నూతన టివైజెఎఫ్ జహీరాబాద్ అధ్యక్షుడుని ఎన్నిక.!

నూతన టి.వై.జె.ఎఫ్. జహీరాబాద్ అధ్యక్షుడుని ఎన్నిక….!

◆-టి.వై.జె.ఎఫ్.అధ్యక్షుడుగా చెలిమేడ అనిల్ కుమార్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ జర్నలిస్టు వృత్తి బాధ్యత గల వృత్తి అని, ప్రజలకు సరైన సమాచారం అందించాల్సిన బాధ్యత వారిపై ఉంటుందని రాష్ట్ర టి . వై.జె.ఎఫ్ అధ్యక్షుడు డాక్టర్ తనుగులు జితేందర్ రావు అన్నారు.హైదరాబాద్ లోని రాష్ట్ర టీ .వై .జె.ఎఫ్ ఆఫీసులో నిర్వహించిన ముఖ్య సమావేశంలో డాక్టర్ జితేందర్ రావు అధ్యక్షతన జహిరాబాద్ తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నూతన (టి.వై.జె.ఎఫ్) అధ్యక్షుడు కోహిర్ మండలం పైడిగుమ్మల్ గ్రామానికి చెందిన చెలిమేడ అనిల్ కుమార్ ను, టి.వై.జె.ఎఫ్. ఉపాధ్యక్షుడిగా ఝరాసంగం మండలం కమల్ పల్లి గ్రామానికి చెందిన నాగేష్ , నూ రాష్ట్ర టి.వై.జె.ఎఫ్.

 

President

అధ్యక్షుడు డాక్టర్ తనుగుల జితేందర్ రావు నియమిస్తున్నట్లు తెలపడం జరిగింది. త్వరలోనే జహీరాబాద్ టీ.వై.జె.ఎఫ్. మిగతా శాఖలను అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు కలిసి నియమించుకోవాలని రాష్ట్ర టి. వై .జె .ఎఫ్.అధ్యక్షుడు కోరడం జరిగింది. చెలిమేడ అనిల్ కుమార్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో జహీరాబాద్ నియోజకవర్గ టీ.వై.జె.ఎఫ్. అధ్యక్షుడిగా నాకు ఇంత పెద్ద బాధ్యత చెప్పినందుకు రాష్ట్ర టీ.వై.జె.ఎఫ్.అధ్యక్షులకు డాక్టర్ తనుగుల జితేందర్ రావు కృతజ్ఞతలు తెలియజేశారు.

పట్టుదలతో పని చేస్తే వ్యాపారంలో.!

పట్టుదలతో పని చేస్తే వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి

నేటి యువత అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలుస్తున్నారు అది తెలంగాణ మట్టిగడ్డ యొక్క గొప్పతనం – మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు

కరీంనగర్ నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా చింతకుంట గ్రామంలోని శాంతినగర్ లో శ్రీసేవాలాల్ మహారాజ్ కాంప్లెక్స్ నందు మాలోత్ కల్పన రాజు నాయక్ పెట్టిన రాయల్ బేకరీ అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, మాజీ కొత్తపెల్లి మండల వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్ లతో కలసి ప్రారంభించడం జరిగినది. ఈసందర్భంగా నారదాసు లక్ష్మణ్ రావు మాట్లాడుతూ నేటి యువతరం కష్టపడి తమ కుటుంబాన్ని పోషించడం కోసం ఏదో రకమైన వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారని ఒకప్పుడు ఏపని లేక అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేవారని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ముందుకు ఎదుగుతుంది అంటే అందుకు కారణం యువతరమని ఏదో ఒక పని చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని లక్ష్యంతో పనిచేస్తున్నారని అందుకోసమే తెలంగాణ ముందు వరుసలో ఉందన్నారు. ఉద్యోగం కాదు వ్యాపారంలో కూడా అధిక లాభాలు సంపాదించి అభివృద్ధి చెందవచ్చనే విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగించారన్నారు. అందులో భాగమే నేడు కల్పన రాజు నాయక్ వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడడం కోసం బేకరీ ఫాస్ట్ ఫుడ్ పెట్టడం జరిగిందని సందర్భంగా వారిని అభినందించారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ ఎస్టి సెల్ అధ్యక్షులు శ్రావణ్ నాయక్, మాజీ వార్డ్ మెంబర్ నజీమా బేగం, బిజెపి నాయకులు సదానందం నాయక్,
బిఆర్ఎస్ నాయకులు చెట్టుపెళ్లి నరేందర్, మల్లేశం, భాస్కర్ నాయక్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ మెంబర్ రవి నాయక్, గిరిజన నాయకులు రంగనాయక్, మోహన్ నాయక్, పాప నాయక్, జాంగిర్, పైడిపాల రవి, శ్రీనివాస్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

దేవాలయ ముఖద్వార తోరణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే.

దేవాలయ ముఖద్వార తోరణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..

నర్సంపేట నేటిధాత్రి:

 

 

ఖానాపూరం మండలం బుధరావుపేట గ్రామంలో భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ముఖద్వారా తోరణం (ఆర్చ్) ను నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి బుదవారం ప్రారంభించారు.అనంతరం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్,టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు,దేవాలయ కమిటీ సభ్యులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య.

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

జహీరాబాద్ నేటి ధాత్రి:

కోహీర్ పరిధిలోని రైల్వే ట్రాక్ వద్ద రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. మృతదేహాన్ని జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురికి తరలించినట్లు పేర్కొన్నారు.

రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.!

రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి

నిజాంపేట నేటి ధాత్రి :

 

 

రైతులు రైతు నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిజాంపేట మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో గల రైతు వేదికలో ఆయన మాట్లాడుతూ.. రైతులు కేంద్ర ప్రభుత్వం పథకాలను పొందడానికి ఈ రైతు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. దీని ద్వారా 11 అంకెల కార్డు రావడం జరుగుతుందన్నారు. మండల వ్యాప్తంగా రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

యువకుడి ప్రాణం తీసిన అప్పు.

యువకుడి ప్రాణం తీసిన అప్పు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

అప్పుల బాధలు తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జహీరాబాద్ లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జహీరాబాద్ పట్టణంలోని . మహేంద్ర కాలనీకి చెందిన మృతుడు రవికాంత్ చారీ 32 స్వర్ణకారుడు వ్యాపారం చేస్తుండేవాడు. అప్పుల బాధ తట్టుకోలేక ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి.

పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని జాకీర్ హుస్సేన్ అన్నారు. కోహీర్ ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా రెండు జతల యూనిఫాం, పుస్తకాలు ఇస్తామని చెప్పారు. నిష్ణాతులైన ఉపాధ్యాయ బృందం ఉందని పేర్కొన్నారు.

సీబీఎస్ఈ ఫలితాలలో కేవీ విద్యార్థుల ప్రతిభ.

సీబీఎస్ఈ ఫలితాలలో కేవీ విద్యార్థుల ప్రతిభ.

