బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన చందుపట్ల కీర్తి రెడ్డి

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన చందుపట్ల కీర్తి రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

భారతీయ జనతా పార్టీ
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన ఎన్ రామచంద్రరావుని హైదరాబాదులో తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సన్మానం చేసిన బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి సత్యపాల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు వివిధ మండలాధ్యక్షులు వివిధ జిల్లా మోర్చా అధ్యక్షులు మండల నాయకులు సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కేకే మహేందర్ రెడ్డి ఘనంగా పుట్టినరోజు వేడుకలు

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కేకే మహేందర్ రెడ్డి ఘనంగా పుట్టినరోజు వేడుకలు…. తంగళ్ళపల్లి నేటి ధాత్రి…. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కేకే మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకల్లో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పెదెత్తును పాల్గొని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి 63వ జన్మదిన వేడుకల సందర్భంగా మండల కేంద్రంలో. పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి సంబరాలను జరుపుకొని తదుపరి.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు చాలామంది ఉత్సాహంగా పాల్గొని కేకే కట్ చేసి బర్తడే జన్మదిన వేడుకలను. ఘనంగా నిర్వహించడం పాటు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు మండలంలో గ్రామంలో పండ్ల పంపిణీ కానీ ఇతర కార్యక్రమాలు కానీ నిర్వహిస్తూ ప్రత్యేకంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎంఆర్ చెక్కుల పంపిణీ చేయడం పాటు. గత కొన్ని సంవత్సరాలుగా పార్టీకి అహర్నిశలు కృషి చేస్తూ ఎన్నోసార్లుఓడిపోయిన కూడాప్రజల మధ్యన తిరుగుతూ ప్రజలకు అవసరాలకు తగ్గట్టుగా సమస్యలు పరిష్కారం చేస్తూ ప్రజల వెంటనే ఉంటూ ఎల్లకాలం వారి బాగు బాగోళలు. చూసుకుంటూ పార్టీకి అధిష్టానికి అనుగుణంగా పనిచేస్తూ కార్యకర్తలకు ప్రజలకు ఏ ఆపద వచ్చిన ముందుండి ప్రజా సమస్యల పరిష్కరించే నాయకుడిగా నియోజకవర్గంలో కాకుండా రాష్ట్రంలో అధిష్టానం దృష్టిలో మంచి పేరు సంపాదించుకున్న మన ప్రియతమ నాయకుడు కేక మహేందర్ రెడ్డి అని ఆయన ఎల్లప్పుడు.పిల్లాపాపలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ ఎప్పటికైనా అధిష్టానం గుర్తించి తగు ఫలితం దక్కుతుందని ఆశ భావం వ్యక్తంచేశారు. ఇట్టి బర్త్డే కార్యక్రమంలో. మండల అధ్యక్షులు ప్రవీణ్. మునిగల రాజు సత్తు శ్రీనివాస్ రెడ్డి లింగాల భూపతి టెక్స్టైల్ పార్కు మాజీ సర్పంచ్ మాజీ ఎంపిటిసి.రాము లీగల్ సెల్ బొద్దుల రాజేశం. పొన్నాల పరుశురాం పొన్నాల లక్ష్మణ్.ముందాటి తిరుపతి. ఎగుర్ల ప్రశాంత్. కర్ణాకర్. గుగ్గిళ్ళ భరత్ గౌడ్. మీరాల శ్రీనివాస్ యాదవ్. మహిళా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లింగం రాణి జిల్లా ఆసుపత్రి బృందం. బ్లడ్ బ్యాంక్ ఇన్చార్జి రవికుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

అర్హులకే డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపు…

Allotment of double bedroom houses to deserving people…

ఆర్డీవో శ్రీనివాసులు, ఎమ్మార్వో సతీష్ కుమార్,కమిషనర్ గద్దె రాజు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు రామకృష్ణాపూర్ లోని ఆర్కేసీఓఏ క్లబ్ లో లాటరీ ద్వారా ఇండ్ల కేటాయింపు జరిగింది. మంచిర్యాల్ ఆర్డీవో శ్రీనివాసులు,మందమర్రి తహసిల్దార్ సతీష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు ఆధ్వర్యంలో లబ్ధిదారులకు లాటరీ ద్వారా చీటీలు తీసి అర్హులకు ఇండ్ల నెంబర్లను అందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 286 ఇండ్లకు గాను 230 ఇండ్లను లబ్ధిదారుల సమక్షంలోనే విద్యార్థులతో లాటరీ ద్వారా చీటీలు తీయించి అర్హులకు డబుల్ బెడ్రూం ఇండ్ల నెంబర్లను కేటాయించడం జరిగిందని తెలిపారు. దివ్యాంగులకు మొదటగా 13 ఇండ్లను లాటరీ ద్వారా అందించిన అనంతరం 217 ఇండ్లను అందరికీ కలిపి అందించడం జరిగిందని పేర్కొన్నారు. ఇండ్ల కేటాయింపులో ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా నిర్వహించామని అన్నారు. ఎవరికైతే లాటరీ పద్ధతి ద్వారా ఇండ్ల కేటాయింపు జరిగిందో వారి బ్యాంకు అకౌంట్ బుక్, ఆధార్ కార్డ్ , ఎలక్షన్ కార్డు, అప్లికేషన్ ఫామ్ లు తీసుకొని సాఫ్ట్ వేర్ లో డాటా ఎంట్రీ చేసిన అనంతరం పట్టా సర్టిఫికేట్ రాగానే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇల్లును అందజేస్తామని తెలిపారు.ఇండ్ల కేటాయింపు స్థలమైన క్లబ్ కు బెల్లంపల్లి ఏసిపి రవికుమార్, మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి లు పరిశీలించారు. పట్టణ ఎస్సై రాజశేఖర్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

