భద్రత నియమాలతో ప్రమాదాలకు అడ్డుకట్ట: ఎమ్మెల్యే మాధవరెడ్డి

భద్రత నియమాలు పాటిస్తే ప్రమాదాలు నివారించచ్చు

ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు భాగంగా విద్యార్థులతో ర్యాలీ.

నర్సంపేట,నేటిధాత్రి:

ప్రభుత్వం చేపట్టిన రోడ్డు భద్రత నియమాలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చునని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు భాగంగా డిస్ట్రిక్ట్ ట్రాన్ఫోర్ట్ ఆఫీసర్, జిల్లా రవాణా శాఖ అధికారి, శోభన్ బాబు ఆధ్వర్యంలో నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి సాహకారంతో బుధవారం నర్సంపేట పట్టణంలోని వరంగల్ కూడలి నుండి అంబేద్కర్ సెంటర్ వరకు రోడ్డు భద్రత ఫ్లకార్డులతో వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీ ప్రారంభిస్తున్న డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ శోభన్ బాబు

ముందుగా ఈ ర్యాలీని డిస్ట్రిక్ట్ ట్రాన్ఫోర్ట్ ఆఫీసర్ శోభన్ బాబు స్థానిక సిఐ శ్రీనివాస్ తో కలిసి ప్రారంభం చేశారు.ఈ ర్యాలీ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్డు భద్రతల పట్ల అధికారులు తెలుపుతున్న అవి పాటించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.ప్రభుత్వ భద్రత నియమాలు పాటిస్తే 90 నుండి 100 ప్రమాదాలు జరుగకుండా నివారించవచ్చునని పేర్కొన్నారు.నియోజకవర్గంలో అన్ని మండలాల్లో అన్ని రకాల వాహనదారులకు అవగాహన కల్పించదానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

రోడ్డు భద్రత నియమాల గురించి మాట్లాడుతున్న డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ శోభన్ బాబు

డిస్ట్రిక్ట్ ట్రాన్ఫోర్ట్ ఆఫీసర్ శోభన్ బాబు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ఉండేందుకు గాను జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏసీపీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు భద్రత నియమాలు తప్పకుండా పాటించాలని చెప్పారు.హెల్మెంట్, ధృవీకరణ పత్రాలతో వాహనాలు నడపాలన్నారు.మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ , పిసిసి సభ్యుడు పెండెం రామానంద్, మాంటిస్సొరి స్కూల్ చైర్మన్ జగన్ మోహన్ రెడ్డి, మాథర్స్ ల్యాండ్ పాఠశాల ఛైర్మన్ పాశికంటి రమేష్,పలువురు అధికారులు,పోలీస్ శాఖ ఎస్సైలు,కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు,విద్యార్థులు పాల్గొన్నారు.

రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ తో సిరిసిల్ల ఆర్టిఏ వీడియో కాన్ఫరెన్స్…

రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ తో సిరిసిల్ల ఆర్టిఏ వీడియో కాన్ఫరెన్స్

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ జరిపిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలో భాగంగా జిల్లాలో జిల్లాకు సంబంధించి జరిపిన అన్ని రకాల వాహనాల కేసుల గురించి జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ మరియు మోటార్ వాహన తనిఖీ అధికారి వంశీధర్ కార్యాలయ నిర్వాహకురాలు కల్పన జరిపిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలో తెలిపిన వివరాలు జిల్లా నుంచి మొత్తం 293 కేసులు రాయడం జరిగిందన్నారు. అందుకుగాను రాష్ట్ర రవాణా శాఖ వారు నిర్ణయించిన 64 లక్షల రూపాయలు 100% గా నియమించారు. దీనికి గాను టాక్స్ మరియు పెనాల్టీ కాంపౌండింగ్ ఫీజు ద్వారా మొత్తంగా 96,96,465 టాక్స్ ఫెనాల్టీ రూపేణా 151 %గా వసూలు చేశామని మని తెలిపారు. అలాగే ఇంకా టాక్స్ కట్టని సరుకు రవాణా వాహనాలు ట్రాక్టర్ ట్రైలర్ ఇతర వాహనాలు 5088 వాహనాలు ఉన్నట్టు. ఈ వాహనాలు మీ స్వంతంగా టాక్స్ కట్టుకుంటే ఎలాంటి పెనాల్టీ లేకుండ కట్టాల్సి ఉంటుంది అదే రవాణా శాఖ అధికారులు పట్టుకుంటే 200 % ఫైన్ తో కట్టాల్సి ఉంటుందని. సరుకు రవాణా వాహనాలు తప్పని సరిగా భీమా, కాలుష్య నియంత్రణ పత్రాలు వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలతో డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని అలాగే పదిహేను సంవత్సరాలు పూర్తి ఐన స్వంత పనులకు వాడే ద్విచక్ర వాహనాలు, స్వంత కార్ లు విధిగా గ్రీన్ టాక్స్ వాహన భీమా వాహన కాలుష్య పత్రాలతో మీ స్వంత వాహనాలను పురుద్దరణ చేసుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి తెలిపారు .పై విషయాన్ని రాష్ట్ర రవాణా కామిషనర్ సురేంద్ర మోహన్ కి తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version