◆ వందశాతం ఉత్తీర్ణత.● శ్రీనిధి విద్యార్థినికి 586 మార్కులు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కన బరిచారు. పాఠశాలకు చెందిన 27 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, అందరూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. పాఠశాల చెందిన విద్యార్థినికి శ్రీనిధి 600 మార్కులకు గాను 586 మార్కులు సాధించి పాఠశాలలో ప్రథమ స్థానంలో నిలిచింది. మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులను పాఠశాల చైర్మన్, ఝరాసంగం తహసిల్దార్ తిరుమలరావు, కేంద్రీయ విద్యాలయ ప్రధానోపాధ్యాయులు కేవీడీ పవన్ కుమార్, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

ఆపరేషన్‌ సింధూర్‌తో వెల్లడైన భారత్‌ సత్తా

మన రక్షణ ఉత్పత్తుల అమ్మకాలు పెరిగే అవకాశం

మన సామర్థ్యానికి వేదికగా మారిన పాక్‌

భౌతికంగా ఓడిన పాక్‌…కానీ నిజంగా ఓడిరది చైనా

దేశానికి నిబ్బరాన్నిచ్చిన ఆత్మనిర్భర్‌ భారత్‌

ఆయుధ సంపత్తిలో సూపర్‌పవర్‌గా భారత్‌

ప్రపంచ వేదికపై బలీయమైన అగ్రరాజ్యంగా భారత్‌

నేటిధాత్రి ,డెస్క్‌: 

ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాశ్చాత్యమీడియా చైనా ఆయుధాల సామర్థ్యాన్ని ఆకాశానికెత్తే స్తూ విపరీతంగా వార్తలు ప్రచురించడం ఒక విచిత్ర పరిణామం. వీటిల్లో వచ్చిన వార్తలకు, క్షే త్రస్తాయిలో జరుగుతున్నదానికి అసలు పొంతనే లేదు! పాకిస్తాన్‌లో నెలకొల్పిన చైనాతయారీ రక్షణ వ్యవస్థలు అసలు ఏఒక్క భారత క్షిపణని లేదా డ్రోన్లను ఆపలేకపోయాయి. ఇదే సమయం లో పాక్‌ డ్రోన్‌లు లేదా క్షిపణులు భారత్‌ భూభాగంలోకి ప్రవేశించకుండానే ధ్వంసమైపోయాయి. ప్రస్తుతానికి ఈ పాకిస్తాన్‌, చైనా అనుకూల మీడియా ప్రచారాన్ని పక్కన పెడితే, నిజానికి భారత్‌ను రక్షించిందేమిటి? ప్రపంచానికి ఇది ఎటువంటి సందేశం ఇచ్చిందనేది పరిశీలిద్దాం.

అమెరికా సైన్యంలో పనిచేసి ప్రస్తుతం మాడిసన్‌లో అర్బన్‌ వార్‌ఫేర్‌ స్టడీస్‌కు చీఫ్‌గా వున్న జాన్‌ స్పెన్సర్‌ సింధూర్‌ సందర్భంగా భారత్‌ సమీకృత గగనతల రక్షణ వ్యవస్థ ఏవిధంగా పనిచేసిం దో, దాని సామర్థ్యమెంటో చాలా నిశితంగా పరిశీలించి అత్యంత విలువైన సమాచారాన్ని వెల్లడిరచారు. అంతేకాదు ఆపరేషన్‌ సింధూర్‌ నుంచి ప్రపంచం నేర్చుకోవలసిన పాఠాలు కూడా చాలనే వున్నాయని ఆయన విశ్లేషించారు. సింధూర్‌ ఆపరేషన్‌లో భారత్‌ ప్రపంచానికి ఒక సరికొత్త ఆధునిక రక్షణ ప్రక్రియను పరిచయం చేసింది. తన గగనతలాన్ని కొన్ని అంచెలుగా ఏర్పరచుకున్న పటిష్ట రక్షణ వ్యవస్థ సహాయంతో సమర్థవంతంగా కాపాడుకోవడమే కాదు, ప్రత్యర్థి పాకిస్తాన్‌ భూభాగంలో నెలకొల్పిన చైనా రక్షణ వ్యవస్థలను తుత్తినియలు చేసి తన ఆధిపత్యాన్ని స్పష్టంగా ప్రదర్శించింది. ఇక్కడ పాకిస్తాన్‌కు మాత్రమే కాదు ప్రపంచానికి భారత్‌ ఒక పాఠాన్ని నేర్పింది. అదేంటంటే ‘‘ఎన్ని రక్షణ ఆయుధాలను, వ్యవస్థలను కొనుగోలు చేసావన్నది కాదు ఇక్కడ ప్రశ్న. వాటిని ఎంత చక్కగా సమన్వయంతో ఉపయోగించావన్నది ప్రధానం’’. భారత్‌ ఈ ఆపరేషన్‌ లో త్రివిధ దళాలను సమన్వయం చేయడమే కాదు, చక్కటి ప్రణాళికతో, తనవద్ద వున్న సాంకేతిక నైపుణ్యాన్ని చక్కగా వినియోగించుకొని పాకిస్తాన్‌ను చావుదెబ్బ కొట్టింది. నిజం చెప్పాలంటే బాహ్యంగా ఓటమిపాలైనట్టు పాకిస్తాన్‌ కనిపిస్తున్నా, అసలు దెబ్బతగిలింది మాత్రం చైనాకు!

భారత్‌ నేడు ఉపయోగిస్తున్న గగనతల రక్షణ వ్యవస్థలో దేశీయంగా అభివృద్ధి చేసిన ఆకాశ్‌, క్యు.ఆర్‌.ఎస్‌.ఏ.ఎం.లతో పాటు ఇజ్రాయిల్‌కు చెందిన బరాక్‌ా8, రష్యా తయారీ ఎస్‌ా400 వున్నాయి. ఈ మూడు స్వల్ప, మధ్య, దీర్ఘ శ్రేణి అంచెలు నిరంతరం వివిధ దశల్లో సమన్వయం తో పనిచేసి ఒక రక్షణ జాలాన్ని ఏర్పరచాయి. 

సరిహద్దుల్లో పాకిస్తాన్‌ చైనా తయారీ హెచ్‌.క్యుా9 (ఇది ఎస్‌ా300 మాదిరిగా పనిచేస్తుంది), ఎల్‌వైా80, మరియు ఎఫ్‌ఎరా90. వీటి పనితీరు పేపరుపై వివరించడానికి తప్ప, యుద్ధక్షేత్రంలో ఎంతమాత్రం పనికిరావన్నది స్పష్టమైంది. ఎందుకంటే భారత్‌ తన ఎలక్ట్రానిక్‌ యుద్ధతంత్రం, సైద్ధాంతిక క్రియాశీలత, గతిశీలక దాడులతో ఈ రక్షణ వ్యవస్థలను ఎందుకూ కొరగాకుండా చేయడమే కాదు, పాక్‌ భూభాగాల్లోకి చాలా సమర్థవంతంగా చొచ్చుకెళ్లి అనుకున్న లక్ష్యాలను సాధించగలిగింది. 

