ప్రాణాలు కాపాడిన చేర్యాల పోలీస్ స్వామి..

ప్రాణాలు కాపాడిన చేర్యాల పోలీస్ స్వామి

చేర్యాల నేటి ధాత్రి

చేర్యాల పట్టణంలో ఈరోజు ఉదయం పెద్ద చెరువు లో పాక రాణి 24 అనే యువతి దూకి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించి మునిగిపోయే ప్రమాదం లో ఉన్న యువతిని చెరువు కట్టపై వాకింగ్ చేస్తున్న చేర్యాల పోలీస్ స్టేషన్లో రైటర్ గా విధులు నిర్వహిస్తున్న తాండ్ర స్వామి గమనించి వెంటనే దూకి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా యువతిని కాపాడాడు అతన్ని ధైర్యాన్ని అందరూ మెచ్చుకున్నారు ఈ సందర్భంగా సిద్దిపేట సీపీ అనురాధ మేడం హుస్నాబాద్ ఏసిపి సదానందం చేర్యాల సిఐ ఎల్ శ్రీను ఎస్సై నవీన్ మరియు తోటి సిబ్బంది చేర్యాలలో పలువురు అభినందించారు

చరిత్రకు సజీవ సాక్ష్యం ఛాయాచిత్రం..

చరిత్రకు సజీవ సాక్ష్యం ఛాయాచిత్రం..

రామాయంపేట ఆగస్టు 19 నేటి ధాత్రి (మెదక్)

 

 

ఒక్క ఫొటోలో ఎన్నో మధుర జ్ఞాపకాలు.

ఉద్వేగాన్ని, ఉత్సాహాన్ని, ఆవేశాన్ని, ఆలోచనను పలికించేది..

మొత్తం ఇతివృత్తాన్ని ఆవిష్కరించేదే ఫొటో

గత స్మృతులను వర్తమానానికి తెలియజెప్పే సాధనం

ఉద్యమాలకు ఊపిరి పోసేది.. ఆధ్యాత్మిక భావాలను పలికించేది

మధుర స్మృతులను నెమరేసుకునేదే చిత్రం..

ఒక్కఫొటో ఎన్నో హావభావాలకు నిదర్శనం

కరిగిపోయే కాలానికి చెరిగిపోని ఛాయాచిత్రం.
ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అన్నట్టు.. ఒక్క ఫొటో ఏళ్ల సజీవ చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుందనడంలో సందేహమే లేదు. ఒక చిత్రం ఎన్నో హావ భావాలను పలికిస్తూ గత స్మృతులను వర్తమానానికి తెలియజెప్పే సాధనంగా నిత్యనూతనంగా విరాజిల్లేది ఫొటో. మధుర జ్ఞాపకాలను పదికాలాల పాటు పదిలంగా ఉంచేది ఫొటో అంటే అతిశయోక్తి కాదు. గంట పాటు చదివే సమాచారాన్ని, కేవలం ఒకే ఒక్క ఫొటో.. క్షణాల్లో విశదీకరిస్తున్నదని పలువురు తమ అభిప్రాయాలను సైతం వ్యక్తం చేసారు. ఉద్యమమయినా, ఆధ్యాత్మికమైనా, ఆపదైనా, సంపదైనా, యుద్ధమైనా, శాంతి అయినా ఒక్క క్లిక్ తోనే ఒడిసిపట్టి చరిత్ర పుటల్లోకి చేరవేసే సాధనం ఒక్క ఫొటోగ్రాఫర్ మాత్రమే అని చెప్పాలి. ప్రపంచ పాటోగపీ దినోత్సవం సందరంగా నేటి ధాత్రి పత్యేక కథనం.

