దుండగుడిని శిక్షించాలి
ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా అధ్యక్షుడు గరుగుల శ్రీనివాస్
నిజాంపేట: నేటి ధాత్రి
కుల్చారం మండలంలో సబ్ స్టేషన్ సమీపంలో పైతారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత అనిల్ ను దారుణంగా హత్య చేసిన దుండగులను వెంటనే కఠినంగా శిక్షించాలని మెదక్ జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు గరుగుల శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు నిజాంపేట లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చైతన్య కార్యకర్తగా పేరు తెచ్చుకున్న వ్యక్తిని హత్య చేయడం దారుణమన్నారు. హత్య చేసిన దుండగులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విచారణ జరిపి దుండగులను కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. ఈ విషయమై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.