విచ్చలవిడిగా బ్లాక్ మార్కెట్ దందా….!

*విచ్చలవిడిగా బ్లాక్ మార్కెట్ దందా….!*

Rampant black market business….!

*జహీరాబాద్ నేటి ధాత్రి:*

జహీరాబాద్ న్యాల్కల్ మొగడంపల్లి కోహిర్ ఝరాసంగం మండలంలో గుట్కా వ్యాపారం జోరుగా సాగుతున్నది. పిల్లి గుడ్డిదైతే ఎలుక ఎగిరి మరీ ఎక్కిరిస్తుందన్న సామెతలా తయారైంది ఇప్పుడు అక్రమ గుట్కా వ్యాపారుల తీరు.గుట్కా అమ్మగాలపై నిషేధం ఉన్నప్పటికీ సంబంధిత శాఖల అధికారుల నిఘా లేకపోవడంతో మండలంలో విచ్చలవిడిగా గుట్కా అమ్మకాలు చేపడుతూ లక్షల రూపాయల సొమ్ము చేసుకుంటున్నారు. గుట్కా వ్యాపారులు అక్రమంగా అమ్మకాలు చేపట్టొద్దని సంబంధిత అధికారులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ.. ఇటీవల కాలంలో దీనిపై అధికారులు ఎవరూ అజమాషి చేయకపోవడంతో అక్రమ వ్యాపారులు ఆడింది ఆట పాడిందే పాటగా వ్యాపారం గుట్టుగా కొనసాగుతుంది.

*- కిరాణా షాపుల్లో పుష్కలంగా గుట్కా అమ్మకాలు*

మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లోని కిరాణా షాపుల్లో, పాన్ షాపులలో నిషేధ గుట్కాలను పుష్కలంగా అమ్ముతున్నారు. అధికారులు ఎవ్వరు కిరాణా, పాన్ షాపులపై కన్నెత్తి కూడా చూడకపోవడంతో వారి వ్యాపారం మూడుపువ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతోంది. ఈ గుట్కాలు అమ్ముతున్న వారు ఇతర రాష్ట్రాల నుండి ఎంతో గోప్యంగా తీసుకువచ్చి చిరు వ్యాపారులు,పాన్ షాప్ లకు అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. వీటిని కొనుగోలు చేస్తున్న పాన్ షాప్, చిల్లర దుకాణాల వ్యాపారులు వారు కొన్న ధరల కంటే రెండు రెట్లు లాభాన్ని చూసుకుని గుట్కా ప్రియులకు విక్రయిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

*- గుట్కాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?*

ఈ నిషేధిత గుట్కాలు మండలానికి ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయి అంటే చత్తీస్గడ్ నుండి మండలంలోని స్వర్ణ గ్రామానికి వస్తున్నాయనే వినికిడి వినిపిస్తోంది. అక్కడ నుంచి ప్రతినిత్యం అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. గుట్కా వ్యాపారం చేస్తున్న వ్యక్తి అధికార పార్టీ నాయకుడి అండదండలతో ఈ గుట్కా రవాణా చేస్తు ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా అక్రమ వ్యాపారం చేస్తున్నాడన్న ఆరోపణలు వున్నాయి. గుట్కా వ్యాపారం చేస్తున్న వ్యక్తి సంబంధిత శాఖ అధికారులకు ముడుపులు అందించడంతో సంబంధిత శాఖ అధికారులు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మహారాష్ట్ర కూడా ప్రతినిత్యం వాహనాల్లో గుట్కాను అక్రమ వ్యాపారం చేస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. మండల గ్రామాల కేంద్రంగానే గుట్కా దందా జోరుగా సాగుతుందని మండల వాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుట్కా నిషేధాన్ని అరికట్టాలని మండల వాసులు కోరుతున్నారు.

