బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మోతె కర్ణాకర్ రెడ్డి
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం కొండాపూర్ వెంకటేశ్వర్ పల్లె గ్రామాలలోభూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహా సభకు అధిక సంఖ్యలో పాల్గొనేలా కార్యకర్తల ను సమాయత్తం చేస్తూ రోజు ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న గణపురం మండల పార్టీ మండల అధ్యక్షులు మోతె కరుణాకర్ రెడ్డి
బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు భారీ ఎత్తున పాల్గొనాలి……
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ తంగళ్ళపల్లి మండల ఆఫీసులో ఏర్పాటు చేసిన సమావేశంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 27.వ .తారీఖున వరంగల్ కేంద్రంలో ఏర్పాటు చేసిన రజదోత్సవ సభ సమావేశంలో మండల కేంద్రం నుంచి కనీసం 300 నుంచి పైనే కార్యకర్తలు పాల్గొనాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ జాతిపిత కెసిఆర్ ప్రవేశపెట్టిన సభకు పెద్ద ఎత్తున మండలం నుండి పార్టీ కార్యకర్తలు పాల్గొని సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు మండల అధ్యక్షుడు రాజన్న పట్టణ శాఖ అధ్యక్షులు జగన్ ఆధ్వర్యంలో సభకు వచ్చే వారి జాబితాను సిద్ధం చేస్తూ వారికి అవగాహన సదస్సు నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ఎగుడు మామిడి వెంకట రమణారెడ్డి పడిగల రాజు తంగళ్ళపల్లి మాజీ సర్పంచ్ రవి అనిత వెంగళ రమేష్ కందుకూరి రామ గౌడ్ మహిళా మాజీ సర్పంచ్ కోడం సంధ్యారాణి మహిళా నాయకురాలు పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
ఓబులాపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడి రాజీనామా
మల్లాపూర్ ఏప్రిల్ 18 నేటి ధాత్రి
కాంగ్రెస్ పార్టీ కోరుట్ల కాంసెన్సీ ఇంచార్జ్ జువ్వడి నర్సింగ రావు గారు, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను కలుపుకోలేక పోతున్నారు మల్లాపూర్ మండలంలో పది సంవత్సరాలు కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్య కర్తలు తీవ్ర ఆవేదనలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వారందరికీ న్యాయం చేయాలని కోరుకుంటూ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నేను గత పది సంవత్సరాలుగా పార్టీ కోసం పైసలు ఖర్చు పెట్టుకున్నాను కష్టపడ్డాను ఫలితంగా నాకు అవమానాలే ఎదురు అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నర్సింగరావు గారు నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పట్టించుకోకపోవడంలేదు నిరసన గా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని తెలియపరుస్తున్నాను పల్లె శేఖర్ ముదిరాజ్. .
భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)కరీంనగర్ నగర నూతనకమిటీఎన్నిక
కరీంనగర్, నేటిధాత్రి:
సిపిఐ కరీంనగర్ నగర 11వ మహాసభలో నగర నూతన కమిటీని శుక్రవారం రోజున ఎన్నుకోవడం జరిగిందని సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. సిపిఐ నగర కార్యదర్శిగా కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శులుగా పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజు, కోశాధికారిగా బీర్ల పద్మలతో పాటు పదకోండు మంది కార్యవర్గ సభ్యులు ఇరవై తోమ్మిది మంది కౌన్సిల్ సభ్యులను నూతనంగా ఎన్నుకోనైనదని వారు తెలిపారు. నూతనంగా ఎన్నికైన వారు మాట్లాడుతూ నగరంలో సిపిఐ పార్టీని వాడవాడనా బలోపేతం చేస్తూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ జెండా మున్సిపల్ పై ఎగిరే విధంగా పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేస్తామన్నారు. నగరంలో అభివృద్ధి పనుల్లో పూర్తిగా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని వీటిపై రానున్న కాలంలో ఉద్యమాలు చేస్తామని వారు పేర్కొన్నారు. నగరంలో వేలాది మంది ప్రజలు ఇండ్లు లేక కిరాయి ఇండ్లలో ఉంటూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇండ్లులేని నిరుపేదలకు ఇండ్లు వచ్చేంతవరకు పోరాటాలు చేస్తామని, రేషన్ కార్డులు,పెన్షన్లు ఇతర సంక్షేమ పథకాలన్నీ పేద ప్రజలకు అందేందుకు కృషి చేస్తామన్నారు. ఎన్నికకు సహకరించిన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకట్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామికి ధన్యవాదాలు తెలియజేశారు.
బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి. మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తక్కలపెల్లి చందర్ రావు
నేటిధాత్రి అయినవోలు :-
వర్ధన్నపేట నియోజకవర్గం అయినవోలు మండలం ఉడుతగూడెం గ్రామంలో శనివారం టిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు తోట రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగిన టిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నందనం సొసైటీ వైస్ చైర్మన్ తక్కలపల్లి చందర్ రావు మాట్లాడుతూ ఈనెల 27వ తేదీన ఎలుకతుర్తి ఎక్స్ రోడ్డులో నిర్వహించే బిఆర్ఎస్ పార్టీ రచతోత్సవ సభకు గ్రామంలో అధిక సంఖ్యలో హాజరై సభ విజయవంతం అయ్యేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని రానున్న రోజుల్లో బి. ఆర్. ఎస్. అధినేత కేసీఆర్ తప్పకుండా ముఖ్యమంత్రి అవుతున్నారని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ టిఆర్ఎస్ ఇన్చార్జి కట్కూరి రాజు మండల నాయకుడు కొమురయ్య, దేవదాసు ఆకారపు యాదవ రెడ్డి ప్రతాపరెడ్డి చంద్రారెడ్డి సుదర్శన్ రెడ్డి రమేష్ నరేష్ రవి వీరస్వామి రవి యాదగిరి శీను అనిల్ మల్లయ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
లక్షలాదిగా తరలి వచ్చి బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని చెన్నూరు నియోజకవర్గం బీఆర్ఎస్ శ్రేణులు కోరారు.స్థానిక నియోజకవర్గం కోటపల్లి మండలంలోని సర్వాయిపేట గ్రామంలో బీఆర్ఎస్ చలో వరంగల్ బహిరంగ సభ వాల్ పోస్టర్లను శుక్రవారం విడుదల చేశారు.చలో ఎల్కతుర్తి,వరంగల్ భారీ బహిరంగ సభ ఏర్పాట్లలలో భాగంగా వివిధ కార్యక్రమాలు నియోజవర్గ పరిధిలో చేపడుతున్నమన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దపల్లి మాజీ పార్లమెంటు సభ్యులు,మాజీ ప్రభుత్వ విప్,బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 27 న వరంగల్ లో జరిగే బహిరంగ సభకు లక్షలాదిగా జనం తరలి రావాలన్నారు.పార్టీ ఏర్పడి విజయవంతంగా రెండు దశాబ్దాల నర పూర్తయిన సందర్భంగా 25 సంవత్సరాల గులాబీ పండుగ వేడుకల్లో ప్రతి ఒక్కరూ తరలి రావాలని నియోజకవర్గ ప్రజలను కోరారు.ఉద్యమ స్ఫూర్తితో ఓరుగల్లుకు దండై కదులుదామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా బాపు నాయక్,రాజ్ కుమార్ యాదవ్,దుర్గం రాజేందర్,దుర్గం సంపత్,సప్ప భాస్కర్,జిమిడి సాగర్,దుర్గం రోహిత్,జిమిడి చంద్రయ్య,బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
రేవంత్ ఏడాదిన్నర పాలనలో..పుష్ప, హైడ్రా, మూసీ తప్ప ఏం లేదు
-బిజెపి మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు మోరే వేణుగోపాల్ రెడ్డి మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీల హామీలంటూ అర చేతిలో స్వర్గం చూపించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అన్ని మరిచిపోయిందని బిజెపి మొగుళ్ళపల్లి మండల అధ్యక్షుడు మోరే వేణుగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడాదిన్నర పాలనలో పుష్ప, హైడ్రా, మూసీ, హెచ్ సీ యూ మీద పడ్డారే తప్పితే ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలో అసమర్థ, అవినీతి, అసత్య ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. ఆర్థిక క్రమశిక్షణ లేని జీరో పరిపాలన సాగుతోందని..ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, విద్యా భరోసా కార్డు, చేయూత, ఆరోగ్యశ్రీ, లక్ష రూపాయలు, తులం బంగారం..ఇలా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ విస్మరించారని విమర్శించారు. రాను రాను సీఎం రేవంత్ రెడ్డి గ్రాఫ్ పడిపోతుందని, రేవంత్ రెడ్డి ని కేసీఆర్ జైలులో వేస్తే..రేవంత్ కనీసం ఆ ప్రయత్నం కూడా చేయడం లేదని విమర్శించారు.
