టిటిపిఓసి 25 లో పాల్గొన్న ప్రెప్‌ఇన్స్టా.

టిటిపిఓసి 25 లో పాల్గొన్న ప్రెప్‌ఇన్స్టా

విద్యా వ్యవస్థ, పరిశ్రమల మధ్య అనుసంధానానికి వ్యూహాత్మక దిశ

వరంగల్ నేటిధాత్రి:

భారతదేశంలోని ప్రముఖ ప్లేస్‌మెంట్ ప్రిపరేషన్ మరియు నైపుణ్యాభివృద్ధి వేదిక అయిన ప్రెప్‌ఇన్స్టా, జూన్ మొదటివారంలో షాద్ నగర్ లో జరిగిన కెరీర్ నెక్సస్ -2025లో హాజరైనది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్స్ కన్సోర్షియం (టిటిపిఓసి) ఏర్పాటు చేసింది. రెండు రోజుల పాటు సాగిన ఈ సదస్సు విద్యా సంస్థలు మరియు కార్పొరేట్ నియామకదారుల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి ప్రధాన వేదికగా నిలిచింది. దేశవ్యాప్తంగా వందలాదిమంది టీపీఓలు, హెచ్ ఆర్ అధిపతులు, ఎడ్టెక్ నేతలు మరియు పాలసీ మేకర్లు పాల్గొని, క్యాంపస్ ప్లేస్‌మెంట్లు మరియు నైపుణ్యాభివృద్ధి భవిష్యత్తును పునర్నిర్వచించాలనే లక్ష్యంతో చర్చించారు. ఈ చర్చల కేంద్రబిందువుగా, విద్యా శిక్షణ మరియు పరిశ్రమ అవసరాల మధ్య పెరుగుతున్న అంతరాన్ని పరిగణించడమే జరిగింది. ప్రెప్‌ఇన్స్టా సీనియర్ డైరెక్టర్ మనీష్ అగర్వాల్ మాట్లాడుతూ, “భారతదేశంలో ప్లేస్‌మెంట్ లాండ్‌స్కేప్ వేగంగా మారుతోంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది గ్రాడ్యుయేట్లు తయారవుతున్నా, పరిశ్రమ ప్రమాణాలకు అనుగుణంగా ఉద్యోగానికి సిద్ధంగా ఉండే వారి శాతం చాలా తక్కువగా ఉంది. ఈ అంతరాన్ని తగ్గించాలంటే, టిపిఓ లు మరియు కంపెనీ హెచ్ఆర్ లు కలిసి పని చేయాలి. శిక్షణ, అంచనా, నియామకం అన్నీ ఒకే వేదికపై కలిసేలా ప్లాట్‌ఫారాలు నిర్మించాలి. ఇది విద్యార్థుల విజయాన్ని పటిష్టంగా మద్దతిచ్చే ప్లేస్‌మెంట్ పద్ధతుల తరం కావాలి” అని అన్నారు. ఈ కార్యక్రమంలో చర్చించిన ముఖ్య సమస్యలు ఈ విధంగా ఉన్నాయి. క్యాంపస్ శిక్షణలో ప్రమాణాల లోపం, పాత విధానాల ఆధారంగా ప్లేస్‌మెంట్ ట్రాకింగ్, టీపీఓ లు మరియు నియామకదారుల మధ్య తక్కువ కమ్యూనికేషన్, టియర్ 2 టియర్ 3 కాలేజీలలో తక్కువ ప్లేస్‌మెంట్ శాతం వంటివి ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి, ప్రెప్‌ఇన్స్టా సహకారాత్మక, డేటా ఆధారిత దృక్పథాన్ని ప్రతిపాదించింది. దీని ద్వారా కాలేజీలు పటిష్టమైన డేటా, స్కేలబుల్ టూల్స్, మరియు బలమైన రిక్రూటర్ నెట్‌వర్క్‌ను పొందగలుగుతాయి. “ప్రెప్‌ఇన్స్టాలో, లక్ష్యం ఏమిటంటే విద్యార్థి ఏ కాలేజ్‌లో చదువుతున్నా, అతనికి సరైన శిక్షణ, మార్గనిర్దేశం మరియు ఉద్యోగ అవకాశాలు అందాలి. టిటిపీఓసి వంటి ఈవెంట్‌లు విద్యా వ్యవస్థతో కలసి భవిష్యత్ కోసం సమగ్ర పరిష్కారాలను రూపకల్పన చేసే అవకాశాలు కల్పిస్తాయి” అని మానిష్ అగర్వాల్ తెలిపారు. ఈ దిశగా, ప్రెప్‌ఇన్స్టా భారత దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీల టిపిఓలు మరియు మేనేజ్‌మెంట్‌లను 2025 ప్లేస్‌మెంట్ సీజన్ కోసం వ్యూహాత్మక భాగస్వామ్యాలను అన్వేషించమని ఆహ్వానిస్తోంది. ప్రెప్‌ఇన్స్టా రూపొందించిన బి2ఐ సాస్ ప్లాట్‌ఫారమ్ ‘ఆప్టిమస్’ ఇప్పటికే 250కి పైగా విద్యాసంస్థలకు మద్దతు ఇస్తోంది. శిక్షణ, అంచనా మరియు ప్రిపరేషన్ ట్రాకింగ్‌ను సమర్థంగా నిర్వహిస్తోంది. 2017లో స్థాపితమైన ప్రెప్‌ఇన్స్టా, నైపుణ్యాల అభివృద్ధి మరియు ప్లేస్‌మెంట్ కోసం విశ్వసనీయ వేదికగా ఎదిగింది. ఇందులో 200కి పైగా ఇండస్ట్రీ-అలైన్‌డ్ కోర్సులు ఉన్న ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉంది. ఇందులో జనరేటివ్ ఏ ఐ, మెషీన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్‌ సెక్యూరిటీ, డేటా సైన్స్ వంటి హై-డిమాండ్ రంగాలలో శిక్షణ అందించబడుతుంది. నైపుణ్యాధారిత, ఉపాధి-సిద్ధమైన భారత్ కోసం మద్దతుగా నిలుస్తోందని తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version