సొంత నిధులతో వీధి లైట్లు ఏర్పాటు చేసిన రమేష్ నాయక్…

నేటి ధాత్రి -గార్ల :-మండల పరిధిలోని, సత్యనారాయణపురం గ్రామపంచాయతీ ఇందిరానగర్ తండ గ్రామానికి చెందిన భూక్యా రమేష్ నాయక్ చిమ్మచీకట్లో ఉన్న పల్లెల్లో వీధి లైట్లు ఏర్పాటు చేసి వెలుగు నింపారు. వర్షాకాలంలో గ్రామాల్లో వీధి దీపాలు లేకపోవడంతో ప్రజలు పాము, తెలు కాట్లకు గురవుతారేమోనని ఆందోళన చెందిన రమేష్ వీధి లైట్లు ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయం. కొందరు రాజకీయాలు చేయడమే పనిగా, తమ స్వార్థం కోసం పని చేస్తుంటే ఇతను మాత్రం తన సొంత డబ్బులతో సమస్య పరిష్కరానికి కృషి చేయడాన్ని ప్రజలు అభినందిస్తున్నారు. వీధి లైట్లు ఏర్పాటు చేసిన రమేష్ నాయక్ ను ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు.

 

street lights with own money

దివంగత వైయస్సార్ సేవలు ఎనలేనివి..

దివంగత వైయస్సార్ సేవలు ఎనలేనివి..

ఘనంగా వైయస్సార్ జయంతి వేడుకలు

నర్సంపేట,నేటిధాత్రి:

మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసిన సేవలు తినలేనివని నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.దుగ్గొండి మండలంలోని గిర్నిబావి కేంద్రంలో మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వైయస్అర్ ముఖ్యమంత్రిగా విద్యా, వైద్యం, ఉపాధి ఉచితంగా పేదలకు అందించారన్నారు.ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలతో పేద ప్రజలను ఆదుకున్న ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉంటుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఎర్రల బాబు వర్కింగ్ ప్రెసిడెంట్ ఒలిగే నర్సింగరావు, మాజీ ఎంపీపీలు చుక్క రమేష్, బూర్గు రవీందర్, మండల నాయకులు కామ శోభన్, జంగిలి నగేష్, గ్రామ పార్టీ అధ్యక్షులు కొలిపాక బిక్షపతి చెన్నారపు రాజు కామిశెట్టి రమేష్ మండల యూత్ నాయకులు కొలుగూరి సుమంత్ నాయకులు
పాల్గొన్నారు.

మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసి శుభాకాంక్షలు.!

మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన బీసీ సంఘం నేత
బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి
పంతకాని శ్రీనివాస్ నేత
మహదేవపూర్ జూన్ 7( నేటి ధాత్రి)

తెలంగాణ రాష్ట్ర మైనింగ్ మరియు కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి హైదరాబాదులోని ఆయన నివాసంలో సోమవారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పంత కానీ శ్రీనివాస్ నేత కలిసి
వివేక్ వెంకటస్వామి గారు తెలంగాణ రాష్ట్ర మైనింగ్ మరియు కార్మిక మరియు ఉపాధి కల్పనా శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

అనంతరం గడ్డం వివేక్ వెంకటస్వామి మైనింగ్ కార్మిక ఉపాధి కల్పన శాఖకు మంత్రిగా ఉన్నందున వెనుకబడిన ప్రాంతాలైన మహాదేవపూర్, కాటారం, పలిమెల, మహా ముత్తారం, మల్హర్ మండలాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేయాలని మంత్రి గారికి విన్నవించగా స్పందించిన మంత్రి తప్పకుండా అధికారులతో మాట్లాడి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పంత కానీ శ్రీనివాస్ నేత తెలిపారు

పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ అన్నకు జన్మదిన

పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు*

సామాజిక ఉద్యమాల పితామహుడు,MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు,ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణ సాధకుడు

వర్దన్నపేట (నేటిధాత్రి )

:గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాలకు ఎమ్మార్పీఎస్ భువనగిరి జిల్లా ఇన్చార్జి బిర్రు మహేందర్ మాదిగ అన్నగారి సూచనల మేరకు ఈరోజు గ్రామంలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం మరియు మందకృష్ణ మాదిగ గారి జన్మదిన వేడుకలు ఎమ్మార్పీఎస్ వర్ధన్నపేట మండలం ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రభాకర్ మాదిగ అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మార్పీఎస్ వరంగల్ జిల్లా సీనియర్ నాయకులు వర్ధన్నపేట మండలం ఇన్చార్జి గోలి సుధాకర్ మాదిగ అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఎంఎస్పి వర్ధన్నపేట మండలం ఉపాధ్యక్షులు బిర్రు బిక్షపతి మాదిగ బి ఆర్ ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు తాటికాయల సురేష్ మాదిగ కురుమ సంఘం నాయకుడు వడ్డే నారాయణ ఆటో యూనియన్ అధ్యక్షుడు బిర్రు భాస్కర్ మాదిగ ఎమ్మెస్ ఎఫ్ మండల అధ్యక్షులు బిర్రు రమేష్ మాదిగ ఎమ్మెస్ ఎఫ్ జిల్లా నాయకులు సురేష్ మాదిగ ఎం ఎస్ ఎఫ్ మండల నాయకులు మంద నిరంజన్ మాదిగ ఎమ్మార్పీఎస్ మండల నాయకులు మధు మాదిగ కొమురయ్య మాదిగ రమేష్ మాదిగ రాజు మాదిగ దీపక్ మాదిగ వీరస్వామి మాదిగ తదితరులు పాల్గొన్నారు

వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు వినతి పత్రం.

