వర్షాలు సకాలంలో కురవాలని సంకల్ప పూజ చేసిన.

వర్షాలు సకాలంలో కురవాలని సంకల్ప పూజ చేసిన బిజెపి నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి

సకాలంలో వర్షాలు పడి రాష్ట్రము దేశములోని ప్రజలు పశుపక్షాధులు సమస్త జీవకోటి సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని దొంగల రాజేందర్ అన్నారు ఈ సందర్భంగా భూపాలపల్లి సుభాష్ కాలనీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో వర్షాలు సకాలంలో కురవాలని బిజెపి పార్టీ నాయకులు ఆధ్వర్యంలో సంకల్ప పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ పూజా కార్యక్రమంలో వరుణ దేవుని యొక్క ఆశీర్వాదం కోసం వర్షాలు కురవాలని సీతారాములకు వాసు అయ్యగారుచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి సంకల్పం నెరవేరాలని సీతారాములను ప్రార్థించడం జరిగిందని అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలందరూ కూడా వర్షాల కోసం భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థించాలని అన్నారు సమృద్ధిగా వర్షాలు పడితే రైతులు మనకోసం పండించే పంట చేతికి వస్తుందని రైతుల ఆనందంగా ఉంటేనే సమస్త జీవకోటి ఆనందంగా ఉంటుందని కావున కనీసం మనం ప్రత్యక్షంగా రైతుల కోసం ఏమి చేయలేము కనీసం వర్షాలు పడాలని భగవంతుని ప్రార్థిస్తే రైతులకు అండగా ఉన్న వాళ్ళం అవుతామని అన్నారు ప్రకృతి సస్య శ్యామలంగా ఉండడంకోసం ప్రతి ఒక్కరూ ప్రకృతికి అనకూలంగా జీవించాలని అన్నారు ప్రకృతి ఆగ్రహిస్తే ప్రజలు సంతోషంగా జీవించలేరని అన్నారు వర్షాల కోసం ప్రతి ఒక్కరు భగవంతుని ప్రార్థించి భాగస్వాములు కావాలని ప్రజలను రాజేందర్ కోరారు ఈ కార్యక్రమంలో బట్టు రవి కంబాల రాజయ్య సామల మధుసూదన్ రెడ్డి తుమ్మేటి రామ్ రెడ్డి అజ్మీర రాజు నాయక్ కరివేద మనోహర్ రెడ్డి ఊరటి మునేందర్ కoచెం నరసింహమూర్తి గుండె శీను పొన్నాల కొమురయ్య తాండ్ర హరీష్ చెక్క శంకర్ శ్రీధర్ దొంగల కుమార్ తదితరులు పాల్గొన్నారు

సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో బుద్ధుని నాటక ప్రదర్శన.

సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో బుద్ధుని నాటక ప్రదర్శన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

ప్రపంచానికి మానవత సుగందాలు అందించిన తధాగత్ భగవాన్ బుద్ధుని నాటక ప్రదర్శ న జూలై 2 బుధవారం నాడు సాయంత్రం 6:30 గంటలకు షెట్కర్ ఫంక్షన్ హాల్ నందు అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారిచే బుద్ధునితో నా ప్రయాణం అనే అద్భుతమైన నాటక ప్రదర్శన నిర్వహించబడుతుంది ఈ యొక్క నాటకంలో బుద్ధుడు బోధించిన శాంతి సందేశం ప్రజ్ఞ, శీల, కరుణ సామ్రాట్ అశోక చక్రవర్తి హింసను విడనాడి బౌద్ధాన్ని స్వీకరించి విశ్వవ్యాప్తం చేసిన విధానం మరియు 2500 సంవత్సరాల తర్వాత విశ్వ జ్ఞాని, సబండవర్గాల హక్కుల ప్రదాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధ ధర్మానికి పునర్జీవనం పోసిన విధానాన్ని అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారు 30 మంది సభ్యులతో మంచి లైటింగ్, అద్భుతమైన సంగీతంతో ఈ యొక్క నాటకాన్ని ప్రదర్శించబోతున్నారు కావున జహీరాబాద్ పరిసర ప్రాంత ప్రజలందరూ సకాలంలో సరైన సమయానికి వచ్చి ఇంతటి మంచి అవకాశాన్ని వినియోగించుకొని జయప్రదం చేయగలరు. ఈ యొక్క సమావేశంలో సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కర్ణం రవికుమార్, జహీరాబాద్ డివిజన్ అధ్యక్షులు సురేష్ బుద్ధిష్ట్ర సొసైటీ నాయకులు సుభాష్, నర్సింలు, అశోక్, రాజు, బంద్యప్ప తదితరులు పాల్గొన్నారు.

సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో బుద్ధుని నాటక ప్రదర్శన.

సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో బుద్ధుని నాటక ప్రదర్శన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

ప్రపంచానికి మానవత సుగందాలు అందించిన తధాగత్ భగవాన్ బుద్ధుని నాటక ప్రదర్శ న జూలై 2 బుధవారం నాడు సాయంత్రం 6:30 గంటలకు అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారిచే బుద్ధునితో నా ప్రయాణం అనే అద్భుతమైన నాటక ప్రదర్శన నిర్వహించబడుతుంది ఈ యొక్క నాటకంలో బుద్ధుడు బోధించిన శాంతి సందేశం ప్రజ్ఞ, శీల, కరుణ సామ్రాట్ అశోక చక్రవర్తి హింసను విడనాడి బౌద్ధాన్ని స్వీకరించి విశ్వవ్యాప్తం చేసిన విధానం మరియు 2500 సంవత్సరాల తర్వాత విశ్వ జ్ఞాని, సబండవర్గాల హక్కుల ప్రదాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధ ధర్మానికి పునర్జీవనం పోసిన విధానాన్ని అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారు 30 మంది సభ్యులతో మంచి లైటింగ్, అద్భుతమైన సంగీతంతో ఈ యొక్క నాటకాన్ని ప్రదర్శించబోతున్నారు కావున జహీరాబాద్ పరిసర ప్రాంత ప్రజలందరూ సకాలంలో సరైన సమయానికి వచ్చి ఇంతటి మంచి అవకాశాన్ని వినియోగించుకొని జయప్రదం చేయగలరు.

ఈ వ్యవహారం ఎలా బయటకు వెళ్ళింది మిరే చెప్పారు.

నేటిధాత్రి కథనం,తో ఉద్యోగుల పై “ఆ అధికారి” ఆగ్రహం.!?

ఈ వ్యవహారం ఎలా బయటకు వెళ్ళింది మిరే చెప్పారు.!?

నేను మీ బాస్,మీకు ఉద్యమం నుండి తొలగిస్తా అంటూ సీరియస్.!?

అరాచకం తట్టుకోలేక కొందరు బదిలీ,అదేబాటలో మరొకొందరు.!?

ఆశాఖ లో మూడు ప్రధాన విభాగాలు టార్గెట్, పెద్దమొత్తం లో వసూల్.!?

ఆశాఖ అధికారికి కొందరు ఉన్నత అధికారుల ప్రోత్సహం,? ఎక్కడ విధులు చేసిన ఇదే తంతు.!?

ఆ అధికారి బండారం బయటకు వచ్చిన ఉన్నత అధికారులు స్పందన కరువు ఎందుకు.!?

మహాదేవపూర్-నేటిధాత్రి:

నేటి రాత్రి దినపత్రిక ప్రచురించిన “అవినీతికి పాల్పడితేనే, సై లేదంటే విజిలెన్స్ దాడులు.” అనే శీర్షికపై మండలంలోని ఆ శాఖ అధికారి తన సిబ్బందిపై విరుచుక పడినట్లు సమాచారం. శాఖలోని విభాగాలకు సంబంధించిన బాధ్యతలను విధుల నుండి తొలగిస్తానని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా శాఖలో జరిగే వ్యవహారం బయటకు ఎలా వెళ్లిందని సిబ్బందితోపాటు శాఖలోని విభాగాలకు సంబంధించిన పలువురిని ప్రత్యేకంగా మీరే చెప్పారంటూ వార్నింగ్లు ఇవ్వడం జరిగిందని, ఇదే క్రమంలో ఆ అధికారి ప్రత్యేకంగా కొందరు శాఖలోని ఉద్యోగులతో పాటు విభాగాలకు సంబంధించిన బాధ్యులపై మరింత ఒత్తిడి పెంచినట్లు విశ్వ నీ సమాచారం. ఆ శాఖ అధికారి వ్యవహారం తిర పైకి వచ్చినప్పటికీ కూడా ఉన్నత అధికారులు విచారణ జరిపించకపోవడం అధికారిపై చర్యలు తీసుకోకపోవడం శాఖలోని ఉద్యోగులు ఆశ్చర్యానికి గురవుతున్నట్లు తెలుస్తుంది.

ఈ వ్యవహారం ఎలా బయటకు వెళ్ళింది మిరే చెప్పారు.!?

