లు లో కూడా ట్రాక్టర్లు తిరగడం పంట పొలాలు వెళ్లే దారి పూర్తిగా ధ్వంసం అయిందని అంతేకాకుండా అనుభవం లేని లైసెన్స్ లేని డ్రైవర్లతో వంట పొలాల్లో ట్రాక్టర్లు దించడం దీని ద్వారా పంటలు ధ్వంసం అవుతున్నాయని ఇంతకుముందు తహసిల్దార్ కి మొరము తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇచ్చిన వారు పట్టించుకోలేదని మొరం డిమాండ్ ఎక్కువ ఉండడంతో జెసిపిల ద్వారా గుండు గుట్ట నుండి తీసుకొచ్చి డ్రంపులు చేస్తూ అధికారులు చూసి చూడనట్టు వివరిస్తున్నారని ప్రస్తుతం గుండు గుట్ట కనుమరుగవుతూ ఉన్నదని అధికారులు మాకేం పట్టింపులేనట్టు వ్యవహరిస్తున్నారని మేము పంట పొలాలకు వెళ్లి కెనాల్ దారిలో అక్కడి కాలనీవాసులు కెనాల్ వెంట సిసి రోడ్డుపై జెసిబి లు ట్రాక్టర్లు మిల్లర్లు కార్లు అన్ని రోడ్లపై నిలుపుతున్నారని బండ్లను తీయమంటే వారు బెదిరిస్తూ భయంతో గురి చేస్తున్నారని దయచేసి మా యందు దయతలిచి మా సమస్యలకు వెంటనే పరిష్కరించాలని అక్రమ మొరంపై చర్యలు తీసుకోవాలని కెనాల్ వెంట సిసి రోడ్డుపై ఉన్న వెహికల్స్ తీయించి మాకు న్యాయం చేయాలని వినతిపత్రం ఇచ్చామని అన్నారు .ఈ కార్యక్రమంలో జెట్టి లింగం ఒజ్జల బుచ్చిరెడ్డి ఎర్రోళ్ల హనుమాన్లు ఆకుల నరేష్ నారాయణ బొడ్ల ఆనందు ఒజ్జల శ్రీనివాస్ కురుమ సాయిలు లక్ష్మణ్ యమ రాజయ్య అరిగేలా లక్ష్మణ్ జెట్టి శ్రీనివాస్ బాలరాజు సంజీవ్ గంగారెడ్డి సురేష్ దేవయ్య తదితర రైతులు పాల్గొన్నారు.

రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ తో సిరిసిల్ల ఆర్టిఏ వీడియో కాన్ఫరెన్స్…

రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ తో సిరిసిల్ల ఆర్టిఏ వీడియో కాన్ఫరెన్స్

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ జరిపిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలో భాగంగా జిల్లాలో జిల్లాకు సంబంధించి జరిపిన అన్ని రకాల వాహనాల కేసుల గురించి జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ మరియు మోటార్ వాహన తనిఖీ అధికారి వంశీధర్ కార్యాలయ నిర్వాహకురాలు కల్పన జరిపిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలో తెలిపిన వివరాలు జిల్లా నుంచి మొత్తం 293 కేసులు రాయడం జరిగిందన్నారు. అందుకుగాను రాష్ట్ర రవాణా శాఖ వారు నిర్ణయించిన 64 లక్షల రూపాయలు 100% గా నియమించారు. దీనికి గాను టాక్స్ మరియు పెనాల్టీ కాంపౌండింగ్ ఫీజు ద్వారా మొత్తంగా 96,96,465 టాక్స్ ఫెనాల్టీ రూపేణా 151 %గా వసూలు చేశామని మని తెలిపారు. అలాగే ఇంకా టాక్స్ కట్టని సరుకు రవాణా వాహనాలు ట్రాక్టర్ ట్రైలర్ ఇతర వాహనాలు 5088 వాహనాలు ఉన్నట్టు. ఈ వాహనాలు మీ స్వంతంగా టాక్స్ కట్టుకుంటే ఎలాంటి పెనాల్టీ లేకుండ కట్టాల్సి ఉంటుంది అదే రవాణా శాఖ అధికారులు పట్టుకుంటే 200 % ఫైన్ తో కట్టాల్సి ఉంటుందని. సరుకు రవాణా వాహనాలు తప్పని సరిగా భీమా, కాలుష్య నియంత్రణ పత్రాలు వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలతో డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని అలాగే పదిహేను సంవత్సరాలు పూర్తి ఐన స్వంత పనులకు వాడే ద్విచక్ర వాహనాలు, స్వంత కార్ లు విధిగా గ్రీన్ టాక్స్ వాహన భీమా వాహన కాలుష్య పత్రాలతో మీ స్వంత వాహనాలను పురుద్దరణ చేసుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి తెలిపారు .పై విషయాన్ని రాష్ట్ర రవాణా కామిషనర్ సురేంద్ర మోహన్ కి తెలియజేశారు.

అనుమతి పత్రాలు లేని 8 ఇసుక ట్రాక్టర్ల పై కేసులు నమోదు.

అనుమతి పత్రాలు లేని 8 ఇసుక ట్రాక్టర్ల పై కేసులు నమోదు.

ఎస్ఐ జి శ్రవణ్ కుమార్.

చిట్యాల, నేటి ధాత్రి :

 

 

చిట్యాల మండల కేంద్రంలో ఎటువంటి అనుమతి పత్రాలు లేని కాల్వపల్లి, అందుకు తండా, నేరేడుపల్లి గ్రామాలకు చెందిన ఎనిమిది ఇసుక ట్రాక్టర్ల పై కేసు నమోదు చేసి ఎమ్మార్వో ముందు ఉంచగా, ఎమ్మార్వో వాటిపై జరిమానా విధించిన తర్వాత వాటిని వదిలివేయడం జరిగింది
ఇకముందు ఎవరైనా అనుమతి పత్రాలు లేకుండా ఇసుక అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని చిట్యాల ఎస్సై జి శ్రవణ్ కుమార్ తెలిపారు,
అలాగే మైనర్ డ్రైవింగ్ చేస్తే ఓనర్ పై కూడా కేసు నమోదు చేస్తామని, వాహనాలకు తప్పకుండా నంబర్ ప్లేట్లు ఉండాలని డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version