ముఖ్యమంత్రి, ఐటీ మంత్రి చిత్రపటానికి పాలభిషేకం.

ముఖ్యమంత్రి, ఐటీ మంత్రి చిత్రపటానికి పాలాభిషేకం.

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీని నెరవేర్చింది. తిరుపతి.

మహాదేవపూర్- నేటి ధాత్రి:

బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించడంతో బిసి ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటి మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. గురువారం రోజున మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బీసీ సంఘం అధ్యక్షుడు తిరుపతి ఆధ్వర్యంలో, పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అక్బర్ ఖాన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు తిరుపతి మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం రాష్ట్రంలోని బీసీల కు రిజర్వేషన్ కల్పించడం హర్షణీయమని, ప్రభుత్వం బిల్లు ఆమోదించడం రాష్ట్రవ్యాప్తంగా బీసీలు మర్చిపోలేని రోజని అన్నారు. అలాగే రాష్ట్ర మంత్రులకు శాసనమండలి సభ్యులకు, బీసీ సంఘాల ప్రతినిధులకు, అధ్యక్షుడు తిరుపతి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు మురళి, దేవరావు, స్వామి, తిరుపతి, డాక్టర్ హబీబ్ ,సతీష్ జగదీష్ రామస్వామి, ప్రవీణ్, చంద్రయ్య, లక్ష్మణ్, మహబూబ్ ఖాన్, మహేష్ లు పాల్గొన్నారు.

కేటీఆర్ కు ఘన స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్యే!

కేటీఆర్ కు ఘన స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

యాదాద్రి భువనగిరి , నేటి ధాత్రి

చౌటుప్పల్:రాష్ట్ర వ్యాప్త పర్యటన భాగంగా కేటీఆర్ నేడు సూర్యాపేటలో భారీ బహిరంగ సభలో పర్యటించిన నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని బస్టాండ్ వద్ద కేటీఆర్ కు మునుగోడు బిఆర్ఎస్ ఇంచార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి ఘన స్వాగతం పలికిన టిఆర్ఎస్ కార్యకర్తలు.. కేటీఆర్ కు ప్రత్యేకంగా శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ,పాల్వాయి స్రవంతి ఈ కార్యక్రమంలోమండల అధ్యక్షులు ,ప్రజాప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

అంకెల గారడీగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్..

అంకెల గారడీగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్..

విద్యారంగానికి 7.5%నిధులను మాత్రమే కేటాయించడాన్ని బిఆర్ఎస్వి పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం..

బిఆర్ఎస్వి సీనియర్ నాయకుడు వొల్లాల శ్రీకాంత్ గౌడ్

వీణవంక,( కరీంనగర్ జిల్లా ):నేటి ధాత్రి :

 

నేడు ప్రవేశ పెట్టిన బడ్జెట్ సమావేశంలో 2025-2026 ఆర్థిక సంవత్సర బడ్జెట్ పూర్తిగా అంకెల గారడీగా ఉంది. అమలుకాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేస్తూ అధికారం చేపట్టిన ఈ ప్రభుత్వం పథకాలను అమలు చేయకుండా నానా అవస్థలు పడుతున్నారు. గత ఎన్నికల సమయంలో విద్యారంగానికి 15%నిధులు కేటాయిస్తామని ప్రగల్బాలు పల్కి, పోయిన బడ్జెట్ లో 7.3%నిరాశ మిగిల్చి, నేడు ఈ బడ్జెట్ లో కూడా 7.5%23,108 కోట్లు మాత్రమే కేటాయించింది. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అని వారి నినాదాలతో ఈ బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. కానీ వారి నినాదాలు వాస్తవానికి మాత్రం సంక్షేమనికి ఆమడ దూరం, అభివృద్ధి లో వెనుకబాటు తనం, సూపరిపాలన శూన్యం మాత్రమే చూస్తున్నాం. బి ఆర్ ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు విద్యారంగానికి,యూనివర్సిటీలకు, గురుకులాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి అద్భుతంగా అభిరుద్ది పరిచింది. కానీ ఈ ప్రభుత్వం యూనివర్సిటీ, గురుకులాలను నిర్లక్ష్యం చేస్తు విద్యార్థుల మరణాలకు కారణమౌతున్నాయి. గురుకులాలలో చదువుతున్న విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలను 200%, డైట్ చార్జీలు 40% పెంచుతామణి గత బడ్జెట్ లోనే అన్నారు. మళ్ళీ గతంలో మాదిరే ఇప్పుడు కాస్మోటిక్, డైట్ ఛార్జిలను 200%, 40% అంటున్నారు. అంటే గతంలో ఈ కేటాయింపులు జరగలేదా..?. మీ బడ్జెట్ నిధులు నీటి మూటలేనా..? అని అడుగుతున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలు చైతన్య వంతులు, విద్యావంతులు, మేధావులు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి మాట నిలబెట్టుకోవాలని కోరుతున్నాం. విద్యారంగా సమస్యల మీద అసెంబ్లీ ముట్టడి చేసిన కూడా మీ వైఖరి మారలేదు. వందేళ్లకు పైబడి ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ కీ 1000 కోట్లు రాష్టంలోని అన్నీ యూనివర్సిటీ లను అభివృద్ధి చేయాలి అలాగే యూనివర్సిటీ లో ఉన్న బోధన, బోధనేతర ఖాళీలను తక్షణమే భర్తీ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో విద్యారంగా సమస్యలు తీర్చే వరకు బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో మా పోరాటాన్ని ఉదృతం చేస్తామని  అన్నారు.

