దివంగత మాజీ ఎమ్మెల్యే కు ఘన నివాళి.
ఎర్ర సత్యం సేవలు మరువలేనివి.
మహబూబ్ నగర్/ నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో దివంగత జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర సత్యం విగ్రహానికి పలువురు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి, అనంతరం జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ను టీపీసీసీ కో ఆర్డినేటర్ దారా భాస్కర్ శాలువాతో మంగళవారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ పార్టీ సీనియర్ నాయకులు పోమాల్ గ్రామా మాజీ సర్పంచ్ కొండనోళ్ల కృష్ణయ్య, మాజీ సర్పంచ్ కొందుటి రామచంద్రయ్య, పోమాల్ గ్రామా మాజీ కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు మాజీ వార్డ్ సభ్యులు పిడుగు సుధాకర్, సంజీవ రెడ్డి, కావలి ఎల్లప్ప ముదిరాజ్, వెంకటయ్య ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.