ఇదే సమయంలో రష్యాతో జరిగిన యుద్ధంలో ఉక్రెయిన్‌ కూడా ఎన్నో పాఠాలు నేర్పింది. ఎట్లా అంటే ఉక్రెయిన్‌ విస్తీర్ణం 6లక్షల చదరపు కిలోమీటర్లు. సువిశాల మైదానాలు, విస్తరించిన పట్ట ణ మౌలిక సదుపాయాలు ఈ యుద్ధంలో పెను సవాలుగా నిలిచాయి. ఇక్కడ ఉక్రెయిన్‌కు అ త్యంత ఖర్చుతో కూడిన పరిమిత వ్యవస్థలు వుండటం మాత్రమే కాదు ఇక్కడ సమస్య. వీటిని ఎంత సమర్థవంతంగా సమన్వయంతో ఉపయోగించామన్నది అత్యంత కీలకం. పశ్చిమ దేశాలు అందించిన ఉపరితలం నుంచి ఆకాశంలోకి ప్రయోగించే క్షిపణులు (ఎస్‌ఏఎం), సోవియట్‌ యూనియన్‌ కాలంనాటి ఆయుధాలు, ఎస్‌`300 యూనిట్లు, సంచార ఐఆర్‌ఐఎస్‌`టి బ్యాటరీ లు, మనుషులు మోసుకెళ్లగల గగనతల రక్షణ వ్యవస్థలు, విమాన విధ్వంసక శతఘ్నులు ము ఖ్యంగా జర్మన్‌ తయారీ జెపార్డ్‌లు ఉక్రెయిన్‌ వద్ద వున్నప్పటికీ వీటిని ఉపయోగించడంలో సమ న్వయం లోపించడం పరాజయానికి దారితీసింది.

ఇక భారత్‌ విషయానికి వస్తే దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన ఆయుధాలను ఎంతో చక్కగా సమర్థవంతంగా వినియోగించింది. వీటి పనితీరు నూటికి నూరుపాళ్లు నిక్కచ్చిగా వుండటంతో ప్రపంచానికి భారత సాంకేతిక పరిజ్ఞాన సామర్థ్యంపై గట్టి విశ్వాసం ఏర్పడిరది. ఈ నేపథ్యంలో రష్యా తయారీ ఎస్‌`400కు సమానమైన ప్లాట్‌ఫామ్‌లు, ఇతర దేశీయ తయారీ ఆయుధాలను ఇప్పుడు భారత్‌ చక్కగా విదేశాలకు అమ్ముకోగలుగుతుంది. ఒకరకంగా చెప్పాలంటే తన ఆయుధ సామర్థ్య ప్రదర్శనకు పాకిస్తాన్‌ను ఒక వేదికగా భారత్‌ ఉపయోగించుకున్నదనే చెప్పాలి. దీనివల్ల ఒనగూడిన ప్రయోజనాలు రెండు. పాకిస్తాన్‌ పొగరు అణచడం. రెండవది తన ఆయుధ మార్కెట్‌లో మరింత విశ్వసనీయతను సంపాదించుకోవడం. ఇదే సమయంలో చైనా తయారీ పరికరాలు ఎంత నిప్పచ్చరంగా వున్నాయో ప్రపంచానికి విస్పష్టంగా చూపడం! ఈ మూడు లక్ష్యాలను భారత్‌ సునాయాసంగా సాధించింది. మరో ప్రధాన విషయమేంటంటే గత యు ద్ధాల్లో మాదిరిగా భారత్‌ ఎంతో కష్టపడి చమటోడ్చాల్సిన పరిస్థితి ఏర్పడలేదు. తనవద్ద వున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సునాయాసంగా పాక్‌ను మట్టికరిపించింది. 

మొత్తంమీద చెప్పాలంటే ఆపరేషన్‌ సింధూర్‌ తర్వాత భారత్‌ గగనతల రక్షణ వ్యవస్థ, క్షిపణుల సామర్థ్యం ఎంత బాగా వున్నదీ ప్రపంచానికి వెల్లడి కావడంతో, ఈ రంగాల్లో రానున్న కాలంలో భారత్‌ ఎగుమతులు బాగా ఊపందుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటివరకు తక్కువ ఖరీదుకు చైనా నుంచి కొనుగోలు చేస్తున్న ఆయుధాల విషయంలో సంశయాత్మకత పెరగడమే కాదు, ఇక ముందు నాణ్యమైన భారత్‌ ఉత్పత్తులవైపు దృష్టి సారించే అవకాశాలే మెండు.

ఇప్పటికే భారత్‌ తన భౌగోళిక రాజకీయ విస్తృతిని బాగా పెంచుకుంటూ, చైనా ఆధిపత్యాన్ని స వాలు చేస్తోంది. ఇక ఇప్పుడిప్పుడే తయారీరంగంలో కూడా చైనాకు పెద్ద పోటీదారుగా మారబో తున్నది. అంతేకాదు ఆధునిక రక్షణ వ్యవస్థల తయారీ, అమ్మకాల విషయంలో ఇప్పటివరకు కొనసాగుతున్న చైనా ఆధిపత్యాన్ని క్రమంగా దెబ్బతీయవచ్చు. కొన్ని దశాబ్దాలుగా ఆసియా, ఆఫ్రికా దేశాలతో దౌత్య సంబంధాలను నెరపుతూ, చైనా తన ఆయుధాలను ఆయా దేశాలకు అమ్ము కుంటూ వస్తున్నది. ఇప్పుడు భారత సామర్థ్యం బహిర్గతం కావడంతో ఆయా దేశాలు ఇక క్రమంగా చైనాపై ఆధారపడటాన్ని తగ్గించకమానవు. ఇప్పటికే చైనా పట్ల యూరప్‌, ఆఫ్రికా, ఆసియా దేశాల్లో క్రమంగా వ్యతిరేకత పెరుగుతోంది. ముఖ్యంగా దౌత్యం ముసుగులో ఆధిపత్య రాజకీ యాలు చేయడం చేయడం చైనాకు అలవాటు కను, ఇప్పటివరకు అవసరం రీత్యా తప్పనిసరిగా సహిస్తూ వస్తున్న ఆసియా దేశాలు తమ వైఖరిని పూర్తిగా మర్చుకునే అవకాశాలే ఎక్కువ. ఒక పక్క స్నేహసంబంధాలు నెరపుతూనే ఆయా దేశాలను రుణ ఊబిలో నెట్టిన చైనా వైఖరిపట్ల చా లా దేశాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొన్ని ఈ ఊబినుంచి బయటపడటానికి యత్నిస్తుండగా, కొన్ని బయటకు రాలేక చైనా కబందహస్తాల్లో కునారిల్లుకుపోతున్నాయి. ముఖ్యంగా చైనా క ల్పించే రుణ ఊబి ఆయా దేశాలను ఊపిరాడకుండా చేస్తున్నాయి. 

ఇటువంటి పరిస్థితుల్లో వాటికి భారత్‌ ఒక ప్రత్యామ్నాంగా కనిపిస్తున్నా, విశ్వసించడానికి అనువైన వేదిక లేకపోవడంతో అవి మౌనంగా వుంటూ వస్తున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్‌ పుణ్యమాని ఆపరేషన్‌ సింధు భారత్‌ సామర్థ్య ప్రదర్శనకు చక్కటి వేదికగా మారడంతో, ఆసియా, ఆఫ్రికా, యూరప్‌ దేశాల వైఖరిలో గణనీయమైన మార్పు రావడం తథ్యం.

