వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు.

వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలోని ఆరుముల్ల ఎల్ల స్వామి కుమార్తె అరుణ్ జ్యోతి కిషోరల వివాహ మహోత్సవానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యేగండ్రసత్యనారాయణరావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు గ్రామ కమిటీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇందిరమ్మ లబ్ధిదారుల ఇళ్ల కట్టడాలను పరిశీలించిన.!

ఇందిరమ్మ లబ్ధిదారుల ఇళ్ల కట్టడాలను పరిశీలించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

కరక గూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి..

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రేగళ్ల గ్రామం లో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారి తనప సుశీల ఇళ్ల నిర్మాణ పనులు పరిశీలించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇళ్లను అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పరు బేస్ మీట్ వరకు పూర్తి చేసిన వెంటనే లక్ష రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని పేర్కొన్న వీలైనంత తొందరగా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాలను పూర్తి చేయాలని యజమానులు దగ్గరుండి మరి పరిశీలించి నాణ్యతగా కట్టుకోవాలని తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు
ఈ యొక్క కార్యక్రమంలో కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్ , మాజీ సర్పంచ్ పోలెబోయిన శ్రీ వాణి , తిరుపతయ్య గారు,యర్ర సురేష్ , రాందాస్ నాయక్ , కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, యువజన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

జమ్మూ కాశ్మీర్ లో హిందువులపై జరిగిన.

“జమ్మూ కాశ్మీర్ లో హిందువులపై జరిగిన తీవ్రవాదుల దాడిని ఖండిస్తు పాకిస్తాన్ దిష్టిబొమ్మ దగ్ధం

వర్ధన్నపేట (నేటిదాత్రి):

 

వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో జాతీయ రహదారిపై భారతీయ జనతా పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గం కన్వీనర్ చెంగల సురేష్ ఆధ్వర్యంలో జమ్ము కాశ్మీర్ పెహల్గాం లో హిందువులపై జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ పాకిస్తాన్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద సంస్థలు భారతదేశంలో హిందువుల పై దాడికి పాల్పడుతూ మరణకాండ సృష్టించడాన్ని ఆయన ఖండించారు. భారత దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు మత సంస్థలు ఉగ్రవాద సంస్థలకు అండగా నిలుస్తూ ఆశ్రయం కల్పిస్తూ ఉన్నాయని ఇప్పటికైనా వారు ఉగ్రవాదులకు సహాయం అందించడం ఆశ్రయం కల్పించడం మానుకోవాలని లేదంటే భవిష్యత్తులో వారికి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గట్టిగా బుద్ధి చెబుతుందని అదేవిధంగా పాకిస్తాన్ కి కూడా దీటైన సమాధానం ఇస్తుందని ఈట్ క జవాబు పత్తర్ సే దేంగే నినాదాన్ని చేసి చూపెడతారని మహేందర్ రెడ్డి అన్నారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి జడ సతీష్ మాట్లాడుతూ పాకిస్తాన్ ఇప్పటికైనా తన బుద్ధి మార్చుకోవాలని లేదంటే సరైన సమాధానం చెబుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి పింగిలి సంపత్ రెడ్డి. ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బర్ల నవీన్. పింగిలి రాజేందర్. రెడ్డి ఇటికాల ప్రశాంత్. చిర్రా కిరణ్. ఏబీవీపీ నాయకులు బెల్లం కార్తీక్. వడ్డే శ్రీకాంత్. గోరుకంటి శివ. బండారి రేవంత్. చిర్ర రాకేష్. వేము నూరి నాగరాజు. హరీష్. మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

కేసీఆర్ సభను విజయవంతం చేద్దాం..