 

రామాయంపేట మండల కేంద్రంలో మంగళవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటి కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురె జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యుడు బన్సీ నాయక్ మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్లు ఎంతో నైపుణ్యంతో వృత్తినే నమ్ముకుని జీవిస్తున్నప్పటికీ ప్రోత్సాహకాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సెల్ ఫోన్ల ప్రాచుర్యం కారణంగా వృత్తి క్షీణిస్తోందని, లక్షల రూపాయలు పెట్టి కొత్త టెక్నాలజీ కెమెరాలు కొనుగోలు చేసే స్తోమత లేక ఫోటోగ్రాఫర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఒక వేదికను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

 

ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు రొయ్యల హరి ప్రసాద్, సంతోష్ రెడ్డి, రామకృష్ణ, నాని రాజ్ కుమార్, బన్సీ నాయక్, సర్దార్ నాయక్, స్వామి, బాబు, రాజ్ కుమార్, సాయిరాం, సాయిరాం గౌడ్, శ్రీకాంత్, చింటూ తదితరులు పాల్గొన్నారు.

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

తాండూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.186 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తాండూరు మండలంలోని ఫోటో & వీడియోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఫోటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ కి శుభాకాంక్షలు తెలియజేసి వారిని శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్,లయన్స్ క్లబ్ సభ్యులు,ఫోటో & వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్,గౌరవ అధ్యక్షులు సబ్బని సమ్మన్న, ప్రధాన కార్యదర్శి ఉప్పల శోభన్,కోశాధికారి రమేష్, మాజీ అధ్యక్షులు కృష్ణమూర్తి, ఎస్.కె మహిన్,పుప్పాల సురేష్,రంజిత్,దుర్గాప్రసాద్, షారుక్,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

యూరియా వివక్షపై తెలంగాణ ఎంపీల ఆందోళన..

తెలంగాణపై వివక్ష
`యూరియా రాజకీయంపై తెలంగాణ ఎంపీల ఆందోళన
`పార్లమెంట్‌ ముందు నిరసన ప్రదర్శన
న్యూఢల్లీ,నేటిధాత్రి:

తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న యూరియా సమస్యను పరిష్కరించాలంటూ పార్లమెంట్‌ ఆవరణలో రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు ఆందోళనకు దిగారు. వారితోపాటు కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు ప్రియాంకగాంధీ నిరసనలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులపై వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన యూరియాను సరఫరా చేయకుండా తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నారని ఎంపీలు మండిపడ్డారు. యూరియాను భాజపా పాలిత రాష్ట్రాలకు దారి మళ్లిస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది.
యూరియా పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని విమర్శించారు కాంగ్రెస్‌ ఎంపీలు. మంగళవారం పార్లమెంటు ఆవరణలో యూరియా కొరతపై మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు యూరియా పంపుతూ.. తెలంగాణపై వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు ఎంపీలు మల్లురవి, గడ్డం వంశీకృష్ణ. తెలంగాణపై కేంద్ర వైఖరికి నిరసనగా పార్లమెంటు ఆవరణలో ఆందోళనకు దిగారు
తెలంగాణకు మొత్తం 9 లక్షల టన్నుల యూరియా రావాల్సి ఉండగా 3 నుంచి 4 లక్షల టన్నుల యూరియా మాత్రమే ఇచ్చినట్లు ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఫెర్టిలైజర్స్‌ పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్‌ క్రితీ ఆజాద్‌ ను సోమవారం ఎంపీలు అంతా కలిసి ఈ అంశంపై వివరించినట్లు- చెప్పారు. మంగళవారం జీరో అవర్‌ లో దీనిపై ప్రశ్నించనున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వాలున్న రాష్ట్రాలకు యూరియా పంపుతూ.. విపక్ష పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలపై వివక్ష చూపిస్తున్నట్లు ఆరోపించారు.