దినామ్‌ ఆరోపణలే..ఎల్ల కాలం రాజకీయాలే!!

`అభివృద్ధికి ఏది సమయం.. చెప్పుకోవడానికి ఏది సందర్భం.

`నిన్నటి దాకా వీళ్లు..ఇప్పుడు వాళ్లు!

`అవినీతి ఆరోపణలు రాకుండా రాజకీయాలు చేయలేరా?

`దోచుకున్నారన్న విమర్శలు లేకుండా పాలన సాగించలేరా?

`మీరంటే మీరు దోచుకున్న ముచ్చట్లు తప్ప అభివృద్ధి గురించి మాట్లాడరా?

`దోచుకు తింటున్నారనే నాయకులు తప్ప ప్రజలకు దిక్కులేదా!

`నిన్నటి దాగా బిఆర్‌ఎస్‌ లక్షల కోట్లు దోచుకుందన్నారు

`రాష్ట్రాన్ని బిఆర్‌ఎస్‌ దివాలా తీయించిందన్నారు

`నిరూపించమని ప్రతి అంశంలోనూ బిఆర్‌ఎస్‌ సవాలు చేస్తూనే వుంది

`సంవత్సరంన్నరైనా ఏది నిరూపించింది లేదు

`ఎవరికీ శిక్ష పడిరది లేదు

`పత్రికలకు వార్తలకు కొదువ లేదు

`ఇప్పుడు బిఆర్‌ఎస్‌ ఆరోపణలు మొదలయ్యాయి

`కాంగ్రెస్‌ పార్టీ నాయకులు దోచుకుంటున్నారంటున్నారు

`నిజాయితీగా ఏ పార్టీ ప్రజాసేవ చేయలేదా?