ఇంటికో యువకుడు..ఊరికో బస్సుతో దండుగా కదిలి..కేసీఆర్ సభను విజయవంతం చేద్దాం

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

-బీఆర్ఎస్ ఎస్సీ సెల్ నాయకుడు నేర్పటి శ్రీనివాస్

ఈనెల 27న జరగబోయే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ఇంటికో యువకుడు..ఊరుకో బస్సుతో దండుగా కదిలి..కేసిఆర్ సభను కనివిని ఎరుగని రీతిలో విజయవంతం చేసి..అవినీతి కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ మండల నాయకుడు నేర్పటి శ్రీనివాస్ యువతకు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 60 ఏళ్ళ తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షల ప్రతిరూపంగా 2021 ఏప్రిల్ లో ఆవిర్భవించిన టిఆర్ఎస్ తో తెలంగాణ ఉద్యమాన్ని దేశానికి దిక్సూచిగా నిలిపి..తెలంగాణ ప్రజలను ఏకతాటిపైకి తెచ్చి..ఎన్నో కష్టనష్టాలకు, అవమానాలకు, అణచివేతకు వెనుకడుగు వేయకుండా..ప్రజలను అంటిపెట్టుకొని..రాష్ట్ర సాధనకై అలుపెరుగని పోరాటం చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని ఆయన కొనియాడారు. నాడు స్వరాష్ట్ర సాధనకై జరిగిన ఉద్యమంలో..ఆ తర్వాత 10 ఏండ్లు అధికారంలో..నేడు ప్రతిపక్షంలో తెలంగాణ ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా ప్రజలకు అండగా నిలబడ్డది కేసీఆర్ స్థాపించిన టిఆర్ఎస్ పార్టీ, గులాబీ జెండా మాత్రమేనన్నారు. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం..పదేళ్ల పాలన..మేలవింపు తెలంగాణ గుండె చప్పుడుగా నిలిచిన టిఆర్ఎస్ పార్టీ..ఉద్యమం పిడికిలెత్తి రజతోత్సవ వేడుకలకు సిద్ధమవుతుందన్నారు. టిఆర్ఎస్ 25 ఏళ్ల మహా ప్రస్థానం సందర్భంగా ఈనెల 27న మరో అద్భుతం ఆవిష్కృతం కానుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది ప్రజా పాలన కాదని, రాక్షస పాలన అని, దాన్ని తిప్పికొట్టేందుకు ప్రజలకు రజతోత్సవ సభ భరోసానిస్తుందన్నారు.

రజతోత్సవ సభను విజయవంతం చేయండి.!

బి.ఆర్.ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయండి

సిరిసిల్ల టౌన్ : (నేటిధాత్రి)

 

 

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని 37వ వార్డులో మాజీ కౌన్సిలర్ రెడ్డి మాధవి రాజు ఆధ్వర్యంలో ఈరోజు సిరిసిల్ల పట్టణంలో డప్పు సప్పులతో ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి ఆహ్వాన పత్రికను అందించి కుటుంబ సమేతంగా తేది:27-4-24 ఆదివారం రోజున జరగబోయే భారత రాష్ట్ర సమితి పార్టీ 25వ వేడుకల సందర్భంగా రజతోత్సవ సభను విజయవంతం చేయవలసిందిగా కోరడం జరిగినది. అంతే కాకుండా భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాటలు విని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా సవినాయంగా వార్డు ప్రజలను కోరుతూ ఆహ్వాన పత్రిక అందించడం జరిగినది.ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధి గా భారత రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాజా మాజీ చేనేత, జౌలి మరియు టెక్స్ టైల్స్ కార్పొరేషన్ అధ్యక్షులు గూడూర్ ప్రవీణ్, సిరిసిల్ల పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు బత్తుల వనజ రమేష్, 37.వ వార్డు బి.ఆర్.యస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి,కూరపాటి భూమేష్, బూత్ అధ్యక్షులు వేముల తిరుపతి, మహిళా విభాగం వార్డు అధ్యక్షులు ముదారపు లలిత రాజేశం, కమిటీ సభ్యులు, ఎక్కల దేవి శ్యామల, గంగుల సదానందం, మచ్చ సురేష్, గాజుల ఎల్లయ్య, జిందం రాజేశం, బోద్దుల రమేష్, పచ్చనూరు తిరుపతి, గజ్జల లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు అందాలి.

అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు అందాలి

లబ్ధిదారులకు ఇసుక ఉచితం.. రవాణా ఛార్జీలు చెల్లించాలి
పైలట్ ప్రాజెక్ట్ గ్రామాలు, వార్డుల్లో లక్ష్యం పూర్తి చేయాలి
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్ : (నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. పైలెట్ ప్రాజెక్ట్ గ్రామాలు, వార్డుల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిపై జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి బుధవారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని మండలాలు, మున్సిపాలిటీల వారిగా ఇండ్ల నిర్మాణాల పురోగతి పై ఆరా తీశారు. ఎందుకు లక్ష్యం చేరుకోలేదో వివరాలు అడిగి తెలుసుకొని, త్వరగా ఎలా పూర్తి చేయాలో సూచనలు చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఆశయమని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల గ్రామ, కమిటీలు గుర్తించిన వారితో పాటుగా ఎవరైనా నిరుపేదలు ఉంటే పూర్తి వివరాలు తీసుకొని ఇండ్లు ఇవ్వాలని సూచించారు. గ్రామాలు, వార్డుల్లో గతంలో నిర్మించి మధ్యలో వదిలేసిన గృహాలను ఇందిరమ్మ ఇండ్ల పథకంలో చేర్చవద్దని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వాటిపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని వివరించారు.

Collector

 

 

 

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇస్తుందని తెలిపారు. రవాణా ఛార్జీలు మాత్రమే లబ్దిదారు చెల్లించాలని పేర్కొన్నారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక అయిన గ్రామాలు, వార్డుల్లో లక్ష్యం మేరకు నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మేరకు అధికారులు సమన్వయంతో పని చేసి ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని తెలిపారు.
గ్రామాలు, మున్సిపాలిటీలలో అధికారులు నిత్యం క్షేత్ర స్థాయిలో పర్యటించి, అర్హులకు ఇండ్ల నిర్మాణాలపై సూచనలు అందించాలని, పనులు వేగంగా పూర్తి అయ్యేలా చూడాలని ఆదేశించారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతి, సర్వే వివరాలు ప్రతి రోజూ సాయంత్రం తమకు పంపించాలని కలెక్టర్ సూచించారు.వీడియో కాన్ఫరెన్స్లో జడ్పీ సీఈవో వినోద్ కుమార్, డీఆర్డీఓ శేషాద్రి, పీడీ హౌసింగ్ శంకర్, డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్లు శంకుస్థాపన, కళ్యాణ లక్ష్మి పంపిణీ.!

ఇందిరమ్మ ఇళ్లు శంకుస్థాపన, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ

పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా ఎన్నుకున్న లింగగూడెం గ్రామ పంచాయతీ కేంద్రంలో మంగళవారం ఇందిరమ్మ ఇల్లులు శంకుస్థాపన చేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు . ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇల్లు ఇపిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం కూడా అందరూ వినియోగించుకోవాలని యువత కు చాలా ఉపయోగ కరమయిన పథకం అని తెలియజేసారు. ఈ మధ్య ప్రవేశ పెట్టిన భూ భారతి పథకం ద్వారా ఎలాంటి భూమి సమస్యలు ఉన్న పరుష్కరించ పడతాయని పూర్వం ఉన్న ధరణి పథకం ద్వారా అనేక మంది ప్రజలు ఇబందులు పడ్డారని భూభారతి ద్వారా అలాంటి సమస్యలన్నీ పరిష్కారం దొరుకుతుంది అని ఏ సమస్య ఉన్న ఎమ్మార్యో ని సంప్రదించండి అని తెలియజేసారు. నన్ను గెలిపించినందుకు అనుక్షణం మీ కోసం పని చేస్తానని ఎలాంటి సమస్య ఉన్న నన్ను సంప్రదించండి అని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకున్న లింగగూడెం గ్రామ పంచాయతీ రాష్ట్రానికే మార్గదర్శకంగా నిలవాలని అధికారులు కూడా అందుకు అనుకూలంగా పని చేయాలనీ ఆదేశాలిచారు. అనంతరం కళ్యాణి లక్ష్మి అర్హులైన వారికి మొత్తంగా రు.27,03132 (ఇరవై ఏడు లక్షల మూడు వేల నూట ముప్పై రెండు రూపాయలు ) అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో మండల అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొడెం ముత్యమాచారి, పిఎస్ఆర్,పీవీఆర్ యువసేన కో-ఆర్డినేటర్ ఎస్కె ఖదీర్, మాజీ ఎంపీపీ చాట్ల పద్మ, ఏఏంసి డైరెక్టర్ ఊకె బుచ్చయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దార అశోక్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

