వ్యవసాయ ఒక ఉద్యోగం లాంటిది.

వ్యవసాయ ఒక ఉద్యోగం లాంటిది.

పంటల మార్పిడితో అధిక లాభాలు..

వరిపంట సాగు కంటే కంది పంటతో అధిక లాభాలు.

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఉచిత కంది విత్తనాల కిట్ల పంపిణి

నర్సంపేట నేటిధాత్రి:

వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ యాంత్రిక పద్దతిలో వ్యవసాయం చేస్తేనే లాభాలు లేకపోతే అప్పులపాలు కాక తప్పదని అన్నారు. వ్యవసాయం చేసే రైతులకు అది ఒక ఉద్యోగం లాంటిదని, సేంద్రియ వ్యవసాయంతో కష్టపడి పని చేస్తే లాభాలు పొందవచ్చునని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి తెలిపారు.జాతీయ ఆహార భద్రత పోష కమిషన్, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పప్పు దినుసుల చిరు సంచుల కందులు,మినుములు విత్తన పంపిణీ కార్యక్రమం నర్సంపేట వ్యవసాయ శాఖ ఉపసంచాలకులు దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో నర్సంపేట డివిజన్ పరిధిలోని ఆరు మండలాల లో గల రైతులకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఎల్అర్జి 52 రకం కంది విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కంది పంట సాగు చేయడం ద్వారా అధిక లాభాలు రావడం,ఆకులు మొత్తం భూమిపై రాలడంతో ఎరువులగా మారుతుంది. దీంతో భూసారం పెరుగుతుంది.రాబోయే పంటలకు ఎరువులు తక్కువగా వాడుకోవచ్చని పేర్కొన్నారు.వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్న విధంగా కందులు 10 నుండి 12 క్వింటాలు రావడం ఖాయమని ,వరి సాగు కంటే కందుల పంట సాగు వలన అధిక లాభాలు పొందవచ్చన్నారు.పత్తి మిరప,వేరుశనగ మరే ఇతర పంటల కంటే పప్పు దినుసుల పంటలే మేలన్నారు.గతంలో పశువుల ఎరువులు వాడేది.

ఇప్పుడు అధికంగా కెమికల్స్, ఫర్టీలైజర్స్ వేస్తున్నారు. దీంతో భూసారం తగ్గుతున్నది.పెట్టుబడులు పెరుగుతున్నాయి.లాభాలు తక్కువగా వస్తున్నాయని దీంతో రైతు కుటుంబం అప్పుల పాలు కావాల్సిన పరిస్థితి నెలకొంటున్నదని ఎమ్మెల్యే దొంతి రైతులకు సూచించారు.అధిక పెట్టుబడుల వలన నేడు రైతులు తమ శ్రమ శక్తిని కూడా సంపాదించలేక పోతున్నారని…రైతే రాజు.. నేను రాజు అనే పిలింగ్ తో ,వ్యవసాయంలోనే ఉపాధి.. ఉన్నది.వ్యవసాయంతోనే జీవనం సాగిస్తూ అభివృద్ధి చేసుకోవాలని ఈసందర్భంగా పేర్కొన్నారు.తక్కువ పెట్టుబడులు ఉన్న అపరాలు పంటలు,ఫామ్ అయిల్ పంటలు సాగు చేసుకోవాలన్నారు.బయట దేశాల నుండి దిగుమతి అయ్యే వస్తువులకు ఆపాలని,వేరుశనగ,అపరాల పంటలకు బోనస్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా కేంద్రానికి నివేదికలు అందించేందుకు చర్యలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే దొంతి రైతులకు తెలిపారు.గ్రామాల్లో ఇండ్ల కూరగాయలు, కోళ్ళు,గుర్రెలు పెంపకం చేసుకోవాలి.ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవ్వరూ సాగు చేసుకోవటం లేదు.
గ్రామాల్లో ఉన్న ప్రజలకు హైదారాబాద్ లో ఉన్న ప్రజలకు తేడా లేకుండా పోయిందని ఈ సందర్భంగా నియోజక వర్గం ప్రజలకు సూచించారు.
వ్యవసాయ శాఖ జిల్లా అధికారి అనురాధ మాట్లాడుతూ
ప్రతీ రోజు పప్పుదినుసులు తినాల్సిందే. కావున ప్రస్తుతం పప్పుల్లో కలర్ వేస్తున్నారు.వాటి వలన క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పప్పు దినుసుల పంటలు
వరి సాగు కంటే కందుల పంట వలన అధిక లాభాలు ఉన్నాయని సూచించారు.ఈ సాగు వలన భూసారం పెరుగుతుంది.అవసరం మేరకే ఎరువులు,కెమికల్స్ వేయాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఆర్టీవో ఉమారాణి, నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, జాతీయ ఆహార భద్రత న్యూట్రిషన్ మిషన్ వరంగల్ ఉమ్మడి జిల్లా కన్సల్టెంట్ సారంగం,వైస్ చైర్మన్ , ఆయా మండలాల వ్యవసాయ శాఖ అధికారులు రైతులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version