బిల్లు రద్దు కై ఉద్యమిస్తూనే,చట్టాన్ని రక్షించుకోవాలి..

బిల్లు రద్దు కై ఉద్యమిస్తూనే,చట్టాన్ని రక్షించుకోవాలి

నిజాంపేట్, నేటి ధాత్రి

 

 

 

ఉపాధి హామీ పనులు జరిగే ప్రదేశంలో డి బిఎఫ్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న కూలీల లో కలవడం జరిగింది. ఈ సందర్భంగా సంజీవ్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ కూలీల హక్కులను హరిస్తుందని, కూలీల గొంతును నొక్కేందుకే వీబీ గ్రామ్ జీ బిల్లు 2025 ను తీసుకువస్తుందని,
బిల్లు రద్దుకై ఉపాధి హామీ కూలీలు ఐక్యంగా ఉద్యమించి,ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించుకోవాలని డిబిఎఫ్ జిల్లా అధ్యక్షులు కూలీలకు పిలుపునిచ్చారు.
సోమవారం నాడు నిజాంపేట మండలం వెంకటాపూర్ కె గ్రామంలో ఉపాధి హామీ పనుచేస్తున్న కూలీలను కలిసి చట్టానికి జరిగే నష్టాలను వివరిస్తూ చట్టాన్ని కాపాడుకోవాలని కోరారు.
కేంద్రములో అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఉపాధి హామీ చట్టాన్ని అడుగడుగున ఉల్లంఘింస్తూ కూలీల హక్కులను పూర్తిగా తీసివేస్తూ పనికి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుందని అన్నారు.
ఉపాధి హామీ చట్టాన్ని యదవిధంగా కొనసాగించాలని
కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దేశంలో వామపక్షాలు, సామాజిక శక్తుల తివ్రమైన ఒత్తిడితో వచ్చిన యంజి ఎన్ అర్ ఇజిఎను తీసివేసేందుకు బిజెపి ప్రయత్నం చేస్తుందని అన్నారు.
కూలీలకు పని హక్కులను కల్పించిన మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి విబి గ్రామ్ జి బిల్లు 2025 పేరుతో కేంద్ర ప్రభుత్వం ముందుకు రాబోతుందన్నారు.
దేశంలో రైతాంగ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశంలోని రైతాంగం ఐక్య పోరాటం చేసి నల్ల చట్టాలను రద్దు చేసుకున్నారన్నారు.
నాటి రైతుల స్ఫూర్తితో కూలీలు పోరాటం చేసి ఉపాధి హామీ పని హక్కులను రక్షించుకొవాలన్నారు.
దేశ వ్యాప్తంగా 33 కోట్ల కూలీల హక్కులను కాల రాస్తున్న బిజెపికి వ్యతిరేకంగా కూలీలు ఉద్యమించి తమ హక్కులను కాపాడుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సరిత మధుసూదన్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ కైలాస్, డి బిఎఫ్ మండల అధ్యక్షులు బ్యాగరీ చంద్రం, ఉపాధి హామీ కూలీలు మహిళలు పాల్గొన్నారు.

మోకుదెబ్బ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జూలూరి మనీష్ గౌడ్…

మోకుదెబ్బ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జూలూరి మనీష్ గౌడ్

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట పట్టాణానికి చెందిన జూలూరి మనీష్ గౌడ్ ను గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ అనుబంధ సంఘం యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు నీయామక పత్రం సోమవారం అందజేసినట్లు రమేష్ గౌడ్ తెలిపారు. గౌడ కులస్తుల అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసం మనీష్ గత కొన్నేళ్లుగా చేస్తున్న కృషిని గుర్తించి యువజన సంఘం ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగిందన్నారు. ఈ పదవిలో మనీష్ గౌడ్ రెండేళ్లు కొనసాగుతాడన్నారు.తనను యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించిన అనంతుల రమేష్ గౌడ్, తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు రాగుల కిరణ్ కుమార్ గౌడ్, జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకట్ గౌడ్, నర్సంపేట డివిజన్ అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ గౌడ్, ఎరుకొండ కర్ణాకర్ గౌడ్ లకు మనీష్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ జాగృతి బాధితుల ఐక్యవేదిక.

