జున్నుతుల మధుకర్ రెడ్డి జన్మదిన వేడుకలు.

జున్నుతుల మధుకర్ రెడ్డి జన్మదిన వేడుకలు

శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ధర్మకర్త

వీణవంక ( కరీంనగర్ జిల్లా) నేటి ధాత్రి:

వీణవంక మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జున్నుతుల మధుకర్ రెడ్డి 43వ జన్మదిన వేడుకలు వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎక్కటి రఘపాల్ రెడ్డి, ఎండీ సాహెబ్ హుస్సేన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్స్ పండ్లు పంపిణీ చేయడం జరిగింది
అనంతరం మండల అధ్యక్షుడు రఘపాల్ రెడ్డి ఎండి సాహెబ్ హుస్సేన్ లు మాట్లాడుతూ, కార్యకర్త స్థాయి నుండి ధర్మ కర్త గా ఎదిగి ముందు ముందు మరెన్నో పదవులను పొందాలని వారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంచాలని వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నాము అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎక్కటి రఘపాల్ రెడ్డి, మాజీ అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్,గంగాడి రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ లు చిన్నాల అయిలయ్య, మార్కెట్ డైరెక్టర్ మాదాసు సునీల్,కర్ర తిరుపతి రెడ్డి, నాయకులు ఈదునూరి పైడి కుమార్,ఒరేం శ్రీనివాస్, ఉయ్యాల నాగరాజు,కర్ర గురు,మర్రి సమ్మయ్య తదితరులు పాలుగోన్నారు.

ఘనంగా చించోడ్ అభిమన్యు రెడ్డి జన్మదిన వేడుకలు.!

ఘనంగా.. చించోడ్ అభిమన్యు రెడ్డి జన్మదిన వేడుకలు

జడ్చర్ల / నేటి ధాత్రి:

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని పెద్దయపల్లి చౌరస్తాలో బుధవారం రాజపూర్ మండలంలోని దొండ్లపల్లి మాజీ ఎంపీటీసీ.. చొక్కంపేట గ్రామానికి చెందిన చించోడ్ అభిమన్యు రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అభిమన్యు రెడ్డికి గజమాలతో మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మండలంలోని పారిశుద్ధ్య కార్మికులకు చీరలను పంపిణీ చేశారు. రాజాపూర్, బాలానగర్ ప్రభుత్వ పాఠశాలలకు నడుచుకుంటూ వెళ్తున్న..40 మంది గిరిజన విద్యార్థులకు సైకిల్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజక వర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

చైర్మన్ సత్యనారాయణ రెడ్డి పూజలు.!

కోటగుళ్లలో చెల్పూర్ సొసైటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి పూజలు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో చెల్పూర్ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్ గండ్ర సత్యనారాయణరెడ్డి గురువారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని సాదరంగా ఆహ్వానించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించి అర్చకులు నాగరాజు ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version