`ప్రజలకు ప్రత్యామ్నాయం వీళ్లు తప్ప ఇంకెవరూ లేరా?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఏ రాజకీయ పార్టీ నాయకుడి గురించి విన్నా ఏమున్నది గర్వకారణం సమస్తం అవినీతి ఆరోపణల మయం. ఇప్పుడున్న రాజకీయ పార్టీలైనా, నాయకులైనా సరే ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని వాళ్లు మచ్చుకు కూడా కనిపించడం లేదు. వాళ్లు నిజంగా సంపాదించారా? లేదా? అన్నది ఎవరికీ తెలియదు. కాని ఆస్ధులు కూడబెట్టుకున్నారన్నది నిజం. జనంలో ఆ దర్పం కనిపిస్తున్నది నిజం. కాని రాజకీయ అవినీతి ద్వారా సంపాదించారా? అన్నది మాత్రం పూర్తిగా నిజంకాకపోవచ్చు. ఒకప్పుడు నాయలంటే కేవలం ప్రజా ప్రతినిధులుగానే కొనసాగుతూ వుండేవారు. ప్రజా సేవ తప్ప మరో వ్యాపకం వుండేది కాదు. వుంటే గింటే అంతో ఇంతో వ్యవసాయం వుండేది. అంతే తప్ప పెద్దగా వ్యాపారాలుండేవి కాదు. సంపాదనపై పెద్దగా వారికి ఆసక్తి వుండేది కాదు. ఎన్నికల సమయాల్లో కూడా వారికి వ్యాపారులు సహకరించేవారు. ఎన్నికల తంతు పూర్తి చేసుకునేవారు. కాని ఎనభైవ దశకం నుంచి పార్టీలపైన విమర్శలు, నాయకుల మీద అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయి. అవి ఇప్పుడు తారాస్దాయికి చేరుకున్నాయి. ఒకప్పుడు లక్షల రూపాలయలు సంపాదించారంటే అది పెద్ద విషయంగా చెప్పుకునే వారు. తర్వాత కోట్లు, వందల కోట్లు, వేల కోట్లు, ఇప్పుడు ఏకంగా లక్షల కోట్లు అనే మాటలు తప్ప తక్కువ వినిపించడం లేదు. నిజంగా నాయకులు అంత సంపాదిస్తారా? అంటే అవును ఎవరూ సమాదానం చెప్పలేరు. విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నామనే వారు కూడా వున్నారు. అయితే ఆ విమర్శించే వాళ్లు కూడా ప్రతి విమర్శలు ఎదుర్కొంటున్నవాళ్లే..అందులో ఎవరూ సుద్దపూసలు కాదన్న మాటలు పడుతున్నవాళ్లే..ఈ నాలుగు దశాబ్దాల కాలంలో ఆరోపణలు ఎదుర్కొని నాయకులు ఒక్కరు కూడ లేదు. కాకపోతే ఇప్పటికీ కనిపిస్తున్న ఒక్కరో, ఇద్దరో నాయకులు వున్నప్పటికీ వారు క్రియాశీల రాజకీయాల్లో లేరు. ఎన్నికల్లో పోటీచేసినా వాళ్లు ఇప్పుడు గెలవలేరు. గతంలో నాలుగుసార్లు, ఐదు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి ఎలాంటి అవినీతి మరకలు అంటని వారు, ఇప్పుడు ఎన్నికల్లో పోటీచేసినా తప్పకుండా వాళ్లు కూడా ఆరోపణలు ఎదుర్కొక తప్పని పరిస్దితులు వచ్చేశాయి. రాజకీయాల్లో అవినీతి అనే పదం అంతకు ముందుఎలా వున్నా..ఎంత వున్నప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతే పుట్టిందని చెప్పకతప్పదు. ఇప్పుడు ఎన్టీఆర్‌ కాలంలో గురించిగొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ అప్పట్లో ఎన్టీఆర్‌ అవినీతి మీద, ఆశ్రిత పక్షపాతం మీద, అదికార దుర్వినియోగం మీద, కుటుంబ పాలన మీద అనేక సిని మాలు వచ్చాయి. నేరుగా ఎన్టీఆర్‌ను టార్గెట్‌ చేస్తూ సినీ నటుడు సూపర్‌ స్టార్‌ కృష్ణ అనేక సినిమాలు తీశాడు. కాని ఇప్పుడు ఎన్టీఆర్‌ కాలం గొప్పదనట్లు చెబుతుంటారు. అదే నిజమైతే అప్పట్లో అలాంటి సినిమాలు వచ్చేవి కాదు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ది అనే మాట అటకెక్కింది. నిత్యం రాజకీయ పరమైన ఆరోపణలతోనే కాలం గడిచింది. నిజమైన అభివృద్దిని ఆనాడు చేసిందేమీ లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో వున్నప్పుడు తొమ్మిదేళ్ల కాలంలో పెద్దగా వ్యవసాయపరమైన ప్రాజెక్టుల నిర్మాణం జరగలేదు. ఎంత సేపు పారిశ్రామికీకరణ, ప్రభుత్వ రంగ సంస్ధల ప్రైవేటీ కరణ, ప్రభుత్వ కంపనీల అమ్మకాలులతో వచ్చే ఆదాయాల్లో కమీషన్లు అనే ఆరోపణలు అనేకం ఎదుర్కొన్నారు. రైతులకు సబ్సిడీలు తగ్గించారు. విపరీతమైన కంరటు చార్జీలు పెంచారు. వ్యవసాయం లాభసాటి నుంటి గిట్టుబాటు కాదన్నంత దూరం తెచ్చాడు. వ్యవసాయం పంగడ కాదు, దండగ అన్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. మరి ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చేసిన అభివృద్ది ఏమిటని బూతద్దం పెట్టి వెతికినా ఒక్క ప్రాజెక్టు కనిపించదు. రాష్ట్రాదాయమేమో కాని, ఆయన ఆస్దులు మాత్రం పెరిగిపోయాయన్న ఆరోపణలుఅనేకం వచ్చాయి. రెండు ఎకరాల చంద్రబాబు, ఇరవై వేలకోట్లు సంపాదించారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు నుంచి తెచ్చిన అప్పులతో, అవసరం లేని పనులు చేపట్టి, రైతులను ఇబ్బందులకు గురి చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. కమ్యూనిస్టుల చేత ప్రపంచ బ్యాంకు జీతగాడు అని పుస్తకాలు కూడా ప్రచురించారు. తర్వాత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన ఐదేళ్లలలోనే లక్ష కోట్లు సంపాదించారన్న ఆరోపణలుఎదుర్కొన్నారు. ఆయన హయాంలో కూడా పెద్దగా చేసిన పనులేమీ లేదు. కాని నిత్యం అవినీతి ఆరోపణలు ప్రత్యారోపణలతోనే కాలం గడిచిపోయింది. తర్వాత మరో ఐదేళ్ల కాలంలో ఎప్పుడూ ఆరోపణలు ఎదుర్కొని రోశయ్య, రాష్ట్రం విడిపోయే సయమంలో కిరణ్‌కుమార్‌ రెడ్డి పెద్దఎత్తున సంతకాలు పెట్టి సంపాదించారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. దాదాపు ఆ ముప్పై ఎళ్ల కాలంలో వచ్చిన మార్పులు ఏమిటంటే అంతా హైటెక్‌ హంగులు తప్ప మరేం కనిపించడం లేదు. కేవలం ఐటి తప్ప మరేం కొత్త పుంతలు తొక్కిన ఆర్ధిక పరిస్దితి లేదు. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి కేసిఆర్‌ పరిపాలన చేసిన పదేళ్ల కాలం పాటు కాంగ్రెస్‌ నుంచి అనేక ఆరోపణలు, విమర్శలే. తొలి ఐదేళ్ల కాలంలో కొంత ప్రతిపక్షాల నుంచి పెద్దగా నిరసనలు, ఆరోపణలు వినిపించలేదు. కాని కేసిఆర్‌ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ఇక ఆర్ధికపరమైన ఆరోణలతోనే కాలం గడిచింది. ఆ సమయంలో కాంగ్రెస్‌ గాని, బిజేపి గాని నిత్యం ఆరోపణలే తప్ప కేసిఆర్‌ తోపాటు, బిఆర్‌ఎస్‌కు చెందిన నాయకుల ఆర్ధికపరమైన దోపిడీ గురించి స్పష్టమైన ఆధారాలు సంపాదించిందేమీ లేదు. ముఖ్యంగా సోషల్‌ మీడియా యుగం మొదలైన తర్వాత బిఆర్‌ఎస్‌ పతనం మొదలైంది. పిపిసి. అధ్యక్షుడుగా రేవంత్‌రెడ్డి నియాకంతో బిఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ అమాంతం పడిపోయింది. నిత్యం ఆరోపణలు, ప్రత్యారోపణలతోనే కాలం గడిచిపోయింది. ఇప్పుడు బిఆర్‌ఎస్‌ వంతు వచ్చింది. ఏడాదిన్నర కాలం పూర్తవుతోంది. గతంలో నాయకులు చేసిన ఆరోపణలు మీడియా గుర్తు చేస్తే తప్ప వాటి గురించి ఆలోచనలు వుండేవి కాదు. ప్రజలు కూడా పట్టించుకునేంత తీరిక వుండేది కాదు. కాని నేడు ఆ పరిస్దితి లేదు. సోషల్‌ మీడియా ప్రభావం ఎక్కువైంది. నాయకులు మర్చిపోయినా, సోషల్‌ మీడియా నిత్యం ప్రశ్నిస్తూనే వుంటుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిఆర్‌ఎస్‌ హాయంలో జరిగిన, ప్రతిపక్షంలో వున్నప్పుడు చేసిన ఆరోపణల మీద నిజా నిజాలు తేలుతాయని అందరూ అనుకున్నారు. కాళేశ్వరంలో లక్ష రూపాయలు తిన్నారన్నది ప్రదాన ఆరోపణ కేసిఆర్‌ మీద వుంది. అంతే కాకుండా కేసిఆర్‌ ఫామ్‌ హౌజ్‌లో వందల ఎకరాలున్నాయన్నాదానిపై విమర్శలున్నాయి. కేసిఆర్‌ పాలనా సమయంలో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులు అనేవి ఇప్పటికీ సజీవంగా సాగుతున్న ఆరోపణలు. మరి ఆ ఆరోపణలు ప్రభుత్వం ఎందుకు నిరూపించలేకపోతోంది. ఏడాదిన్న కాలం గడిచిపోతోంది. యాదాద్రి విద్యుత్‌ ప్రాజెక్టుతోపాటు, అనేక ఇరిగేషన్‌ ప్రాజెక్టుల మీద ఆరోపణలున్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి దీనిపై చర్యలు తీసుకుంటామని చెబుతూనే వున్నారు. మీరు ఎలాంటి దర్యాప్తులైనా చేసుకోండని బిఆర్‌ఎస్‌ ఎదరు సవాలు చేస్తూనే వుంది. బిఆర్‌ఎస్‌ హాయాంలో కేసిఆర్‌ ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పులు చేసిందని అంటున్నారు. వాటి లెక్కలు చెప్పరు. అందులో జరిగిన అవినీతి చెప్పరు. ఇక బిఆర్‌ఎస్‌ వంతు వచ్చింది. ఏడాదిన్న కాలంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇన్ని వేల కోట్లు దోచుకున్నాడు? ఆయన సోదరులు ఇన్ని తిన్నారు? ఫలానా మంత్రి ఇలా వసూలు చేస్తున్నాడు? అని ఆరోపణలు మొదలు పెట్టారు. కాని వివరాలు చెప్పమంటే మాత్రం సమయం వచ్చినప్పుడు అన్నీ బైట పెడతామంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు. వారికి వివరాలు చెప్పడానికి సమయం, సందర్భం అవసరామా? అంటే పార్టీలు ఏవైనా సరే నాయకులంతా ఎల్ల కాలం రాజకీయాలు తప్ప మరేం చేయారా? ఎమ్మెల్యేలు ఎవరూ తమ నియోజకవర్గాలలో వున్న సమస్యలు ప్రస్తావించారా? వాటి పనుల పూర్తి గురించి, అబివృద్ది గురించి మాట్లాడరా? చేసిన అభివృద్ది గురించి చెప్పరా? దినాం..అధికార పార్టీ నాయకులతోపాటు, ప్రతిపక్ష నాయకులంతా అవినీతి ఆరోపణలు తప్ప మరేం మాట్లాడుకోరా? నువ్వుంటే,నువ్వు అని నిత్యం ఒకరిపై ఒకరు చేసుకునే అవినీతి ఆరోపణలు వింటూ ప్రజలు కూడాపంచ తంత్ర కథలు వింటున్నట్లు సంబరపడి పోతున్నారు. ఇది కూడా తమ మంచికే అని నాయకులు లోలోన నవ్వుకుంటున్నారు..అంతే అంతకు మించి ఈ కథ ఒక్క అడుగు కూడా ముందుకు పోదు..అవినీతి నిరూపణలు అన్నవి ఆమడదూరం…అంతే!!!

