స్థానిక సంస్థ ఎన్నికలలో 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలి.

స్థానిక సంస్థ ఎన్నికలలో 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలి

◆ జట్గొండ మారుతి డిమాండ్ చేశారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

తెలంగాణలో స్థానిక సంస్థ ఎన్నికలలో
న్యాల్కల్ మండల మల్గి గ్రామానికి చెందిన మాజీ తాజా సర్పంచ్ తెలంగాణ బీసీ సంక్షేమ సమితి విద్యార్థి ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ అధ్యక్షులు జట్గొండ మారుతి మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తరువాతనే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని
స్థానిక సంస్థ ఎన్నికలలో 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి తెలంగాణ బీసీ సంక్షేమ సమితి విద్యార్థి ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ అధ్యక్షులు జట్గొండ మారుతి డిమాండ్ చేశారు.

బీసీలకు మంత్రి పదవి ఇచ్చి మాట నిలబెట్టుకున్న,

బీసీలకు మంత్రి పదవి ఇచ్చి మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

 

 

 

 

సిరిసిల్ల పట్టణం కేంద్రం లో ని ప్రెస్ క్లబ్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చొక్కాల రాము ముదిరాజ్ మాట్లాడుతూ వాకిటి
శ్రీ హరికి మంత్రి పదవి ఇచ్చి,ముదిరాజులకు ఇచ్చిన మాట ను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుందని, అన్నారు. అలాగే చొక్కాల రాము ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 42 శాతం ముదిరాజులు ఉన్నారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, సర్పంచ్, జడ్పిటిసి మరియు జడ్పీ చైర్మన్ స్థానాలను కూడా ముదిరాజులకు కేటాయించాలని అన్నారు. బీసీడీఈ లో ఉన్న ముదిరాజులను బీసీ ఏలోకి మార్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇవ్వాలని అన్నారు.వాకిటి శ్రీహరి కి మంత్రి పదవి ఇచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు పంబాల దేవరాజు సంయుక్త కార్యదర్శి జంగాపల్లి శేఖర్,రాయిని ప్రతాప్, సిరిసిల్ల టౌన్ అధ్యక్షుడు వంకాయల కార్తీక్,కోలా నరేష్, మామిండ్ల నారాయణ మునిగల రాజు చుక్క శేఖర్ బల్లెపు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

కులగణన నిర్ణయంతో బీసీలకు నాయ్యం బీజేపీ.

కులగణన నిర్ణయంతో బీసీలకు నాయ్యం-బీజేపీ రామడుగు మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్

రామడుగు, నేటిధాత్రి:

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈసంధర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరియు కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేస్తామని కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం చాలా శుభపరిణామం వారికి మనస్పూర్తిగా యావత్ తెలంగాణ మరియు భారతదేశ ప్రజలు తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్, మండల ప్రధాన కార్యదర్శిలు పోచంపెళ్లి నరేష్, పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, మండల ఉపాధ్యక్షుడు కాడే నర్సింగమ్, బద్ధం లక్ష్మారెడ్డి, సీనియర్ నాయకులు కట్ట రవీందర్, జిత్తవేణి అంజిబాబు, యువ మోర్చా మండల అధ్యక్షులు దురుశెట్టి రమేష్, దళిత మోర్చా మండల అధ్యక్షులు సెంటి జితేందర్, జిల్లా యువ మోర్చా కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రామ్, మండల యువ మోర్చ ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి లక్ష్మణ్, బూత్ కమిటీ అధ్యక్షులు కడారి శ్రీనివాస్, ఉత్తేమ్ కనుకరాజు, దైవల తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో బీసీలంటే బీఆర్ఎస్ పార్టీకి అంత అలుసా..?

తెలంగాణలో బీసీలంటే బీఆర్ఎస్ పార్టీకి అంత అలుసా..?

-బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

తెలంగాణ రాష్ట్ర జనాభాలో 50 శాతంకు పైగా ఉన్న బీసీల పట్ల బీఆర్ఎస్ వైఖరి ఏమిటని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు వేముల మహేందర్ గౌడ్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన స్థానికంగా విలేకరులతో మాట్లాడారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ నిర్వహించిన సభలో గులాబీ దళపతి..మాజీ సీఎం కేసీఆర్ తన సుదీర్ఘ ప్రసంగంలో బీసీల ఊసే ఎత్తకపోవడం శోచనీయమన్నారు. తెలంగాణ ఉద్యమం తరహాలో..రాష్ట్రంలో బీసీ వాదం రోజురోజుకు పెరిగిపోతుంటే..బీసీల్లో వచ్చిన చైతన్యం చూసిన కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో బీసీలకు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లను అసెంబ్లీలో ప్రవేశపెడుతూ..చట్టం చేశారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ 18 నెలల పాలనలో ప్రతి అంశంపై మాట్లాడిన కేసీఆర్..బీసీల ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదని..బీసీలు అంటే కేసీఆర్ కు అంతా అలుసా అని మహేందర్ గౌడ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని ప్రశ్నించిన కేసీఆర్..బీసీల హక్కులు, డిమాండ్లపై ఎందుకు నిలదీయలేదన్నారు. బీసీ బిల్లు అమలుపై ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించాల్సి ఉండాల్సిందన్నారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు కోసం న్యాయ నిపుణులతో చర్చించి..బీసీ బిల్లు అమలు చేయడంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నందున కేసీఆర్ తన వైఖరిని స్పష్టం చేస్తే బీసీలు హర్షించే వారని తెలిపారు. బీసీ బిల్లును గవర్నర్ వద్దకు పంపకుండా..కేంద్రానికి పంపి చేతులు దులుపుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తే.. బీసీల్లో మరింత ఆత్మవిశ్వాసం పెరిగేదన్నారు. బీహార్, తమిళనాడు ప్రభుత్వాలు గతంలో అనుసరించిన విధాన ప్రక్రియను ఇక్కడ కూడా పాటించాలని, ప్రభుత్వానికి సూచనలు, సలహాలు కేసీఆర్ ఇవ్వాల్సిందన్నారు. తమిళనాడులో రిజర్వేషన్లు పెంచినప్పుడు..బిల్లులు పాస్ చేయడానికి చట్టాలు చేసినప్పుడు..మొదట జీవోలు జారీచేసి ఉద్యోగాలు భర్తీ చేశారన్నారు. తెలంగాణలో బీసీ బిల్లు అమలు కాకుండా ఉండేందుకు కొందరు కోర్టుకు వెళితే..సుప్రీంకోర్టు రిజర్వేషన్లను కొట్టివేస్తే..అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చి సవరణ చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచిస్తే..బీసీలు..బీఆర్ఎస్ ను ఆదరించేవారన్నారు. బీసీల ప్రస్తావన లేకపోవడంతో..బీసీలు..కేసీఆర్, బీఆర్ఎస్ పట్ల ఆగ్రహంగా ఉన్నట్లు వేముల మహేందర్ గౌడ్ తెలిపారు.

