నాగూర్లపల్లిలో ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు-చలివేంద్రం ప్రారంభం…

నాగూర్లపల్లిలో ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు-చలివేంద్రం ప్రారంభం

నర్సంపేట, నేటిధాత్రి:

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు నాగూర్లపల్లిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ యువజన సంఘం అధ్యక్షుడు తనుగుల దేవేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి 16వ వార్డు కౌన్సిలర్ బానోత్ నవీన్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.అనంతరం అంబేడ్కర్ సెంటర్ వద్ద సాదుల శ్రీనివాస్ (శీను) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కౌన్సిలర్ ప్రారంభించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని బాటసారుల కోసం ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మాచిక నర్సయ్య, మాజీ ఉపసర్పంచ్ తనుగుల రవీందర్, బుర్రి సాగర్, బూరి ఆంజనేయులు, కటస్వామి, ఎలందుల భాస్కర్, తనుగుల రాజు, బుర్రి సునీల్, గుర్రం రవి, జవాజి చంద్రమౌళి, సాదుల ముత్తిలింగం, కరుణాకర్, తనుగుల శ్రీకాంత్, సుధాకర్, తనుగుల అంజి, శివకోటి, బాబు, కొండం జ్యోతి, భాగ్య, అంబేడ్కర్ యువజన సంఘం నాయకులు, గ్రామ పెద్దలు మరియు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఘనంగా ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి వేడుకలు…

ఘనంగా ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి వేడుకలు :

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ మహరాజ్ యువజన సభ్యులకు శివాజీ విగ్రహ ప్రతిష్టాపనకి కాళీ స్థలాన్ని ఇవ్వాలని కోరిన ఛత్రపతి శివాజీ మహరాజ్ యువజన సభ్యుల కోరికమేరకు గ్రామ సర్పంచ్ చింతలగట్టు శివరాజ్ గ్రామకంఠంలోని కొంత కాళీ స్థలాన్ని కొల్లూరు గ్రామ పంచాయతీ అధ్వర్యం లో ఇవ్వడం జరిగింది…ఈ రోజు శివాజీ మహరాజ్ జయంతి సందర్బంగా కాళీ స్థలంలో శివాజీ మహారాజ్ జెండాను ఎగురవేసి పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు…ఈ కార్యక్రమములో మాజీ ఎంపీటీసీ రాజ్‌కుమార్, గ్రామ సర్పంచ్ చింతలగట్టు శివరాజ్, మాజీ వార్డు సభ్యులు ఎం విష్ణు గ్రామ పెద్దలు మంగలి మొగులయ్య, చింతలగట్టు మొగులయ్య, డప్పూరు రాములు, డప్పూరు బీరప్ప మరియు శివాజీ మహారాజ్ యువజన సంఘ అధ్యక్షులు మరియూ నాయకులు,సభ్యులు యువకులు పాల్గొని శివాజీయహరాజ్ విగ్రహానికి పూలమాల వేసి పూజ చేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

మోకుదెబ్బ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జూలూరి మనీష్ గౌడ్…

మోకుదెబ్బ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జూలూరి మనీష్ గౌడ్

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట పట్టాణానికి చెందిన జూలూరి మనీష్ గౌడ్ ను గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ అనుబంధ సంఘం యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు నీయామక పత్రం సోమవారం అందజేసినట్లు రమేష్ గౌడ్ తెలిపారు. గౌడ కులస్తుల అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసం మనీష్ గత కొన్నేళ్లుగా చేస్తున్న కృషిని గుర్తించి యువజన సంఘం ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగిందన్నారు. ఈ పదవిలో మనీష్ గౌడ్ రెండేళ్లు కొనసాగుతాడన్నారు.తనను యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించిన అనంతుల రమేష్ గౌడ్, తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు రాగుల కిరణ్ కుమార్ గౌడ్, జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకట్ గౌడ్, నర్సంపేట డివిజన్ అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ గౌడ్, ఎరుకొండ కర్ణాకర్ గౌడ్ లకు మనీష్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.

వనపర్తిలో మహాత్మా గాంధీకి వర్తకులు, ఆర్యవైశ్యులు నివాళులు

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన వర్తకులు ఆర్యవైశ్యులు

వనపర్తి నేటిధాత్రి .

వనపర్తి జిల్లా కేంద్రంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వర్తక సంఘం అధ్యక్షులు పాలాది సుమన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బచ్చురాం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వర్తకులు దోమ శివ బొడ్డు శంకర్ సంబు రవి వై వెంకటేష్ హెచ్ఎంటి రవి ప్రసాద్ ఆర్యవైశ్యులు ఏపూరి శ్రీనివాసులు కొట్ర రామకృష్ణ యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ కందికొండ సాయిరాం మారం గోవిందు గుప్త ఆర్యవైశ్య సంఘం మహిళ అధ్యక్షురాలు పిన్నం వసంత నరేందర్ బచ్చు సౌజన్య వాసవి క్లబ్ అధ్యక్షులు ఆకుతోట రాఘవేంద్ర రాజ్ మెడికల్ షాపు శంకర్ కూన శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి…

అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి.

చిట్యాల, నేటిదాత్రి :

చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు జన్నే యుగేందర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశాని రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య విచ్చేసి మాట్లాడుతూ అంబేద్కర్ 69 వ వర్ధంతి కార్యక్రమమును ఘనంగా నిర్వహించాలని.అన్నారు,. గ్రామాలలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ అంబేద్కర్ భావజారాన్ని ప్రజలకు తెలియ పరచాలని , మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే వర్ధంతి కార్యక్రమంలో అందరూ హాజరు కావాలని మహానీయుడు కన్న కలలను నిజం చేయాలని భారత రాజ్యాంగ రచయిత ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరివాడని , అందుకు కుల మతాలకు వివిధ రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలు అంబేద్కర్ వాదులు మేధావులు ఉద్యోగులు శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరూ ఈనెల 6న అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనాలన్నారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల ప్రచార కార్యదర్శి కట్కూరి రాజు మండల నాయకులు గురుకుంట్ల కిరణ్ శ్రీలపాక ప్రణీత్ గడ్డం సదానందం కట్కూరి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు

23 లక్షలతో అంబేద్కర్ భవనం నిర్మించి వదిలేశారు.

23 లక్షలతో అంబేద్కర్ భవనం నిర్మించి వదిలేశారు.

అంబేద్కర్ సంఘానికి అప్పగించాలని ఎమ్మెల్యేకి వినతి.

చిట్యాల, నేటిదాత్రి :

 

చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ భవనం మూడు సంవత్సరాల క్రితం 23 లక్షలతో నిర్మించి ప్రారంభించినప్పటికీ అంబేద్కర్ సంఘానికి ఆ భవనం అప్పగించడం లేదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కి అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య మండల అధ్యక్షులు జన్నె యుగేందర్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది, అంబేద్కర్ సంఘానికి అంబేద్కర్ అభిమానులకి అంబేద్కర్ వాదులకి మండల ప్రజలకి ఉపయోగంలో ఉండాల్సిన అంబేద్కర్ భవనం నిరుపయోగంగా ఉందని ఆవరణ మొత్తం పిచ్చి మొక్కలతో నిండిపోయిందని ఎమ్మెల్యే కి వివరించడం జరిగిందనీ తెలిపారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధికారులతో మాట్లాడారు అంబేద్కర్ భవనం మీకు అప్పగించడం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు జన్నె యుగంధర్, రాష్ట్ర నాయకులు పుల్లమల్లయ్య, దొడ్డికిష్టయ్య తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version