ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను అడ్డుకోవడం సిగ్గుచేటు.

ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను అడ్డుకోవడం సిగ్గుచేటు-కె. యూ విద్యార్థి సంఘాలు

నేటిధాత్రి :హన్మకొండ

 

 

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను అడ్డుకోవడం సిగ్గుచేటని కాకతీయ యూనివర్సిటీ విద్యార్ధి సంఘాలు అన్నారు.

శనివారం కాకతీయ యూనివర్సిటీ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసుకున్న విద్యార్థి సంఘాల సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకులు డా.సయ్యద్ వలి ఉల ఖాద్రి(ఏ.ఐ.వై.ఫ్)దుర్గం సారయ్య (పి.డి.యస్. యూ) గుగులోతు రాజు నాయక్( గిరిజన శక్తి) మెడ రంజిత్ (టి.జి.వి.పి) మట్టెడ కుమార్ (పరిశోధక నాయకులు) కన్నం సునీల్ (టి.యస్. ప్) దుప్పటి కిషోర్ కడాపాక రాజేందర్ ,బొట్ల మనోహర్ (బి.యస్.ఫ్) హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద మధ్యతరగతి విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో విద్య అందాలని మంచి ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ప్రారంభించాలని నిర్ణయం చేసింది దానిలో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను ప్రారంభించడానికి యూనివర్సిటీని సంప్రదిస్తే యూనివర్సిటీ అధికారులు పోలీస్ క్యాంపు ని తీసేసి ఆ క్యాంపు స్థలాన్ని కేటాయించారని

ఈ నిర్ణయాన్ని అన్ని ప్రజాస్వామ్య విద్యార్థి సంఘాలు స్వాగతించాయని కానీ కొన్ని విద్యార్థి సంఘాలు సొంత రాజకీయ ఎజెండా తో కుట్రలతో దీన్ని అడ్డుకోవాలని చుస్తున్నారని దానిని తీవ్రంగా ఖండిస్తున్నామని అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తే పేద మధ్య తరగతి విద్యార్థులకు విద్య అందుతుందని నగరంలో మంచి వాతావరణం లో విద్య అందే అవకాశముంటుందని యూనివర్సిటీ పరిధిలో పెడితే రోడ్డు రవాణా సౌకర్యాలు కూడా అనుకూలంగా ఉంటుందని కావున వెంటనే స్కూలు ప్రారంభించి నిర్మాణం చేపట్టాలని కోరుతున్నాము.

అదే విధంగా కొందరు కావలసికొని కుట్రలు చేసి అడ్డుకోవాలని చూస్తున్నారని వారి ప్రయత్నాలు ఫలించవని ప్రభుత్వం స్కూలు నిర్మాణం చేపట్టి స్కూల్ ప్రారంభించాలని కోరుతున్నాం.

ఈ కార్యక్రమంలో పి.డి. యస్. యూ హన్మకొండ జిల్లా అధ్యక్షులు వంశీ కృష్ణ సౌరవ్ రాహుల్ వర్ధన్ శివ రెడ్డి కార్తిక్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version