హైదరాబాద్‌లో వరుస దుర్ఘటన

హైదరాబాద్‌లో వరుస దుర్ఘటన
`వినాయక విగ్రహం తరలిస్తుండగా విద్యుత్‌ షాక్‌
`హైటెన్షన్‌ వైర్‌ తగలడంతో ఇద్దరు యువకుల దుర్మరణం
హైదరాబాద్‌,నేటిధాత్రి:

హైదరాబాద్‌ రామంతాపూర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకుల్లో విషాదం మరువకముందే బండ్లగూడలో మరో ఘటన చోటుచేసుకున్నది. వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తుండగా విద్యుత్‌ షాక్‌తో ఇద్దరు యువకులు మృతిచెందారు. కొందరు యువకులు భారీ వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో బండ్లగూడ వద్ద లంబోదరుడి విగ్రహానికి హై టెన్షన్‌ వైరు తరగలడంతో ట్రాక్టర్‌కు విద్యుత్‌ షాక్‌ తగిలింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిని అఖిల్‌ అనే యువకుడిని దవాఖానకు తరలించారు. మృతులను టోని (21), వికాస్‌ (20)గా గుర్తించారు. కరెంటు షాక్‌తో ట్రాక్టర్‌ టైర్లు పూర్తిగా కాలిపోయాయి. దీంతో క్రేన్‌ సహాయంతో వినాయక విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. రామంతాపూర్‌లోని గోఖలేనగర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకల సందర్భంగా రథంపై శ్రీకృష్ణుడి ఉరేగింపు కోసం ప్రత్యేక రథాన్ని తయారు చేశారు. ఆదివారం రాత్రి స్థానిక వీధుల్లో యాదవ సంఘం భవనం నుంచి శ్రీకృష్ణుడి ఉరేగింపు చేపట్టారు. ఓవైపు వర్షం పడుతుండగా మరోవైపు భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణుడి రథయాత్ర కొనసాగింది. ఉరేగింపు దాదాపు పూర్తయి తిరిగి రథాన్ని యాదవ సంఘ భవనం వద్ద పెట్టేందుకు వెళ్తుండగా రథాన్ని ముందుకు లాగుతున్న జీపు ఆగిపోయింది. మరో వంద అడుగుల దూరం ఉండటంతో చేతులతో తోస్తూ వెళ్లారు. మరో 50 అడుగుల దూరం ఉండగానే ఆకస్మాత్తుగా రథాన్ని లాగుతున్న వాళ్లు గట్టిగా అరుస్తూ కిందపడి పోయారు. అప్పటికే రథంపై ఉన్న వాళ్లు ఏం జరిగిందో అర్థం కాక పరుగులు పెట్టారు. వేలాడుతున్న విద్యుత్తు తీగ రథానికి తగిలి షాక్‌ కొట్టింది. దీంతో వెనుక నుంచి తోస్తున్న వాళ్లు 9 మంది అపస్మార స్థితిలో పడిపోయారు. వారిని రక్షించేందుకు స్థానికులు కొందరికి సీపీఆర్‌ కూడా చేసినా ఫలితం లేకుండాపోయింది. ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో నలుగురిని చికిత్స కోసం వివిధ దవాఖానాలకు తరలించారు.

ఆశా వర్కర్ల కు కనీస వేతనం ఇవ్వాలి…

ఆశా వర్కర్ల కు కనీస వేతనం ఇవ్వాలి

పీహెచ్సీ ముందు సిఐటీయు ధర్నా

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

 

గుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో తమకు పారితోషకం వద్దని ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని కోరుతూ పిహెచ్సి ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం స్థానిక డాక్టర్ సుధీర్ కు సమస్యలతో కూడిన వినతి పత్రం సమర్పించారు. తమకు ప్రతి నెల వేతనం సక్రమంగా చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం నేటికీ 20 తారీకు గడుస్తున్నప్పటికీ వేతనం ఇవ్వలేదని తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పిన ప్రభుత్వం మాట దాటి వేసిందని అందుకనే ఈనెల 25న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు, 30 న హైదరాబాద్ కమిషనరేట్ కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహించనున్నట్లు సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యురాలు వజ్జ సుశీల తెలిపారు. జబ్బ ఆదిలక్ష్మి అధ్యక్షతన జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం తమతో వెట్టి చాకిరీ చేయిస్తున్నదని కనీస వేతనం అమలు చేయడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో పూనేమ్ సరోజ, ఊకె విజయలక్ష్మి, లక్ష్మీనరసమ్మ కల్తీ వసంత ,వినోద, ఈశ్వరి ఈసం రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

24న జహీరాబాద్ కు మందకృష్ణ మాదిగ రాక

24న జహీరాబాద్ కు మందకృష్ణ మాదిగ రాక

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఈ నెల 24న జహీరాబాద్ లో పెన్షన్ పెంపు కోసం నిర్వహించే మహా గర్జన సన్నాహక సదస్సుకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జహీరాబాద్ నియోజకవర్గంలోని వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు తప్పక హాజరు కావాలని తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా అధ్యక్షులు నర్సింహులు కోరారు.

శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి ఆధ్వర్యంలో సామూహిక చాలీసా పారాయణం

శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి ఆధ్వర్యంలో సామూహిక చాలీసా పారాయణం

సేవ కమిటీ అధ్యక్షులు ఆకుల సుభాష్ యాదవ్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం ధర్మారావుపేట ఉత్తరముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలొ శ్రావణమాసం శుక్లపక్షం ఏకాదశి మంగళవారం రోజునా శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి ఆధ్వర్యంలో స్వామి వారికీ చందనోత్సవం తమలపాకుల తోరణాలు జిల్లేడు దండలతో పాటు సామూహిక చాలీసా పారాయణం చేయడం జరిగిందని సేవ సమితి అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్ తెలిపారు వచ్చిన భక్తులకు సకల్పం చెప్పి తీర్థ ప్రసాదాలు ఆలయ అర్చకులు బెనికి రాజేందర్ అందించారు. ఈ సంవత్సరం పాడిపంటలు సమృద్ధిగా ఉండి ఆయురారోగ్యాలతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని అందరిపై ఆ స్వామి కరుణకటాక్షలు మెండుగా ఉండాలని ఉత్తరముఖ ఆంజనేయ స్వామిని కోరామన్నారు.ఈ కార్యక్రమంలొ కమిటీ సభ్యులు వాలా నర్సింగరావు బెతి రవీందర్ దూలం శంకర్ ఆకుల దామోదర్ బాపని సాంబయ్య పనికెలా శివకృష్ణ సింగం రాజవిరు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

పాఠశాల ఆవరణలో వర్షపు నీరు…

పాఠశాల ఆవరణలో వర్షపు నీరు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం పంచాయతీ పరిధిలోని గ్రామ ప్రాథమిక పాఠశాలలో వర్షాలకు వర్షపు నీరు చేరింది. రోజులు గడుస్తున్న కొద్దీ నిలిచిన నీటిలో క్రిమికీటకాలు పెరిగి దుర్గంధం వెదజల్లుతోంది.
మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం రాత్రి పడిన వర్షనికీ పాఠశాలలో ఆవరణలో చేరిన వర్షపు నీరు.విద్యార్థులు పాఠశాల గదులకు వెళ్ళటానికి,పాఠశాల నుండి బయటకు వెళ్లడానికి విద్యార్థిలకు ఇబ్బంది కలుగుతుందని విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

 

 

మండల కేంద్రంలో ఉన్న పాఠశాలలో మన ఊరి మనబడి లో ఎన్నో నిధులతో పనులు చేశారు.పాఠశాల ఆవరణలో మట్టి వేసి ఎత్తుగా చేయడం లేదు,
కానీ ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమని విద్యార్థి తల్లిదండ్రులు చింతిస్తున్నారు.ఇప్పటికైనా వెంటనే స్పందించి ఈ సమస్య ను పరిష్కరించాలని విద్యార్థి తల్లిదండ్రులు కోరారు.

చల్మెడ వాగు వద్ద.. గేట్లు ఏర్పాటు..

చల్మెడ వాగు వద్ద..
గేట్లు ఏర్పాటు..