BJP కిసాన్ మోర్చా మండల కార్యవర్గo ఎన్నిక.

భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మండల కార్యవర్గo ఎన్నిక

చందుర్తి, నేటిధాత్రి:

ఈ రోజు చందుర్తి మండల కేంద్రంలో బీజేపీ మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు చింతకుంట సాగర్ ఆధ్వర్యంలో నూతన మండల కమిటీ నియామకం చేయడం జరిగింది. ఇందులో ప్రధాన కార్యదర్శి గా ముడపెల్లి ముకేష్ (మల్యాల ), ఉపాధ్యక్షులు గా బోరగాయ తిరుపతి (జోగాపూర్ ) బంబోతుల ప్రశాంత్
(మర్రిగడ్డ) లను, కార్యదర్శులు గా నీరటి శేఖర్ (నర్సింగపూర్), పగిడే మల్లేశం (ఎన్గల్ ), లంబ రాకేష్ (మూడపెల్లి ), తోట శంకర్(మూడపెల్లి) లను,
కార్యవర్గ సభ్యులు గా ఈగ శ్రీధర్ (లింగంపేట), అట్టేపెళ్లి సాయి (తిమపూర్) లను నియమించారు.

ఈ నియామకలు తక్షణమే అమలోకి వస్తాయి అని తెలియజేరశారు.
ఈ కార్యక్రమంలో వేములవాడ నియోజకవర్గ బిజెపి కన్వీనర్ మార్తా సత్తయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు సిరికొండ శ్రీనివాస్ మండల అధ్యక్షుడు మొఖిల విజేందర్, మండల ప్రధాన కార్యదర్శిలు పెరుక గంగరాజు,మర్రి మల్లేశం బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ పొంచెట్టి రాకేష్, బిజెపి నాయకులు చింతకుంట గంగాధర్, చినుముల హనుమయ్య చారి, లింగాల రాజయ్య, మట్కా మల్లేశం, పాటి సుధాకర్, చిర్రం తిరుపతి, పెరుక రంజిత్,బద్దం తిరుమల్ రెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షుడు మోతుకుపెల్లి రాజశేఖర్,మెంగాని శ్రీనివాస్, మర్రి రాజు, కుసుంబ లింగ రావు తదితర నాయకులు పాల్గొన్నారు.

కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే.

కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

దేవరకద్ర /నేటి ధాత్రి:

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం దామాగ్నాపూర్ గ్రామంలో దేవరకద్ర మండలానికి చెందిన పలువురికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి గురువారం లబ్ధిదారులకు అందజేశారు.
అనంతరం శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానం వద్ద రాజగోపురం ముందు షెడ్డు నిర్మాణం సంబంధించిన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

వడ్డీ లేని రుణాల మంజూరుతో సీఎం చిత్ర పఠానికి క్షీరాభిషేకం..

వడ్డీ లేని రుణాల మంజూరుతో సీఎం చిత్ర పఠానికి క్షీరాభిషేకం

 

మొగుళ్లపల్లి నేటి ధాత్రి

మండల కేంద్రంలోని వెలుగు మండల సమైక్య కార్యాలయంలో. బుధవారం ముఖ్యమంత్రి, మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే చిత్రపటాలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేసినందుకు గాను మహిళల పాలాభిషేకం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ రఫీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీఎం రవి వర్మ మాట్లాడుతూ ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర ముఖ్య మంత్రి మొన్న జనగామ జిల్లా పర్యటనకు వచ్చిన సంధర్భంగా మహిళా స్వయం సహాయక సభ్యులతో చేపట్టిన మహిళా శక్తి కార్యక్రమాల గురించి వారితో మాట్లాడి సంతృప్తితో ఎస్ హెచ్ జి లకు వడ్డీ లేని ఋణం క్రింద రూ.100 కోట్లను మంజూరీ చేశారన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వెలుగు మండల సమాఖ్య మొగుళ్ళపల్లి సెర్ప్, డి.ఆర్.డి.ఏ మొగుళ్లపల్లి మండలం ఆధ్వర్యంలో. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గ్రామీణ అభివృద్ధి శాఖ మినిస్టర్ సీతక్క, స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు రూ. 10 కోట్లు మంజూరీ కాగా మొగుళ్లపల్లి మండలానికి క్రింది విధంగా మంజూరీ కావడం జరిగింది.మండలంలో మొత్తం 657 సంఘాలకు ఒక కోటి ఆరు లక్షల తొంబై ఏడు వెయ్యిల రెండు వందల తొంబై నాలుగు రూపాయలు సంఘాల ఖాతాలలో పడడం జరిగినది. మహిళా సంఘ సభ్యులకు అందించిన ముఖ్య మంత్రి, పంచాయితీ రాజ్ గ్రామీణభివృద్ధి శాఖా మంత్రి , సి.ఈ.ఓ, సెర్ప్, మండల మహిళలు అందరి తరపున ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ సిబ్బంది గాజుల బాబురావు, బత్తిని శ్రీనివాస్, బత్తిని ప్రవీణ్, పసరగొండ రేవతి, వివో ఏలు శ్రీరామ్ తిరుపతి, లలిత, పావని, రమాదేవి, రమ్య, శ్రీకాంత్, బాలకృష్ణ, వివిధ గ్రామాల వివోఏలు తదితరులు పాల్గొన్నారు.

బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు తీరని అన్యాయం.!

బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

-బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2025-2026 సంవత్సరానికి ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో బీసీలకు తీవ్రమైన అన్యాయం చేసిందని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ ఆరోపించారు. గురువారం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.3,04,965 కోట్ల మొత్తం బడ్జెట్లో 56 శాతం పైగా ఉన్న బీసీలకు కేవలం ముష్టి వేసినట్లు 3.6 శాతం రూ.11,405 ఓట్లు కేటాయించి బీసీలను అవమానపరిచారని ఆయన మండిపడ్డారు. బీసీలకు కేటాయించిన ఈ బడ్జెట్ బీసీలకు ఏ విధంగా..ఏ మేరకు..ఏ మూలకు సరిపోతాయో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు చెప్పాలని మహేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీలకు స్థానిక సంస్థల్లో మరియు విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదింప చేసిన మీరు..బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం ఎందుకింత వివక్షత చూపుతున్నారని ప్రశ్నించారు. బడ్జెట్లో బీసీలకు ఇంత తక్కువ నిధులు కేటాయించడంలో ఆంతర్యం ఏమిటని..ఇది వివక్షత కాదా..? అని ప్రశ్నించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం ప్రతి సంవత్సరం బీసీలకు 20 వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చడం సరికాదన్నారు. బడ్జెట్ ను సవరించైనా సరే బీసీలకు బడ్జెట్ పెంచాలని మహేందర్ గౌడ్ డిమాండ్ చేశారు.

సిఎం రిలిప్ పండ్ చెక్కులపంపీణీ.!

సిఎం రిలిప్ పండ్ చెక్కులపంపీణీ.

జహీరాబాద్. నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలం పీచేరాగడి గ్రామానికి చెందిన బాధితులకు
గురువారం ఉదయం ముఖ్య మంత్రి సహయనిధీ
చెక్కులు పంపిణీ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ కోహీర్ మండల
అధ్యక్షుడు రామలింగారెడ్డి తెలిపారు. ఈకార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

మా ప్రాంతానికి తీవ్ర అన్యాయం.!

మా ప్రాంతానికి తీవ్ర అన్యాయం..

—కె.మాణిక్ఆవు, ఎమ్మెల్యే, జహీరాబాద్

జహీరాబాద్. నేటి ధాత్రి:

సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథ కాలకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం అన్యాయం. కాంగ్రెస్ ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా రైతులకు అన్యాయం చేస్తున్నది. సంగమే శ్వర ఎత్తిపోతల పథకంతో జహీరాబాద్ నియోజకవర్గంలోని జహీరా బాద్, న్యాల్కల్, ఝరాసంగం, కోహీర్, మొగు డంపల్లి మండలాల పరిధిలోని 115 గ్రామా ల్లోని 1,03,259 ఎకరాలకు సాగు నీరందిం చేందుకు లక్ష్యంగా పెట్టుకుని బీఆర్ఎస్ హయాంలో భూమి పూజ చేశాం. మునిపల్లి మండలంలోని చిన్నచల్మెడలో పంపుహౌస్ కోసం భూమి పూజ చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంగమేశ్వర ఎత్తిపోతల పథ కాన్ని అడ్డుకుంటున్నది. వెనుకబడిన ప్రాంతంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నది. అనేకసార్లు దీనిపై అసెంబ్లీలో విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. జహీరాబాద్ ప్రాంత నిరుద్యోగు లకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు పరిశ్రమల ఏర్పాటు కోసం భూసేకరణ చేపడుతున్న నిమ్స్ ప్రాజెక్టుకు నిధులు కేటాయించలేదు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది.

రాష్ట్ర బడ్జెట్లో ప్రాధాన్యం కలి గిన రంగాలకు నిధులు కేటా యింపు ఆశాజనకంగా లేదు. ముఖ్యంగా వ్యవసాయం, పారిశ్రా మిక రంగం, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర బలహీనవర్గాలకు కేటాయింపులు తగ్గాయి. ప్రస్తుతం ఇచ్చిన నిధులతోనైనా సకాలంలో పనులు చేపడితేనే ప్రజలకు ప్రయోజనం కలుగు తుంది. జహీరాబాద్ నియోజకవర్గంలో నిష్ణా ప్రాజెక్టు తోపాటు సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలకు నిధు లను విస్మరించారు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం.

