క్యాలెండర్ ఆవిష్కరణలో పాలొన్న ఐక్య వేదిక అధ్యక్షులు సతీష్…

క్యాలెండర్ ఆవిష్కరణలో పాలొన్న ఐక్య వేదిక అధ్యక్షులు సతీష్

వనపర్తి నేటిదాత్రి .

 

 

 

హైద్రాబాద్ మియాపూర్ లో ఉమ్మడి పాలమూర్ ప్రజా సంఘాలు,ఉద్యోగ సంఘాల అద్యర్యము లో ముద్రనుంచి న క్యాలండర్ ఆవిష్కరణ లో వనపర్తి జిల్లా అఖిల పక్ష ఐక్యవెదక అధ్యక్షులు సతీష్ యాదవ్ పాల్గొన్నారు . ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వనపర్తి జిల్లా ముఖచిత్ర క్యాలెండర్ అద్భుతమైన రీతిలో ప్రింట్ చేయిస్తున్న అఖిలపక్ష ఐక్యవేదిక సావిత్రిబాయి పూలే జయంతి రోజున ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టిన అధ్యక్షుడు సతీష్ యాదవ్ ను అభినందించారు. క్యాలెండర్ విడుదల చేయాలని కోరారు. తదనంతరం డా” సతీష్ యాదవ్ ను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో.. అధ్యక్షత వహించిన సతీష్ యాదవ్, ముఖ్య అతిథులు మాజీ సబ్ రిజిస్టర్ మల్లారెడ్డి, ఐలాండ్స్ నర్సిరెడ్డి,ఆఫీసర్ కడుకుంట్ల కురుమయ్య, గోపాల్ , కోటయ్య, అనిల్, దశరథ్ నాయక్,విశిష్ట అతిథులు కరెంట్ ఆఫీసర్ సందీప్ రెడ్డి,పెద్దలు భాస్కర్ రెడ్డి, కాంట్రాక్టర్ జగత్ పల్లి రమేష్ యాదవ్,చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారని సతీష్ యాదవ్ ఒక ప్రకటన లో తెలిపారు

తిరుపతిలో హెల్మెట్ అవగాహన ర్యాలీ ప్రారంభించిన తుడా చైర్మన్…

*గరుడ టూ వీలర్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ మరియు హెల్మెట్ అవగాహన ర్యాలీని ప్రారంభించిన….

+తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి..

తిరుపతి (నేటి ధాత్రి)

 

తిరుపతి గరుడ టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్‌ ను తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి గారు ఘనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యుల విన్నపం మేరకు ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలనే ఉద్దేశంతో బాలాజీ కాలనీ కూడలి వద్ద ఏర్పాటు చేసిన హెల్మెట్ అవగాహన ర్యాలీ”* ని ఆయన పోలీసు అధికారులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పిలుపునిచ్చారు.
ప్రాణ రక్షణకు హెల్మెట్ ఒక కవచంలా పనిచేస్తుందని, కుటుంబ సభ్యుల క్షేమం కోరి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.
గరుడ టూ వీలర్ అసోసియేషన్ సభ్యులు కేవలం వృత్తికే పరిమితం కాకుండా,ఇలాంటి సామాజిక అవగాహన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఆయన అభిప్రాయపడ్డారు.
నగరంలోని ప్రధాన కూడళ్లలో గుండా సాగిన ఈ ర్యాలీలో పోలీస్ సిబ్బంది,మెకానిక్ సోదరులు హెల్మెట్లు ధరించి, భద్రతా నిబంధనలపై ప్లకార్డులతో ప్రజలకు అవగాహన కల్పించారు.
అంతకముందు బాలాజీ కాలనీ కూడలి వద్దకు చేరుకున్న తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారికి అసోసియేషన్ సభ్యులు దుశ్శలావతో సత్కరించి, క్యాలెండర్ ప్రతిని అందించారు. ​
ఈ కార్యక్రమంలో గరుడ టూ వీలర్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శి, పోలీస్ అధికారులు ఇతర కార్యవర్గ సభ్యులు మరియు మెకానిక్ సోదరులు పాల్గొన్నారు

టిపిటిఎఫ్ నిబద్ధతగల బలమైన సంఘం విద్యా వ్యవస్థ బలోపేతానికి ఎనలేని కృషి..

టిపిటిఎఫ్ నిబద్ధతగల బలమైన సంఘం విద్యా వ్యవస్థ బలోపేతానికి ఎనలేని కృషి

టిపిటిఎఫ్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణలో మండల విద్యాధికారి కాలేరు యాదగిరి ఉద్ఘాటన.

ఉపాధ్యాయ హక్కుల సాధన కై, సంక్షేమానికై నిరంతర పోరాటం

నాణ్యమైన విద్యను అందించడమే సంఘం ప్రధాన లక్ష్యం

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ ఉవాచ

కేసముద్రం/ నేటి ధాత్రి

 

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపిటిఎఫ్) కేసముద్రం మండల శాఖ ఆధ్వర్యంలో టీపిటిఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్ (2026) ఆవిష్కరణ కార్యక్రమం కేసముద్రం మండల విద్యా వనరుల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాశాఖ అధికారి కాలేరు యాదగిరి క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎంఈఓ కాలేరు యాదగిరి మాట్లాడుతూ, “టీపిటిఎఫ్ ఉపాధ్యాయుల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేస్తూ, విద్యావ్యవస్థ బలోపేతం లో కీలక పాత్ర పోషిస్తోందని” ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు అంకితభావంతో పని చేయాలని, అందుకు విద్యాశాఖ ఎల్లప్పుడూ సహకరిస్తుందని తెలిపారు.
అనంతరం టీపిటిఎఫ్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ మాట్లాడుతూ, “ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కై నిరంతరం పోరాటం చేస్తుందని, నాణ్యమైన విద్య అందించడమే ప్రధాన లక్ష్యంగా టి పి టి ఎఫ్ పనిచేస్తుంది ” అని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల గౌరవం, భద్రత, సంక్షేమం కోసం టీపిటిఎఫ్ ముందుండి పోరాడుతుందని, అవసరమైతే ఉద్యమాలకూ సిద్ధమని తెలిపారు.
ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సంఘ మండల ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు, స్టేషన్ కేసముద్రం కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, టీపీటీఫ్ సీనియర్ నాయకులు బందెల రాజు, కల్వల కాంప్లెక్స్ హెడ్మాస్టర్ బండారు నరేందర్, తాళ్లపూస పల్లి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కనకయ్య, ఉప్పరపల్లి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్, ఉపాధ్యాయులు దేవ్ సింగ్, బద్రు నాయక్, వెన్నెల అనిత, ఎమ్మార్సీ సిబ్బంది ఖాదర్,బిక్షపతి పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version