డే-కేర్ సెంటర్ తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ కు అప్పగించాలని విన్నపం

ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేత

సిరిసిల్ల జిల్లా సీనియర్ సిటిజన్ అసోసియేషన్

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్ కు తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షులు చేపూరి బుచ్చయ్య, రాష్ట్ర కార్యదర్శి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జనపాల్ శంకరయ్య ఉపాధ్యక్షులు ఏనుగుల ఎల్లయ్య, కోశాధికారి దొంత దేవదాసు కార్యదర్శి గౌరిశెట్టి ఆనందం మరో కార్యదర్శి వికృతి ముత్తయ్య గౌడ్ , బుస దశరథం , చీకోటి శ్రీహరి, సీనియర్ సిటిజన్ వేములవాడ బాధ్యులు మొదలైన సీనియర్ సిటిజన్ ప్రతినిధులు కలిసి, ఆది శ్రీనివాస్ ని సత్కరించి వారి చేతుల మీదుగా సీనియర్ సిటిజన్ చట్టం పోస్టర్ను ఆవిష్కరించారు. వినతి పత్రాన్ని సమర్పించారు. తర్వాత ప్రభుత్వం తరఫునుండి మంజూరైన డీ-కేర్ సెంటర్ ను తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ నడుపుటకు సంసిద్ధంగా ఉన్నదని విన్నవించారు. వినతి పత్రం సమర్పించారు. సీనియర్ సిటిజనులకు సంబంధించినది కాబట్టి సీనియర్ సిటిజనులకు ఇచ్చినచో 100% సీనియర్ సిటిజనులకు న్యాయం జరుగుతుందని ప్రతినిధులు విన్నవించుకున్నారు.
దానికి గౌరవనీయులు ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ తో మాట్లాడుతానని చెప్పడం జరిగినది.సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ హర్షం వ్యక్తం చేసింది.

బీరన్న బోనాల ఉత్సవాలకు హాజరుకానున్న.

బీరన్న బోనాల ఉత్సవాలకు హాజరుకానున్న మంత్రి కొండా సురేఖ?

వరంగల్, నేటిధాత్రి

తొలి ఏకాదశి సందర్భంగా వరంగల్ లోని కరీమాబాదులో ఆదివారం సాయంత్రం, బీరన్న బోనాల ఉత్సవాలను నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొండా సురేఖ హాజరు కానున్నట్లు సమాచారం.

వారితో పాటు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, బీజేపీ నేతలు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, గంటా రవికుమార్ లు కూడా రానున్నారు.

అయితే.. ఒకే కార్యక్రమానికి మూడు పార్టీల నేతలు హాజరు కానుండడంతో అక్కడ ఉత్కంఠ నెలకొంది. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా, ముందు జాగ్రత్తగా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

పవన్‌కల్యాణ్‌ చేతుల మీదుగా..

పవన్‌కల్యాణ్‌ చేతుల మీదుగా..

ఆర్కే సాగర్‌ నటించిన ‘ద 100’ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. రాఘవ్‌ ఓంకార్‌ శశిధర్‌ దర్శకత్వంలో ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ రూపుదిద్దుకొంది. ఈ సినిమా…ఆర్కే సాగర్‌ నటించిన ‘ద 100’ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. రాఘవ్‌ ఓంకార్‌ శశిధర్‌ దర్శకత్వంలో ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ రూపుదిద్దుకొంది. ఈ సినిమా ట్రైలర్‌ను ఏపీ ఉపముఖ్యమంత్రి, హీరో పవన్‌కల్యాణ్‌ శనివారం విడుదల చేశారు. ‘జీవితంలో జరిగిపోయినది మనం మార్చలేం. కానీ జరగబోయేదాన్ని కచ్చితంగా ఆపగలం’ అంటూ విక్రాంత్‌ ఐపీఎస్‌ పాత్ర పోషించిన ఆర్కే సాగర్‌ వాయిస్‌ ఓవర్‌తో ట్రైలర్‌ ప్రారంభమవుతుంది. పోలీస్‌ ఆఫీసర్‌గా ఫిట్‌నెస్‌ కలిగి అద్భుతంగా కనిపించారాయన. మిషా నారంగ్‌ హీరోయిన్‌గా నటించారు. సస్పెన్స్‌, థ్రిల్స్‌తో ఎంతో గ్రిప్పింగ్‌గా ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ను దర్శకుడు రూపొందించారు. విడుదలకు ముందే సినిమాపై అంచనాలను ఈ ట్రైలర్‌ పెంచేసింది.

నైతిక క్రమశిక్షణకు దలైలామా ప్రతీకః ప్రధాని మోదీ.

ప్రేమ, కరుణ, సహనం, నైతిక క్రమశిక్షణకు దలైలామా ప్రతీకః ప్రధాని మోదీ

టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా నేడు తన 98వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దలైలామాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో పోస్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు దలైలామాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆయనను ప్రేమ, సహనానికి చిహ్నంగా ప్రధాని అభివర్ణించారు.టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా నేడు తన 98వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దలైలామాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో పోస్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు దలైలామాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆయనను ప్రేమ, సహనానికి చిహ్నంగా ప్రధాని అభివర్ణించారు.

