ఆస్తి పన్ను వడ్డీ పై తొంభై శాతం రాయితీ.

ఆస్తి పన్ను వడ్డీ పై తొంభై శాతం రాయితీ…

మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోనీ ఇండ్లపై, ఇంటి స్థలాల పై ఆస్థి పన్ను బకాయి ఉన్నట్లేతే ఈ నెల 31 లోపున చెల్లిస్తే వడ్డీపై 90% రాయితీని పొందుతారని మున్సిపాలిటీ కమిషనర్ గద్దె రాజు ఒక ప్రకటనలో తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను బకాయి ఉన్నవాళ్లకి గత సంవత్సరపు పెండింగ్ ఆస్తి పన్ను, ప్రస్తుత ఆస్థీ పన్ను ను ఈనెల 31 లోపు చెల్లించినట్లయితే వడ్డీ పై 90% రాయితీని కల్పించిందని , ఓటిఎస్ స్కీం ద్వార ఆస్తీ పన్ను బకాయి చెల్లించవచ్చని కమీషనర్ తెలిపారు.

ఆస్తి పన్ను బకాయి ఉంటే 2019 తెలంగాణ పురపాలక చట్టం లోని సెక్షన్ 87 ప్రకారం ఆస్తులను జప్తు చేసేందుకు వీలుంటుందని తెలిపారు. పుర ప్రజలందరూ గమనించి ఆస్తి పన్ను బకాయిలు ఉన్నట్లయితే వెంటనే చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని కోరారు.

ఆస్తిపన్నుపై 90% వడ్డీ రాయితీ.

ఆస్తిపన్నుపై 90% వడ్డీ రాయితీ

మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి పట్టణ ప్రజలకు శుభవార్త
ఆర్థిక సంవత్సరం 2024-25 వరకు బకాయి పడినటువంటి ఆస్తి పన్ను పై 90% వడ్డీని మినహాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
వన్ టైం సెటిల్మెంట్ (ఓ.టి.ఎస్) పథకం ద్వారా పన్ను చెల్లింపుదారులు ఆర్థిక సంవత్సరం 2024-25 వరకు గల ఆస్తి పన్ను బకాయిలపై గల వడ్డీనీ 90% వరకు మినహాయింపు ఇవ్వడం జరిగినది కేవలము ఆస్తి పన్ను వడ్డీలో కేవలం 10% వడ్డీని ఒకేసారి చెల్లించి వారి యొక్క బకాయిలను పూర్తి చేసుకోవచ్చు, కావున భూపాలపల్లి పట్టణ ప్రజలు ఇట్టి సదా అవకాశాన్ని వినియోగించుకోవాలని మునిసిపల్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ పట్టణ ప్రజలను కోరినారు ఇప్పటికే ఆస్తి పన్ను చెల్లించిన యజమానులకు వారికి వారి యొక్క వడ్డీ రాయితీ భవిష్యత్తు చెల్లింపులతో సర్దుబాటు చేస్తారు కావున పట్టణ సద్వినియోగం చేసుకోవాలి

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version