మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సహకారంతో సోలార్ లైట్ ఏర్పాటు
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండలం వెంకట్రావుపల్లి గ్రామపంచాయతీ లోని దుబ్బపల్లి లో కార్మిక శాఖ మంత్రి గడ్డ వివేక్ సహకారంతో డిసిసి జనరల్ సెక్రెటరీ రిక్కుల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం సోలార్ లైట్ ఏర్పాటు చేశారు.రాత్రి పూట విద్యుత్ అంతరాయం కలిగి గ్రామస్తులు ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని గ్రహించి సోలార్ లైట్ ఏర్పాటుకు సహకరించిన కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.