విసికె పార్టీ యూత్ రాష్ట్ర అధ్యక్షులుగా అంబాల అనిల్ ఎన్నిక.
చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని టేకుమట్ల మండలం లోని అంకుశపూర్ గ్రామానికి చెందిన అనిల్ కుమార్ ను విముక్త చిరుతల కచ్చి పార్టీ తెలంగాణ రాష్ట్ర యూత్ యువజన రాష్ట్ర అధ్యక్షుడిగా తమిళ నాడు లోని చిదంబరం పార్లమెంట్ సభ్యులు తిరుమవళవన్ నియమించారు. వారు మాట్లాడుతూ యువతీ యువకులు ఎదుర్కొంటున్న సమస్యల మీద పోరాడాలని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు సాధించే దిశగా ముందుకు సాగాలని బహుజన రాజ్యాధికారం సాధించే పోరాటంలో ముందుకు సాగాలని భారత దేశంలో ప్రజలందరికీ స్వేచ్ఛను సమానత్వాన్ని అందిస్తున్న భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే పోరాటంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్న సామ్రాజ్యాన్ని నిర్మించడం కోసం ఉద్యమించాలని తలైవర్ పార్లమెంటు సభ్యులు తోల్ తిరుమవళవన్ సూచించారు.ఇతనివెంట విసికె పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా జీలుకర శ్రీనివాస్ జాతీయ అధ్యక్షులు తమిళనాడు చిదంబరం ఎంపీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ తోల్ తిరుమవళవన్ విసికె పార్టీ ఆస్థాన కవి రచయిత సింగర్ ప్రముఖ బహుజన వాగ్గేయకారులు మచ్చ దేవేందర్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెరుపెల్లి ఆనంద్ మరియు పార్టీ కార్యకర్తల తదితరులు పాల్గొన్నారు, నాకు సహకరించిన అందరికీ పేరుపేరునా ఉద్యమ జై భీములు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు,
సుమారు లక్షన్నర విలువగల నిషేధిత అంబర్, గుట్కాలు స్వాధీనం.
మణికంఠ కిరాణం యజమాని దొడ్డ పుష్పలీలపై కేసు నమోదు.
వివరాలు వెల్లడించిన టాస్క్ ఫోర్స్ ఏసిపి మధుసూదన్, సీఐ శ్రీధర్..
నేటిధాత్రి నర్సంపేట:
నర్సంపేట పట్టణంలో భారీ ఎత్తున నిషేధిత అంబర్, గుట్కా ప్యాకెట్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 1,59,000 విలువగల అంబర్ గుట్కాలుగా అంచనా వేశారు. నర్సంపేట పట్టణంలోని పాకాల రోడ్డుకు గల మణికంఠ కిరాణం దుకాణంపై పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించి నిషేధిత అక్రమ అంబర్ గుట్కాలను స్వాధీనం చేసుకొని కిరాణం షాపు యజమాని దొడ్డ పుష్పలీలపై కేసు నమోదు చేసినట్లు టాక్స్ ఫోర్స్ ఏసీబీ మధుసూదన్, సీఐ శ్రీధర్ తెలిపారు.
