కాంగ్రెస్ శ్రేణుల్లో ఆశలు..!

కాంగ్రెస్ శ్రేణుల్లో ఆశలు..!

కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో పదవుల పందెం మొదలైంది. జిల్లా అధ్యక్ష పదవి కోసం జిల్లా వర్కింగ్ ప్రెసి‌డెంట్‌గా ఉన్న కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, పార్లమెంట్ స్థానానికి పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన వెలిచాల రాజేందర్రావు, పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కుర్ర సత్యప్రసన్నరెడ్డి, సీనియర్ నేత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి పోటీ పడుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ (Congress Party) సంస్థాగత పునర్నిర్మాణంపై దృష్టిసారించడంతో పార్టీ శ్రేణుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తెలంగాణ (Telangana) రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అధికారంలో లేకపోవడం, ఏడాదిన్నర క్రితం అధికారంలోకి వచ్చినా ఆటు సంస్థాగత పదవులు గానీ, ఇటు నామినేటెడ్ పదవులు (Nominated Posts) దక్కక నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్న పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు, క్రియాశీల కార్యకర్తలు, గ్రామీణస్థాయి నాయకుల్లో ఇప్పుడు ఉత్సాహం మొదలైంది. పార్టీ ఆధిష్టానవర్గం సంస్థాగత పునర్నిర్మాణంపై దృష్టిసారించడమే కాకుండా ఉమ్మడి జిల్లాల స్థాయిలో (Karimnagar) ఇన్చార్జీలను పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను నియమించడంతో వారు తమకు అప్పగించిన బాధ్యతల్లో పనిచేయడం ప్రారంభించారు.. ఉమ్మడి జిల్లా సంస్థాగత ఇన్చార్జి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (MLC Addanki Dayakar) ఉమ్మడి జిల్లా పరిధిలోని జిల్లాల్లో పర్యటన ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆయన సమావేశం ఏర్పాటు చేసి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒక జిల్లా ఉపాధ్యక్షున్ని, ప్రతి బ్లాక్ నుంచి ఒక ప్రధాన కార్యదర్శిని, ప్రతి మండలం నుంచి ఒక కార్యదర్శిని తీసుకుంటామని ప్రకటించారు. క్షేత్రస్థాయి నేతలు ఆయా పదవుల క్రీడ కోసం అప్పుడే తమ ప్రయత్నాలు ప్రారంభించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కూడా తీవ్రమైన పోటీ నెలకొన్నది.

ప్రయత్నాలు ముమ్మరం చేసిన నేతలు..

సంస్థాగత ఇన్చార్జి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ జిల్లాలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో సమావేశం ఏర్పా టు చేయడంతో డీసీసీ పదవిని ఆశిస్తున్నవారు అలర్ట్ అయి అందుకు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రధానంగా పదవి కోసం ప్రస్తుతం కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసి‌డెంట్‌గా ఉన్న కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, పార్లమెంట్ స్థానానికి పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన వెలిచాల రాజేందర్రావు, పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కుర్ర సత్యప్రసన్నరెడ్డి, సీనియర్ నేత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి పోటీ పడుతున్నారు

తవక్కల్ విద్యార్థులకు సెమ్స్ ఒలంపియాడ్.

తవక్కల్ విద్యార్థులకు సెమ్స్ ఒలంపియాడ్ జాతీయ ర్యాంకులు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

 

 

తవక్కల్ విద్యాసంస్థల్లో విద్యనభ్యసించే విద్యార్థులు ప్రతీ సంవత్సరం ప్రతిభ కనబరుస్తూ జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించడం గర్వంగా ఉందని విద్యాసంస్థల అధినేత అబ్దుల్ అజీజ్ అన్నారు. గత విద్యా సంవత్సరం జాతీయ స్థాయిలో నిర్వహించిన సెమ్స్ ఒలంపియాడ్ టాలెంట్ టెస్ట్ లో పలువురు విద్యార్థులకు జాతీయ స్థాయిలో ర్యాంకులు వచ్చాయని ఆయన అన్నారు. మందమర్రిలోని ఫోర్త్ క్లాస్ తన్విశ్రీ జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్, రామకృష్ణాపూర్ లోని తొమ్మిదవ తరగతి అబూ హురైరా జాతీయ స్థాయిలో మూడవ ర్యాంక్, నాల్గవ తరగతి విధిషా రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్, ఐదవ తరగతి సాయి సృజన్ రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ లు సాధించారని అబ్దుల్ అజీజ్ తెలిపారు. హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర మొదటి అవార్డ్ గ్రహీత అనూప్ కుమార్ చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాలు, గోల్డ్ మెడల్, ప్రశంసా పత్రం నగదు పురస్కారాలతో విద్యార్థులను సన్మానించారు.విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు.

