ఆస్తి పన్ను వడ్డీ పై తొంభై శాతం రాయితీ.

ఆస్తి పన్ను వడ్డీ పై తొంభై శాతం రాయితీ…

మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోనీ ఇండ్లపై, ఇంటి స్థలాల పై ఆస్థి పన్ను బకాయి ఉన్నట్లేతే ఈ నెల 31 లోపున చెల్లిస్తే వడ్డీపై 90% రాయితీని పొందుతారని మున్సిపాలిటీ కమిషనర్ గద్దె రాజు ఒక ప్రకటనలో తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను బకాయి ఉన్నవాళ్లకి గత సంవత్సరపు పెండింగ్ ఆస్తి పన్ను, ప్రస్తుత ఆస్థీ పన్ను ను ఈనెల 31 లోపు చెల్లించినట్లయితే వడ్డీ పై 90% రాయితీని కల్పించిందని , ఓటిఎస్ స్కీం ద్వార ఆస్తీ పన్ను బకాయి చెల్లించవచ్చని కమీషనర్ తెలిపారు.

ఆస్తి పన్ను బకాయి ఉంటే 2019 తెలంగాణ పురపాలక చట్టం లోని సెక్షన్ 87 ప్రకారం ఆస్తులను జప్తు చేసేందుకు వీలుంటుందని తెలిపారు. పుర ప్రజలందరూ గమనించి ఆస్తి పన్ను బకాయిలు ఉన్నట్లయితే వెంటనే చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని కోరారు.

మార్చి 31 లోపు ఎల్ఆర్ఎస్ చేసుకుంటే 25 శాతం రాయితీ.

మార్చి 31 లోపు ఎల్ఆర్ఎస్ చేసుకుంటే 25 శాతం రాయితీ

ప్రణాళికాబద్ధంగా పెండింగ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించాలి
– కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

రాజన్న సిరిసిల్ల 🙁 నేటి ధాత్రి )

ప్రణాళికాబద్ధంగా పెండింగ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను మార్చి చివరి లోపు పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.శుక్రవారం జిల్లా సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఎల్ఆర్ఎస్ పై సంబంధిత అధికారులతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్ఆర్ఎస్ 2020 క్రింద 42 వేల 942 దరఖాస్తులు రాగా, 23 వేల 515 దరఖాస్తులు ఆమోదించామని,1230 దరఖాస్తులు తిరస్కరించామని అన్నారు. ప్రస్తుతం ఎల్ 1 వద్ద 6776 దరఖాస్తులు, ఎల్ 2 వద్ద 385 , ఎల్ 3 వద్ద 76 పెండింగ్ ఉన్నాయని, వీటిని మార్చి చివరి నాటికి పరిష్కరించాలని అన్నారు.
ఎల్ఆర్ఎస్ స్క్రూటినీ పూర్తి చేసుకుని ఆమోదించిన దరఖాస్తుదారుల ను ఫాలో అప్ చేయాలని అన్నారు.జిల్లాలో 23 వేల 515 దరఖాస్తులు రుసుం చెల్లింపు కోసం ఆమోదిస్తే ఇప్పటి వరకు 184 మాత్రమే ఫీజు చెల్లించారని, మిగిలిన దరఖాస్తుదారులు మార్చి 31 లోపు  రు

42 శాతం బీసీ రిజర్వేషన్ కల్పించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు

సుంకరబోయిన మొగిలి
కొత్తగూడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు

కొత్తగూడ, నేటిధాత్రి:

కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇవ్వకున్నా కానీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించినందుకు హర్షం వ్యక్తం చేసిన కొత్తగూడ మండల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకరబోయిన మొగిలి
వారు మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేసేది చెపుతుంది చెప్పిందే చేస్తుంది
రాష్ట్రంలో ప్రజా పాలనలో భాగంగా మొదటి ప్రాధాన్యత మహిళలకు మరియు రైతులకు కల్పించారు ప్రజా ప్రభుత్వం రాగానే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం , ఉచిత గృహ జ్యోతి, ఉచిత 500 కే వంట గ్యాస్, సన్న వరి ధాన్యం కు 500 బోనస్, ఉద్యోగ అవకాశాలు కల్పించారు, రైతులకు వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ పెంపు, గత పది ఏళ్లలో అర్హులైన వారందరికీ ఏ ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వలేదు … కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రాగానే తెలంగాణ ప్రభుత్వం
సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే అధికారికంగా
సర్వే నిర్వహించి కుల గణన చేసి అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు ప్రకటించారు
42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు అసెంబ్లీలో ఆమోదం తెలుపుతూ… నిర్ణయం తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డికి, తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ అనసూయ సీతక్క కు, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ కు మరియు రాష్ట్ర మంత్రివర్గం కు గౌరవ సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఎమ్మెల్యేలకు బీసీలకు అండగా సహకరించిన ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపిన కొత్తగూడ బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు సుంకరబోయిన మొగిలి,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version