‘‘దలైలామా 90వ పుట్టినరోజు సందర్భంగా 1.4 బిలియన్ల భారతీయులతో కలిసి నేను కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని’’ ప్రధానమంత్రి రాశారు. ‘‘ఆయన ప్రేమ, కరుణ, సహనం, నైతిక క్రమశిక్షణకు చిరస్మరణీయ చిహ్నం. ఆయన సందేశం అన్ని మతాల ప్రజలలో గౌరవం మరియు ప్రశంసలను ప్రేరేపించింది. ఆయన ఆరోగ్యం, దీర్ఘాయుష్షును కొనసాగించాలని మేము కోరుకుంటున్నాము.’’ అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు.

తెలుగు దేశం పార్టీ (టీడీపీ) అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నాయుడు కూడా దలైలామాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఆయనతో ఉన్న ఫోటోను కూడా షేర్ చేశారు. “పవిత్ర దలైలామాకు పుట్టినరోజు శుభాకాంక్షలు. శాంతి, కరుణ, ఆధ్యాత్మిక బలానికి ప్రపంచవ్యాప్త చిహ్నం, ఆయన సామరస్యం సందేశం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రేరేపిస్తుంది” అని ఆయన రాశారు.

టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా తన 90వ పుట్టినరోజుకు ఒక రోజు ముందు ఒక కీలక ప్రకటన చేశారు. ‘‘నేను ఇంకా 130 సంవత్సరాలు జీవిస్తానని’’ ఆయన అన్నారు. వారసుడి ఎన్నిక, వివాదాల మధ్య, దలైలామా శనివారం ఇలా కీలక ప్రకటన చేశారు. ‘‘అనేక ప్రవచనాలను పరిశీలిస్తే, నాకు అవలోకితేశ్వరుడి ఆశీస్సులు ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఇప్పుడు నేను ఇంకా 30-40 సంవత్సరాలు జీవించాలనుకుంటున్నాను. బహుశా నేను 130 సంవత్సరాలకు పైగా జీవిస్తాను.’’ అంటూ వెల్లడించారు.

తన వారసుడిని ప్రకటించారనే పుకార్ల మధ్య దలైలామా ఈ ప్రకటన చేశారు. దలైలామా పుట్టినరోజున హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో జూలై 2న మూడు రోజుల 15వ టిబెటన్ మతపరమైన సమావేశం ప్రారంభమైంది. ‘‘నా మరణం తర్వాత, టిబెటన్ బౌద్ధ సంప్రదాయాల ప్రకారం వారసుడిని ఎంపిక చేస్తామని’’ ఆయన చెప్పారు.

టెన్జిన్ గ్యాట్సో 14వ దలైలామా. ఆయన జూలై 6, 1935న జన్మించారు. ఆయన టిబెట్ దేశాధినేత, ఆధ్యాత్మిక గురువు. ఆయన తొలిసారిగా 1959లో చైనా నుండి తవాంగ్ చేరుకున్నారు. అప్పటి నుండి ఆయన భారతదేశంలో నివసిస్తున్నారు. దలైలామాకు 1989లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఆయన 65 కంటే ఎక్కువ దేశాలకు ప్రయాణించారు. అంతే కాకుండా, ఆయన ఇప్పటివరకు 85 కంటే ఎక్కువ గౌరవాలను అందుకున్నారు.

చేవెళ్ల నియోజకవర్గంలో మాజీ జడ్పీటీసీ.

చేవెళ్ల నియోజకవర్గంలో మాజీ జడ్పీటీసీ సభ్యురాలికి ఘన నివాళులు

శంకర్ పల్లి, నేటిధాత్రి:
రంగా రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు పడాల వెంకట్ స్వామి సతీమణి, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు మరియు మాజీ ఎంపీపీ శ్రీమతి పడాల యాదమ్మ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. చేవెళ్ల మండలం ముడిమ్యాల గ్రామంలో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించబడిన సందర్భంగా, పలువురు నాయకులు, కార్యకర్తలు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పామేన భీమ్ భరత్ స్వర్గీయ యాదమ్మ భౌతిక కాయానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం, ఆయన పడాల వెంకట్ స్వామి మరియు కుమారుడు ప్రభాకర్ ని పరామర్శిస్తూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మొయినాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మానయ్య, వైస్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, చేవెళ్ల యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు పెంట రెడ్డి, సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణ రెడ్డి, బాకారం మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి, ఫిషర్ మెన్ సంఘం అధ్యక్షుడు బిక్షపతి, తోల్కట్ట సత్యనారాయణ, బలవంత రెడ్డి, ముడిమ్యాల గ్రామ ఎంపీటీసీ శ్రీనివాస్, వివిధ గ్రామాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు.

పెండింగ్ లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలి.