ఝరాసంగం మండల కుప్పా నగర్ గ్రామ శివారులో గురువారము సాయంత్రం 3:30 పిడుగుపాటుకు 23 మేకలు మృత్యువాత పడ్డాయి. కుప్పా నగర్ గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల బాలప్ప తండ్రి లక్ష్మప్ప.తనకున్న మేకలను మేత కోసం గ్రామ పంట పొలాల్లోకి తోలుకు వెళ్లాడు. ఉరుములు మెరుపులు మొదలు కావడంతో ఓ చెట్టు కిందికి వాటిని నిలిపి.ఒక్కసారిగా పిడుగుపడడంతో.మేకలన్నీ అక్కడికక్కడే మృతి చెందినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న పశుసంవర్ధక శాఖ అధికారులు… పిడుగుపాటుకు మేకలు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. పిచ్చకుంట్ల బాలప్ప తండ్రి లక్ష్మప్ప కు న్యాయం చేయాలని అధికారులను గ్రామస్థులు కోరారు. మేకలు మృతి చెందిన వార్త విన్న వెంటనే కుప్పా నగర్ గ్రామ సెక్రెటరీ స్వప్న ఎలా జరిగిందని అడిగి తెలుసుకున్నారు ఝరాసంగం మండల ఎంఆర్ఓ తిరుపతి రావు రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామారావు ఝరాసంగం సబ్ ఇన్స్పెక్టర్ నరేష్ రైతులు పాల్గొన్నారు
రజితోత్సవ సభను విజయవంతం చేయండి – పోస్టర్ ఆవిష్కరణ – టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి
సిరిసిల్ల (నేటి ధాత్రి):
బిఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన జరిగే పార్టీ రజితోత్సవ సభను విజయవంతం చేయడానికి సిరిసిల్ల తెలంగాణ భవన్లో సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రజతోత్సవ సభ పోస్టర్ ఆవిష్కరించంకోవడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి మాట్లాడుతూ 27వ తేదీన జరిగే పార్టీ రజితోత్సవ సభను విజయవంతం చేయడానికి బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అత్యధికంగా హాజరుకావాలని కోరడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, రాష్ట్ర నాయకులు గూడూరి ప్రవీణ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, మాజీ గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య,సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ,మ్యాన రవి, ఎండి సత్తార్, బొల్లి రామ్మోహన్, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్, టిఆర్ఎస్ పార్టీ వార్డు అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది.
కేసముద్రం మండలంలోని సివిల్ సప్లై గోదాములలో కొందరు ఉద్యోగలు అవకతవకలకు పాల్పడుతున్నారని కేసముద్రం సహకార బ్యాంకు విశ్రాంత ఉద్యోగి సీఈఓ వెంకటచలం ఆరోపించారు. గురువారం కేసముద్రంలో పత్రికా ప్రకటన విడుదల చేసిన అనంతరం వారు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో ఇనుగుర్తి ధాన్యం కొనుగోలు కేంద్ర మిగిలిన గన్ని బ్యాగుల విషయం సివిల్ సప్లై ఉద్యోగులు అవకతవకలకు పాడుపడుతున్నారని అన్నారు. గన్ని బ్యాగుల 83 కట్టల లో ఉన్న 4,150 ఖాళీగా అన్ని బ్యాగులను కేసముద్రంలోని సివిల్ సప్లై గోదాంలో సంబంధిత అధికారులకు అప్పగించడం జరిగిందని తెలిపారు. అట్టి 83 కట్టలకు గాను రూపాయలు 40 చొప్పున 3420 దిగుమతి చార్జీలు కూడా చెల్లించామని అన్నారు కేంద్రం ఇన్చార్జి అయిన సురేందర్ ను 83 కట్టల కాళీ బ్యాగులు దిగుమతి అయినట్లు రాసి ఇవ్వాలని రసీదు అధికారులను అడగగా రేపు ఇస్తాం మాకు ఇస్తాం అంటూ కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వయంగా తాను కూడా సివిల్ సప్లై గోదాముకు వెళ్లి అడగగా 42 కట్టలు దిగుమతి అయినట్లు రాసి ఇవ్వడం జరిగిందని, తక్కువ గన్ని బ్యాగుల కట్టలు రాసి ఇవ్వడమేంటి అని అడగగా 52 కట్టలు దిగుమతి మాత్రమే దిగుమతి అయ్యాయని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి వెళ్లిపోయినట్లు తెలిపారు. ఇట్టి విషయంపై అనేకమార్లు అడిగినా కూడా పెడచెవిన పెడుతూ అధికారులు బాధ్యతారహిత్యంగా ఒక విశ్రాంత ఉద్యోగి పైనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆవేదన వ్యక్తం చేశారు.సివిల్ సప్లై గోదాంలో జరుగుతున్న అవకతకులపై విచారణ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పై అధికారులను ఈ సందర్భంగా వారు కోరారు.
* ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా…….. బి ఆర్ ఎస్ 25 ఏళ్ల ప్రస్థానం * కేటీఆర్ యువసేనమండల అధ్యక్షులు శనిగరపు శ్రీనివాస్*
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
మొగుళ్ళపల్లి మండలంలో గురువారం రోజునవిలేకరుల సమావేశంలో కేటీఆర్ యువసేన మండల అధ్యక్షులు శనిగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పునర్నిర్మాణం ధ్యేయంగా 25 ఏళ్ల క్రితం ఏర్పాటైన టిఆర్ఎస్ (బిఆర్ఎస్ ) ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు తిరుగులేని విజయాలు ఉన్నాయి టిఆర్ఎస్ పురుడు పోసుకుని బి ఆర్ఎస్ గా రూపాంతం చెందిన పార్టీ 25 ఏళ్ల ప్రస్థానంలోకి అడుగు పెట్టనుంది ఈనెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలనీ ఈ మహోత్తర కార్యక్రమానికి పల్లెలు పట్టణాల ప్రజలు కదిలిరావాలని ఈ సభతో రాష్ట్రంలో మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందనే సత్త చూపించాలని కోరారు.
సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజు
కరీంనగర్, నేటిధాత్రి:
ఈనెల 18వ తేదీన సిపిఐ కరీంనగర్ నగర పదకోండవ మహాసభ నగరంలోని గణేష్ నగర్ లో గల బద్ధం ఎల్లారెడ్డి భవన్ లో ఉదయం 10:30 గంటలకు జరగనుందని ఈయొక్క మహాసభకు నగరంలోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మహా సభను విజయవంతం చేయాలని కసిరెడ్డి సురేందర్ రెడ్డి, పైడిపల్లి రాజులు కోరారు. ఈయొక్క మహాసభకు ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామిలు హాజరై ప్రసంగిస్తారని వారు తెలిపారు. ఈయొక్క నగర మహాసభలో కరీంనగర్ నగరంలోని అరవైవ డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించడం జరుగుతుందని, రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ పోటీ చేయుటకు కార్యకర్తలను సంసిద్ధం చేయడం జరుగుతుందన్నారు. నగరంలో గత రెండు సంవత్సరాలుగా అభివృద్ధి పనులు అటకెక్కాయని గత ప్రభుత్వం ఆగ మేఘాల మీద అనేక పనులను శంకుస్థాపనలు చేసి వదిలేసిందని చాలా ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తామని ఎన్నికల ముందు చెప్పి పూర్తిగా మరిచిపోయారని ఆరోపించారు. స్మార్ట్ సిటీ పనుల్లో పూర్తిగా అవినీతి అక్రమాలు జరిగాయని, మానేర్ రివర్ ఫ్రంట్ తీగల వంతెన పనుల్లో పూర్తిగా నాణ్యత లోపించి రోడ్డు పూర్తిగా ధ్వంసమవుతుందని గత మున్సిపల్ పాలకవర్గం పూర్తిగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డందని భూకబ్జాలు, ఇండ్లు కడితే కమిషన్లు, ఇంటి నెంబర్ కు డబ్బులు తీసుకుని నానా రకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టారని ఈసమస్యలతో పాటు నగరంలో ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాల కోసం రేషన్ కార్డుల కోసం అర్హులైన వారికి పెన్షన్ల కోసం రానున్న కాలంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళ్ళుటకు ఈమహాసభ ఎంతగానో ఉపయోగపడుతుందని వారు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం, ఆరు గ్యారెంటీలు అర్హులైన వారికి అందే వరకు ఉద్యమాలతో ఒత్తిడి తీసుకువచ్చి పేద ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలు అందే వరకు పోరాట కార్యాచరణ చేస్తామని సురేందర్ రెడ్డి, పైడిపల్లి రాజు తెలిపారు. ఈమహాసభ నగర ప్రజల దశ దిశ మార్చేందుకు ఉపయోగపడుతుందన్నారు. కావున నగర ప్రజలు మహాసభలో అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.