నిజాంపేట: నేటి ధాత్రి

గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వాగుల వద్ద పోలీసులు భారీ గేట్లు ఏర్పాటు చేశారు. ఈ మేరకు నిజాంపేట – చల్మెడ గ్రామాల మధ్య వాగు నిన్న రాత్రి కురిసిన వర్షానికి పొంగిపోర్లడం తో స్థానిక ఎస్ఐ. రాజేష్, ఎంపీడీఓ రాజీరెడ్డీ రోడ్డుకు ఇరువైపులా గేట్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. భారీ వర్షాల నేపథ్యంలో లో ప్రజలు అప్రమత్తం గా ఉండాలన్నారు. చెరువులు కుంటలు నిండుకుండాల మారడం తో ప్రజలు చెరువుల వద్దకు వెళ్ళవద్దన్నారు. అత్యవసర సమయంలో 100 కు డయాల్ చేయాలన్నారు.

విద్యార్థుల ఆలోచన శక్తి మేదస్సు అభివృద్ధి కోసం

విద్యార్థుల ఆలోచన శక్తి మేదస్సు అభివృద్ధి కోసం

స్వగ్రామ విద్య అభివృద్ధికి అంకితభావం…

కేసముద్రం,ఇనుగుర్తి హై స్కూల్స్ కి చెస్ బోర్డుల బహుకరణ

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మరియు ఇనుగుర్తి మండలాల విద్యార్థుల క్రీడా ప్రోత్సాహానికి అమెరికాలో నివాసముంటున్న వెంకటగిరి గ్రామానికి చెందిన ఎన్ ఆర్ ఐ గుజ్జ శ్రీనివాసరావు, ఆయన సతీమణి మంజుల దంపతులు విశేష సహకారం అందించారు. విద్యార్థుల ఆలోచనా శక్తి, మేధస్సు అభివృద్ధి కోసం మండలంలోని 14 ప్రభుత్వ హైస్కూల్స్‌కి ఒక్కొక్క పాఠశాలకు 6 చొప్పున చెస్ బోర్డులు బహుకరించారు.

ఈ కార్యక్రమంలో కేసముద్రం మండల విద్యాశాఖాధికారి కాలేరు యాదగిరి, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు బందెల రాజు, బండారు నరేందర్, ధన్నసరి సింగిల్ విండో చైర్మన్ మర్రి రంగారావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు, బి ఆర్ ఎస్ నాయకులు నీలం దుర్గేశ్, గుగులోత్ వీరునాయక్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఇలా పేర్కొన్నారు.

అమెరికాలో నివసిస్తూ స్వగ్రామ విద్యార్థుల అభివృద్ధికి అంకితభావంతో ముందుకు వస్తున్న గుజ్జ శ్రీనివాసరావు, మంజుల దంపతులు నిజమైన ఆదర్శ దాతలు అన్నారు.

చెస్ ఆట విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని, వ్యూహాత్మక ఆలోచనను పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తుంది అని దాత అభిప్రాయపడ్డారు.

స్వగ్రామ విద్యా అభివృద్ధికి అంకితభావంతో చేసిన గుజ్జ శ్రీనివాసరావు, మంజుల దంపతుల సహకారం కేసముద్రం మండల విద్యా రంగంలో చిరస్మరణీయంగా నిలుస్తుందని అందరూ అభిప్రాయం వ్యక్తం చేశారు.

శేఖపూర్ ఆంజనేయస్వామి దేవాలయం:

శేఖపూర్ ఆంజనేయస్వామి దేవాలయం: శిల్ప సంపదతో రామాయణ గాథ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ మండలం శేఖపూర్ గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం, శివాలయం కలిసి ఉన్న ఏకైక క్షేత్రం. వందల ఏళ్ల నాటి రావి చెట్టు కింద కొలువై ఉన్న ఈ దేవాలయం, అద్భుతమైన శిల్ప సంపదతో రామాయణ చరిత్రను రంగుల రూపంలో కనువిందు చేస్తుంది. ప్రతి మంగళవారం, శనివారం ఇక్కడ హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంది.

స్థానిక సమరం.. ఎవరికీ అనుకూలం?

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-67.wav?_=1

స్థానిక సమరం.. ఎవరికి అనుకూలం!

