విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసిన ఘనత.

విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసిన ఘనత బిఆర్ఎస్ పార్టీకె దక్కుతుంది

గణపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో భూపాలపల్లి మాజీ శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణారెడ్డి- జ్యోతి నిన్న స్కూళ్లలో విస్తృత పర్యటనలు చేసి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేయడం విడ్డూరంగా ఉంది
గడిచిన 10 సంవత్సరాలు బి ఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా అప్పుడు గుర్తుకు రాలేదా పాఠశాలల మీద వీరి ప్రేమ.
గడిచిన 10 సంవత్సరాలలో
మండల కేంద్రంలో ఒక ఎంఈఓ ను కూడా నియమించలేదు
పిల్లలకు ఎటువంటి కాస్మోటిక్ చార్జీలు, మెస్ చార్జీలు ఇవ్వలేదు.
పాఠ్య పుస్తకలు ఏక రూప దుస్తువులను ఇవ్వలేదు
వారు తినే భోజనాన్ని ఒక్కరోజు ఎలా ఉంది అని అడిగిన పాపాన పోయిన నాధుడే లేడు.
ఈరోజు మా నాయకుడు భూపాలపల్లి శాసనసభ్యులు సత్యనారాయణ రావు అభివృద్ధిని చూసి ఓర్వలేక. ఏ అంశాల మీద మాట్లాడాలో తెలవక పాఠశాలల చుట్టూ తిరుగుతూ ముసలి కన్నీరు కారుస్తున్నారు.
మీరు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు నిర్మించిన పాఠశాలను ఏ రోజైన తనిఖీ చేశారా. మీ నాయకులైన తనిఖీ చేశారా. కనీసం పాఠశాలలో ఖాళీలు ఉన్నటువంటి పోస్టులను ఏ రోజైన భర్తీ చేశారా.
హాస్టల్లో స్కావేందర్స్ పోస్ట్ లను నియమించాలని జ్ఞానం కూడా లేకుండా మీరు మీ నాయకులు మాట్లాడుతున్నారా
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థను ప్రతిష్ట చేయాలని రేవంత్ రెడ్డి కంకణం కట్టుకొని విద్య వ్యవస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తూ విద్యార్థులను ఉన్నత స్థాయిలకు ఎదిగేలా చేయాలని దృఢ సంకల్పంతో, మా నాయకుడు కృషి చేస్తున్నాడు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్. కో ఆప్షన్ సభ్యులు ఎండి చోటేమియా. మార్కెట్ కమిటీ డైరెక్టర్ కట్కూరు శ్రీనివాస్. మాజీ ఎంపీపీ వడ్లకొండ నారాయణ. వైస్ ఎంపీపీ విడుదలైన అశోక్. మాజీ సర్పంచ్ నారగని దేవేందర్ గౌడ్. గ్రామ కమిటీ అధ్యక్షుడు ఓరుగంటి కృష్ణ. మండల అధికార ప్రతినిధి మామిళ్ల మల్లికార్జున గౌడ్.వార్డ్ మెంబర్ గంధం ఓధాకర్. సీనియర్ నాయకులు బాల్య కుమార్. పూదరి రవి. ఎస్కే జానీ. దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

సన్నబియ్యం ఇచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదే.

సన్నబియ్యం ఇచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదే.

మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా.

దుగ్గొండి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చుక్క రమేష్ గౌడ్

నర్సంపేట,నేటిధాత్రి:

నిరుపేదలు,సామాన్య ప్రజలు,ధనికుల ఓకె రకమైన సన్నబియ్యం తినాలనే ఉద్దేశ్యంతో దేశంలో మొదటిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో సన్నబియ్యం పథకం ప్రారంభించారని దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చుక్క రమేష్ గౌడ్ అన్నారు.ఇటీవలే నూతనంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు.ఈ సందర్బంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు ఆర్డినెన్సు చేసి దేశంలో చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందపరించిన విధంగా అన్ని పథకాలు అమలు చేస్తున్నదని వాటి అమలును ప్రజల్లోకి మండల పార్టీ సహకారంతో తీసుకెళ్తానని పేర్కొన్నారు. తనకు గత 30 ఏండ్లుగా రాజకీయ అనుభవం ఉన్న నేపథ్యంలో దుగ్గొండి మండలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిపించుకుంటానని రమేష్ గౌడ్ హామీ ఇచ్చారు.తమపై నమ్మకంతో మండల అధ్యక్షునిగా బాధ్యత ఇచ్చిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి,సహకరించిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి,నియోజకవర్గ నాయకులు,మండల నాయకులు,కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

జనగణన కులగనన చేసిన ఘనత బి జే పి కే

జనగణన కులగనన చేసిన ఘనత బి జే పి కే సాధ్యం..