పెండింగ్ లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలి

మంచిర్యాల,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లాలోని పోస్టుమెట్రిక్ హాస్టల్లో విధులు నిర్వహిస్తున్న నైట్ వాచ్మెన్,డే వాచ్మెన్,కుక్,స్లీపర్,స్కావెంజర్స్ వేతనాలు గత ఏడు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదు.ఈ వేతనాలను తక్షణమే చెల్లించాలని కార్మికులను ఆదుకోవాలని శనివారం రోజున భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు ఆధ్వర్యంలో దళిత అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ సిహెచ్.దుర్గ ప్రసాద్ కి మెమోరండం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి డి.బ్రహ్మానందం మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా పరిధిలోని పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో పనిచేసే కుక్,స్వీపర్ అండ్ స్కావెంజర్,నైట్ వాచ్మెన్,డే వాచ్మెన్ లకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు.మంచిర్యాల జిల్లాలోని పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో పని చేసే వర్కర్స్ కు రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనల వల్ల తీవ్ర జాప్యం జరుగుతుంది.రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ చేసిన అనంతరం కంటిన్యూషన్ లెటర్ రాలేదని బిల్లులు పెట్టకుండా పెండింగ్ లో పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది.అనంతరం సంబంధిత శాఖ నుంచి ట్రెజరీ కి బిల్లులు పెట్టాల్సి ఉంటుంది.ఈ బిల్లులు పెట్టే కోణంలో ప్రొఫెషనల్ టాక్స్, టి.డి.ఎస్ కట్టకుండా బిల్లులు పంపించడం వల్ల ట్రెజరీ లో బిల్లులు చేయకుండా పెండింగ్ లో పెడుతున్నారు.బిల్లులు రిటర్న్ చేస్తున్నారు.ఒకవేళ ట్రెజరీ నుంచి బిల్లులు చేసి ప్రభుత్వ ఖజానాకు పంపిస్తే ఈ కుబేర్ అని,బ్రీజింగ్ అని నెలలు గడిచి పోతుంటాయి.ఈ విధానం వల్ల దళిత అభివృద్ధి శాఖ పోస్టుమెట్రిక్ హాస్టల్ లో పనిచేసే వర్కర్స్ కు వేతనాలు రాకుండా ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారు.కనుక ఇప్పటికైనా ప్రభుత్వం,ప్రభుత్వ యంత్రాంగమంతా ఈ విధానాన్ని మార్చి కాంట్రాక్ట్ ,ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాలు కలెక్టర్ ఖాతా నుంచి చెల్లించే విధంగా ప్రణాళిక రూపొందించాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య ( ఐఎఫ్ టియు) డిమాండ్ చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో సంపత్,సునీత, మల్లేశ్వరి,హేమ,పద్మ,లక్ష్మి,తదితరులు పాల్గొన్నారు.

సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సేవలు అభినందనీయం.

సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సేవలు అభినందనీయం…

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రతి పేదవాడికి అండగా ఉండి,వారికి చూపును అందించే ప్రయత్నమే ఈ కార్యక్రమం.. సుంకిరెడ్డీ రాఘవేందర్ రెడ్డి ప్రారంభమైన ఐక్యత ఫౌండేషన్ ఉచిత కంటి వైద్య శిభిరం సేవలు ముఖ్య అతిథులుగా హాజరైన కల్వకుర్తి కోర్టు సీనియర్ జడ్జి శ్రీమతి శ్రీదేవి ప్రముఖ డా.దామోదర్ రెడ్డి మొదటి రోజు 800 మందికి పైగా శిబిరానికి హాజరుకాగా 600 మందికిపైగా కంటి పరీక్షలు, 35 మందిపేషెంట్లు కంటి శుక్లాల సర్జరీలకి ఎంపిక. 300 పైగా ఉచిత కంటి అద్దాల పంపిణి… శనివారం కల్వకుర్తి పట్టణ కేంద్రంలోని CKR ఫంక్షన్ హాల్లో…ఐక్యత ఫౌండేషన్ చైర్మన్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు& TASK-C.O.O సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో ఐక్యత ఫౌండేషన్& శంకర నేత్రాలయ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిభిరం సేవలు స్థానిక ప్రముఖ డా.దామోదర్ రెడ్డి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించగా,సీనియర్ జడ్జి శ్రీమతి శ్రీదేవి శిబిరాన్ని సందర్శించి ఉచిత కంటి వైద్య శిభిరం సేవలను పరిశీలించి,అద్దాల పంపిణి,కంటి సర్జరీలకు సంబంధించిన పలు విషయాలు వైద్యుల బృందంతో చర్చించి వారిని అభినందించారు.ఈ సందర్భంగా సీనియర్ జడ్జి శ్రీమతి శ్రీదేవి గారు మాట్లాడుతూ… సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సేవలు అభినందనీయం అని,గత కొన్ని నెలలుగా నేను ఎక్కడ చూసినా సుంకిరెడ్డి సామాజిక సేవలు గమనిస్తున్నానని,వాటికి సంబంధించిన పలు గురించి కూడా నేను తెలుసుకున్నానని,వారికి సమాజం పట్ల,ప్రజలకు ఏదో చెయ్యాలనే సేవా దృక్పథానికి అభినందిస్తున్నానని, సుంకిరెడ్డి లాగే ప్రతి ఒక్కరు సమాజం పట్ల ఎంతో కొంత సేవ దృక్పథాన్ని అలవర్చుకోవాలని,పేదలకు ఉచిత కంటి సర్జరీలు,అద్దాల పంపిణి వంటి వ్యయంతో కూడుకున్న సేవలను పేద ప్రజలకి అందిస్తున్నందుకు వారిని ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తు,ఒక గొప్ప కార్యక్రమానికి ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు…డా.దామోదర్ రెడ్డి మాట్లాడుతూ… కల్వకుర్తి ప్రాంతంలో ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి,పేదలకు ఉచితంగా సర్జరీలు చేసి,వారికి అన్ని విధాలుగా అండగా ఉంటున్నారని వారి గొప్ప సేవలు కల్వకుర్తి ప్రజలకు అందిస్తున్నందుకు ఈ సందర్భంగా సుంకిరెడ్డి అభినందనలు తెలియజేస్తు,గొప్ప కార్యక్రమానికి ముఖ్య అతిథిగ ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు…సుంకిరెడ్డి మాట్లాడుతూ.. పేద ప్రజలు తమ తమ ఆర్థిక ఇబ్బందులు,పలు కారణాల వలన కంటి సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని, నియోజకవర్గంలో కంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రతి పేదవాడికి తన వంతు ప్రయత్నంగా అండగా ఉండటానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టానని,మా కార్యక్రమం ప్రారంభోత్సవానికి విచ్చేసి,తమ విలువైన సమయాన్ని కేటాయించి,పలు సూచనలు అందించిన సీనియర్ జడ్జి శ్రీమతి శ్రీదేవి మేడమ్ స్థానిక సీనియర్ డా.దామోదర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు…ఈ కార్యక్రమంలో…కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పవన్ కుమార్ రెడ్డి గారు,యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బీస బాలరాజు,యువజన నాయకులు పర్శపాకుల రమేష్,ఐక్యత ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు పరచాలి.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు పరచాలి

బారసా జిల్లా అధికార ప్రతినిధి శ్రీధర్

వనపర్తి నేటిదాత్రి :

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీ ఆర్ ఎస్ పార్టీ పిలుపుమేరకు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశాలతో వనపర్తి పట్టణ బీ ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పలుస రమేష్ గౌడ్ అధ్యర్యములో వనపర్తి పట్టణం లో 6 వ వార్డు మెట్టుపల్లి లో బీఆర్ఎస్ నేతలు పర్యటించారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు వారు చేసిన అభివృద్ధి పై ప్రజలను అడిగి తెలుసుకున్నామను మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ తెలిపారు మెట్టుపల్లి ప్రజాలు ప్రజలు మాజీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సహకరముతో వనపర్తి అభివృద్ధి జెరిగిందని ప్రజలు తెలిపారని శ్రీధర్ తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనె అమలు పరచాలని బీ ఆర్ ఎస్ నేతలు డిమాండ్ చేశారు మెట్టుపల్లి 6 వార్డు పర్యటన లో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు గట్టు యాదవ్ పట్టణ అధ్యక్షులు రమేష్ గౌడ్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ ప్రధాన కార్యదర్శి గందం పరంజ్యోతి మాజీ కౌన్సిలర్లు బండారు కృష్ణ నాగన్న యాదవ్ ఉంగ్లం తిరుమల్ ప్రేమ్ నాథ్ రెడ్డి స్టార్ రహీం మాజీ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గులాం ఖాదర్ ఖాన్ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు భాగ్యరాజ్ కవిత సింగనమణి గోపాల్ సునీల్ వాల్మీకి డి దానేలు జహంగీర్ రామకృష్ణనాయుడు అలీమ్ ముని కుమార్ బొడ్డుపల్లి సతీష్ అనుపటి రాము వెంకట్ రఘు బంగాలే వజ్రాల సాయిబాబా గొర్ల బాలయ్య తోట శ్రీను జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు

అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు..

అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ మండలం కొత్తూర్ బి గ్రామ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు రమేష్ రెడ్డి గారి మాతృమూర్తి స్వర్గస్తులైనరు విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు గ్రామానికి చేరుకొని పార్థివ దేహానికి నివాళులర్పించి ,కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు జహీరాబాద్ ఎమ్మెల్యే గారితో పాటుగా మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ యువ నాయకులు మిథున్ రాజ్, చిన్న రెడ్డి,దీపక్,శ్రీకాంత్, పాప్ నాథ్, విజయ్ రాథోడ్ తదితరులు ఉన్నారు.

డిసిసి బ్యాంక్ ఆవరణలో మొక్కలు నాటిన.