శాయంపేట నేటిధాత్రి:

తెలంగాణలో 10 ఏళ్ల టిఆర్ఎస్ పాలన తర్వాత గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడిన విషయం తెలిసిందే. ప్రభుత్వం కొలువు దీరి 20 నెలల పాటు పాలన పూర్తయింది. ఇక ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎలాంటి అంచనాలు ఉన్నా యని చర్చ ఆసక్తికరంగా నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు. పదేండ్ల టిఆర్ ఎస్ పాలనలో అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొని పార్టీ అభ్యర్థుల గెలుపు కోసంపాటు పడితే గెలిచిన అనంతరం తమను పట్టించుకోకుండా పార్టీ ఫిరాయింపుదార్లకే పెద్ద పీటా చేస్తున్నారని చాలా రకాలుగా పార్టీల క్యాడర్ మండిపడుతోంది.కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడిన క్యాడర్ ని కాదని గత బిఆర్ ఎస్ ఎమ్మెల్యేల వద్ద అనేక పైరవీలు ఎమ్మెల్యేని భ్రష్టుప ట్టిన వ్యక్తులు మళ్లీ తాజా ఎమ్మెల్యే వద్ద చేరినారని ఆరోపణలు వినిపిస్తున్నాయి పార్టీ జెండా మోసిన అసలు సిసలు కార్యకర్తలను పట్టించు కోకపోవడం లేదని తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పదవి ప్రమాణం చేసిన నాటి నుండి నేటి వరకు అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు మరికొన్ని ప్రజలకు మేలు చేసేదిగా ఉన్నాయి. ప్రభుత్వం కొలువుదీరిన సమయం చాలా తక్కువగా ఉంది. అనేక సంక్షేమ పథకాల అమలుకు ప్రయత్నిస్తున్న మాట నిజమే అయితే అటు కేంద్రంలో కాం గ్రెస్ పార్టీకి పూర్తి వ్యతిరేకమైన బిజెపి అధికారంలో ఉంది. పదేళ్ల రాష్ట్రంలో పాలన సాగించిన కేసీఆర్ అనేక సంక్షేమ పథకాల అమలుకు కట్టడాల పేరుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణించింది. ఆరు గ్యారెంటీలు అమలు ప్రజల సంక్షేమం కోసం పాటుపడిన ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో పూర్తి మెజార్టీ కాంగ్రెస్ పార్టీ ముందున్న లక్ష్యం కాబట్టి ప్రజల తీర్పు ఎటువైపు ఉంటుందో! ఆలోచించాల్సి ఉంది.

ఉరివేసుకొని వ్యక్తి మృతి…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-19T154900.138-1.wav?_=2

 

ఉరివేసుకొని వ్యక్తి మృతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ టౌన్ / ఝారసంగం మండలం
గుర్తు తెలియని మగ వ్యక్తి సంఘటన మంగళవారం చోటు చేసుకుంది ఎస్సై క్రాంతి కుమార్ పటేల్ తెలిపిన వివరాల ప్రకారం వయస్సు అందాజు 30 నుండి 35 సంవత్సరాలు, సంగారెడ్డి జిల్లా, ఝరాసంగం మండలం, కుప్పానగర్ గ్రామ శివారులో ఒక పురాతన పాడుబడిన డాబా యందు గుర్తుతెలియని వ్యక్తి ఉరివేసుకొని చనిపోయి ఉన్నాడు ఇతని యొక్క వివరాలు తెలిసినచో క్రింది నంబరుకు ఎస్ ఐ
8712656771జహీరాబాద్ రూరల్ సిఐ 8712656732. సంప్రదించగలరని తెలిపారు,

తెలంగాణ ఐఏఎస్‌ అధికారులపై కేంద్రానికి ఫిర్యాదు.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-66.wav?_=3

