నూతన గౌడ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

నూతన గౌడ సంఘం క్యాలెండరు ఆవిష్కరణ

నడికూడ,నేటిధాత్రి:

నూతన గౌడ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పోశాల సురేష్ గౌడ్,జిల్లా ఇంచార్జ్ తాళ్లపెల్లి హరికృష్ణ గౌడ్, మండలం అధ్యక్షులు పోశాల అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ రోజు వరికోల్ గ్రామంలో ఎల్లమ్మ పండగ పురస్కరించుకొని నూతన గౌడ సంఘం క్యాలెండరు ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సంఘం పెద్దమనిషి పోశాల సమ్మయ్య గౌడ్,గ్రామ అధ్యక్షులు పోశాల రమేష్ గౌడ్,గ్రామ ఎల్లమ్మ టెంపుల్ అధ్యక్షులు పోశాల అశోక్ గౌడ్,ఉపాధ్యక్షులు తాళ్లపెల్లి రాజు గౌడ్,గ్రామ కమిటీ మెంబెర్స్ ఒల్లలా మల్లయ్య గౌడ్,పోశాల రాజు గౌడ్, తాళ్లపెల్లి రఘుపతి గౌడ్, తాళ్లపెల్లి సదానందం గౌడ్, ఓల్లాల కిరణ్ గౌడ్,పోశాల సంపత్ గౌడ్,నూతన గౌడ సంఘం అధ్యక్షులు ఉడుతల బాలకృష్ణ గౌడ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా రావటం జరిగింది.వారితో పాటు రాష్ట్ర కమిటీ మెంబెర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆనంద్ గౌడ్,కిరణ్ కుమార్ గౌడ్, రమేష్ గౌడ్,అంజి గౌడ్ తదితరులు పాల్గొనడం జరిగింది.

కేసముద్రంలో ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ

ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మండలంలో వివేకవర్ధిని హై స్కూల్ విద్యాసంస్థల అధినేత, టస్మా జిల్లా అధ్యక్షుడు, కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కేసముద్రం మండల కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో క్యాలెండర్‌ను ఆయన తన చేతుల మీదుగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ మాట్లాడుతూ, ఉపాధ్యాయుల పాత్ర సమాజ నిర్మాణంలో అత్యంత కీలకమైందని తెలిపారు. విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాల బోధనే కాకుండా నైతిక విలువలు, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని అన్నారు. నూతన సంవత్సరం ఉపాధ్యాయులకు, విద్యార్థులకు విద్యారంగంలో మరిన్ని విజయాలు తీసుకురావాలని, ప్రతి పాఠశాల నాణ్యమైన విద్యకు మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ప్రైమరీ క్యాంపస్ ఇన్‌చార్జి చిర్ర విజయ మాట్లాడుతూ, ఉపాధ్యాయుల ఐక్యతతోనే విద్యాసంస్థల అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు మారుతున్న కాలానికి అనుగుణంగా తమ బోధనా విధానాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చీకటి బీరయ్య, మహమ్మద్ గౌస్, డెక్క లక్ష్మణ్, సతీష్, ప్రవళిక, హారతి ఠాగూర్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

అలాగే మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గండు మురళి ఆధ్వర్యంలో పలువురు ఉపాధ్యాయ బృందం సభ్యులు హాజరై, నూతన సంవత్సరంలో ఉపాధ్యాయుల సంక్షేమం, విద్యార్థుల భవిష్యత్తు కోసం సంఘం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.
క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నూతన సంవత్సర శుభాకాంక్షలతో సార్థకంగా కొనసాగింది.

ముదిరాజ్ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ …

ముదిరాజ్ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ …

◆-: ఎమ్మెల్యే మాజీ డిసిఎంఎస్ చైర్మన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

తాలూకా ముదిరాజ్ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్యరావు మాజీ డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ పాల్గొనడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావు మాట్లాడుతూ గత ఎన్నికల్లో ముదిరాజ్ సంఘం కు హామీలు ఇవ్వడం జరిగిందని అన్ని హామీలు నెరవేర్చే బాధ్యత తాను తీసుకుంటానని ఎమ్మెల్యే తెలియజేయడం జరిగింది అంతేకాకుండా