బి జే పి జిల్లా కార్యదర్శి పోదెం రవీందర్

మంగపేట నేటిధాత్రి :

 

మంగపేట మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఆఫీస్ నందు మండల అధ్యక్షుడు రావుల జానకిరామ్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇట్టి సమావేశంలో జిల్లా కార్యదర్శి పోదెం రవీందర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ….. దేశంలోని జనగణనలో కులగణనను చేయడం ఒక్క భారతీయ జనతా పార్టీకే సాధ్యమవుతుందని నిరూపించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నే అని ధీమా వ్యక్తం చేశారు. మన దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంవత్సరాలు పరిపాలించినా ఏనాడు కూడా జనగణన కుల గణనను చేయించిన దాఖల లు లేదని ఇంత బృహోత్కరమైన కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ నిర్వహించిన సందర్భంగా మండల నాయకులు అందరూ వారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు యరంగారి వీరన్ కుమార్, గుండు రాజేష్, రామ గాని నరేందర్, బట్ట బాబురావు, కాసర్ల మల్లారెడ్డి, , సునీల్ కుమార్, గుండారపు రోహిత్ కుమార్, వై ప్రకాష్, కాక లక్ష్మి తదితరులు పాల్గొనడం జరిగింది

మన సంస్కృతిని ప్రపంచానికి చాటిన ఘనత కవితక్కదే.

మన సంస్కృతిని ప్రపంచానికి చాటిన ఘనత కవితక్కదే….
– జాగృతితోనే బతుకమ్మ సంబరాలకు పునర్జీవం
– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌
– మంథనిలో ఘనంగా కవితక్క జన్మదిన వేడుకలు

మంథని :- నేటి ధాత్రి

మన సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచస్థాయిలో చాటిన ఘనత కల్వకుంట్ల కవితక్కకే దక్కుతుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు. మాజీ ఎంపీ,ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకల్లో బాగంగా గురువారం మంథని పట్టణంలోని రాజగృహాలో వేడుకలు నిర్వహించారు. ఈసందర్బంగా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం కూతురు అయినా ఒక సాధారణ నాయకురాలిగా కవితక్క తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుందన్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో సైతం తనవంతుగా ముఖ్య పాత్ర పోషించిందని, ప్రజల్లో అనునిత్యం మమేకమై వారి కష్టసుఖాలను తెలుసుకునేవారన్నారు. జాగృతి సంస్థను ఏర్పాటుచేసి అనేక సేవలు అందించడంతో పాటు ప్రపంచంలోని తెలుగువాళ్లకు మన సంస్కృతిని చాటి చెప్పారన్నారు. అలాగే ప్రతి గ్రామంలో బతుకమ్మ ఆటలు ఆడుకునేవారని, కానీ జాగృతి సంస్థ ద్వారా కవితక్క అంగరంగ వైభవంగా బతుకమ్మసంబరాలు నిర్వహించి విశిష్టతను చాటారని, తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మకు పునర్జీవం ఇచ్చారని ఆయన కొనియాడారు. నిత్యం ప్రజల కోసం, తెలంగాణ కోసం ఆలోచన చేసే కవితక్కకు మంథని నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు అభిమానుల పక్షాన పుట్టిన రోజు శుభాకాంక్షలను ఈ సందర్బంగా ఆయన తెలిపారు.

తెలంగాణకే తలమానికం. ఎన్డీఎస్ఎల్.

