బిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు.

బిఆర్ఎస్ పార్టీ పోరాట ఫలితమే వ్యవసాయ రైతులకు సాగునీరు విడుదల

బిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు

నేటిధాత్రి చర్ల

బిఆర్ఎస్ పార్టీ ఉద్యమం వలన ఈరోజు రైతులకు తాలిపేరు కాలవల నుండి నీరు విడుదల చేసారు అని బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు కో కన్వీనర్ ఐనవోలు పవన్ ఒక ప్రకటనలో తెలిపారు జూలై 6 తేదీన డివిజన్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ మానెం రామకృష్ణ చర్ల మండల బిఆర్ యస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు ప్రాజెక్ట్ నిండా నీరు ఉన్న నీరు విడుదల చేయడం లేదని రైతులు ఆందోళన చెందారు వెంటనే నీరు రైతులకు విడుదల చేయాలని డివిజన్ నాయకులు డిమాండ్ చేశారు దాని పలితమే ఈ రోజు రైతులకు నీరు విడుదల చేసారు చాలా సంతోషం అదే విధంగా కాలువలకు పడిన గండ్లను కూడ పూడ్చే కార్యక్రమాన్ని కూడ చేపడితే కింది ప్రాంత రైతుల కూడా న్యాయం జరుగుతుంది దుమ్ముగూడెం మండలంలో తూరుబాక వద్ద కల్వర్టు కృంగి పోయి ఉంటే బిఆర్ఎస్ పార్టీ డివిజన్ నాయకులు మండల నాయకులు ఉద్యమాన్ని చేపడితే వెంటనే బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించారు బిఆర్ఎస్ పార్టీ ఏప్పుడు కూడా తెలంగాణ ప్రజల కోసం రైతుల కోసం నిరంతరం పోరాటం చేస్తుందని తెలియజేసారు

టి యు డబ్ల్యూ జే (ఐ జేయు) 3 మడలాల కన్వీనర్ గా పుల్లరవితేజ.

టి యు డబ్ల్యూ జే (ఐ జేయు) 3 మడలాల కన్వీనర్ గా పుల్లరవితేజ.

చిట్యాల నేటిధాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల ప్రెస్ క్లబ్ కార్యాలయంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ టి యు డబ్ల్యూ జె ఐ జెయు చిట్యాల టేకుమట్ల మొగుళ్ళపల్లి మూడు మండలాల కన్వీనర్గా పుల్ల రవితేజను (ఆర్ బి న్యూస్ )నియమించినట్లు జిల్లా అధ్యక్షులు క్యాతం సతీష్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి సామంతల శ్యామ్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూనియన్ అభివృద్ధి కోసం గత కొన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్న రవితేజను నియమించమని జర్నలిస్టుల సమస్యల కోసం కృషి చేయాలని అన్నారు అనంతరం ఎన్నికైన రవితేజ ను అభినందించారు, ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షుడు ఐజేయు జిల్లా నాయకులు కాట్రేవుల ఐలన్న ప్రెస్ క్లబ్ నాయకులు కట్కూరి శ్రీనివాస్ బుర్ర రమేష్ గుర్రపు రాజమౌళి సరిగోమ్ముల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఏబీవీపీ జిల్లా కన్వీనర్ గా శ్రావణ్ కుమార్.

ఏబీవీపీ జిల్లా కన్వీనర్ గా శ్రావణ్ కుమార్

నర్సంపేట నేటిధాత్రి:

 

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వరంగల్ జిల్లా కన్వీనర్ గా బానోత్ శ్రవణ్ కుమార్ ను నియమించారు.
జూన్ 22 నుండి 24 వరకు ఆర్మూర్ లో జరిగిన తెలంగాణ ప్రాంత అభ్యాసవర్గలో ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షులు జానా రెడ్డి వరంగల్ జిల్లా కన్వీనర్ గా బానోత్ శ్రవణ్ కుమార్ ను నియమించారు.గతంలో హన్మకొండ జిల్లా కేంద్రంగా ఆర్ట్స్ కళాశాల ప్రెసిడెంట్ గా,ఆర్ట్స్ జోనల్ ఇన్చార్జిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పనిచేశారు.ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో వరంగల్ జిల్లా కన్వీనర్ గా నియమించిన ఏబీవీపీ రాష్ట్ర శాఖకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతినిత్యం విద్యార్థులకు సేవలు అందిస్తూ అవినీతిని అంతం చేస్తానని తెలియజేశారు.

(TEOBDA) తెలంగాణ ఐ ఆర్గాన్ బాడీ డోనర్స్.!

(TEOBDA) తెలంగాణ ఐ ఆర్గాన్ బాడీ డోనర్స్ అసోసియేషన్ కన్వీనర్ గా గోనె ఎల్లప్ప

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి )

అవయవ దానం అత్యున్నత మైన దానమని, మానవత్వంతో అమరత్వం పొందవచ్చునని, మరణానంతర జీవం మరణించి జీవించవచ్చని తెలంగాణ నేత్ర శరీర అవయవ దాతల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ పరికిపండ్ల అశోక్ పేర్కొన్నారు. గత మూడు దశాబ్దాలుగా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సిరిసిల్ల వాసి గోనె ఎల్లప్పను తెలంగాణ నేత్ర శరీర అవయవ దాతల(TEOBDA) సంఘం జిల్లా కన్వీనర్ గా డాక్టర్ అశోక్ నియమించారు. హైదరాబాదులో జరిగిన రాష్ట్ర కార్యనిర్వాహక సమావేశంలో గోనె ఎల్లప్పకు సిరిసిల్ల జిల్లా కన్వీనర్ గా నియామక పత్రాన్ని అందజేశారు, వారు సిరిసిల్ల జిల్లాలో అవయవదానంపై అవగాహన, నేత్రదానాలు, దేహదానాలు ప్రోత్సహించవలసి ఉంటుందని, ఈ పదవి మూడు సంవత్సర కాలం ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల అనుగుణంగా పనిచేయవలసి ఉంటుందని డాక్టర్ అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు.

NHRC జిల్లా సోషల్ మీడియా కన్వీనర్.

ఎన్ హెచ్ఆర్సి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గా అయిలోని అభిషేక్.

వరంగల్/నర్సంపేట,నేటిధాత్రి:

మానవ హక్కుల సంఘం సోషల్ మీడియా వరంగల్ జిల్లా కన్వీనర్ గా గీసుగోoడ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామానికి చెందిన అయిలోని అభిషేక్ ను నియమిస్తూ స్టేట్ చైర్మన్ బద్దిపడిగా శ్రీనివాస్ రెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు.తనపై నమ్మకంతో బాధ్యతను అప్పజెప్పిన నేషనల్ చెర్మెన్,డాక్టర్ మహమ్మద్ యాసీన్, వరంగల్ జిల్లా అద్యక్షులు గంగుల అశోక్ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్ హెచ్ ఆర్ సి సంస్థలో తన కర్తవ్యాన్ని క్రమశిక్షణతో నెరవేస్తానని తెలిపారు. ఎల్లప్పుడూ రాష్ట్ర అధ్యక్షులు వారికి జిల్లా తోటి సభ్యులకు అన్ని విధాలుగా సహకారం అందజేస్తానని అన్నారు. పేద ప్రజల తరఫున చట్టపరమైన దిశలో మానవ హక్కుల చర్యలో తోడ్పాటును నిర్వహించేందుకు కృషి చేస్తానని తెలిపారు.ఆపదలో ఉండే ఈ వ్యక్తికైనా ఎన్ హెచ్ ఆర్ సి ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version