డప్పుసప్పుళ్లతో సంబరాలు జరుపుకున్న పార్టీ శ్రేణులు కార్యకర్తలు

పరకాల నేటిధాత్రి

 

The CM’s portrait was anointed under the auspices of the Congress party.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల లో బీసీ కులగణన,ఎస్సి కుల వర్గీకరణ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి వాటిని ఆమోదించిన సందర్బంగా బుధవారం రోజున పట్టణంలోని బస్టాండ్ కూడలిలో పట్టణ,మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్,మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షుడు కట్కూరి దేవేందర్ రెడ్డి,ఏఏంసి చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి బీసీ కులగణన కార్యక్రమాన్ని చెప్పటి బిల్లును అసెంబ్లీ లో ఆమోదించడానికి,అలాగే సుప్రీంకోర్టు ఎస్ సి వర్గీకరణ పై ఇచ్చిన తీర్పును గౌరవించి దేశంలోని మొట్టమొదటిసారిగా ఎస్సి వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్లును ఆమోదించడానికి కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి పరకాల కాంగ్రేస్ పార్టీ తరుపున కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పరకాల సమన్వయ కమిటీ సభ్యులు సోద రామకృష్ణ, కుంకుమేశ్వర్ టెంపుల్ చైర్మన్ కొలుగురి రాజేశ్వరరావు, మాజీ కౌన్సిలర్లు పంచగిరి జయమ్మ,మడికొండ సంపత్ కుమార్,మాజీ ఎంపీపీ రామ్మూర్తి,చిన్నల గొనాద్, నల్లబోల కృష్ణయ్య అల్లం రఘునారాయణ,దాసరి బిక్షపతి,మడికొండ సంపత్,బండి సదానందం గౌడ్,పసుల రమేష్,మార్క రఘుపతి గౌడ్,నల్లెల అనిల్ బొమ్మ కంటి చంద్రమౌళి దుబాసి వెంకటస్వామి,అంబిరు మహేందర్,సుంకరి దిలీప్, ఎండి తాజుద్దీన్,ఎండి ఆజి, బొచ్చు జెమిని,మచ్చ సుమన్, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ఆశాలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానం అమలు చేయాలి..

బడ్జెట్ సమావేశాల్లోనే ఆశాలకు 18వేల కనీస వేతనం నిర్ణయించాలి

కాంగ్రెస్ ఆశాలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానం అమలు చేయాలి

లేదంటే ఆశాల పోరాటం ఉదృతం చేస్తాం

సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ లక్ష్మీనారాయణ
నల్లగొండ జిల్లా, నేటిధాత్రి:
ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ 18,000/ లు ఫిక్సిడ్ వేతనం నిర్ణయించాలని పీఫ్, ఈ ఎస్ ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని లేదంటే ఆశాలు సమరశీల ఉద్యమాలకు సిద్ధమవుతారని సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం కోసం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ మేరకు నల్గొండ కలెక్టరేట్ ముందు భారీ ధర్నా నిర్వహించారు. గేటు ముందు బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ జె శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి చినపాక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎన్నికల ముందు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం ఆశాల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని,ఆశాల వేతనాలు పెంచడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని కనీస వేతనం 18 వేలు పెంచుతామని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. కానీ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్న ఆశాల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు.ఆశాల సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు ప్రభుత్వానికి అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన కనీసం చలనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్ హెచ్ ఎం స్కీం లో భాగంగా గత 19 సంవత్సరాల నుండి రాష్ట్రంలో ఆశ వర్కర్లు పనిచేస్తున్నారు, వీరంతా బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళలు, రాత్రనకా పగలనకా ఉదయం నుండి రాత్రి వరకు నిరంతరం ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తూ డెలివరీల సందర్భంగా రోజుల తరబడి కుటుంబాన్ని వదిలి హాస్పిటల్ వద్ద ఉండాల్సి వస్తుందని అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని ఆశాలు పోరాడుతుంటే కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న హక్కులను కాలరాస్తుందని అన్నారు.45వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫారసులు ప్రకారం 26 వేల కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం మాట్లాడుతూ కరోనాకాలంలో ఆశాల శ్రమను గుర్తించిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆశా వర్కర్లు గ్లోబల్ లీడర్స్ అని ఆశాలకు అవార్డును ప్రకటించింది.కానీ మన కేంద్ర ప్రభుత్వం నేటికీ ఆశల శ్రమను గుర్తించడానికి సిద్ధపడట్లేదు పైగా ఎన్ హెచ్ ఎం స్కీంకు బడ్జెట్ ను తగ్గిస్తుంది, కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి సంఘం పెట్టుకునే హక్కు సమ్మె చేసే హక్కు లేకుండా చేసి కార్మిక హక్కులను కాల రాస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఆశ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 21న పి హెచ్ సి ల ముందు ధర్నాలు, 24న చలో హైదరాబాద్ కు ఆశాలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆశ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి మహేశ్వరి,టీ వెంకటమ్మ,సిఐటియు జిల్లా నాయకులు పెంజర్ల సైదులు, పోలే సత్యనారాయణ, బైరం దయానంద్,అవుట రవీందర్ అశా యూనియన్ నాయకులు రమావత్ కవిత, కె శైలు, విమల పుష్పలత, ఎస్ జయమ్మ, స్వర్ణ, పార్వతమ్మ, ప్రేమలత, బి అనూష, ధనలక్ష్మి, కె సునీత, వీరభద్రమ్మ, మంగతాయి తదితరులు పాల్గొన్నారు

బడుగు బలహీన వర్గాలకు న్యాయం.

