ఝరాసంఘంలో భారీ వర్షం
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంఘం మండలం బిడే కన్నె గ్రామంలో సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని స్తంభింపజేసింది. గ్రామ సమీపంలో వాగులో చిక్కుకున్న బొలెరో వాహనాన్ని గ్రామస్తులు చాకచక్యంగా బయటకు తీశారు. గ్రామానికి వెళ్లే రోడ్డుపై మోకాలిలోతు నీరు ప్రవహించింది. ఏడాకులపల్లి గ్రామంలో వరద నీటిలో చిక్కుకున్న విద్యార్థులను గ్రామస్తులు సురక్షితంగా దాటించారు. ఈ ప్రాంతంలో 2.0 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.