రైతులు కొనుగోలు కేంద్రాలనుసద్వినియోగం చేసుకోవాలి. పి ఏ సి ఎస్ చైర్మన్ సంపెల్లి నరసింగరావు …………

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

మొగుళ్ళపల్లి మండలంలోని వివిధ గ్రామాలలోరంగాపురం, ఇస్సిపేట, మొగుళ్ళపల్లి, కొరికిశాల, మొట్లపల్లి గ్రామాలలో. ధాన్యం కొనుగోలు కేంద్రాలను భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు పిఎసి ఎస్ చైర్మన్ సంపెల్లి నరసింగరావు తో కలిసి ముందుగా తూకానికి కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ధాన్యాన్ని తూకం వేశారు . అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తరుగు పేరుతో రైతులను మోసం చేస్తే సహించేది లేదని రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సూచించిన కొనుగోలు కేంద్రాలలో విక్రయించిన రైతులకు మద్దతు ధరతో పాటు ప్రభుత్వం అందిస్తున్న 5 వందల బోనస్ పొందాలని రైతులు ధాన్యంలో. తాలు, మట్టి గడ్డలు లేకుండా.

 

MLA

తెమ శాతం తక్కువగా ఉండేవిదంగా చూసుకోవాలి. పిఎసిఎస్ సిబ్బంది హమాలీల కొరత లేకుండా ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించిన మిల్లులకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించాలని మీ ఇష్టానుసారం మిల్లులకు తరలించి రైతులకు ఇబ్బందులు కలిగిస్తే ఆ మిల్లులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈగతసీజన్ లో జిల్లాలో రైతులకు 30 కోట్ల బోనస్ ఇచ్చామని రైతులవద్ద ధాన్యం కొనుగోలు చేసిన పది రోజుల్లో. ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందని కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఇక్కడ ప్రభుత్వం నిబంధనలు పాటిస్తూ. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని రైతు సంక్షేమమే ప్రభుత్వ ద్యేయమని, అధికారులకు సూచించారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డీఓ. రవి, తహసీల్దార్, జాలి సునీత, ఎంఎఓ. సురేందర్ రెడ్డి, చిట్యాల ఎఎంసి చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, పిఎసిఎస్ చైర్మన్ సంపెల్లి నర్సింగారావు, మోటె ధర్మారావు, తక్కళ్లపెల్లి రాజు,క్యాతరాజు రమేష్, పోల్నేని లింగారావు, బక్కిరెడ్డి, శివారెడ్డి, గుండారపు తిరుపతి, లింగయ్య, సొసైటీ డైరెక్టర్లు నాయకులు రైతులు పాల్గొన్నారు.

పేద కుటుంబాలకు అండగా ప్రజా ప్రభుత్వం.

పేద కుటుంబాలకు అండగా ప్రజా ప్రభుత్వం

సన్న బియ్యం పంపిణీ పేదలకు వరం

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని

సన్నబియ్యం పంపిణీ నిరుపేదలకు వరంగల్ మారిందని

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో దళిత కుటుంబానికి చెందిన దారకొండ నాగరాజు నివాసంలో గ్రామానికి చెందిన నాయకులతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలందరికీ పూర్తిస్థాయిలో ఆహార భద్రత కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయడం దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించ బడిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు

విద్యార్థులు ఇష్టపడి చదవాలి పాఠశాల.!

