వర్షాలు సకాలంలో కురవాలని సంకల్ప పూజ చేసిన బిజెపి నాయకులు
భూపాలపల్లి నేటిధాత్రి
సకాలంలో వర్షాలు పడి రాష్ట్రము దేశములోని ప్రజలు పశుపక్షాధులు సమస్త జీవకోటి సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని దొంగల రాజేందర్ అన్నారు ఈ సందర్భంగా భూపాలపల్లి సుభాష్ కాలనీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో వర్షాలు సకాలంలో కురవాలని బిజెపి పార్టీ నాయకులు ఆధ్వర్యంలో సంకల్ప పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ పూజా కార్యక్రమంలో వరుణ దేవుని యొక్క ఆశీర్వాదం కోసం వర్షాలు కురవాలని సీతారాములకు వాసు అయ్యగారుచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి సంకల్పం నెరవేరాలని సీతారాములను ప్రార్థించడం జరిగిందని అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలందరూ కూడా వర్షాల కోసం భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థించాలని అన్నారు సమృద్ధిగా వర్షాలు పడితే రైతులు మనకోసం పండించే పంట చేతికి వస్తుందని రైతుల ఆనందంగా ఉంటేనే సమస్త జీవకోటి ఆనందంగా ఉంటుందని కావున కనీసం మనం ప్రత్యక్షంగా రైతుల కోసం ఏమి చేయలేము కనీసం వర్షాలు పడాలని భగవంతుని ప్రార్థిస్తే రైతులకు అండగా ఉన్న వాళ్ళం అవుతామని అన్నారు ప్రకృతి సస్య శ్యామలంగా ఉండడంకోసం ప్రతి ఒక్కరూ ప్రకృతికి అనకూలంగా జీవించాలని అన్నారు ప్రకృతి ఆగ్రహిస్తే ప్రజలు సంతోషంగా జీవించలేరని అన్నారు వర్షాల కోసం ప్రతి ఒక్కరు భగవంతుని ప్రార్థించి భాగస్వాములు కావాలని ప్రజలను రాజేందర్ కోరారు ఈ కార్యక్రమంలో బట్టు రవి కంబాల రాజయ్య సామల మధుసూదన్ రెడ్డి తుమ్మేటి రామ్ రెడ్డి అజ్మీర రాజు నాయక్ కరివేద మనోహర్ రెడ్డి ఊరటి మునేందర్ కoచెం నరసింహమూర్తి గుండె శీను పొన్నాల కొమురయ్య తాండ్ర హరీష్ చెక్క శంకర్ శ్రీధర్ దొంగల కుమార్ తదితరులు పాల్గొన్నారు