బీసీలంతా ఐక్యంగా పోరాడితేనే బీసీ బిల్లు సాధ్యం

బీసీలంతా ఐక్యంగా పోరాడితేనే బీసీ బిల్లు సాధ్యం

-వేముల మహేందర్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

కులాలకతీతంగా, పార్టీలకతీతంగా బీసీలంతా ఏకమై ఐక్యంగా పోరాడితేనే పార్లమెంటులో బీసీ బిల్లు సాధ్యమవుతుందని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ అన్నారు. శనివారం ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల కోటాలో బీసీలకు కల్పించిన 42 శాతం రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ఆమోదించి, 9వ షెడ్యూల్లో చేర్చాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అడుక్కుంటే వచ్చేది బిచ్చం..పోరాడితే సాధించుకునేది మన వాటా అని అన్నారు. బీసీలు ఉవ్వెత్తున ఉద్యమాలు చేసినప్పుడే రాజ్యాధికారం సాధించుకుంటామన్నారు. బీసీలంతా ఐక్యంగా ఉన్నప్పుడే బీసీ బిల్లుకు న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీసీల పక్షపాతేనన్నారు. దేశంలో బీసీ వాదం బలంగా ఉందని, బీసీలు అగ్గిరాల్చితే అందరూ భయపడతారన్నారు. తమిళనాడులో దివంగత జయలలిత మాదిరిగా మనం కూడా మిలిటెంట్ పోరాటాలు చేయాలన్నారు. రాజ్యాంగ స్వరూపాన్ని మార్చైన మన రిజర్వేషన్లను సాధించుకోవాలని, బీసీ బిల్లు కోసం పార్లమెంట్ సభ్యులతో చర్చించాలని, బీసీలు అంటే ఓట్లు వేసే యంత్రాలు, పార్టీల జెండాలు మోసే కార్యకర్తలుగా మిగలవద్దన్నారు. బీసీలు బిచ్చగాళ్లు కాదు..రాజ్యాధికారం వైపు పయాణించే బ్రిలియంట్ క్యాస్ట్ అని తెలిపారు.

బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు తీరని అన్యాయం.!

బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

-బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2025-2026 సంవత్సరానికి ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో బీసీలకు తీవ్రమైన అన్యాయం చేసిందని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ ఆరోపించారు. గురువారం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.3,04,965 కోట్ల మొత్తం బడ్జెట్లో 56 శాతం పైగా ఉన్న బీసీలకు కేవలం ముష్టి వేసినట్లు 3.6 శాతం రూ.11,405 ఓట్లు కేటాయించి బీసీలను అవమానపరిచారని ఆయన మండిపడ్డారు. బీసీలకు కేటాయించిన ఈ బడ్జెట్ బీసీలకు ఏ విధంగా..ఏ మేరకు..ఏ మూలకు సరిపోతాయో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు చెప్పాలని మహేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీలకు స్థానిక సంస్థల్లో మరియు విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదింప చేసిన మీరు..బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం ఎందుకింత వివక్షత చూపుతున్నారని ప్రశ్నించారు. బడ్జెట్లో బీసీలకు ఇంత తక్కువ నిధులు కేటాయించడంలో ఆంతర్యం ఏమిటని..ఇది వివక్షత కాదా..? అని ప్రశ్నించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం ప్రతి సంవత్సరం బీసీలకు 20 వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చడం సరికాదన్నారు. బడ్జెట్ ను సవరించైనా సరే బీసీలకు బడ్జెట్ పెంచాలని మహేందర్ గౌడ్ డిమాండ్ చేశారు.

తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ చారిత్రక ముందడుగు.

తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ చారిత్రక ముందడుగు

కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్‌లో చేర్చాలి బీసీ జేఏసీ

మంచిర్యాల,నేటి ధాత్రి:

