రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ తో సిరిసిల్ల ఆర్టిఏ వీడియో కాన్ఫరెన్స్
సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )
రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ జరిపిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలో భాగంగా జిల్లాలో జిల్లాకు సంబంధించి జరిపిన అన్ని రకాల వాహనాల కేసుల గురించి జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ మరియు మోటార్ వాహన తనిఖీ అధికారి వంశీధర్ కార్యాలయ నిర్వాహకురాలు కల్పన జరిపిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలో తెలిపిన వివరాలు జిల్లా నుంచి మొత్తం 293 కేసులు రాయడం జరిగిందన్నారు. అందుకుగాను రాష్ట్ర రవాణా శాఖ వారు నిర్ణయించిన 64 లక్షల రూపాయలు 100% గా నియమించారు. దీనికి గాను టాక్స్ మరియు పెనాల్టీ కాంపౌండింగ్ ఫీజు ద్వారా మొత్తంగా 96,96,465 టాక్స్ ఫెనాల్టీ రూపేణా 151 %గా వసూలు చేశామని మని తెలిపారు. అలాగే ఇంకా టాక్స్ కట్టని సరుకు రవాణా వాహనాలు ట్రాక్టర్ ట్రైలర్ ఇతర వాహనాలు 5088 వాహనాలు ఉన్నట్టు. ఈ వాహనాలు మీ స్వంతంగా టాక్స్ కట్టుకుంటే ఎలాంటి పెనాల్టీ లేకుండ కట్టాల్సి ఉంటుంది అదే రవాణా శాఖ అధికారులు పట్టుకుంటే 200 % ఫైన్ తో కట్టాల్సి ఉంటుందని. సరుకు రవాణా వాహనాలు తప్పని సరిగా భీమా, కాలుష్య నియంత్రణ పత్రాలు వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలతో డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని అలాగే పదిహేను సంవత్సరాలు పూర్తి ఐన స్వంత పనులకు వాడే ద్విచక్ర వాహనాలు, స్వంత కార్ లు విధిగా గ్రీన్ టాక్స్ వాహన భీమా వాహన కాలుష్య పత్రాలతో మీ స్వంత వాహనాలను పురుద్దరణ చేసుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి తెలిపారు .పై విషయాన్ని రాష్ట్ర రవాణా కామిషనర్ సురేంద్ర మోహన్ కి తెలియజేశారు.