వార్డులో సమస్యలు పరిష్కరించాలి .

వార్డులో సమస్యలు పరిష్కరించాలి

మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేసిన మాజీ కౌన్సిలర్ సంపత్

పరకాల నేటిధాత్రి :

 

 

వార్డులో డ్రైనేజీలు క్రమ క్రమంగా తీయక దుర్వాసన వస్తుందని,ఇంటింటికి స్వచ్ఛ ఆటోల ద్వారా చెత్త సేకరించాలని,నల్లాల ద్వారా ఇంటింటికి క్రమం. తప్పకుండా నీళ్లు అందే విధంగా చూడాలని,వీధిలైట్లు వెలుగని చోట వెలిగేలా చూడాలని,ఎండకాలం దృష్ట్యా బోరింగులు రిపేరు ఉన్న దగ్గర ఎప్పటికప్పుడు రిపేర్లు చేపించాలని,వీధులన్నీ శుభ్రంగా ఉండేలా చూడాలని, దోమల మందు ఫాగింగ్ చేపించాలని,డ్రైనేజీల వెంట బ్లీచింగ్ చల్లించాలని మున్సిపాలిటీలోని ఒకటో వార్డు ప్రజల సౌకర్యార్థం వార్డును పరిశుభ్రంగా ఉండేలా చూడాలని మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు.

కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే వారికే పార్టీ పదవులు.

కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే వారికే పార్టీ పదవులు

గ్రామ స్థాయి నుండి బ్లాక్ స్థాయి వరకు నూతన కమిటీలు

కేసముద్రం నేటిదాత్రి:

కేసముద్రం మండల కేంద్రంలో లక్ష్మీ సాయి గార్డెన్ లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో సంస్థాగత నిర్మాణం సన్నహక విస్తృత స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించబడింది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ అబ్జర్వర్ పోట్ల నాగేశ్వర్ రావు,టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,అబ్జర్వర్ కూచన రవళి రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా పోట్ల నాగేశ్వర్ రావు,రవళి రెడ్డి మాట్లాడుతూ పార్టీ బలపడాలంటే ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని,అర్హులైన నాయకులకు ఖచ్చితంగా పదవులు వస్తాయ అన్నారు.నాయకత్వం అందరికీ అవకాశం ఇస్తుందని,క్షేత్ర స్థాయిలో పనిచేసి కాంగ్రెస్ పార్టీకి మద్దతును పెంచాలన్నారు.రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని సాధించేందుకు మన అందరము కలిసికట్టుగా పని చేయాలి అని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి,పిసిసి మెంబర్ దస్రు నాయక్,ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి,డిసిసి వైస్ ప్రెసిడెంట్ అంబటి మహేందర్ రెడ్డి,మాజీ పిఎసిఎస్ చైర్మన్ బండారు వెంకన్న,మాజీ జడ్పీటీసీ కదిరే సురేందర్,పోలేపాక నాగరాజు,మార్కెట్ డైరెక్టర్ ఎండీ ఆయూబ్ ఖాన్,మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి రఫీ ఖాన్,ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు వెంకన్న,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోలేపెల్లి మహేందర్,కార్యకర్తలు,మండల నాయకులు,జిల్లా నాయకులు,గ్రామ కమిటీ అధ్యక్షులు,యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

దుర్గమ్మ తల్లి పండుగ సందర్భంగా గూగుల్ శంకర్ .!

దుర్గమ్మ తల్లి తిరుగు పండుగ ఉత్సవం సందర్భంగా మాజీ కౌన్సిలర్ గూగుల్ శంకర్ నివాసంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర సందడి

తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి :

 

 

తొర్రూర్ డివిజన్ పరిధిలోని టీక్యా తండా , ఎర్రసోమ్లా తండా లో మాజీ కౌన్సిలర్ గూగుల్ శంకర్ నివాసంలో బిఆర్ఎస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు, వద్దిరాజు రవిచంద్ర సందడి చేశారు.
గ్రామీణ ప్రాంతంలో గిరిజనులు ఎంతో ఉత్సాహంగా, సాంప్రదాయమైన పద్ధతులల్లో జరుపుకొనే ఈలాంటి పండుగలు మనుషుల మధ్య మానవ సంబంధాన్ని, ఆచార సాంప్రదాయాన్ని ప్రేమను పంచే విలువైన పండుగలుగా వర్ణించారు. గిరిజన మిత్రుడు శంకర్ నివాసంలో పండుగ సంబరాలు పాల్గొనడం ఎంతో ఆనందంగా అందని తెలియజేశారు.

 

Celebrations

ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ పార్టీ తోరూర్ మండల పార్టీ అధ్యక్షులు పసుమర్తి సీతారాములు, మాజీ జడ్పిటిసి & మహబూబాబాద్ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ మంగళ పెల్లి శ్రీనివాస్, పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షులు రామిని శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ అనుమాండ్ల ప్రదీప్ రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నలవాస ప్రమోద్, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీనివాస్ , మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్స్ ఎన్నమ నేని శ్రీనివాసరావు, నాయకులు కర్నే నాగరాజు, పేర్ల జంపా సింగిల్ విండో డైరెక్టర్ జనార్దన్ రాజు , మాజీ సర్పంచ్ విజయకుమార్ నాయకులు, గుంజి రవి యాకూబ్, బానోత్ అశోక్ తండావాసులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

దుర్గమ్మ తల్లి తిరుగు పండుగ ఉత్సవం.!

దుర్గమ్మ తల్లి తిరుగు పండుగ ఉత్సవం సందర్భంగా మాజీ కౌన్సిలర్ గూగుల్ శంకర్ నివాసంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర సందడి

తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి:

తొర్రూర్ డివిజన్ పరిధిలోని టీక్యా తండా , ఎర్రసోమ్లా తండా లో మాజీ కౌన్సిలర్ గూగుల్ శంకర్ నివాసంలో బిఆర్ఎస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు, వద్దిరాజు రవిచంద్ర సందడి చేశారు.
గ్రామీణ ప్రాంతంలో గిరిజనులు ఎంతో ఉత్సాహంగా, సాంప్రదాయమైన పద్ధతులల్లో జరుపుకొనే ఈలాంటి పండుగలు మనుషుల మధ్య మానవ సంబంధాన్ని, ఆచార సాంప్రదాయాన్ని ప్రేమను పంచే విలువైన పండుగలుగా వర్ణించారు. గిరిజన మిత్రుడు శంకర్ నివాసంలో పండుగ సంబరాలు పాల్గొనడం ఎంతో ఆనందంగా అందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ పార్టీ తోరూర్ మండల పార్టీ అధ్యక్షులు పసుమర్తి సీతారాములు, మాజీ జడ్పిటిసి & మహబూబాబాద్ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ మంగళ పెల్లి శ్రీనివాస్, పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షులు రామిని శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ అనుమాండ్ల ప్రదీప్ రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నలవాస ప్రమోద్, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీనివాస్ , మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్స్ ఎన్నమ నేని శ్రీనివాసరావు, నాయకులు కర్నే నాగరాజు, పేర్ల జంపా సింగిల్ విండో డైరెక్టర్ జనార్దన్ రాజు , మాజీ సర్పంచ్ విజయకుమార్ నాయకులు, గుంజి రవి యాకూబ్, బానోత్ అశోక్ తండావాసులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

44 కార్మిక చట్టాలను అమలు చేయాలి AITUC డిమాండ్. !