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ నేడు బిల్లు ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీకి,ముఖ్యంగా రాహుల్ గాంధీకి మరియు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని బిసి జేఏసీ,మంచిర్యాల జిల్లా కమిటీ నాయకులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరియు దేశవ్యాప్తంగా సామాజిక న్యాయాన్ని సాధించేందుకు పోరాటం చేస్తున్న అన్ని బీసీ సంఘాల విజయమని,బీసీల హక్కుల కోసం కృషి చేస్తున్న వారందరికీ ఇది గర్వకారణమన్నారు.ఈ బిల్లు ద్వారా స్థానిక సంస్థలు,విద్యా మరియు ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కలగనుండటం ఒక చారిత్రక ముందడుగు అవుతుందని,దేశవ్యాప్తంగా బీసీ సామాజిక న్యాయ ఉద్యమానికి బలాన్ని చేకూర్చే మైలురాయిగా నిలుస్తుందనీ,బీసీ జేఏసీ తరఫున ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వ పరిమితులలోనూ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ,దేశవ్యాప్తంగా బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు మేము నిరంతర పోరాటం కొనసాగిస్తామన్నారు.రిజర్వేషన్ బిల్లుకు న్యాయస్థానాల్లో ఆటంకాలకు అవకాశమున్నందున,దీన్ని భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలనీ,అప్పుడే ఈ చట్టాన్ని న్యాయపరమైన సవాళ్ల నుండి రక్షించవచ్చునని,ఇది బీసీలకు న్యాయమైన ప్రాతినిధ్యం అందించడంలో కీలక పాత్ర పోషితుందనీ,అసెంబ్లీ లో కాంగ్రెస్ పార్టీ,బీసీ లకు విద్య,ఉద్యోగ,స్థానిక సంస్థల రిజర్వేషన్ 42% శాతం కల్పిస్తూ బిల్లు ను పెట్టి,తెలంగాణ లోని బీసీ ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ కి ధన్యవాదములు తెలియ జేస్తూన్నామనీ బీసీ జేఏసీ,మంచిర్యాల జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు
ఒడ్డేపల్లి మనోహర్ అన్నారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ సేవ దళ్ నాయకులు,బీసీ నాయకులు డా.నిలకంటేశ్వర్,బీసీ జేఏసీ జిల్లా నాయకులు,డా.రాజకిరణ్,బీసీ జేఏసీ జిల్లా నాయకులు గుమ్ముల శ్రీనివాస్,తీన్మార్ మల్లన్న టీమ్ జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ,బీసీ జేఏసీ నాయకులు రాజన్న యాదవ్,పిట్టల రవీందర్,పెద్దల్ల చెంద్రకాంత్,ఎండీ లతీఫ్, భీమాసేన్,చెంద్రగిరి చెంద్రమౌళి,పిట్టల తిరుపతి,తీన్మార్ మల్లన్న టీమ్ జిల్లా సభ్యులు
దినకర్,దీపక్,సాయిరాం తదితరులు పాల్గొన్నారు.

బిసిల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.

*ప్రభుత్వ పథకాలపై, వాటి అమలుపై ప్రజలకు అవగాహన కల్పించాలి.

*పేద బడుగు బలహీన బీసీలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు బీసీ కార్పొరేషన్ నుండి అర్హులైన బీసీలకు రుణాలు అందిస్తున్నాం.

*ఖాదీ వస్త్రాలు ధరించేలా ప్రజల్లో అవగాహన కల్పించి ఖాదీ వస్త్రాలను ప్రోత్సహించాలి.

*రాష్ట్ర బీసీ సంక్షేమ,ఆర్థిక వెనుకబడిన తరగతుల మరియు చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు ఎస్. సవిత.

తిరుపతి(నేటి ధాత్రి)ఫిబ్రవరి08:

బిసిల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందనీ, అధికారులు ప్రభుత్వ పథకాలపై,వాటి అమలుపై ప్రజలకు అవగాహన కల్పించాలనీ, పేద బడుగు బలహీన బీసీలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు బీసీ కార్పొరేషన్ నుండి అర్హులైన బీసీలకు రుణాలు అందిస్తున్నామని, ఖాదీ వస్త్రాలు ధరించేలా ప్రజల్లో అవగాహన కల్పించి ఖాదీ వస్త్రాలను ప్రోత్సహించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ,ఆర్థిక వెనుకబడిన తరగతుల మరియు చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు ఎస్. సవిత పేర్కొన్నారు.
శనివారం సాయంత్రం బీసీ సంక్షేమ, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు శాఖాపరమైన సమీక్ష సమావేశం తిరుపతి శ్రీ పద్మావతి అతిథి గృహం నందు బీసీ సంక్షేమ, బీసీ కార్పొరేషన్, చేనేత జౌళి శాఖ, ఆప్కో అధికారులతో నిర్వహించారు.
మొదటగా తిరుపతి జిల్లా నందు బీసీ సంక్షేమ వసతి గృహాల మరమ్మత్తులకు ప్రభుత్వం విడుదల చేసిన 85.5 లక్షల రూపాయలకు అదనంగా జిల్లా కలెక్టర్ సహకారంతో నిధులను చేకూర్చుకుని అన్ని ప్రభుత్వ వసతి గృహాలకు మరమ్మత్తులు చేయించాలని ఆదేశించారు.
అనంతరం ప్రభుత్వ బిసి ప్రీ-మెట్రిక్ వసతి గృహాలలోని పదవ తరగతి విద్యార్థులు 100 శాతం ఫలితాలు సాధించే దిశగా హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, ట్యూటర్స్, జిల్లా అధికారులు కృషి చేయాలని మరియు పదవ తరగతి విద్యార్థులకు స్పెషల్ డైట్ సమకూర్చాలని ఆదేశించారు.ఈ విద్యా సంవత్సరానికి వసతి గృహాలకు సమకూర్చిన 20 ఇన్వర్టర్లతో పాటుగా అన్ని వసతి గృహాలకు ఇన్వర్టర్లు సరఫరా చేయాలని సమీక్ష సమావేశంలో నేరుగా రాష్ట్ర అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశించారు.
బీసీ కార్పొరేషన్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ ప్రభుత్వము అందజేస్తున్న సబ్సిడీ రుణాల గురించి విరివిగా ప్రచారం చేసి బలహీన వర్గాల ప్రజలకు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేయాలని ఆదేశించారు.
చేనేత జౌళి శాఖ అధికారులతో సమీక్షిస్తూ ప్రభుత్వ పథకాలను కింద స్థాయి బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందించడానికి సదరు పథకాలపై అవగాహన కొరకు ప్రాంతాల వారీగా సమావేశాలు నిర్వహించి ఖద్దరు వస్త్రాలు ధరించే విధంగా ఆరోగ్య, అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, తిరుపతి జిల్లా బీసీ సంక్షేమ మరియు సాధికార అధికారి చంద్రశేఖర్,బీసీ కార్పొరేషన్ కార్యనిర్వహణ అధికారిని శ్రీదేవి, చేనేత జౌళి శాఖ ఏడి వరప్రసాద్, తిరుపతి జిల్లా ఆఫ్కో అధికారి ఎన్ కోటేశ్వరరావు, బిసి సంక్షేమ డివిజనల్ అధికారులు జోత్స్న, లక్ష్మీనారాయణ, కృష్ణయ్య, వెంకటేశ్వర్లు మరియు పర్యవేక్షకులు సాయి తిరుమంగళం తదితరులు పాల్గొన్నారు.

కులగణన సర్వే మళ్ళీ చేపట్టాలి, బీసీలకు 42% శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి.

టిఆర్ఎస్ నియోజకవర్గ యువజన విభాగం వేములవాడ ఇన్చార్జి ఈర్లపల్లి రాజు డిమాండ్.

చందుర్తి, నేటిధాత్రి:

కులగణనను మళ్లీ సర్వే చేయాలి
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని మాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని టిఆర్ఎస్ నియోజకవర్గ యువజన విభాగం వేములవాడ ఇన్చార్జి ఈర్లపల్లి రాజు డిమాండ్ చేశారు. పోయిన సంవత్సరం ఎన్నికలకు ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సభ పెట్టి బీసీల రిజర్వేషన్లు పెంచుతామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని అన్నారు. ఉద్దేశపూర్వకంగానే బీసీ జనాభాను తగ్గించి చూపారు. 42 శాతం సీట్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అంటుంది. కేవలం స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాదు. చట్టబద్ధత కూడిన రిజర్వేషన్లను అమలు చేస్తేనే అన్నింట్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు అవుతాయి. జనాభాపరంగా దక్కాల్సిన రిజర్వేషన్లను అందకుండా చేసింది. బీసీలను మరోసారి మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరారు. తాజా కుల గణన ప్రకారం బీసీలు ఒక కోటి 85 లక్షల మంది ఉంటే దామాషా ప్రకారం 51 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి కానీ ఇటీవల సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీ జనాభా 46% ఉన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది ఇది కచ్చితంగా మోసమే 2014 నాటి సమగ్ర కుటుంబ సర్వేలో 56% ఉన్న బీసీలు తాజా సర్వే నాటికి ఇంత భారీగా ఎలా తగ్గుతారు కొత్త ఫార్మాట్లో బీసీ కులాలను చేపట్టాలి బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి లేదంటే ఉద్యమిస్తాం అని టిఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ అధ్యక్షులు ఈర్లపల్లి రాజు తెలియజేసారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version