హైడ్రెంట్స్,స్పింక్లర్లను ఏర్పాటు చేసుకోవాలి.!

ధియేటర్ లలో హైడ్రెంట్స్,స్పింక్లర్లను ఏర్పాటు చేసుకోవాలి

 

పరకాల నేటిధాత్రి

 

ఫైర్ అధికారి వక్కల భద్రయ్య ఆధ్వర్యంలో పట్టణంలోని జయడీలక్స్ మరియు కాకతీయ థియేటర్లలో అరవ రోజు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించారు.మేనేజర్, సిబ్బందికి అగ్ని ప్రమాదాల నివారణ చర్యల గూర్చి అవగాహన కలిపించారు.అందులో భాగంగా ఫైర్ ఎక్సటింగుషేర్ ఏర్పాటు చేసుకోవాలనీ,నిర్ధేశించిన సమయంలో వాటిని రీఫిల్ చేసుకోవాలని తెలిపారు.హైడ్రెంట్స్,స్పింక్లర్లను ఏర్పాటు చేసుకోవాలని, రెడియం ఎగ్జిట్ సూచికలు అత్యవసర సమయంలో అందరికి కనిపించే విధంగా ఉండాలని సూచించారు.హలొజెన్ దీపాలను వాడలని అత్యవసర సమయలో సిబ్బందికి,సెక్యూరీటీ సిబ్బందికి ఫైర్ స్టేషన్ నెంబర్ అందుబాటులో ఉంచి సమాచారం అందించాలని సూచించారు.ఈ కార్యక్రమం లో పరకాల అగ్ని మాపక సిబ్బంది ఎల్ఎఫ్ కృషుమార్,డ్రైవర్ సత్తయ్య ఫైర్మన్ సత్యం,దిలీప్ కుమార్ లు పాల్గొన్నారు.

యుద్ద ప్రాతిపదికన విద్యుత్ అమర్చిన సింగరేణి.

యుద్ద ప్రాతిపదికన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ అమర్చిన సింగరేణి…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల రాజీవ్ చౌక్ ఏరియాలో సింగరేణి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ గురువారం మధ్యాహ్నం పేలడంతో విద్యానగర్, భగత్ సింగ్ నగర్ ఏరియాలలో గల సింగరేణి క్వార్టర్స్ కు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తక్షణమే స్పందించిన సింగరేణి యాజమాన్యం నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను యుద్ద ప్రాతిపదికన ఏర్పాటు చేసి కార్మికుల సౌకర్యార్థం నూతన ట్రాన్స్ఫార్మర్ ను వెంటనే అమర్చడంతో కార్మికులు సింగరేణి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. సింగరేణి యాజమాన్యం కార్మికుల కొరకు అహర్నిశలు పాటుపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని కార్మికులు వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ పునరుద్ధరణలో సింగరేణి ఇంజనీర్ సదానందం, ఎలక్ట్రిషన్లు తిరుమలరావు, ముస్తాఫ్ అలీ, కాంతారావు, సంపత్ తదితర సింగరేణి మజ్దూర్లు పాల్గొన్నారు.

చత్రపతి శివాజీ జయంతి వేడుకలు

మంచిర్యాల జిల్లా కేంద్రంలో శివాజీ విగ్రహం ఏర్పాటు చేయాలి

మంచిర్యాల,నేటి ధాత్రి:

బీసీ సమాజ్ మంచిర్యాల కార్పొరేషన్ కమిటీ ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలవేసి జయంతి ఉత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ బహుజన రాజు చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని మంచిర్యాల జిల్లా కేంద్రంలో నెలకొల్పుటకు అనుమతించాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు.ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏ విధంగా నైతే హిందూ రాజస్థాపన కై పోరాటం చేసిండో అదేవిధంగా వారి స్ఫూర్తితోనే బీసీ రాజ్యాధికార స్థాపనకు బీసీ సమాజ్ యావత్ బిసి సమాజాన్ని ఏకం చేసి బిసి రాజ్యాధికారం దిశగా పోరాటాలను కొనసాగిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ సమాజ్ సీనియర్ నాయకులు బొలిశెట్టి లక్ష్మణ్, బియ్యాల సత్తయ్య,పోరండ్ల శ్రీనివాస్,సల్ల విజయ్ కుమార్, జక్కం రవీందర్,గుమ్మల సుదర్శన్,బిరుదు రాజు ,శ్రీధర్, రాజు,వెన్నంపల్లి మురళి, గుండ్ల లక్ష్మణ్,బీసీ సమాజ్ మహిళా నాయకురాలు ఆకుతోట పద్మాదేవి,వీణవంక నాగలక్ష్మి,చెన్నూరు ఉమాదేవి తదితరులు పాల్గొని శివాజీ చిత్రపటానికి నివాళులు అర్పించారు.

శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి దేవాలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు

ఆలయ కమిటీ చైర్మన్ తాళ్లపల్లి గోవర్ధన్ గౌడ్

గణపురం నేటి ధాత్రి..

గణపురం మండల కేంద్రంలో శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి దేవాలయంలో గురువారం రోజు మాఘమాస శుక్ల నవమి సందర్భంగా ఆలయంలో స్వామివారికి ఆలయ అర్చకులు ముసునూరు నరేష్ కమిటీ వారిచే ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పురాతన శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి వారి ఆలయ ప్రాంగణంలో 20వేల రూపాయలతో ఆలయ కమిటీ వారిచే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ తాళ్లపల్లి గోవర్ధన గౌడ్ బండారి శంకర్ బూర రాజగోపాల్ మాదాసు అర్జున్ మాదాసు మొగిలి బటిక స్వామి మూల శ్రీనివాస్ గౌడ్ దయ్యాల భద్రయ్య తదితరు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version