జమ్మికుంట పాత వ్యవసాయ మార్కెట్ నందు ధాన్యం కొనుగోలు ప్రారంభించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
జమ్మికుంట :నేటిధాత్రి
జమ్మికుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు పొన్నగంటి సంపత్ ఆధ్వర్యంలో జమ్మికుంట పాత వ్యవసాయ మార్కెట్ నందు ధాన్యం కొనుగోలు కేంద్రం ను హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఉపయోగపడేలా కొనుగోలు కేంద్రం ఉండాలని అధికారులకు సూచించారు రైతులు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు దళారులు రైతులను మోసం చేయాలని చూస్తే సహించేది లేదన్నారు ప్రతి ధాన్యం గింజను మద్దతు ధరకు కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు జమ్మికుంట వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు పొన్నగంటి సంపత్ ఆధ్వర్యంలో జరిగింది ఇట్టి కార్యక్రమములో , మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లూరు స్వప్న, వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి సొసైటీ వైస్ చైర్మన్ మామిడి తిరుపతిరెడ్డి, తాసిల్దార్ రమేష్, మార్కెట్ సెక్రెటరీ మల్లేష్,మరియు అగ్రికల్చర్ ఆఫీసర్,హమాలి అధ్యక్షుడు రాజేశ్వరరావు, మార్కెట్ డైరెక్టర్లు,సొసైటీ డైరెక్టర్లు, మరియు రైతులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది
జయ శంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ముచిన్పర్తి గ్రామాన్ని గురువారం రోజున ఏ సి ఎల్ బి అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి తనిఖీ చేయడం జరిగింది . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లను తొందరగా పూర్తి చేయాలని బేస్మెట్ లెవెల్ పనులను లబ్ధిదారులతో పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ డి ఆర్ డి ఏ ఎంపీడీవో జయశ్రీ, ఎంపీ ఓ రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు
వరి ధాన్యాన్ని దళారులకు అమ్మి రైతులు మోసపోవద్దు
జైపూర్,నేటి ధాత్రి:
కష్టపడి పండించిన పంటను దళారులకు అమ్మి రైతులు మోసపోవద్దని కాంగ్రెస్ నాయకులు అన్నారు.జైపూర్ మండలంలోని శివ్వారం,కుందారం,నర్సింగాపూర్,పౌనూరు,గ్రామాలలో కాంగ్రెస్ నాయకులందరూ కలిసి వరి ధాన్యం కొనుగోలు సెంటర్లను ప్రారంభించారు.రైతులు ఎంతో కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోతున్నారని అవకతవకలు చేస్తూ రైతుల దగ్గర నుండి దళారులు కాజేస్తున్నారని రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని ప్రభుత్వం గుర్తించి వడ్ల సెంటర్లను ఏర్పాటు చేసిందని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కష్టాలను తెలుసుకొని సన్న రకం వడ్లకు అదనంగా 500 రూపాయలు బోనస్ అందజేస్తుందని కామన్ గ్రేడ్ ధాన్యానికి 2300. ఏ గ్రేడ్ ధాన్యానికి 2320 తో పాటు అదనంగా 500 రూపాయలు బోనస్ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని ప్రజలందరూ దీన్ని గుర్తించి సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో చల్ల సత్యనారాయణ రెడ్డి,మంతెన లక్ష్మణ్,చల్ల విశ్వంభర్ రెడ్డి,పండుగ రాజన్న,శీలం వెంకటేష్,లక్ష్మీనారాయణ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూడలేకే సోనియా రాహుల్ పైఅక్రమ కేసులు
ధర్నాలో వనపర్తిఎమ్మెల్యే మేఘారెడ్డి
వనపర్తి నేటిదాత్రి :
కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రధాని మోడీ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు నేషనల్ హెరాల్డ్ న్కేసులో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ల పేర్లు నమోదు చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర టీ పీ సీ సీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన పిలుపుమేరకు గురువారం ఖిల్లా ఘనపురం మండల కేంద్రంలో నిర్వహించిన ధర్నా లో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు ప్రతిపక్షాల మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కొనసాగిస్తున్న మోడీ ప్రభుత్వానికి త్వరలోనే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ పై కక్ష దింపు చర్యలు కొనసాగిస్తే చూస్తూ ఊరుకునేది లేదనిఎమ్మెల్యే ఆగ్రహం చేశారు నిరసన కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా డి సి సి బి అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, ఖిల్లా ఘణపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు విజయకుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, పాల్గొన్నారు
హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ గాంధీ పై కేసులు వెంటనే ఎత్తివేయాలని నిరసన
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలో కూడలి వద్ద హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీ పై పెట్టిన కేసులు ఎత్తివేయాలని నిరసనగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణరావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందులో నంబర్ వన్ గా సోనియాగాంధీ,నెంబర్ టు గా రాహుల్ గాంధీ పేర్లు ప్రస్తావించింది మరోవైపు ఇదంతా రాజకీయ కక్ష సాధింపు అని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది.దేశవ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ పాదయా త్రకు ప్రజల నుండి వస్తున్న ఆదరణతో నరేంద్ర మోడీ గుండెల్లో రైళ్లు పరిగెడుతు న్నాయి.రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు.
