వెంకటేశ్వర గ్యాస్ ఏజెన్సీ ప్రారంభం, విశ్వకర్మ గోడపత్రిక ఆవిష్కరణ
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలో వెంకటేశ్వర గ్యాస్ ఏజెన్సీని దొడ్డేంద్రయ్య గురుస్వామి ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విశ్వకర్మ గోడపత్రికను కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విశ్వకర్మ అధ్యక్షులు చంద్రప్ప, జెంట్ సెక్రటరీ రాజేశ్వర్ ఛారీ, స్థానిక విశ్వకర్మ నేతలు, మాజీ సర్పంచ్ సవిత రంగారెడ్డి, రఘునాథ్ చారి పాల్గొన్నారు. దొడ్డేంద్రయ్య గురుస్వామి మాట్లాడుతూ, టాటా, బిర్లా వంటి ప్రముఖ వ్యాపారాల పేర్లతో పాటు విశ్వకర్మ పేర్లు కూడా గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు.