తెలంగాణకే తలమానికం. ఎన్డీఎస్ఎల్

మెట్ పల్లి మార్చి 11 నేటి ధాత్రి

చక్కర కర్మగారాన్ని నాశనం చేసిన ఘనత బీఆర్ఎస్ కే దక్కుతుంది ఎన్నికల్లో ఇచ్చిన హామీని కాంగ్రెస్ మర్చిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం పసుపునకు రూ. 12వేల మద్దతు ధర ఇవ్వాల్సిందే చెరుకు రైతుల కోసం ఉద్యమించేది బీజేపీ పార్టీ మాత్రమే బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు చిట్నేని మెట్ పల్లిలో చెరుకు రైతులకు మద్దతుగా బీజేపీ మహాధర్నా
మెట్ పల్లితెలంగాణకే తలమానికం ఎన్డీఎస్ఎల్ కర్మగారాలు అని బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు చిట్నేని అన్నారు. మంగళవారం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇచ్చిన పిలుపు మేరకు మెట్ పల్లి పట్టణంలోని పార్టీ కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించి రైతులు, రైతు సంఘ ప్రతినిధులతో కలిసి మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు గంటపాటు రహదారిపై బైఠాయించి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు హాజరై మాట్లాడారు.
1947లోనే బోధన్ లో ఎన్డీఎస్ఎల్ కర్మాగారం ప్రారంభమైందన్నారు. కొన్ని సంవత్సరాలు చెరుకు రైతులకు లాభదాయకంగా ఉన్న ఎన్డీఎస్ఎల్ ను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 2015లో లే ఆఫ్ ప్రకటించి మూసివేసారన్నారు. దీంతో సుమారు 15 వేల ఎకరాల్లో పంటను చెరుకు రైతులు నష్టపోతున్నారన్నారు. కర్మగారాలను అర్థంతరంగా మూసివేయడంతో చెరుకు రైతులకు ఉపాధి లేక వారితో పాటు, వారి పిల్లల సైతం ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.
కాగా 2013లోనే బీజేపీ ఆధ్వర్యంలో ముత్యంపేట చక్కర కర్మగారాన్ని తెరిపించాలని డిమాండ్ చేస్తూ మెట్ పల్లిలో రైతులతో కలిసి పార్టీలకతీతంగా ధర్నా కార్యక్రమం నిర్వహించామని గుర్తు చేశారు. ప్రస్తుతం కర్మాగారం మూతపడడంతో చెరుకు రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి రెండు నవోదయ పాఠశాలలను మంజూరు చేయించిన ఘనత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ దక్కుతుందన్నారు. ఒకటి కోరుట్ల నియోజకవర్గంలో, మరొకటి జక్రాన్ పల్లిలో మంజూరు చేయించామని. ఇప్పటికైనా పాలకులు స్పందించి చెరుకు రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వెంటనే చక్కర కర్మగారాన్ని తెరిపించాలని, కర్మాకారానికి సంబంధించిన భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా ఆది నుంచి రైతుల సంక్షేమానికి బీజేపీ ఆధ్వర్యంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కృషి చేస్తూనే ఉన్నారని గుర్తు చేశారు. ఆయన కృషి మేరకు పసుపు బోర్డును సాధించుకున్నామని, పసుపు రైతుల సంక్షేమానికి పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, ధర్నా కార్యక్రమ కన్వీనర్, రాష్ట్ర నాయకులు ఏలేటి నరేందర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ చెట్లపల్లి మీనా – సుఖేందర్ గౌడ్, నరేష్, రాష్ట్ర ఓబీసీ ఉపాధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్, బీజేపీ నాయకులు, రైతు సంఘం నాయకులు బద్దం శ్రీనివాస్ రెడ్డి, గుంటుక సదాశివ్, వడ్డేపల్లి శ్రీనివాస్, పంచిరి విజయ్, రాజ్ పాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బింగి వెంకటేష్, దొనికెల నవీన్, డాక్టర్ వెంకట్ రెడ్డి, పీసు రాజేందర్ రెడ్డి, బత్తుల శ్రీనివాస్, బొడ్ల నరేష్, గుగ్గిళ్ళ తుకారం గౌడ్, బొడ్ల ఆనంద్, పన్నాల రాఘవరెడ్డి, బొడ్ల గౌతమ్, జక్కుల జగదీష్, సదాశివ్, మహేష్, బొమ్మెల శంకర్, జుంగల ఆనంద్, రమేష్ యాదవ్, శ్రీనివాస్, సుంచు రణధీర్, రాజారెడ్డి, కొయ్యల లక్ష్మణ్, శ్రీధర్ రెడ్డి, చెట్లపల్లి సాగర్, కలాల సాయిచందు, ఇట్యాల నవీన్, కుడుకల రఘు, కలిగోట శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version