4.లేబర్ కోడ్లను రద్దుచేసి 44 కార్మిక చట్టాలను అమలు చేయాలి AITUC డిమాండ్…………………

తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి :

 

 

అంగన్వాడి టీచర్స్ & హెల్పర్స్ అసోసియేషన్ AITUC ఆధ్వర్యంలో మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలం కేంద్రంలోని ICDS అధికారి మజార్ గారికి సమ్మె నోటీసు ఇచ్చి అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు చీర లక్ష్మీ నరసమ్మ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు సాధించుకున్న చట్టాల గురించి ఆలోచించకుండా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరించడం ఎంతవరకు సరి అయిందన్నారు 44 కార్మిక. చట్టాలను నాలుగు లేబర్ కోడులుగా చేయాలని చూసి ఆలోచనను విరమించుకోవాలన్నారు అంగన్వాడి, ఆశ, మధ్యాహ్న భోజనం కార్మికులంతా కేంద్ర ప్రభుత్వ స్కీం వర్కర్స్ లక్షలాదిమంది శ్రమదోపిడికి గురవుతూ అతి తక్కువ వేతనాలతో ఎక్కువ పని గంటలు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా ప్రయత్నిస్తుంటే మా యొక్క హక్కులను కాలరాయటం బిజెపి ప్రభుత్వానికి ముఖ్యంగా నరేంద్ర మోడీకి తగునా అన్నారు మే 20 తారీకు నాడు చేపట్టినటువంటి సార్వత్రిక సమ్మెలో కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని బిజెపి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు కార్మికులంతా అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు………….. కార్యక్రమంలో. రేషపల్లి నవీన్. బందు మహేందర్. డప్పు శీను తదితరులు పాల్గొన్నారు

దోపిడి పాలకులకు వామపక్ష ఐక్యతే ఏకైక మార్గం.

దోపిడి పాలకులకు వామపక్ష ఐక్యతే ఏకైక మార్గం

ఓంకార్ పీడిత ప్రజల మహాశక్తి

ఎంసిపిఐ(యు)జాతీయ ప్రధాన కార్యదర్శి మద్ది కాయల అశోక్ ఓంకార్

ఓంకార్ శత జయంతి వార్షికోత్సవ ప్రారంభ సభలో పాల్గొన్న వామపక్ష సామాజిక రాష్ట్ర నేతలు

వరంగల్ జిల్లా ప్రతినిధి  నేటిధాత్రి:

దేశంలో పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలకు మతోన్మాద దోపిడీ వ్యవస్థకు ప్రత్యామ్నాయం వామపక్ష సామాజిక శక్తుల ఐక్య ఉద్యమాలు అని ఎంసిపిఐ యు జాతీయ ప్రధాన కార్యదర్శి మద్ది కాయల అశోక్ ఓంకార్ అన్నారు. కమ్యూనిస్టుల ఐక్యతకు అమరజీవి మద్ది కాయల ఓంకార్ కలలు కన్నాడని అది నిజం చేయడం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, అసెంబ్లీ టైగర్ ఎంసిపిఐ యు వ్యవస్థాపకులు,అమరజీవి మద్ది కాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవ ప్రారంభ సభ కామ్రేడ్ గోనె కుమారస్వామి అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన అశోక్ ఓంకార్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాసరావు, ప్రజాకవి జయరాజు, సినీ డైరెక్టర్ బాబ్జి, సిపిఐ ఎంఎల్ యు డెమోక్రసీ అధికార ప్రతినిధి చలపతిరావు, బిఎల్ఎఫ్ రాష్ట్ర చైర్మన్ నల్ల సూర్యప్రకాష్, మురహరి తదితరులు మాట్లాడుతూ అమరజీవి ఓంకార్ త్యాగాలు ఆదర్శాలు ప్రతి కమ్యూనిస్టు ఉనికిబుచ్చుకొని ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆ దిశలో బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందని అందరికీ చెందాల్సిన సంపదను పెట్టుబడిదారులకు కట్ట పెడుతున్నారని ప్రజా ఉద్యమాలనుంచి వేస్తున్నారని భద్రత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మతం అంట కడుతున్నారని ప్రజలకు కనీస అవసరాలు సమకూర్చడంలో కనీస చిత్తశుద్ధి ప్రదర్శించని పాలకులు పోరాడే వారిపై మాత్రం అణిచివేత చర్యలకు పాల్పడుతున్నారని ఇలాంటి పరిస్థితుల్లో ఓంకార్ గారి స్ఫూర్తితో ఎంతటి త్యాగానికైనా సిద్ధపడి పోరాటాలను నిలబెట్టాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, పోలి బ్యూరో సభ్యులు కాటం నాగభూషణం, వల్లె పుపేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు వనం సుధాకర్, జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్, యువ రచయిత యోజన,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్ రెడ్డి అంశారెడ్డి, మస్తుల మట్టయ్య, వరికుప్పల వెంకన్న,మంద రవి,కుంభం సుకన్య, తుకారాం నాయక్, లింగంపల్లి శ్రీనివాసరెడ్డి,వర్ణం వెంకటరెడ్డి, సోమిడి శ్రీనివాస్ లతోపాటు ఐక్య ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కన్నం వెంకన్న బృందం ఇతర కళాకారులు ఆటపాట అలరించాయి.ముందుగా వరంగల్ వ్యాప్తంగా ఎర్రజెండాలు,ప్రభబండ్లు,కోలాటాలు,ప్రజా నాట్యమండలి డప్పు చప్పుళ్ళతో వరంగల్ నర్సంపేట ప్రధాన రహదారిపై
భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.మహిళల కోలాట నృత్యాలు,విప్లవ పాటలు ఎంతగానో అలరించారు.

నర్సింగ్ హోమ్ ను తనిఖీ చేసిన వైద్యాధికారులు .

నర్సింగ్ హోమ్ ను తనిఖీ చేసిన వైద్యాధికారులు

నిజాంపేట, నేటి ధాత్రి :

 

 

మెదక్ జిల్లా నిజాంపేట
మండల కేంద్రంలోని శ్రీనివాస నర్సింగ్ హోమ్ ను జిల్లా వైద్యాధికారులు మంగళవారం తనిఖీలు చేశారు. ప్రోగ్రామ్ ఆఫీసర్ సుజన మాట్లాడుతూ నిజాంపేట శ్రీనివాస నర్సింగ్ హోమ్ పై వచ్చిన ఫిర్యాదు మేరకు తనికి చేయడం జరిగిందని అన్నారు. అందులో భాగంగానే అన్ని రిపోర్టులను సేకరించి డిఎంహెచ్వో కు పంపించడం జరుగుతుందని తదుపరి విచారణ చేపట్టిన తర్వాత తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎం హెచ్ ఓ అనిల్, డాక్టర్ హరిప్రియ, డెమో శ్రీనివాస్, సూపర్వైజర్లు వెంకటేశ్వరరావు, కొండయ్య, రామారావు తదితరులు పాల్గొన్నారు.