మండలంలోని ఆ శాఖ అధికారి వ్యవహారం సొంత శాఖలో విజిలెన్స్ దాడులు, అవినీతికి పాల్పడకుంటే సిబ్బందితోపాటు, విభాగాల బాధ్యులపై కక్ష సాధింపుతో విజిలెన్స్ దాడులు ఉద్యోగం నుండి వెళ్లిపోయేలా హింసించడం, ఆ అధికారికి గత కొన్ని నెలలుగా మహాదేవపూర్ మండల ఆ శాఖ సిబ్బంది మరియు విభాగాల బాధ్యులు హింసను తట్టుకోలేకపోతున్న క్రమంలో విజిలెన్స్ దాడులు తెరపైకి రావడం ఆ శాఖ అధికారి వ్యవహారం అంతర్గతంగా మండలమంతా ఇతర శాఖల్లో కూడా చర్చనీయంగా మారడంతో, నేటి ధాత్రి ఆదివారం రోజు,” అవినీతికి పాల్పడితేనే సై లేదంటే విజిలెన్స్ దాడులు” అనే శీర్షికను ప్రచురించింది. ఆదివారం శీర్షిక సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న క్రమంలో ఆ శాఖ అధికారి వ్యవహారమంతా ఆ శీర్షికలో ఉండడం తన శాఖ తన గురించి ఇలా బయటికి వచ్చిందని,ఆదివారం సెలవు రోజు తన మొబైల్ ఫోన్ ను పనిలో పెట్టడం చేశాడట అధికారి, కిందిస్థాయి ఉద్యోగులతో పాటు శాఖలోని ఇతర విభాగాల బాధ్యులకు ఫోన్ ద్వారా వార్నింగ్ లు ఇవ్వడం ప్రారంభించినట్లు సమాచారం. తనకు ఏమనుకుంటున్నారు, మీ శాఖ అధికారిని అంతర్గత వ్యవహారం ఏలా బయటికి పొక్కింది, నేను ఏమైనా చేస్తా మీరు ఎలా సమాచారం బయటకి చెప్తారు, ఉద్యోగం పై ప్రేమ లేదా, ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసి మీ ఉద్యోగం పోయేలా చేస్తానని సిబ్బంది మరియు, ఆ శాఖలోని విభాగాల బాధ్యులకు వార్నింగ్ లు ఇవ్వడం తో ప్రస్తుతం శాఖలోని కిందిస్థాయి సిబ్బంది తమపై అన్యాయాలు చేసి అవినీతికి పాల్పడాలి అనే అధికారి తమకు ఉన్నత అధికారులకు చెప్పి చర్యలు తీసుకుంటానని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పుకుంటున్నట్లు సమాచారం.

అరాచకం తట్టుకోలేక కొందరు బదిలీ,అదేబాటలో మరొకొందరు.!?

ఆ శాఖ అధికారి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి కింది స్థాయి ఉద్యోగులకు శాఖలోని ఇతర విభాగాలకు సంబంధించిన బాధ్యులకు, కచ్చితంగా అవినీతి చేసి తమ వాటా ఇవ్వాలని ఒత్తిడి తట్టుకోలేక ఆ శాఖకు సంబంధించిన కొందరు బాధ్యులు కిందిస్థాయి ఉద్యోగులు బదిలీ చేసుకొని వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. అలాగే మరికొందరు ఉద్యోగులు సైతం తమ రిటైర్మెంట్ కాలం దగ్గర ఉందని అధికారి ఒత్తిడికి చెప్పుకోలేక విధులు నిర్వహిస్తున్నట్లు, మరికొందరు అధికారిని ప్రశ్నించే సత్తా ఉన్నప్పటికీ పై అధికారులు కూడా ఆ అధికారికి అంతర్గతంగా సహకారం ఉందని తెలుసుకున్న సిబ్బంది ఇతర శాఖల బాధ్యులు, చేసేదేమీ లేక వీరి ప్రాంతానికి బదిలీ చేయించుకునే ప్రయత్నంలో ఉన్నట్లు విశ్వనీయ సమాచారం. ప్రస్తుతం ఆ శాఖ పరిస్థితి ప్రతి ఒక్కరూ బదిలీపై వెళ్లే ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో శాఖలోని విభాగాలు కిందిస్థాయి ఉద్యోగులు లేక శాఖ కార్యాలయం తో పాటు కార్యకలాపాలు త్వరలో ఆగిపోయే పరిస్థితి నెలకొల్పే విధంగా కనబడుతుంది.

ఆశాఖ లో మూడు ప్రధాన విభాగాలు టార్గెట్, పెద్దమొత్తం లో వసూల్.!?