కేటీఆర్ కి మద్దతుగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు.

కేటీఆర్ కి మద్దతుగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఫార్ములా ఈ రేస్ కేసులో నేడు విచారణకు హాజరవుతున్న కేటీఆర్ కి మద్దతుగా జహీరాబాద్ నుంచి బీఆర్ఎస్ శ్రేణులు హైదరాబాద్ తరలి వెళ్లారు. ఎమ్మెల్యే మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ మాట్లాడుతూ.. కేటీఆర్ పై కాంగ్రెస్ కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. కాళేశ్వరంలో అవకతవకల ప్రచారంపై ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో మళ్లీ ఫార్ములా ఈ రేసుపై తిరిగి విచారణ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.

మంత్రి వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు.

మంత్రి వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు

అవినీతిని రూపుమాపి అభివృద్ధి చేసి చూపిస్తా

ప్రతి గ్రామానికి 50 లక్షల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు

అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం

జైపూర్ నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం,రసూల్ పల్లి,జైపూర్ వద్ద శనివారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి నియోజికవర్గానికి విచ్చేసిన మంత్రి వివేక్ వెంకట్ స్వామికి కాంగ్రెస్ నాయకులు మేళ తాళాలతో,బాణసంచా కాల్చి మంత్రికి ఘన స్వాగతం పలికి పూలమాలలతో,శాలువాలతో సత్కరించారు.జైపూర్ మండల కాంగ్రెస్ నాయకులు మంత్రికి ఘన స్వాగతం పలికిన సందర్భంగా చాలా సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన పేదవారికి అందే విధంగా కృషి చేస్తానని అన్నారు.అలాగే పేదవారికి సన్న బియ్యం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని తెలియజేశారు.ప్రజా పాలనలో ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా అక్రమ అరెస్టులకు తావు లేకుండా చూసే బాధ్యత తనదే అని అన్నారు. పేదవారికి ఉచిత విద్య అందించాలనే కృషితో సోమనపల్లి గ్రామంలో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి పనులు జరుగుతున్నాయని తెలిపారు. అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అందించేలా కృషి చేస్తానని అన్నారు.అలాగే చెన్నూరు నియోజకవర్గం లో అక్రమంగా ఇసుక రవాణా,మట్టి రవాణా చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.నేను ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఎన్నుకున్న నాయకుడిని నేను ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల యోగక్షేమాలు చూసుకుంటూ వారికి ప్రభుత్వం ద్వారా అందాల్సిన పథకాలను అందే విధంగా నా సాయ శక్తుల కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.

జనసేన పార్టీలోకి నల్లాని నిర్మల వైసీపీ శ్రేణులుకు మరో షాక్.

జనసేన పార్టీలోకి నల్లాని నిర్మల వైసీపీ శ్రేణులుకు మరో షాక్…

తిరుపతి(నేటి ధాత్రి) మే 27:

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో మంగళంకు సంబంధించి ప్రజాదరణ పొందిన నాయకురాలు నల్లాని నిర్మల ఈ రోజు దాదాపు 100 మంది మహిళ కార్యకర్తలతో ఉమ్మడి జిల్లా జనసేన ఇంచార్జ్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, ఆధ్వర్యంలో గంగాధర నెల్లూరు ఇంచార్జ్ పొన్నా యుగంధర్ సమక్షంలో జనసేన తిరుపతి జిల్లా పార్టీ ఆఫీసులో వందమందితో భారీగా పార్టీలోకి చేరారు. గతంలో కూడా చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే ముక్కుసూటిగా ప్రశ్నించి అవినీతి అక్రమాలను మీడియా సాక్షిగా బయటపెట్టిన నిర్మల ఇప్పుడు జనసేన పార్టీ అండతో నియోజకవర్గంలో అవినీతి అనే మాట లేకుండా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మీడియా సమావేశంలో డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను విశ్వసించి పార్టీపై నమ్మకంతో మరి అభిమానంతో ఇంతమంది వీర మహిళలు రావడం చాలా సంతోషకరమన్నారు.మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ అదేవిధంగా రాజకీయ రంగాలలో కూడా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. వందమంది ఆధార, అభిమానాలు పొందిన నల్లాని నిర్మల కి పార్టీలోకి సాధరంగా ఆహ్వానిస్తూ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని పార్టీ అభివృద్ధి మరియు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గం జనసేన సీనియర్ నాయకులు తపసి మురళి రెడ్డి మరియు జనసైనికులు నాయకులు, కార్యకర్తలు మరియు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version