తెలంగాణ ఐఏఎస్‌ అధికారులపై కేంద్రానికి ఫిర్యాదు

హైదరాబాద్‌,నేటిధాత్రి:
కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ.. ప్రభుత్వ కార్యక్రమాల్లో తప్పుదారి పట్టించేలా మాట్లాడిన ఐపీఎస్‌ అధికారి డి.ఎస్‌. చౌహాన్‌, ఐ.ఎ.ఎస్‌ అధికారి హరి చందనలపై ఆల్‌ ఇండియా సర్వీస్‌ ప్రవర్తనా నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ బిఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేతలు సురేష్‌ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో.. మంగళవారం ఢల్లీిలో కేంద్ర సిబ్బంది, ప్రజా వ్యవహారాల శాఖా మంత్రి జితేంద్ర ప్రసాద్‌ కు ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌ నేతలు దాసోజు శ్రవణ్‌ (ఎమ్మెల్సీ), బాల్క సుమన్‌, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌లు

భూపాలపల్లిలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఘనంగా…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-65-1.wav?_=4

ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ 186 దినోత్సవ వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి

ఘనంగా 186 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను
ఫోటో కెమెరా టెక్నాలజీని అభివృద్ధి చేసి, ఫోటోగ్రఫీ సాంకేతికతను , కళను ప్రపంచానికి తెలియజేసిన లూయిస్ మాండే డాగురే జన్మదినాన్ని ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవంగా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుందని ప్రోటోగ్రాఫర్ మండల అధ్యక్షుడు కార్కురి సతీష్ అన్నారు
జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండల ఫోటోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో జయశంకర్ సెంటర్ లో జిల్లా మాజీ అధ్యక్షులు ఎండి రఫీ మండల అధ్యక్షులు కార్కురి సతీష్ ఆధ్వర్యంలో జయశంకర్ విగ్రహానికి, డాగురే చిత్రపటానికి , పూలమాలలు వేసి కేక్ కట్ చేయడం జరిగింది. అనంతరం ఎండి రఫీ కార్కురి సతీష్ మాట్లాడుతూ డాగురె సృష్టించిన ఫోటోగ్రఫీ టెక్నాలజీ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది నిరుద్యోగులు , ఈ ఫోటోగ్రఫీ రంగాన్ని ఆధారం చేసుకొని జీవనాన్ని కొనసాగిస్తూ, ఆర్థికంగా నిలదొక్కుకుంటూ, కుటుంబాలను పోషించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఒక ఫోటో ఎన్నో జ్ఞాపకాలను సజీవంగా ఉంచుతూ, తరతరాలకు అందిస్తుంది, ఫోటోగ్రఫీ ద్వారా ఎన్నిరంగాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా, ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యవర్గ సభ్యులు రంగు రవీందర్, మండల కోశాధికారి కార్కురి శ్రీనివాస్ , సీనియర్ ఫోటోగ్రాఫర్ రాచర్ల సుధాకర్, శ్రీరాముల రమణ, కోరే సదానందం, అడ్డగట్ల శ్రీనివాస్, దిడ్డి సత్యం,మాదాసి శ్రీనివాస్, మాదాసి సతీష్, మనీషా శ్రీనివాస్, నేరేళ్ల శ్రీనివాస్, ఆముదాల మహేందర్, కన్నం కుమార్, బండ మోహన్, కిషోర్,సుమన్, మనోహర్, పూర్ణచందర్, భాస్కర్, రాజు శ్రీకాంత్, సురేష్, వెంకటేష్, కళ్యాణ్, శ్రీనివాస్, అనిల్, రాకేష్, శ్రీధర్, రాజేష్, వినయ్, మధు, శ్రీకాంత్, మోహన్, తదితరులు పాల్గొన్నారు.