మండలంలోని ఆ శాఖ అధికారి ప్రస్తుతం మూడు ప్రధాన విభాగాలను టార్గెట్ చేసి ఎక్కువ మోతాదులో ఆదాయ వనరులు ఉండడంతో ఆ విభాగాలకు సంబంధించిన బాధ్యులను ప్రధానంగా టార్గెట్ చేస్తూ పెద్ద మొత్తంలో నెలసరి వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. ఆ శాఖలోని మిగతా విభాగాలు తక్కువ మోతాదులో ఆదాయ వనరులు ఉండడంతో వారిని కూడా వారి స్తోమతకు మించి అవినీతికి పాల్పడాలని హింసిస్తూ తనకు నెలసరి వాటా కచ్చితంగా ఇవ్వాలని నికిత చిన్న తరహాలో నిర్వహించబడుతున్న విభాగాల బాధ్యులకు హుకుం జారీ చేసి వారి వద్ద నుండి నెలసరి జీతంల అక్రమ సొమ్మును పీడించి వసూలు చేయడం జరుగుతుందని లేదంటే విజిలెన్స్ దాడులకు సిద్ధంగా ఉండాలని అధికారి హుకుం జారీ చేయడం జరుగుతుందని సమాచారం. అధికారి ఒత్తిడికి తట్టుకోలేక సిబ్బంది మరియు విభాగాల బాధ్యులు అవినీతికి పాడు పరిస్థితి లేకపోవడంతో తమ జీతాల నుండి అధికారికి రూపాయలు ఇచ్చి ఎలాగో అలా తమ ఉద్యోగాన్ని దక్కించుకొని విధులు నిర్వహిస్తూ కాలం గడుపుతున్నట్లు సమాచారం.

ఆశాఖ అధికారికి కొందరు ఉన్నత అధికారుల ప్రోత్సహం,? ఎక్కడ విధులు చేసిన ఇదే తంతు.!?

జిల్లాలోని సొంత శాఖలో కిందిస్థాయి ఉద్యోగులు విభాగాల బాధ్యులకు అవినీతి కొరకు ప్రోత్సహించి నెలసరి జీతం లాగా అక్రమాలు చేసి సొమ్ము అందించాలని లేదంటే విజిలెన్స్ ఆధ్వర్యంలో తనిఖీలు చేసి ఉద్యోగం లేకుండా చేస్తానని సొంత శాఖ సిబ్బంది విభాగాల బాధ్యులకు పీడిస్తున్న ఆ అధికారి బండారం బయటపడినప్పటికీ, శాఖకు సంబంధించిన ఉన్నత అధికారులు చర్యలు తీసుకోకపోవడం కాస్త ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మరోవైపు ఆ శాఖలోని సిబ్బంది మరియు విభాగాల బాధ్యులు పీడించే ఆ అధికారికి జిల్లాలోని కొందరు ఉన్నత అధికారులు అంతర్గతంగా ప్రోత్సహిస్తున్నారని అందుకొరకు ఆ అధికారి తనకంటే పై అధికారులకు కూడా గౌరవం భయం లేనివిధంగా ప్రభాస్ తీస్తున్నాడని చెప్పుకుంటూ ఆశ్చర్యా పోతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ అధికారి ఎక్కడ విధులు నిర్వహించిన, కింది స్థాయి ఉద్యోగులకు పీడించడమే లక్ష్యంగా అవినీతికి పాల్పడి తనకు సొమ్ము అందించడమే సిబ్బంది విభాగాల బాధ్యులు చేసే ప్రధాన పని అని పీడించడం ఆ అధికారికి కొత్తవి కాదని, కానీ జిల్లా మరియు ఉన్నత స్థాయి అధికారులు ఇప్పటివరకు ఆ అధికారిపై చర్యలు తీసుకోకపోవడం ప్రధాన కారణం ఏమిటో ఆ శాఖ పలు అధికారులకు కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుందట. ఏది ఏమైనా సొంత శాఖలో ఇలా అవినీతి చేసి ప్రతినెలా మామూలు ఇవ్వాలని పీడిస్తున్న మండలంలోని ఓ శాఖ అధికారి ఇలాంటి అధికారి మరియు శాఖ రాష్ట్రంలోని ఎక్కడ ఉండదు, కానీ ఈ అధికారి మాత్రం నిర్భయంగా సొంత శాఖలో సిబ్బందికి విభాగాల బాధ్యులకు పీడించి అక్రమ సొమ్ము నెలసరి జీవితంలో దోచుకోవడం, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఆ శాఖలో ఈ అధికారిపై రోజుకు ఒక కొత్త రకమైన అవినీతి తెరపైకి రావడం అధికారులు ఇలాంటి చర్యలపై మొగ్గు చూపుతారు అన్నది వేచి చూడాల్సిందే.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ.

నాగర్ కర్నూల్ /నేటి ధాత్రి.

నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం గుట్టలపల్లి గ్రామంలో ఇల్లు లేని నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైన సందర్భంగా.. నూతన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి ఎమ్మెల్యే కూచకుళ్ళ రాజేష్ రెడ్డి భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ డబుల్ బెడ్రూంలు ఇల్లు ఇస్తామని, మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్ల ఇస్తున్నామన్నారు. మొదటగా గుట్టలపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేశామన్నారు. అనంతరం పొల్మూరు గ్రామంలో రూ.5 లక్షలతో మంజూరైన నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version