Congress
సోనియా గాంధీ రాహుల్ గాంధీ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అక్రమంగా పెట్టించిన హెరాల్డ్ కేసులను వెంటనే ఎత్తివేయా లని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి, బాసని చంద్రప్రకాష్ మార్కండేయ, చిందం రవి, మారేపల్లి రవీందర్, కట్టయ్య, రాజేందర్ మోత్కూరు భాస్కర్, చింతల రవిపాల్, పోలపెల్లి శ్రీనివాసరెడ్డి, ఎండి రఫీ, బాసని శాంత- రవి, అన్ని గ్రామాల కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు, అభిమానులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ఈనెల 27 న వరంగల్ జిల్లా సమీప ఎల్కతుర్తిలో నిర్వహించే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభ పట్ల నర్సంపేట రూరల్ మండలంలోని ఇటుకలపల్లి,ఆకుల తండా,ఏనుగుల తండా,ఇప్పల్ తండ గ్రామలలో బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ ఆయా గ్రామాల్లో మండల పార్టీ అధ్యక్షుడు నామాల సత్యనారాయణ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించారు.అనంతరం గోడ పత్రికలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ రుణ మాఫీ పట్ల ప్రకటన ప్రకారం మిగిలిన రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ రంగాల్లో విఫలమయ్యిందని అన్నారు. ఈ కార్యక్రమం లో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఈర్ల నరసింహరాములు,క్లస్టర్ ఇన్చార్జిలు మోటూరి రవి,కడారి కుమారస్వామి,మాజీ ఎంపీటీసీ భూక్యా వీరన్న,మండల పార్టీ ఉపధ్యక్షుడు అల్లి రవి,ఇటుకాపల్లి గ్రామకమిటీ అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్,ఆకుల తండ గ్రామ పార్టి అధ్యక్షుడు కూకట్ల రవి,ఇప్పల్ తండ గ్రామ పార్టి అధ్యక్షుడు ధరావత్ బద్దు,ఏనుగుల తండ గ్రామ పార్టి అధ్యక్షుడు,మాజీ సర్పంచ్ బానోతు రవి,మాజీ సర్పంచ్ లు మండల రవీందర్,భానోత్ శంకర్ నాయక్,మాజీ ఉప సర్పంచ్ జమాల చంద్రమౌళి,వాడికారి గోపాల్,కుసుంబ కోటి,మండల రాజమౌళి,రాధరపు రాజు,నకినబొయిన సారంగం,జామచెట్ల చేరాలు, సాంబయ్య,గజ్జి బాబు, హరీష్, సుమన్,కిషన్ నాయక్,బోయిని సమ్మాలు,పాసికంటి శంకర్ లింగం,కన్నెబోయిన రాజు, కూకట్ల కుమార్ ఉప్పునూతల వీరాచారి,గోపు సాంబయ్య,బానోతు దశ్రు,కిషన్,ధరావత్ దసురు,జై కిసాన్ బద్రు,గ్రామ కమిటీ సభ్యులు,నాయకులు,పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.