అల్లనా వలన లాభం ఎవరికి?….

అల్లనా వలన లాభం ఎవరికి?….టిఎస్ఎస్ సిసిడిసి ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

◆ యాజమాన్యానికి లాభాలు..

◆ అధికారులకు లంచాలు

◆ నాయకులకు మామూళ్లు

◆ ప్రజలకు కాలుష్యం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

 

 

 

అప్పటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో IDA ద్వారా బుల్లెట్ కర్మాగారం అని చెప్పి పేద రైతుల దగ్గర నుండి ఫుడ్ ప్రాసింగ్ పేరిట సుమారు 150 ఎకరాలు కేటాయించారు కానీ అందులో అల్లనా పశువదశాలను నిర్మించారు, ప్రక్కనే ఉన్న ఆచార్య వినోబా సేకరించిన భూదాన్ భూములను కూడా ఆక్రమించుకొన్నారు,ఈ పరిశ్రమ పర్యవేక్షణ పశుసంవర్ధక శాఖ,కాలుష్య నియంత్రణ మండలి,మరియు APEDA,లు పర్యవేక్షించాలి కానీ ఎక్కడా కూడా సరైన పర్యవేక్షణ జరగడం లేదు,గతంలో ఈ పశువదశాలలో రోజుకు 3000ల వరకు పశువులను వదించేవారు ఇప్పుడు రోజుకు సుమారు 1000 వరకు వదిస్తున్నారు దీని వలన చుట్టు ప్రక్కల ప్రాంతంలో పశువుల సంఖ్య భారీగా తగ్గిపోయింది ఒక పశువును వదించాలంటే పశుసంవర్ధక శాఖ డాక్టర్ పశువులను పరిశీలించి ధ్రువీకరించాల్సి ఉంటుంది వ్యర్థాలను నిబంధనల ప్రకారం వదలాల్సి ఉంటుంది,ఇప్పుడు అక్కడ కనుగొంటే కేవలం ఇద్దరు మాత్రమే 1000 పశువులను పరిశీలించి దృవీకరిస్తారు ఇది ఎలా సాధ్యం.దీనిపైన పశుసంవర్ధక శాఖ అధికారులను అడగగా ఇప్పటివరకు స్పందన లేదు అంటే అధికారులు కర్మాగార యాజమాన్యంతో లంచాలు తీసుకొని కుమ్ముక్కైనట్లు తెలుస్తున్నది.
కాలుష్యం..వ్యర్థాలను సరిగ్గా పారపోయకుండా కర్మాగారంలో వెలువడిన కాలుష్య జలాలతో వర్షం వచ్చినప్పుడు రాత్రి వేళల్లో వర్షపు నీటిలో వదులుతున్నారు దీని వలన చుట్టు ప్రక్కల గ్రామాలలో భూగర్భజలాలు మరియు ప్రక్కనే ఉన్న నారింజ ప్రాజెక్టు నీరు కలుషితమవుతున్నది పంట పొలాలు పంటలకు పనికి రాకుండా పోతున్నాయి కర్మాగారం నుండి వెలువడే వాయు కాలుష్యంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు దీనిని పర్యవేక్షించాల్సిన బాధ్యత కాలుష్య నియంత్రణ అధికారులది,ఎన్నో సార్లు పిర్యాదు చేసిన అధికారులు కర్మాగార యాజమాన్యంతో కుమ్ముక్కై లంచాలు తీసుకొంటు చర్యలు తీసుకోవడం లేదు,జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు గల అధికారులు మాటలకే పరిమితం అవుతున్నారు,నారింజ జలాలు కలుషిo ఆవుతున్నాయి దీనిపై ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకివాలి కానీ ఎలాంటి చర్యలు కనబడటం లేదు.కర్మాగారం మొత్తం పరిధి విస్తీర్ణం లెక్క గట్టి మున్సిపల్ అధికారులు ట్యాక్స్ విధించాలి కానీ అది కూడా సక్రమంగా జరగడం లేదు ఇది మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం.ప్రతి కర్మాగార యాజమాన్యం తమకు వచ్చిన లాభాలలో 2% సియస్ఆర్ నిధులు కేటాయించి ప్రజల అభివృద్ధికి కేటాయించాలి కానీ అది ఎక్కడ కనబడటం లేదు.కర్మాగారంలో సుమారు 2000 వరకు కార్మికులు పనిచేస్తున్నారు అందులో 200 మంది మాత్రమే స్థానికులు ఉన్నారు నిబంధనల ప్రకారం 80% స్థానికులు ఉండాలి స్థానిక భూమి,స్థానిక నీళ్లు,స్థానిక విద్యుత్ వాడుకొంటు వందల కోట్లు సంపాదిస్తు స్థానిక పశు సదంపదను తగ్గించే, కాలుష్యాన్ని వేదజేల్లే, స్థానికులకు ఉపాధి కల్పించని కర్మాగారాలు మనకు అవసరం లేదు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శంకర్,నాయకులు జి.నర్సింలు,శికారి గోపాల్, చల్లా శ్రీనివాస్ రెడ్డి,లు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version