ఐక్రిసాట్ ఫెన్సింగ్ ఏరియా కాలనీని సందర్శించిన…

ఐక్రిసాట్ ఫెన్సింగ్ ఏరియా కాలనీని సందర్శించిన

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రవిణ్య

బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి

నేటి ధాత్రి, పాటన్ చేరు :

పటాన్‌చెరు నియోజకవర్గం భారతీనగర్ డివిజన్‌లోని ఐక్రిసాట్ ఫెన్సింగ్ ఏరియా కాలనీని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రవిణ్య, పటాన్‌చెరు బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి కలిసి సందర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు నేపథ్యంలో ఇళ్లు కూల్చి అపార్ట్‌మెంట్లు నిర్మించే ప్రతిపాదనపై కాలనీ ప్రజల అభిప్రాయాలను జిల్లా కలెక్టర్ ప్రవిణ్య తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కాలనీ ప్రజలు మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం సమయంలో జీఓ 58 జీఓ 59 ద్వారా తమ ఇళ్లకు రెగ్యులరైజేషన్ పట్టాలు పొందామని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ప్రతి ఇంటి యజమానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చినందున, ప్రస్తుతం ఉన్న ఇళ్లను కూల్చి
అపార్ట్‌మెంట్‌లుగా నిర్మించాలనే ప్రభుత్వ ప్రతిపాదనకు తమకు వ్యతిరేకత ఉందని పేర్కొన్నారు. తమకు ఇప్పటికే ఉన్న ఇళ్లలోనే అభివృద్ధి చేసుకునే విధంగా రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
2017 సంవత్సరంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా 221 ఇళ్లు కోల్పోయిన బాధితులకు అప్పట్లో రెవెన్యూ శాఖ ద్వారా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చినా, ఇప్పటివరకు కేటాయించలేదని ఆదర్శ్ రెడ్డి కాలనీ ప్రజల తరఫున జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇళ్లు కోల్పోయిన వారు అద్దె ఇళ్లలో నివసిస్తూ ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ, కాలనీలో ఉన్న ఇళ్లకు ఇంటి పన్ను విధించే అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
కాలనీ ప్రజలు వినిపించిన సమస్యలపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రవిణ్య సానుకూలంగా స్పందించి, సంబంధిత శాఖలతో చర్చించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు, మహిళలు, యువకులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

కోహిర్ ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ నాయకుడి వినతిపత్రం..

కోహిర్ మున్సిపల్ కౌన్సిల్‌కు ప్రజా సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌కు మెమోరాండం

ముహమ్మద్ ఫిర్దౌస్ జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వక మెమోరాండం సమర్పించారు. మున్సిపల్ కౌన్సిల్‌కు సంబంధించిన చాలా ప్రజా సమస్యలను పరిష్కరించాలని

◆:- బిఆర్ఎస్ యువ నాయకుడు ముహమ్మద్ ఫిర్దౌస్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కోహిర్ టౌన్ కు చెందిన సామాజిక కార్యకర్త మరియు బిఆర్ఎస్ యువ నాయకుడు మహ్మద్ ఫిర్దౌస్ సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో కోహెర్ టౌన్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యకు కలిసి కోహిర్ మజ్లిస్ బడియాకు సంబంధించిన చాలా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఒక లిఖిత పూర్వక మెమోరాండం ను అందజేశారు, దీనికి కోహిర్ టౌన్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి, పైన పేర్కొన్న సమస్యలను పరిష్కరించడానికి, సంబంధిత శాఖల అధికారులకు సూచనలు జారీ చేశానని మరియు కోహిర్ మజ్లిస్ బడియాకు సంబంధించిన ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చానని చెప్పారు. ఈ సందర్భంగా మరికొందరు కూడా పాల్గొన్నారు.

వీధిలైట్లు ఏర్పాటు చేయాలి

కోహీర్ మున్సిపల్ పట్టణంలోని పలు కాల నీల్లో వీధిలైట్లు ఏర్పాటు చేయాలని కోహీర్ మున్సిపాలిటీకి చెందిన బీఆర్ఎస్ నాయ కుడు ఫిర్దౌస్ పాటు కోహీర్కు చెందిన పలువురు యువకులు కలెక్టర్ ప్రావీణ్యకు వినతిపత్రం అందజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version