విద్యార్థులు ఇష్టపడి చదవాలి పాఠశాల వార్షికోత్సవంలో ఎమ్మెల్యే జీఎస్సార్

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలంలో ఈరోజు మంగళవారం భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో ప్రాథమికొన్నత పాఠశాల, గణపురం మండలంకేంద్రంలోని మోడల్ స్కూల్
ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగిన పాఠశాలల వార్షికోత్సవ వేడుకల్లో భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు.విద్యార్థుల నృత్యాలు, కోలాటాలు చాలా ఆకర్షించాయి. ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతీ ఏడాది పాఠశాలల్లో నిర్వహించే వార్షికోత్సవాలు బడి పట్ల విద్యార్థుల్లో నమ్మకం, విశ్వాసాన్ని నింపుతాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రులతోడ్పాటు ఉంటే అద్భుతాలను సృష్టిస్తారన్నారు.

 

MLA

తల్లిదండ్రులు పిల్లలకు ప్రతీ రోజు కొంత సమయం కేటాయించి, వారితో విద్యాపరమైన సామాజిక అంశాలపై చర్చించడం ద్వారా వారిలో భయం పోతోందన్నారు. చదవుతో పాటు ఆటపాటలు కూడా చాలా అవసరం అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. ప్రతి విద్యార్థి తమ లక్ష్యాలను ఎంచుకొని ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరారు.విద్యార్థుల కళా ప్రదర్శన అద్భుతంగా ఉందని అన్నారు.చెల్పూర్ పాఠశాలలో వాష్ రూమ్స్ పాఠశాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తాను అన్నారు.పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు టెంకాయ కొట్టి ఇట్టి నిర్మాణ పనులను ప్రారంభించాలని చెప్పారు. గణపురం మండలం మోడల్ పాఠశాలలో డైనింగ్ హాల్, సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు.అనంతరం పోటీ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉపాధ్యాయులను శాలువాతో సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీమతి విజయలక్ష్మి , జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ , మండల ఎంపిడిఓ ఎల్ భాస్కర్ ,ఉపాధ్యాయులు , విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

భాధిత కుటుంబాన్ని పరామర్శించిన సోదా.

భాధిత కుటుంబాన్ని పరామర్శించిన సోదా

 

పరకాల నేటిధాత్రి

 

పరకాల మున్సిపల్ పరిధిలోని 11వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పసుల అన్న స్వామి అన్న పసుల సాంబయ్య సోమవారం రోజున అనారోగ్యంతో మరణించడం జరిగింది.వారి పార్థివ దేహానికి పూలమాలవేసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ పరామర్శలో సమన్వయ కమిటీ సభ్యులు మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్ పసుల రమేష్,ఏకు రాజు,నాయకులు కొయ్యడ చందర్,రవి తదితరులు పాల్గొన్నారు.

27 న రజతోత్సవ సభను విజయవంతం చేయండి.

27 న రజతోత్సవ సభను విజయవంతం చేయండి

బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మోతె కర్ణాకర్ రెడ్డి

గణపురం నేటి ధాత్రి

 

 

 

గణపురం మండలం కొండాపూర్ వెంకటేశ్వర్ పల్లె గ్రామాలలోభూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహా సభకు అధిక సంఖ్యలో పాల్గొనేలా కార్యకర్తల ను సమాయత్తం చేస్తూ రోజు ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న గణపురం మండల పార్టీ మండల అధ్యక్షులు మోతె కరుణాకర్ రెడ్డి

పార్టీ రజతోత్సవ సభకు భారీ ఎత్తున పాల్గొనాలి.

బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు భారీ ఎత్తున పాల్గొనాలి……

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ తంగళ్ళపల్లి మండల ఆఫీసులో ఏర్పాటు చేసిన సమావేశంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 27.వ .తారీఖున వరంగల్ కేంద్రంలో ఏర్పాటు చేసిన రజదోత్సవ సభ సమావేశంలో మండల కేంద్రం నుంచి కనీసం 300 నుంచి పైనే కార్యకర్తలు పాల్గొనాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ జాతిపిత కెసిఆర్ ప్రవేశపెట్టిన సభకు పెద్ద ఎత్తున మండలం నుండి పార్టీ కార్యకర్తలు పాల్గొని సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు మండల అధ్యక్షుడు రాజన్న పట్టణ శాఖ అధ్యక్షులు జగన్ ఆధ్వర్యంలో సభకు వచ్చే వారి జాబితాను సిద్ధం చేస్తూ వారికి అవగాహన సదస్సు నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ఎగుడు మామిడి వెంకట రమణారెడ్డి పడిగల రాజు తంగళ్ళపల్లి మాజీ సర్పంచ్ రవి అనిత వెంగళ రమేష్ కందుకూరి రామ గౌడ్ మహిళా మాజీ సర్పంచ్ కోడం సంధ్యారాణి మహిళా నాయకురాలు పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఓబులాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడి రాజీనామా.

ఓబులాపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడి రాజీనామా

మల్లాపూర్ ఏప్రిల్ 18 నేటి ధాత్రి

 

కాంగ్రెస్ పార్టీ కోరుట్ల కాంసెన్సీ ఇంచార్జ్ జువ్వడి నర్సింగ రావు గారు, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను కలుపుకోలేక పోతున్నారు మల్లాపూర్ మండలంలో పది సంవత్సరాలు కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్య కర్తలు తీవ్ర ఆవేదనలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వారందరికీ న్యాయం చేయాలని కోరుకుంటూ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నేను గత పది సంవత్సరాలుగా పార్టీ కోసం పైసలు ఖర్చు పెట్టుకున్నాను కష్టపడ్డాను ఫలితంగా నాకు అవమానాలే ఎదురు అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నర్సింగరావు గారు నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పట్టించుకోకపోవడంలేదు నిరసన గా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని తెలియపరుస్తున్నాను
పల్లె శేఖర్ ముదిరాజ్.
.

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ).!

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)కరీంనగర్ నగర నూతనకమిటీఎన్నిక

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

సిపిఐ కరీంనగర్ నగర 11వ మహాసభలో నగర నూతన కమిటీని శుక్రవారం రోజున ఎన్నుకోవడం జరిగిందని సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. సిపిఐ నగర కార్యదర్శిగా కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శులుగా పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజు, కోశాధికారిగా బీర్ల పద్మలతో పాటు పదకోండు మంది కార్యవర్గ సభ్యులు ఇరవై తోమ్మిది మంది కౌన్సిల్ సభ్యులను నూతనంగా ఎన్నుకోనైనదని వారు తెలిపారు. నూతనంగా ఎన్నికైన వారు మాట్లాడుతూ నగరంలో సిపిఐ పార్టీని వాడవాడనా బలోపేతం చేస్తూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ జెండా మున్సిపల్ పై ఎగిరే విధంగా పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేస్తామన్నారు. నగరంలో అభివృద్ధి పనుల్లో పూర్తిగా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని వీటిపై రానున్న కాలంలో ఉద్యమాలు చేస్తామని వారు పేర్కొన్నారు. నగరంలో వేలాది మంది ప్రజలు ఇండ్లు లేక కిరాయి ఇండ్లలో ఉంటూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇండ్లులేని నిరుపేదలకు ఇండ్లు వచ్చేంతవరకు పోరాటాలు చేస్తామని, రేషన్ కార్డులు,పెన్షన్లు ఇతర సంక్షేమ పథకాలన్నీ పేద ప్రజలకు అందేందుకు కృషి చేస్తామన్నారు. ఎన్నికకు సహకరించిన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకట్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామికి ధన్యవాదాలు తెలియజేశారు.

రజతోత్సవ సభను విజయవంతం చేయాలి.

బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి.
మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తక్కలపెల్లి చందర్ రావు

నేటిధాత్రి అయినవోలు :-

 

 

 

 

వర్ధన్నపేట నియోజకవర్గం అయినవోలు మండలం ఉడుతగూడెం గ్రామంలో శనివారం టిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు తోట రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగిన టిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నందనం సొసైటీ వైస్ చైర్మన్ తక్కలపల్లి చందర్ రావు మాట్లాడుతూ ఈనెల 27వ తేదీన ఎలుకతుర్తి ఎక్స్ రోడ్డులో నిర్వహించే బిఆర్ఎస్ పార్టీ రచతోత్సవ సభకు గ్రామంలో అధిక సంఖ్యలో హాజరై సభ విజయవంతం అయ్యేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని రానున్న రోజుల్లో బి. ఆర్. ఎస్. అధినేత కేసీఆర్ తప్పకుండా ముఖ్యమంత్రి అవుతున్నారని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ టిఆర్ఎస్ ఇన్చార్జి కట్కూరి రాజు మండల నాయకుడు కొమురయ్య, దేవదాసు ఆకారపు యాదవ రెడ్డి ప్రతాపరెడ్డి చంద్రారెడ్డి సుదర్శన్ రెడ్డి రమేష్ నరేష్ రవి వీరస్వామి రవి యాదగిరి శీను అనిల్ మల్లయ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

రజితోత్సవ సభను విజయవంతం చేయండి

రజితోత్సవ సభను విజయవంతం చేయండి

జైపూర్,నేటి ధాత్రి :

లక్షలాదిగా తరలి వచ్చి బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని చెన్నూరు నియోజకవర్గం బీఆర్ఎస్ శ్రేణులు కోరారు.స్థానిక నియోజకవర్గం కోటపల్లి మండలంలోని సర్వాయిపేట గ్రామంలో బీఆర్ఎస్ చలో వరంగల్ బహిరంగ సభ వాల్ పోస్టర్లను శుక్రవారం విడుదల చేశారు.చలో ఎల్కతుర్తి,వరంగల్ భారీ బహిరంగ సభ ఏర్పాట్లలలో భాగంగా వివిధ కార్యక్రమాలు నియోజవర్గ పరిధిలో చేపడుతున్నమన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దపల్లి మాజీ పార్లమెంటు సభ్యులు,మాజీ ప్రభుత్వ విప్,బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 27 న వరంగల్ లో జరిగే బహిరంగ సభకు లక్షలాదిగా జనం తరలి రావాలన్నారు.పార్టీ ఏర్పడి విజయవంతంగా రెండు దశాబ్దాల నర పూర్తయిన సందర్భంగా 25 సంవత్సరాల గులాబీ పండుగ వేడుకల్లో ప్రతి ఒక్కరూ తరలి రావాలని నియోజకవర్గ ప్రజలను కోరారు.ఉద్యమ స్ఫూర్తితో ఓరుగల్లుకు దండై కదులుదామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా బాపు నాయక్,రాజ్ కుమార్ యాదవ్,దుర్గం రాజేందర్,దుర్గం సంపత్,సప్ప భాస్కర్,జిమిడి సాగర్,దుర్గం రోహిత్,జిమిడి చంద్రయ్య,బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

రేవంత్ ఏడాదిన్నర పాలనలో..పుష్ప, హైడ్రా, మూసీ.!

రేవంత్ ఏడాదిన్నర పాలనలో..పుష్ప, హైడ్రా, మూసీ తప్ప ఏం లేదు

-బిజెపి మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు మోరే వేణుగోపాల్ రెడ్డి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీల హామీలంటూ అర చేతిలో స్వర్గం చూపించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అన్ని మరిచిపోయిందని బిజెపి మొగుళ్ళపల్లి మండల అధ్యక్షుడు మోరే వేణుగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడాదిన్నర పాలనలో పుష్ప, హైడ్రా, మూసీ, హెచ్ సీ యూ మీద పడ్డారే తప్పితే ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలో అసమర్థ, అవినీతి, అసత్య ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. ఆర్థిక క్రమశిక్షణ లేని జీరో పరిపాలన సాగుతోందని..ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, విద్యా భరోసా కార్డు, చేయూత, ఆరోగ్యశ్రీ, లక్ష రూపాయలు, తులం బంగారం..ఇలా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ విస్మరించారని విమర్శించారు. రాను రాను సీఎం రేవంత్ రెడ్డి గ్రాఫ్ పడిపోతుందని, రేవంత్ రెడ్డి ని కేసీఆర్ జైలులో వేస్తే..రేవంత్ కనీసం ఆ ప్రయత్నం కూడా చేయడం లేదని విమర్శించారు.