తెలంగాణ జాగృతి బాధితుల ఐక్యవేదిక.

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

 

తెలంగాణ జాగృతి దాదాపుగా 20 సంవత్సరాల క్రితం పిరియడ్ మందితో మొదలై, తెలంగాణ ఉద్యమంలో మమేకమై పోరాడినటువంటి సంస్థలో, ఎస్సీ, ఎస్టి, బీసీ, మైనారిటీల సహకారంతో జాగృతి అంచలంచెలు ఎదిగిన విషయం వాస్తవం. అప్పటి బడుగు బలహీనవర్గాల కార్యకర్తల కృషితో కల్వకుంట్ల కవిత అధికారం వచ్చిన తర్వాత అందలమెక్కి, అధికార గర్వంతో కార్యకర్తల భుజాలను తొక్కి విలాసవంతమైన జీవితం అనుభవించి, తన గురించి పని చేసిన కార్యకర్తలను మరిచి, అప్పుడు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించకుండా ఈరోజు తమ ఉనికి చాటుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా జాగృతి జనం బాట అనే కార్యక్రమంతో రావడం సిగ్గుచేటు. జాగృతి జనం పాట కార్యక్రమంలో భాగంగా రేపు సిరిసిల్ల జిల్లా పర్యటన కి వచ్చే సందర్భంలో ఎక్కడ కూడా ఆదరణ లభించకపోవడంతో డబ్బులు పంచి, జనాలను మభ్యపెట్టి కొంతమందిని కూడా పెట్టి ఉనికి చాటుకోవడం కోసం మాత్రమే ఈ పర్యటన. పర్యటనకు ముందు సాహితీవేత్తలను, కళాకారులను, బడుగు బలహీన వర్గాలను, మేధావులతో సమావేశాలు పెడతా అని చెప్పి కనీసం వీరిలో ఎవరిని కలవడం లేదు. ఎందుకంటే వీరెవరు కూడా కవితతో కలవడానికి ఇష్టం లేక ముఖం చాటేస్తున్నారు. అందుగురించి ఎక్కడైతే జనాలు ఉంటారో అక్కడికి వెళ్లి వారిని కలవడానికి కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు. గుడిలోకి పోతే భక్తులతో, హాస్పిటల్ కి వెళ్తే రోగులతో, స్కూల్లోకి వెళితే విద్యార్థులతో కలిసి మాత్రమే మాకు చాలా ఆదరణ ఉందని చెప్పుకుంటున్నారు. సిరిసిల్ల జిల్లాలో జరిగిన నేరెళ్ల బాధితులను పరామర్శించడానికి అధికారం కోల్పోయిన తర్వాత రావడం సిగ్గుచేటు. సిరిసిల్లలో ఉన్న బీడీ కార్మికులకు కనీసం పెన్షన్ విషయంలో ఇంతవరకు మాట్లాడని కవిత ఈరోజు మాట్లాడానికి వస్తుండడం మనం ఆలోచించాలి. రాష్ట్రంలో మహిళా సాధికారత గురించి కృషి చేస్తా అన్న కవిత రాష్ట్రంలో ఎంతోమంది మహిళలకు అన్యాయం జరిగినప్పుడు పని నెత్తి కూడా మాట్లాడలేదు. ఖమ్మం జిల్లా చింతపల్లి మండలంలో మరియమ్మ లాక్ అప్డేట్ గాని, ఎల్బీనగర్ లో లక్ష్మీ అనే మహిళను అప్పటి పోలీసులు విచక్షణారహితంగా కొట్టినప్పుడు మాట్లాడలేదు, గ్రూప్ వన్ అభ్యర్థిని చనిపోయినప్పుడు కనీసం పరామర్శించిన పాపాన పోలేదు, వరంగల్ విద్యార్థిని చనిపోయినప్పుడు కూడా సానుభూతి తెలియజేయలేదు. ఇలాంటి అంశాలు ఎన్నింటినో జాగృతి బాధితుల ఐక్యవేదిక నుండి ప్రతి జిల్లాలో ఎండ కట్టడానికి జాగృతి బాధితులు మరియు వారి కుటుంబాలు కవితను ప్రశ్నించడానికి ఐక్యవేదికగా ఏర్పాటు చేయనున్నాం.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version