బిల్లుల ఆమోదంతో… బడుగు బలహీన వర్గాలకు న్యాయం

ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టసభల్లో ఆమోదం

సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట

కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి

బిల్లుల ఆమోదంపై హర్షం వ్యక్తం చేసిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు,పిసిసి సభ్యులు దశ్రు నాయక్,

శాసనసభలో బీసీ రిజర్వేషన్,ఎస్సీ వర్గీకరణ బిల్లులను ఆమోదించిన సందర్భంగా నేడు కేసముద్రం మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ నందు రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేసి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కు,ధన్యవాదాలు తెలిపిన కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు,పిసిసి సభ్యులు దస్రు నాయక్

అనంతరం నాగేశ్వర్ రావు మాట్లాడుతూ:- 42 శాతం రిజర్వేషన్లు కల్పించి బిల్లును చట్టసభలో ఆమోదంతో బడుగు బలహీన వర్గాల సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమని నిరూపితమైంది..

కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల న్యాయం చేస్తుందని మరోసారి రుజువైంది.
ఎవరు చేయలేని సాహసాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసి చూపించారు.
బీసీ బిల్లును కేంద్రం బిజెపి అడ్డగుడ్డ ప్రజలు తగిన బుద్ధి చెప్తారు..

సామాజిక న్యాయాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దపిట వేస్తున్నాను చెప్పడానికి బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులను చట్టసభలో ప్రవేశపెట్టడమే నిదర్శనం..

ఎన్నికల్లో హామీ ఇచ్చినం మాట ప్రకారం రాష్ట్రంలో కులగరణ పూర్తి చేసి కాంగ్రెస్ చరిత్ర సృష్టించడమే కాకుండా దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది..

దేశవ్యాప్తంగా కులగనన చేపట్టాలని బిజెపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం..

తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా దళితులను చేస్తానని చెప్పి కేసీఆర్ గెలిచాక తానే గద్దనికి దళితులను అవమానించారు అని గుర్తుచేశారు..

ఈ కార్యక్రమంలో ప్రాంతీయ అథారిటీ సభ్యులు రావుల మురళి,మాజీ పిఎసిఎస్ చైర్మన్ బండారు వెంకన్న,మాజీ జడ్పీటీసీ కదిరే సురేందర్,బ్లాక్ కాంగ్రెస్ నాయకులు పోలేపాక నాగరాజు, ఎండి తాజోద్దీన్,మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ ఎండీ ఆయాబ్ ఖాన్, యాదగిరి, వీరన్న, గ్రామ కమిటీ అధ్యక్షులు నూకల వెంకటేశ్వర్లు, పోలేపల్లి వెంకట్ రెడ్డి,రాము, వేణు,కొండ సురేష్, కొమరయ్య, సాట్ల శ్రీను,మాజీ ఉప సర్పంచ్ వెంకన్న,కాంగ్రెస్ పార్టీ నాయకులు, భూలోక్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గందసిరి వెంకన్న, పోకల శ్రీనివాస్,తరాల సుధాకర్, సామల నరసయ్య, ఏలేందర్ బన్నిచెట్టి వెంకటేష్, బద్య, హనుమ, బాల,ముజ్జూ, సుందర్ వెంకన్న, బాదవత్ సుమన్,బాలు, పిల్లి రమేష్, వెంకన్న, ఎండి నవాజ్, మామిడి శెట్టి మల్లయ్య, సారయ్య,అరుణ్,రఫీ,సిద్దు,అలీమ్,ఏకాంత చారి,సుధాకర్, గొట్టం రమేష్, మధు తదితరులు పాల్గొన్నారు.

ఆందోళన కలిగిస్తున్న వరుస సంఘటనలు..

విపరీత ధోరణితో అగమ్య గోచరం కానున్న విద్యార్థుల భవిత

ఆందోళన కలిగిస్తున్న వరుస సంఘటనలు

విద్యా హక్కు చట్టంతో ఉపాధ్యాయులకు సంకెళ్లు – నిస్సహాయ స్థితిలో ఆవేదన చెందుతున్న వైనం

తల్లిదండ్రుల అతి గారాబం లేదా అసలు పట్టించుకోకపోవడం రెండూ తప్పే

తీవ్ర దుష్ప్రభావం చూపిస్తున్న సినిమాలు, సోషల్ మీడియా

ప్రశ్నార్ధకం కానున్న విద్యార్థుల భవిష్యత్తు – సమాజ కంఠకులుగా మారే పెను ప్రమాదం

మొక్కై వంగనిది – మానై వంగుతుందా

నేడు బెత్తమే వారిని మార్చలేక పోతే భవిష్యత్తులో లాఠీలు మార్చాల్సి వస్తది

ఇవి డేంజర్ బెల్స్ – ప్రభుత్వాలు ,మేధావులు ఆలోచించాల్సిన తరుణం

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ , ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు ల ఉద్ఘాటన

కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి

ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రభుత్వ పాఠశాల గోడపై పదవ తరగతి విద్యార్థి ” దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటరు ,పట్టుకుంటే వదిలేస్తా బుక్కులెట్టు ,నీ అవ్వ తగ్గేదేలే ” అని పుష్ప సినిమాలోని అల్లు అర్జున్ డైలాగ్ ను కాపీ కొట్టి రాసిన డైలాగ్ చూసి తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ విస్మయం వ్యక్తం చేశారు .ఈ సందర్భంగా మండల శాఖ అధ్యక్షులు సురేందర్ మాట్లాడుతూ సినిమాలు, సోషల్ మీడియా విద్యార్థుల పై తీవ్ర దుష్ప్రభావాన్ని కలిగిస్తున్నాయని, విద్యాహక్కు చట్టం కూడా విద్యార్థులను దండించరాదని చెప్పడం, తల్లిదండ్రుల అతి గారాబం లేదా అసలు పట్టించుకోకపోవడం వలన క్రమశిక్షణ లేకుండా పోయిందన్నారు. విద్యార్థులు ఏం చేసినా అడిగే వారే లేరని వారి ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడ్డారు .వీరికిస్తున్న అతి స్వేచ్ఛ వలన మంచి చెప్పే ప్రయత్నం చేసే ఉపాధ్యాయులపై దాడులు చేయడం , పాఠశాలలో దురలవాట్లకు లోను కావడం , భిన్న రకాల హెయిర్ స్టైల్ లతో ఆకతాయిలుగా మారుతున్నారన్నారు. ఇవన్నీ చూస్తూ విద్యార్థులను సరిదిద్దలేక ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉపాధ్యాయులు ఉంటూ ఎంతో మనోవేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. “ఎంత చెప్పినా చదువులో రాణిస్తలేరని ,అలా అని మిమ్మల్ని దండించలేకపోతున్నాం అని , ఇప్పటికైనా చదవండి” అని ప్రాధేయ పడుతూ ఒక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాష్టాంగ నమస్కారం చేసి, గుంజీలు తీయడం సమస్య తీవ్రతను తెలియజేస్తుందన్నారు. చిన్నతనంలోనే తప్పు చేసినప్పుడు బెత్తంతోశిక్షిస్తే ఇంకొకసారి ఆ తప్పు చేయడానికి భయపడతారని, లాఠీలతో మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడదని వివరించారు. కానీ పిల్లలను దండిస్తే ఉపాధ్యాయులను నిందించడం ,వారిపై దాడులు చేయడంలాంటి సంఘటనలు ఎన్నో చూసామన్నారు. “మొక్కై వంగనిది మానై వంగుతుందా” అని ప్రశ్నించారు .చిన్నతనంలోనే మంచి అలవాట్లు నేర్పిస్తే తల్లిదండ్రులు ,గురువులు గర్వించే లాగా తమ భవిష్యత్తుని తీర్చిదిద్దుకుంటారని అన్నారు . అతి స్వేచ్ఛ ఇచ్చి ఇలాగే వదిలేస్తే సమాజ కంఠకులుగా మారే పెను ప్రమాదం ఉందన్నారు. ఇప్పుడు జరిగిన సంఘటనలన్నీ సమాజానికి డేంజర్ బెల్స్ మోగించినట్లేనని ,ఇంకా నిర్లక్ష్యం వహిస్తే జరిగే నష్టాన్ని ఎవరూ కూడా ఊహించలేరన్నారు.
ఇప్పటికైనా తల్లిదండ్రులు, మేధావులు , ప్రభుత్వాలు ఆలోచించాలని సూచించారు. చట్టంలో మార్పు తీసుకొస్తే విద్యార్థుల ప్రవర్తనలో మార్పు తీసుకురావడం కష్టమేమీ కాదని, తల్లిదండ్రులు కూడా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయులకు సహకరించాలని  కోరారు.

సీఎం రేవంత్ రెడ్డికి మాదిగ జాతి రుణపడి ఉంది.

సీఎం రేవంత్ రెడ్డికి మాదిగ జాతి రుణపడి ఉంది.

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య.

చిట్యాల, నేటిధాత్రి :

తెలంగాణ మాదిగ జాతికి సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు అని చెప్పిన మాట ప్రకారం హామీని నెరవేరుస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మార్గజాతి తరపున ధన్యవాదాలు తెలియజేశారు.
చేవెళ్ల డిక్లరేషన్ భాగంగా కోర్టు తీర్పు వచ్చిన రోజు అసెంబ్లీలో
ప్రకటించి వెను వెంటనే క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి వారి యెక్క సూచనల మేరకు ఏకసభ్య కమిషన్ నియమించి రాష్ట్రంలో వర్గీకరణ తీసుకోవాల్సిన చర్యలు అన్ని తీసుకొని అసెంబ్లీలో వర్గీకరణ చర్చ చేసి క్యాబినెట్ సమావేశంలో ఆమోదిం న్యాయం చేయాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం హర్షణీయం అని తెలియజేశారు
రానున్న రోజుల్లో జనాభా దామాషా ప్రకారం విద్య ఉద్యోగ రంగాలలో‌ కాక చట్ట సభల్లో మరియు నామినేటెడ్ పదవుల్లో కూడా మాదిగ జాతికి న్యాయం జరుగుతుంది గత 45 సంవత్సరాలు‌గా అన్యాయం తొలగిపోయి జనాభ దామాషా ప్రకారం అని పదవుల్లోనూ మాదిగలకు వాటా లభిస్తుందని అన్నారు
ఎస్సీ వర్గీకరణ కోసం అహర్నిశలు కృషి చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన
రాష్ట్ర ముఖ్యమంత్రి కి మాదిగ జాతి తరపున కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు,పెన్నుల పంపిణీ..

