ప్లాంటేషన్ మేనేజర్ సురేష్ కుమార్ కు ఉత్తమ పనితీరు అవార్డు
జైపూర్,నేటి ధాత్రి:
తెలంగాణా అటవీ అభివృద్ధి సంస్థ (టీజీ ఎఫ్ డీసీ ),మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గా పనిచేస్తున్న గోగు సురేష్ కుమార్ గురువారం ఆ సంస్థ డివిజనల్ మేనేజర్ శ్రీశ్రావణి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని టీజీ ఎఫ్ డీసీ డివిజన్ కేంద్ర కార్యాలయమైన కాగజ్ నగర్ లో గురువారం జరిగిన కార్యక్రమం లో ఈ అవార్డు అందుకున్నారు.టీ జీ ఎఫ్ డీసీ ఏర్పడి దశాబ్ది కాలం పూర్తి అయిన సందర్బంగా ప్లాంటేషన్ ల నిర్వహణ లో ఉత్తమ పనితీరు కు గాను ప్రోత్సాహకంగా ఈ అవార్డు అందజేసినట్లు ప్లాంటేషన్ గోగు మేనేజర్ సురేష్ తెలిపారు.