యూత్ రాష్ట్ర అధ్యక్షులుగా అంబాల అనిల్ ఎన్నిక.

విసికె పార్టీ యూత్ రాష్ట్ర అధ్యక్షులుగా అంబాల అనిల్ ఎన్నిక.

చిట్యాల, నేటిధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని టేకుమట్ల మండలం లోని అంకుశపూర్ గ్రామానికి చెందిన అనిల్ కుమార్ ను విముక్త చిరుతల కచ్చి పార్టీ తెలంగాణ రాష్ట్ర యూత్ యువజన రాష్ట్ర అధ్యక్షుడిగా తమిళ నాడు లోని చిదంబరం పార్లమెంట్ సభ్యులు తిరుమవళవన్ నియమించారు. వారు మాట్లాడుతూ యువతీ యువకులు ఎదుర్కొంటున్న సమస్యల మీద పోరాడాలని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు సాధించే దిశగా ముందుకు సాగాలని బహుజన రాజ్యాధికారం సాధించే పోరాటంలో ముందుకు సాగాలని భారత దేశంలో ప్రజలందరికీ స్వేచ్ఛను సమానత్వాన్ని అందిస్తున్న భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే పోరాటంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్న సామ్రాజ్యాన్ని నిర్మించడం కోసం ఉద్యమించాలని తలైవర్ పార్లమెంటు సభ్యులు తోల్ తిరుమవళవన్ సూచించారు.ఇతనివెంట విసికె పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా జీలుకర శ్రీనివాస్ జాతీయ అధ్యక్షులు తమిళనాడు చిదంబరం ఎంపీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ తోల్ తిరుమవళవన్ విసికె పార్టీ ఆస్థాన కవి రచయిత సింగర్ ప్రముఖ బహుజన వాగ్గేయకారులు మచ్చ దేవేందర్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెరుపెల్లి ఆనంద్ మరియు పార్టీ కార్యకర్తల తదితరులు పాల్గొన్నారు, నాకు సహకరించిన అందరికీ పేరుపేరునా ఉద్యమ జై భీములు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు,

నర్సంపేటలో భారీగా అంబర్ గుట్కా ప్యాకెట్ల పట్టివేత..

నర్సంపేటలో భారీగా అంబర్ గుట్కా ప్యాకెట్ల పట్టివేత

కీరాణం దుకాణంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు.

సుమారు లక్షన్నర విలువగల నిషేధిత అంబర్, గుట్కాలు స్వాధీనం.

మణికంఠ కిరాణం యజమాని దొడ్డ పుష్పలీలపై కేసు నమోదు.

వివరాలు వెల్లడించిన టాస్క్ ఫోర్స్ ఏసిపి మధుసూదన్, సీఐ శ్రీధర్..

నేటిధాత్రి నర్సంపేట:

 

 

నర్సంపేట పట్టణంలో భారీ ఎత్తున నిషేధిత అంబర్, గుట్కా ప్యాకెట్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 1,59,000 విలువగల అంబర్ గుట్కాలుగా అంచనా వేశారు. నర్సంపేట పట్టణంలోని పాకాల రోడ్డుకు గల మణికంఠ కిరాణం దుకాణంపై పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించి నిషేధిత అక్రమ అంబర్ గుట్కాలను స్వాధీనం చేసుకొని కిరాణం షాపు యజమాని దొడ్డ పుష్పలీలపై కేసు నమోదు చేసినట్లు టాక్స్ ఫోర్స్ ఏసీబీ మధుసూదన్, సీఐ శ్రీధర్ తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version