డిసిసి బ్యాంక్ ఆవరణలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని డిసిసి బ్యాంక్ ఆవరణలో శనివారం రోజున ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మొక్కలు నాటడం జరిగింది, పచ్చని చెట్లు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయని చెట్టును రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలని గ్రామంలోని ప్రజలందరూ ఇంటికి నాలుగు మొక్కలు చొప్పున పెంచాలని అందరు మొక్కలు నాటినప్పుడే రాష్ట్రం పచ్చదనంగా ఉంటుందని కాలుష్య బారిన పడకుండా ప్రాణాలను కాపాడుకోవచ్చని అన్నారు, అనంతరం బ్యాంక్ ఆవరణలో మొక్కలు నాటారు, అలాగే మొక్కలు నాటడమే కాదని వాటిని రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని అన్నారు, ఈ కార్యక్రమంలో డిసిసి బ్యాంక్ మేనేజర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మధువంశీకృష్ణ, రాయకమురు, జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య ,కాంగ్రెస్ యూత్ మండల అధ్యక్షులు అలకొండ కుమారు, మరియు కాంగ్రెస్ నాయకులు బుర్ర శ్రీనివాసు అల్లం రాజు గంగాధర్ రవి, బ్యాంక్ సిబ్బంది కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన.

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.

చిట్యాల నేటి ధాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం రోజున భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపదలో సీఎం సహాయనిధి ఆపద్భాందవునిలా ఆదుకుంటుందని అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని సీఎం సహాయనిధి ద్వారా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. మానవతాదృక్పథంతో సీఎం రేవంత్ రెడ్డి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ప్రైవేటు, కార్పోరేట్ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్య చికిత్స చేసుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆసరగా నిలుస్తుందన్నారు. బాధితులకు అవసరమైన సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ను తప్పక సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జయశ్రీ తాసిల్దార్ ఇమామ్ బాబా, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి, రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి ముఖిరాల మధువంశీకృష్ణ చిలకల రాయ కొమురు జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య యూత్ మండల అధ్యక్షులు అల్లకొండ కుమార్, టేకుమట్ల చిట్యాల పలువురు మండల కాంగ్రెస్ నేతలు, లబ్ధిదారులు కార్యకర్తలు, పాల్గొన్నారు.

అర్హత పద్మ దేవేందర్ రెడ్డి కి లేదు..

కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత పద్మ దేవేందర్ రెడ్డి కి లేదు..

ఎమ్మెల్యే పై అనవసర ఆరోపణలు చేయడం మంచిది కాదు..

సర్పంచులు అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడడం బిఆర్ఎస్ పాపం..

శిలాఫలకాలు వేయడమే తప్ప పనులు ప్రారంభించని బిఆర్ఎస్..

టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత రావు..

రామాయంపేట జూలై 5 నేటి ధాత్రి (మెదక్)

మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావ్, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల మాట్లాడి అర్హత బి.ఆర్.ఎస్ నాయకులతోపాటు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి కి ఎంత మాత్రం లేదని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత రావు అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యేగా ఉండి చేసిన అభివృద్ధి పనులు ఏమాత్రం లేకపోవడంతో పాటు తక్కువ సమయంలో అభివృద్ధి వేగవంతం చేస్తున్న ఎమ్మెల్యే రోహిత్ రావు పట్ల ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదు అన్నారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో శిలాఫలకాలు వేయడం కొబ్బరికాయలు కొట్టడమే తప్ప ఎక్కడ కూడా పనులు ప్రారంభించిన ఘటనలు లేవన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం 16 నెలలు కాలం ఎమ్మెల్యే రోహిత్ రావు ప్రత్యేక చొరవతో వేగంగా నియోజకవర్గ అభివృద్ధి చెందుతుందన్నారు. ఇది జీర్ణించుకోలేక మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అనవసర ఆరోపణలు చేయడం జరుగుతుందన్నారు. నియోజకవర్గం లో 250 గ్రామపంచాయతీలు రెండు మున్సిపాలిటీలు దేవాలయాలకు నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులను సైతం వారం రోజుల్లోకి ప్రారంభించిన ఘనత ఎమ్మెల్యే రోహిత్ రావుకు దక్కింది అన్నారు. పద్మ దేవేందర్ రెడ్డి రామాయంపేట రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి అభివృద్ధి కుంటూపడిందని కనీసం తన స్వగ్రామం కోనాపూర్ కూడా అభివృద్ధి నోచుకోని దుస్థితి దాపురించింది అన్నారు. రామయంపేట రెవిన్యూ డివిజన్ ప్రకటించి ఆర్డిఓ కార్యాలయం, సిబ్బంది నియమించకపోవడం కనీసం ఆర్డిఓ ఎవరు తెలియని పరిస్థితి అప్పటి బి ఆర్ ఎస్ చేసిన దౌర్భాగ్య పరిస్థితి అన్నారు. తూతు మంత్రంగా రెవిన్యూ డివిజన్ ప్రకటించి చేతులు దులుపుకోవడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

Congress party.

ఈ సమావేశంలో రమేష్ రెడ్డి, దేమే యాదగిరి చిలుక స్వామి, బైరం శంకర్ కంచర్లు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version