దోపిడి పాలకులకు వామపక్ష ఐక్యతే ఏకైక మార్గం .

దోపిడి పాలకులకు వామపక్ష ఐక్యతే ఏకైక మార్గం

ఓంకార్ పీడిత ప్రజల మహాశక్తి

ఎంసిపిఐ(యు)జాతీయ ప్రధాన కార్యదర్శి మద్ది కాయల అశోక్ ఓంకార్

ఓంకార్ శత జయంతి వార్షికోత్సవ ప్రారంభ సభలో పాల్గొన్న వామపక్ష సామాజిక రాష్ట్ర నేతలు

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్ర :

 

 

దేశంలో పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలకు మతోన్మాద దోపిడీ వ్యవస్థకు ప్రత్యామ్నాయం వామపక్ష సామాజిక శక్తుల ఐక్య ఉద్యమాలు అని ఎంసిపిఐ యు జాతీయ ప్రధాన కార్యదర్శి మద్ది కాయల అశోక్ ఓంకార్ అన్నారు. . వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, అసెంబ్లీ టైగర్ ఎంసిపిఐ యు వ్యవస్థాపకులు,అమరజీవి మద్ది కాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవ ప్రారంభ సభ కామ్రేడ్ గోనె కుమారస్వామి అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన అశోక్ ఓంకార్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాసరావు, ప్రజాకవి జయరాజు, సినీ డైరెక్టర్ బాబ్జి, సిపిఐ ఎంఎల్ యు డెమోక్రసీ అధికార ప్రతినిధి చలపతిరావు, బిఎల్ఎఫ్ రాష్ట్ర చైర్మన్ నల్ల సూర్యప్రకాష్, మురహరి తదితరులు మాట్లాడుతూ అమరజీవి ఓంకార్ త్యాగాలు ఆదర్శాలు ప్రతి కమ్యూనిస్టు ఉనికిబుచ్చుకొని ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆ దిశలో బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

 

plundering rulers

ప్రజా సమస్యల పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందని అందరికీ చెందాల్సిన సంపదను పెట్టుబడిదారులకు కట్ట పెడుతున్నారని ప్రజా ఉద్యమాలనుంచి వేస్తున్నారని భద్రత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మతం అంట కడుతున్నారని ప్రజలకు కనీస అవసరాలు సమకూర్చడంలో కనీస చిత్తశుద్ధి ప్రదర్శించని పాలకులు పోరాడే వారిపై మాత్రం అణిచివేత చర్యలకు పాల్పడుతున్నారని ఇలాంటి పరిస్థితుల్లో ఓంకార్ గారి స్ఫూర్తితో ఎంతటి త్యాగానికైనా సిద్ధపడి పోరాటాలను నిలబెట్టాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, పోలి బ్యూరో సభ్యులు కాటం నాగభూషణం, వల్లె పుపేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు వనం సుధాకర్, జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్, యువ రచయిత యోజన,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్ రెడ్డి అంశారెడ్డి, మస్తుల మట్టయ్య, వరికుప్పల వెంకన్న,మంద రవి,కుంభం సుకన్య, తుకారాం నాయక్, లింగంపల్లి శ్రీనివాసరెడ్డి,వర్ణం వెంకటరెడ్డి, సోమిడి శ్రీనివాస్ లతోపాటు ఐక్య ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కన్నం వెంకన్న బృందం ఇతర కళాకారులు ఆటపాట అలరించాయి.ముందుగా వరంగల్ వ్యాప్తంగా ఎర్రజెండాలు,ప్రభబండ్లు,కోలాటాలు,ప్రజా నాట్యమండలి డప్పు చప్పుళ్ళతో వరంగల్ నర్సంపేట ప్రధాన రహదారిపై
భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.మహిళల కోలాట నృత్యాలు,విప్లవ పాటలు ఎంతగానో అలరించారు.

ఆర్వెస్టర్ యజమానులతో ఎంఎఓ సమావేశం.

ఆర్వెస్టర్ యజమానులతో ఎంఎఓ సమావేశం

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

 

మండల కేంద్రంలోని రైతు వేదికలో. మొగుళ్ళపల్లి మండల ఆర్వెస్టర్ యాజమాన్యంతో. మండల వ్యవసాయ అధికారి సురేందర్ రెడ్డి, సమావేశం నిర్వహించారు. అనంతరం ఎంఎఓ మాట్లాడుతూ. వరి కోతలు కోసే సమయంలో ఆర్వెస్టర్ 18 ఆర్పిఎం పెట్టాలని తద్వారా వడ్లనుండి తాలు వేరుచేయబడి వడ్లు మాత్రమే బయటకు వస్తాయని ధాన్యం కోసేటప్పుడు 18 ఆర్పీ ఎం కంటే తక్కువ పెట్టడం వలన తాలు మట్టిపెల్లలు గడ్డి లాంటివి వస్తాయని అందువల్ల వరి ధాన్యం నాణ్యత ప్రామాణాలు దెబ్బతింటాయని. ధాన్యం అమ్మేటప్పుడు నాణ్యత ప్రామాణాలు ఉండకపోవడంతో రైతులు నష్టపోయే అవకాశం ఉందని. అందువల్ల వరి పైరు కోసేటప్పుడు హార్వెస్టర్ యాజమాన్యం తప్పనిసరిగా 18 ఆర్ పి ఎం ఉండేవిధంగా చూసుకోవాలని. దీనివల్ల రైతులు నష్టపోకుండా మేలు జరుగుతుందని. బ్లోయర్ నిర్ణిత పరిధిలో తిరుగునట్లు చూసుకోవాలని. అదేవిధంగా వరిపైరు 85% ఎండిన తర్వాతనే కోతలు కోయాలని పచ్చగా ఉన్న ధాన్యాన్ని కోయరాదని హార్వెస్టర్ యజమానులకు సూచించారు. ఈ సమావేశంలో మండలంలోని ఏఈవోలు, హార్వెస్టర్ యజమానులు పాల్గొన్నారు.

‘రైతులకు ట్రాన్స్ ఫార్మర్ల పంపిణీ’

‘రైతులకు ట్రాన్స్ ఫార్మర్ల పంపిణీ’

దేవరకద్ర /నేటి ధాత్రి :

 

 

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండలంలోని జానంపేట గ్రామంలో ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి మంగళవారం అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్ మండలాలకు చెందిన 67 మంది రైతులకు నూతన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు అధికారంలో ఉండి లో వోల్టేజీ సమస్యను తీర్చలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు నూతన విద్యుత్ ట్రాన్స్ ఫార్మార్లను అందజేస్తున్నమన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో ఏ ఒక్క రైతుకు లో వోల్టేజీ సమస్యతో బాధపడకుండా.. పరిష్కరిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version