ముదిరాజులను రాజకీయంగా ఆర్థికంగా ఎదుగుదలకు తాను సాయ శక్తుల కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది . అదేవిధంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ముదిరాజ్ నాయకులకు టికెట్లు ఇచ్చి ఆదుకుంటానని వారిని గెలిపించే బాధ్యత పూర్తిగా ముదిరాజ్ నాయకులు తీసుకోవాలని ముదిరాజ్ సంఘం నాయకులకు తెలియజేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో బిజెపి నాయకులు గొల్ల భాస్కర్ పాల్గొని బిజెపి పార్టీ తరపున సరైన అభ్యర్థులు ఉంటే టికెట్ ఇచ్చే బాధ్యత నాది అని ఆయన హామీ ఇవ్వడం జరిగింది శివకుమార్ మాట్లాడుతూ అన్ని విధాలుగా ముదిరాజ్ సంఘం ను ఆదుకుంటామని తెలపడం జరిగింది మాజీ కార్పొరేషన్ చైర్మన్ నరోత్తం మాట్లాడుతూ ఐక్యమత్యంతో ముందుకు సాగుతున్నారు అని అభినందించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో బేవా రిజిస్ చైర్మన్ దేవి ప్రసాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ తంజం మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ అదేవిధంగా ముదిరాజ్ సంఘం తాలూకా అధ్యక్షులు శంకర్ ముదిరాజు ముదిరాజ్ సంఘం గౌరవాధ్యక్షులు నారాయణ ముదిరాజ్ రాష్ట్ర కార్యదర్శి సంగప్ప ముదిరాజ్ జిల్లా కార్యదర్శి గోపాల్ ముదిరాజ్ పట్టణ అధ్యక్షులు నాయకుని రమేష్ ముదిరాజ్ జనరల్ సెక్రెటరీ మహేష్ ముదిరాజ్ కోయిరు మండల జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్ ముదిరాజ్ శాంతినగర్ అధ్యక్షులు ప్రవీణ్ ముదిరాజ్ కార్యదర్శి హరీష్ ముదిరాజ్ టౌన్ సెక్రటరీ విజయ్ ముదిరాజ్ శివ ముదిరాజ్ పాండు ముదిరాజ్ మాజీ మండల అధ్యక్షులు విట్టల్ ముదిరాజ్ రంజోల్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు జమాల్ దత్తు ముదిరాజ్ పాల్గొనడం జరిగింది,

తెలంగాణ రాష్ట్ర గీత పని వారల సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన-పంజాల శ్రీనివాస్ గౌడ్.

తెలంగాణ రాష్ట్ర గీత పని వారల సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన-పంజాల శ్రీనివాస్ గౌడ్

కరీంనగర్, నేటిధాత్రి:

గీతాపని వారాల సంఘం క్యాలెండర్ ను కరీంనగర్ లోని బద్ద ఎల్లారెడ్డి భవన్లో సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా పంజాల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గీత పని వారాల సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించడం సంతోషదాయకమని ఇది గీత కార్మికులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.‘దున్నేవాడికి భూమి’ అనే నినాదానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బొమ్మగాని ధర్మభిక్షం నినదించిన ‘గీసేవాడిదే చెట్టు’ అనే నినాదానికి అంతే ప్రాధాన్యత ఉన్నదని, ఇప్పటికీ ప్రజల మనసులో ఉండిపోయిందని గుర్తు చేశారు. బొమ్మగాని ధర్మభిక్షం తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా గీత పనివారల సంఘాన్ని విస్తరించారని, అనేక ఉద్యమాలను చేపట్టారని తద్వారా అనేక హక్కులను సాధించారని గుర్తు చేశారు. నీరా శీతలపానియంగా మారాలన్న బొమ్మగాని ధర్మభిక్షం కోరిక అమలులోనికి వచ్చినప్పటికీ, మరింత క్షేత్రస్థాయిలోకి వెళ్లాల్సి ఉందన్నారు. ఈసంఘం సహకార సంఘాల ఏర్పాటును, ఎక్స్ గ్రేషియాను చెల్లించడాన్ని సాధించిందన్నారు. ధర్మభిక్షం ఆశయాల అమలుకు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
దీంతోపాటు గీతా పరివారల సంఘం రానున్న కాలంలో పేద వర్గాల కుటుంబాలను ఆదుకోవడానికి సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గీతా పనివారల సంఘం కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలపట్ల రాజు గౌడ్, కార్యవర్గ సభ్యులు పైడిపల్లి రాజు గౌడ్, బుర్ర చంద్రశేఖర్ గౌడ్, బీసీ నేత కటికరెడ్డి బుచ్చన్న, తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా ముగ్గుల రంగవల్లి పోటీలు

నేటి దాత్రి నాగర్కర్నూల్ జిల్లా

 