మంత్రి కొండా సురేఖ జన్మదినం సందర్భంగా శబరిమలైలో పూజలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-19T150518.761-1.wav?_=5

 

మంత్రి కొండా సురేఖ జన్మదినం సందర్భంగా శబరిమలైలో పూజలు

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

 

 

తెలంగాణ రాష్ట్ర దేవాదాయ,అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ జన్మదిన సందర్భంగా కొండా దంపతుల ప్రియ శిష్యుడు, కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ మడిపల్లి కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో కేరళలోని శబరిమల శ్రీ అయ్యప్పస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివారి ఆరాధనతో అర్చన, అభిషేకాలు ఘనంగా చేపట్టారు. మంత్రి కొండా సురేఖ ఆయురారోగ్యం, సుసంపన్నం కోసం ప్రత్యేక హోమాలు, ప్రార్థనలు నిర్వహించామని మడిపల్లి కృష్ణ గౌడ్ తెలిపారు.ప్రజల కోసం శ్రేయస్సు సాధించాలని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మరిన్ని సేవలు అందించాలని స్వామివారిని మిత్రులతో కలిసి ప్రార్థించినట్లు ఆయన పేర్కొన్నారు

పేదల సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-64-1.wav?_=6

“పేదల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కృషి”

ఊర్కొండలో రేషన్ కార్డుల పంపిణీ.

రూ.12 లక్షలతో అంగన్వాడి భవనాలు మంజూరు.

ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి.

జడ్చర్ల నేటి ధాత్రి

రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యంమనీ జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి స్పష్టం చేశారు. ఊర్కొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే ప్రసంగించారు. “మా ప్రభుత్వానికి పేదల సంక్షేమమే ప్రథమ కర్తవ్యం. అర్హులైన ప్రతి ఒక్కరి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తున్నాం. రేషన్ కార్డు కేవలం ఒక పత్రం కాదు, ఇది పేద కుటుంబానికి భరోసా, భవిష్యత్తుకు ఆర్థిక బలం.

MLA Janampally Anirudh Reddy.

పేదల ఆకలి తీర్చడమే కాకుండా, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో ఇది కీలకం” అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డూ మంజూరు చేయలేదని విమర్శిస్తూ, అర్హులు ఎన్నో ఏళ్లు ఎదురు చూసినా.. దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయని గుర్తుచేశారు. కానీ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అర్హులందరికీ న్యాయం జరుగుతోందని తెలిపారు. “మా పాలనలో ఎవరూ ఆకలితో ఉండరని, ప్రతి అర్హుడికి సకాలంలో ప్రభుత్వం అందించే లబ్ధి చేరుస్తాం” అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఊర్కొండ మండలానికి 163 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం, 1619 పాత రేషన్ కార్డుల్లో ఆడిషన్స్ పూర్తయ్యాయని వివరించారు. ఇప్పటికే గుడిగానిపల్లి, మాదారం గ్రామాలకు రూ.12 లక్షల నిధులతో అంగన్వాడి భవనాలు మంజూరు అయ్యావని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

డిఈఓ జ్ఞానేశ్వర్ కు ఘన సన్మానం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-63.wav?_=7

డిఈఓ జ్ఞానేశ్వర్ కు ఘన సన్మానం

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:

వరంగల్ జిల్లా విద్యాధికారి మామిడి జ్ఞానేశ్వర్ పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించి సంవత్సరం పూరైన సందర్భంగా ఘన సన్మానం చేశారు.ఈ నేపథ్యంలో డిఈఓ జ్ఞానేశ్వర్ ను ఏఎంఓ సృజనతేజ, జీఈసిఓ ఫ్లోరెన్స్, డిఎస్ఓ శ్రీనివాస్, సూపరింటెండెంట్స్, కోఆర్డినేటర్లు, టీఎన్జీవో జిల్లా ఉపాధ్యక్షుడు రామానుజం జగదీశ్వర్ లు శాలువాలతో సన్మానించి పుష్పగుచ్ఛాలతో శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

చిట్యాలలో బిజెపి నాయకుల పరామర్శ..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-62-1.wav?_=8

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి జిల్లా అధ్యక్షులు.

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం కేంద్రంలో ఇటీవల కాలంలో మరణించిన బుర్ర రాజయ్య గౌడ్ వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి వారి వెంట జిల్లా ప్రధాన కార్యదర్శి తాటికొండ రవి కిరణ్ మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ సీనియర్ నాయకులు చెక్క నరసయ్య రేగొండ మండలం ఉపాధ్యక్షులు శివ కృష్ణ సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి తదితరులున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version