నాగారం జడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు,పెన్నుల పంపిణీ

మెరిట్ మార్కులు సాధించి పాఠశాలకు,తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావాలి

పరకాల నేటిధాత్రి

మండలంలోని నాగారం గ్రామంలో జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివే విద్యార్థులకుటిఆర్ఎస్వి పరకాల మండల అధ్యక్షులు గొట్టే అజయ్ ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు రాయబోయే పరీక్షలలో మెరిట్ మార్క్స్ సాధించి పాఠశాలకు మరియు తల్లిదండ్రులకు గొప్ప పేరు తీసుకురావాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పోతరాజు మనోజ్,అల్లే రాజ్ కుమార్ (మైఖేల్),బండారి రవికుమార్ మరియు పాఠశాల ఉపాధ్యాయురాళ్లు,ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం..

యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం

 

పరకాల నేటిధాత్రి
పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు మాదాసి శ్రీధర్ ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి,డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క,పోన్నం ప్రభాకర్ కి దామోదర రాజనర్సింహ,ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షులు దొమ్మటి కృష్ణకాంత్ మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వమే ఎన్నడ లేనివిధంగా కానీ విని ఎరుగని రీతిలో 6000 కోట్ల రూపాయలతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రాజీవ్ యువ వికాసం పథకం కింద 5లక్షల యువత యువకులకు నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించడానికి ఆర్థిక సహకారం అందించడానికి ఈ పథకం క్రింద ప్రతి లబ్ధిదారునికి నాలుగు లక్షల వరకు ఆర్థిక సాయం అందించడం జరుగుతుందని,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% బిల్లు మరియు ఎస్సీ వర్గీకరణ భారతదేశ చరిత్రలో కనీ వినీ ఎరగని రీతిలో శాసన సభ లో బిల్లునీ ప్రవేశ పెట్టిన తీర్మానించి ఆమోదించినందున తెలంగాణా ప్రభుత్వానికి ఆమోదం తెలిపిన సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పరకాల మండల అధ్యక్షుడు కట్కూరి దేవేందర్ రెడ్డి,పట్టణ అధ్యక్షులు కొయ్యాడ శ్రీనివాస్,మాజీ ఎంపీపీ తక్కలపెళ్లి స్వర్ణలత,సమన్వయ కమిటీ సభ్యులు సొద రామకృష్ణ,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్యామ్,అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి అల్లం శ్రీరామ్ కుమార్,యూత్ నాయకులు బొచ్చు జెమిని,మంద వెంకటేష్,బొచ్చు రాజు,బోజ్జం అనిల్,దాసరి దిలీప్,ఇనుముల రాము,సిలివేర్ తిరుపతి,అముదలపెళ్లి రమేష్,శివ కుమార్,అరుణ్,సురేష్,నరేష్, తిక్క అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన.!

ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు

సిరిసిల్ల టౌన్ 🙁 నేటి ధాత్రి )

Congress

సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించిన సందర్భంగా సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి, ఇది ఒక చరిత్ర ఒక అంశం అంటూ సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్,కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత. మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప కాంగ్రెస్ సీనియర్ గడ్డం నర్సయ్య,ఆకునూరి బాలరాజు. కుడిక్యాల రవి, గోనె ఎల్లప్ప, తదితర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

MP నిధుల కేటాయించడంతో హార్షం వ్యక్తం చేసిన BJP..

MP నిధుల కేటాయించడంతో హార్షం వ్యక్తం చేసిన BJP కథలాపూర్ మండల శాఖ….

నేటి ధాత్రి కథలాపూర్

కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కథలాపూర్ మండలంలోని నాలుగు గ్రామాలకు MP నిధులను కేటాయించడంతో BJP మండల శాఖ,బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. సిరికొండ,తండ్రీయాల, కథలాపూర్ గ్రామాలకు బోర్ మోటార్,దులూర్ రజక సంఘ భవనానికి 9 లక్షల రూపాయలు విడుదల చేయడం పట్ల పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్,వేములవాడ నియోజకవర్గ నాయకులు చెన్నమనేని వికాస్ రావు లకు బీజేపీ మండల శాఖ తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
కార్యక్రమంలో BJP మండల అధ్యక్షులు మల్యాల మారుతి,సీనియర్ నాయకులు వెంకటేశ్వర్ రావ్,బద్రి సత్యం,కథలాపూర్ మహేష్, కాసోజీ ప్రతాప్,నరెడ్ల రవి,గడ్డం జీవన్ రెడ్డి, తెడ్డు మహేష్ పాల్గొన్నారు.

బిఆర్ఎస్వి నాయకుల అరెస్టులు అప్రజాస్వామికం.

బిఆర్ఎస్వి నాయకుల అరెస్టులు అప్రజాస్వామికం.