వెంకటేశ్వర కాలనీ ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల రంగవల్లి పోటీలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారి దంపతులు ముఖ్య అతిథులు గా పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని ప్రతి పండుగ వెనుక గొప్ప పరిమార్తం ఉందని సంక్రాంతి రైతుల పండుగని నాగర్ కర్నూల్ నియోజవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ రంగవల్లిలో ప్రతిభ చూపిన మహిళలకు అభినందనలు తెలిపారు 2026 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు కాలనీవాసులకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రమణారావు కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

తెలంగాణ రైతు రక్షణ సమితి కొత్త సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

క్యాలెండర్ ఆవిష్కరణ

నడికూడ,నేటిధాత్రి:

 

 

తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు,హన్మకొండ జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు తెలంగాణ రైతు రక్షణ సమితి నూతన సంవత్సర క్యాలెండర్ ఘనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నాగూర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రైతు రక్షణ సమితి నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు.రైతుల హక్కుల సాధన కోసం సమితి చేపడుతున్న కార్యక్రమాలు అభినంద నీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు వరికెల కిషన్ రావు హనుమకొండ జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్ సలహాదారులు సుధాకర్ ఉపాధ్యక్షులు చవుల్ల రామారావు హింగే రవీందర్ కార్యదర్శి సురావు బాబురావు జిల్లా నాయకులు అంబిరి శ్రీనివాస్,నడికూడ ఎల్కతుర్తి పరకాల మండల అధ్యక్షులు వాంకే రాజు, కొక్కు తిరుపతి,లక్కర్స్ మధుకర్ కమలాపూర్ ప్రధాన కార్యదర్శి తిప్పారపు సుధాకర్, ఎల్కతుర్తి ప్రధాన కార్యదర్శి కొదటీ మాధవరావు రైతు నాయకులు లోనే సతీష్ తదితరులు పాల్గొన్నారు.

కొండ సురేఖ 2026 క్యాలెండర్ ఆవిష్కరణ

నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ

వరంగల్, నేటిధాత్రి.

 

వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు శ్రీరాం రాజేష్ ప్రచురించిన నూతన సంవత్సర 2026 క్యాలెండర్ ను అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ మురళీధర్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీరాం రాజేష్ మాట్లాడుతూ మొదటగా వరంగల్ తూర్పు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అదే విధంగా జిల్లా మంత్రివర్యులు కొండా సురేఖ మురళీధర్ రావుకు ఎల్లవేళలా భద్రకాళి మాత ఆశీర్వాదం ఉండి ఇంకా పెద్ద పదవులు రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ నాయకులు పగడాల సతీశ్, బత్తుల నవీన్ పాల్గొన్నారు.

క్యాలెండర్ ఆవిష్కరణలో పాలొన్న ఐక్య వేదిక అధ్యక్షులు సతీష్…

క్యాలెండర్ ఆవిష్కరణలో పాలొన్న ఐక్య వేదిక అధ్యక్షులు సతీష్

వనపర్తి నేటిదాత్రి .

 

 

 

హైద్రాబాద్ మియాపూర్ లో ఉమ్మడి పాలమూర్ ప్రజా సంఘాలు,ఉద్యోగ సంఘాల అద్యర్యము లో ముద్రనుంచి న క్యాలండర్ ఆవిష్కరణ లో వనపర్తి జిల్లా అఖిల పక్ష ఐక్యవెదక అధ్యక్షులు సతీష్ యాదవ్ పాల్గొన్నారు . ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వనపర్తి జిల్లా ముఖచిత్ర క్యాలెండర్ అద్భుతమైన రీతిలో ప్రింట్ చేయిస్తున్న అఖిలపక్ష ఐక్యవేదిక సావిత్రిబాయి పూలే జయంతి రోజున ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టిన అధ్యక్షుడు సతీష్ యాదవ్ ను అభినందించారు. క్యాలెండర్ విడుదల చేయాలని కోరారు. తదనంతరం డా” సతీష్ యాదవ్ ను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో.. అధ్యక్షత వహించిన సతీష్ యాదవ్, ముఖ్య అతిథులు మాజీ సబ్ రిజిస్టర్ మల్లారెడ్డి, ఐలాండ్స్ నర్సిరెడ్డి,ఆఫీసర్ కడుకుంట్ల కురుమయ్య, గోపాల్ , కోటయ్య, అనిల్, దశరథ్ నాయక్,విశిష్ట అతిథులు కరెంట్ ఆఫీసర్ సందీప్ రెడ్డి,పెద్దలు భాస్కర్ రెడ్డి, కాంట్రాక్టర్ జగత్ పల్లి రమేష్ యాదవ్,చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారని సతీష్ యాదవ్ ఒక ప్రకటన లో తెలిపారు

తిరుపతిలో హెల్మెట్ అవగాహన ర్యాలీ ప్రారంభించిన తుడా చైర్మన్…

*గరుడ టూ వీలర్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ మరియు హెల్మెట్ అవగాహన ర్యాలీని ప్రారంభించిన….

+తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి..

తిరుపతి (నేటి ధాత్రి)

 

తిరుపతి గరుడ టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్‌ ను తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి గారు ఘనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యుల విన్నపం మేరకు ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలనే ఉద్దేశంతో బాలాజీ కాలనీ కూడలి వద్ద ఏర్పాటు చేసిన హెల్మెట్ అవగాహన ర్యాలీ”* ని ఆయన పోలీసు అధికారులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పిలుపునిచ్చారు.
ప్రాణ రక్షణకు హెల్మెట్ ఒక కవచంలా పనిచేస్తుందని, కుటుంబ సభ్యుల క్షేమం కోరి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.
గరుడ టూ వీలర్ అసోసియేషన్ సభ్యులు కేవలం వృత్తికే పరిమితం కాకుండా,ఇలాంటి సామాజిక అవగాహన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఆయన అభిప్రాయపడ్డారు.
నగరంలోని ప్రధాన కూడళ్లలో గుండా సాగిన ఈ ర్యాలీలో పోలీస్ సిబ్బంది,మెకానిక్ సోదరులు హెల్మెట్లు ధరించి, భద్రతా నిబంధనలపై ప్లకార్డులతో ప్రజలకు అవగాహన కల్పించారు.
అంతకముందు బాలాజీ కాలనీ కూడలి వద్దకు చేరుకున్న తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారికి అసోసియేషన్ సభ్యులు దుశ్శలావతో సత్కరించి, క్యాలెండర్ ప్రతిని అందించారు. ​
ఈ కార్యక్రమంలో గరుడ టూ వీలర్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శి, పోలీస్ అధికారులు ఇతర కార్యవర్గ సభ్యులు మరియు మెకానిక్ సోదరులు పాల్గొన్నారు

టిపిటిఎఫ్ నిబద్ధతగల బలమైన సంఘం విద్యా వ్యవస్థ బలోపేతానికి ఎనలేని కృషి..

టిపిటిఎఫ్ నిబద్ధతగల బలమైన సంఘం విద్యా వ్యవస్థ బలోపేతానికి ఎనలేని కృషి

టిపిటిఎఫ్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణలో మండల విద్యాధికారి కాలేరు యాదగిరి ఉద్ఘాటన.

ఉపాధ్యాయ హక్కుల సాధన కై, సంక్షేమానికై నిరంతర పోరాటం

నాణ్యమైన విద్యను అందించడమే సంఘం ప్రధాన లక్ష్యం

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ ఉవాచ

కేసముద్రం/ నేటి ధాత్రి

 

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపిటిఎఫ్) కేసముద్రం మండల శాఖ ఆధ్వర్యంలో టీపిటిఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్ (2026) ఆవిష్కరణ కార్యక్రమం కేసముద్రం మండల విద్యా వనరుల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాశాఖ అధికారి కాలేరు యాదగిరి క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎంఈఓ కాలేరు యాదగిరి మాట్లాడుతూ, “టీపిటిఎఫ్ ఉపాధ్యాయుల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేస్తూ, విద్యావ్యవస్థ బలోపేతం లో కీలక పాత్ర పోషిస్తోందని” ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు అంకితభావంతో పని చేయాలని, అందుకు విద్యాశాఖ ఎల్లప్పుడూ సహకరిస్తుందని తెలిపారు.
అనంతరం టీపిటిఎఫ్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ మాట్లాడుతూ, “ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కై నిరంతరం పోరాటం చేస్తుందని, నాణ్యమైన విద్య అందించడమే ప్రధాన లక్ష్యంగా టి పి టి ఎఫ్ పనిచేస్తుంది ” అని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల గౌరవం, భద్రత, సంక్షేమం కోసం టీపిటిఎఫ్ ముందుండి పోరాడుతుందని, అవసరమైతే ఉద్యమాలకూ సిద్ధమని తెలిపారు.
ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సంఘ మండల ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు, స్టేషన్ కేసముద్రం కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, టీపీటీఫ్ సీనియర్ నాయకులు బందెల రాజు, కల్వల కాంప్లెక్స్ హెడ్మాస్టర్ బండారు నరేందర్, తాళ్లపూస పల్లి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కనకయ్య, ఉప్పరపల్లి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్, ఉపాధ్యాయులు దేవ్ సింగ్, బద్రు నాయక్, వెన్నెల అనిత, ఎమ్మార్సీ సిబ్బంది ఖాదర్,బిక్షపతి పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version