అంతడుపుల నాగరాజు కు అపూర్వ స్వాగతం.

అంతడుపుల నాగరాజు కు అపూర్వ స్వాగతం

మందమర్రి నేటి ధాత్రి

రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ సలహా సభ్యుడు గా నియమితులైన సందర్బంగా తొలిసారి మందమర్రి కి విచ్చేసిన అంతడుపుల నాగరాజు గారికి కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా శాలువాతో సత్కారించి పూల బొకే అందజేశారు. అనంతరం అంతడుపుల నాగరాజు మాట్లాడుతూ నేను నా పురిటి గడ్డ అయినా మందమర్రి అంటే నాకు ఎంతో ప్రీతి నేను ఈ మందమర్రి లో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఈ తెలంగాణ అంటే నాకు అమితమైన ప్రేమ నేను ఎన్ని మంచి అవార్డుసు అందుకున్నా మందమర్రిని మర్చిపోవడం అంటూ ఉండదు నేను చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. నా చిన్ననాటి నుంచి నేను ఒక కళాకారుడిగా ఒక మంచి ప్రావీణ్యాన్ని సంపాదించుకొని ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నందుకు నేను ఈ ఈ మందమర్రి కి రుణపడి ఉంటాను అని వ్యాఖ్యానించారు

పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం.

పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

నేటి ధాత్రి కథలాపూర్

 

కథలాపూర్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ హై స్కూల్ లో 10 వ తరగతి చదివిన 1999-2000 సంవత్సరనికి చెందిన విద్యార్థులు 25 సంవత్సరాల తరువాత మండల కేంద్రంలో నీ SRR ఫంక్షన్ హాల్ లో సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పూర్వ విద్యార్థులందరూ పాల్గొని చిన్ననాటి జ్ఞాపకాలన్నిటిని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు,ఉపాధ్యాయులు భూమా చారి, అఖిల్ అహ్మద్, శ్రీనివాస్, అంజయ్య, రాజయ్య పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version