రోడ్డుపై గాయాలతో పడి ఉన్న వృద్ధున్ని ఆస్పత్రికి తరలించిన గ్రామస్తులు.

రోడ్డుపై గాయాలతో పడి ఉన్న వృద్ధున్ని ఆస్పత్రికి తరలించిన గ్రామస్తులు.

చందుర్తి, నేటిధాత్రి:

 

చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామానికి చెందిన ఎస్.కె గఫాషా( 80) అనే వృద్ధుడు వేములవాడ కోరుట్ల ప్రధాన రహదారిపై గాయాలతో పడి ఉండడంతో చుట్టుపక్కల వాళ్ళు చూసి 108కు సమాచారం ఇవ్వడంతో అట్టి అంబులెన్స్ లో వృద్దున్ని చికిత్స నిమిత్తం వేములవాడ లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి గ్రామస్తులు తరలించారు. గ్రామస్తుల కథనం ప్రకారం వృద్ధుడు మాత్రల కోసం మెడికల్ షాప్ కు వెళుతుండగా ఏమి జరిగిందో తెలువదు కానీ రోడ్డుపై స్పృహ లేకుండా పడి ఉన్నాడని వెంటనే అంబులెన్స్ తెప్పించి ఆసుపత్రికి తరలించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబులెన్స్ సిబ్బంది ఈఎంటి గణేష్ నాయక్, పైలట్ తోట నరేందర్, గ్రామస్తులు ఉన్నారు.

ఝరాసంఘంలో భారీ వర్షం

ఝరాసంఘంలో భారీ వర్షం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంఘం మండలం బిడే కన్నె గ్రామంలో సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని స్తంభింపజేసింది. గ్రామ సమీపంలో వాగులో చిక్కుకున్న బొలెరో వాహనాన్ని గ్రామస్తులు చాకచక్యంగా బయటకు తీశారు. గ్రామానికి వెళ్లే రోడ్డుపై మోకాలిలోతు నీరు ప్రవహించింది. ఏడాకులపల్లి గ్రామంలో వరద నీటిలో చిక్కుకున్న విద్యార్థులను గ్రామస్తులు సురక్షితంగా దాటించారు. ఈ ప్రాంతంలో 2.0 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version