జహీరాబాద్. నేటి ధాత్రి:

ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాలకు పురిటి గడ్డ అని. ఝరాసంగం మండలం మేధపల్లి తాజా మాజీ సర్పంచ్ మండలబి ఆర్ యస్. యువనాయకులు. పరమేశ్వర్ పాటిల్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న బిఆర్ఎ స్ నాయకలును ఎక్కడిక్కడ ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం హేమమైన చర్య అని అన్నారు. ఉస్మానియా యూనివర్శిటీలో నిరసనల కార్యక్రమాలు రద్దు చేసే సర్క్యులర్ ప్రతిపాదన ను వెంటనే రద్దు చేయాలి అని లేదంటే ఉద్యమాన్ని ఇంకా ఉదృతం చేస్తాం అని ఈసందర్బంగా పరమేశ్వర్ పాటిల్ అన్నారు. టిఆర్ఎస్వీ నాయకులు , అదేవిధంగా దేవరం పల్లి తాజా మాజీ ఉపసర్పంచ్ శంకర్ యాదవ్. ప్యాలవరం తాజా మాజీ ఉపసర్పంచ్ మాణిక్ యాదవ్ లు మాట్లాడుతూ అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్నా మాకు ముందస్తుగా అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నిండమే అప్రజాస్వామికం అయిపోయింది ఈ కాంగ్రెస్ పాలన లో అని. సామాజిక ప్రజా ఉద్యమా లకు వేదికైనటువంటి ఓయులో నిరసన కార్యక్రమాలు రద్దుకు సర్క్యులర్ జారీ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ ముర్కత్వపు చర్య అని మండిపడ్డారు. ప్రతి పక్షంలో ఉన్నపుడు ఇదే ముఖ్యమంత్రి అయినా రేవంత్ రెడ్డి దొడ్డి దారిన ఉస్మానియా యూనివర్శిటీ లో నిరసన కార్యక్రమాలు చేయొచ్చు గానీ ప్రజాస్వామ్య పద్ధతిలో విద్యా ర్థులు నిరుద్యోగ, విద్య, వైద్యం, నీళ్లు, నిధులు నియామకాల కోసం మరియు ప్రభుత్వ తీరును ఎండగట్టి ప్రజా సమస్యల పై ప్రశ్నిస్తే మాలాంటి యువకులను అరెస్ట్ చెయ్యడం. విడ్డురం అని.విద్యార్థి లోకం నేడు నక్సలైట్లు గా అభివర్ణిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో టిఆర్ఎస్వి అద్వర్యంలో విద్యార్థుల పక్షాన పోరాడి మరిత పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ చారిత్రక ముందడుగు.

తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ చారిత్రక ముందడుగు

కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్‌లో చేర్చాలి బీసీ జేఏసీ

మంచిర్యాల,నేటి ధాత్రి:

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ నేడు బిల్లు ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీకి,ముఖ్యంగా రాహుల్ గాంధీకి మరియు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని బిసి జేఏసీ,మంచిర్యాల జిల్లా కమిటీ నాయకులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరియు దేశవ్యాప్తంగా సామాజిక న్యాయాన్ని సాధించేందుకు పోరాటం చేస్తున్న అన్ని బీసీ సంఘాల విజయమని,బీసీల హక్కుల కోసం కృషి చేస్తున్న వారందరికీ ఇది గర్వకారణమన్నారు.ఈ బిల్లు ద్వారా స్థానిక సంస్థలు,విద్యా మరియు ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కలగనుండటం ఒక చారిత్రక ముందడుగు అవుతుందని,దేశవ్యాప్తంగా బీసీ సామాజిక న్యాయ ఉద్యమానికి బలాన్ని చేకూర్చే మైలురాయిగా నిలుస్తుందనీ,బీసీ జేఏసీ తరఫున ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వ పరిమితులలోనూ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ,దేశవ్యాప్తంగా బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు మేము నిరంతర పోరాటం కొనసాగిస్తామన్నారు.రిజర్వేషన్ బిల్లుకు న్యాయస్థానాల్లో ఆటంకాలకు అవకాశమున్నందున,దీన్ని భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలనీ,అప్పుడే ఈ చట్టాన్ని న్యాయపరమైన సవాళ్ల నుండి రక్షించవచ్చునని,ఇది బీసీలకు న్యాయమైన ప్రాతినిధ్యం అందించడంలో కీలక పాత్ర పోషితుందనీ,అసెంబ్లీ లో కాంగ్రెస్ పార్టీ,బీసీ లకు విద్య,ఉద్యోగ,స్థానిక సంస్థల రిజర్వేషన్ 42% శాతం కల్పిస్తూ బిల్లు ను పెట్టి,తెలంగాణ లోని బీసీ ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ కి ధన్యవాదములు తెలియ జేస్తూన్నామనీ బీసీ జేఏసీ,మంచిర్యాల జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు
ఒడ్డేపల్లి మనోహర్ అన్నారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ సేవ దళ్ నాయకులు,బీసీ నాయకులు డా.నిలకంటేశ్వర్,బీసీ జేఏసీ జిల్లా నాయకులు,డా.రాజకిరణ్,బీసీ జేఏసీ జిల్లా నాయకులు గుమ్ముల శ్రీనివాస్,తీన్మార్ మల్లన్న టీమ్ జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ,బీసీ జేఏసీ నాయకులు రాజన్న యాదవ్,పిట్టల రవీందర్,పెద్దల్ల చెంద్రకాంత్,ఎండీ లతీఫ్, భీమాసేన్,చెంద్రగిరి చెంద్రమౌళి,పిట్టల తిరుపతి,తీన్మార్ మల్లన్న టీమ్ జిల్లా సభ్యులు
దినకర్,దీపక్,సాయిరాం తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version