మినీ మేడారం జాతర విజయవంతంగా ముగిసింది

మినీ మేడారం జాతర విజయవంతంగా ముగిసింది

-జాతర ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి చదువు అన్నారెడ్డి

-జనంలో నుంచి వనంబాట పట్టిన అమ్మవార్లు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

ఈనెల 28 నుంచి ప్రారంభమైన మినీ మేడారం జాతర విజయవంతంతో శనివారం ముగిసింది. 1లక్ష 50 వేళ మంది భక్తులు మినీ మేడారం జాతరను సందర్శించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని ముల్కలపల్లి-మొగుళ్లపల్లి గ్రామాల మధ్యన అత్యంత వైభవంగా ఇరు గామాల జాతర ఉత్సవ కమిటీ సభ్యుల సమన్వయంతో..మండల అధికారుల సహకారంతో..జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా..అన్ని సౌకర్యాలను కల్పించడంతో..భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి అమ్మవార్లకు మొక్కులను సమర్పించారని జాతర ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి చదువు అన్నారెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అమ్మవార్లు జనంలో నుంచి వనంబాట పట్టడంతో..జాతర ముగిసిందని ఆయన తెలిపారు. జాతర విజయవంతంలో భాగస్వాములైన మండల అధికారులకు, జాతర ఉత్సవ కమిటీ సభ్యులకు, ఇరు గ్రామాల ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి ఆధ్వర్యంలో సామూహిక చాలీసా పారాయణం

శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి ఆధ్వర్యంలో సామూహిక చాలీసా పారాయణం

సేవ కమిటీ అధ్యక్షులు ఆకుల సుభాష్ యాదవ్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం ధర్మారావుపేట ఉత్తరముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలొ శ్రావణమాసం శుక్లపక్షం ఏకాదశి మంగళవారం రోజునా శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి ఆధ్వర్యంలో స్వామి వారికీ చందనోత్సవం తమలపాకుల తోరణాలు జిల్లేడు దండలతో పాటు సామూహిక చాలీసా పారాయణం చేయడం జరిగిందని సేవ సమితి అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్ తెలిపారు వచ్చిన భక్తులకు సకల్పం చెప్పి తీర్థ ప్రసాదాలు ఆలయ అర్చకులు బెనికి రాజేందర్ అందించారు. ఈ సంవత్సరం పాడిపంటలు సమృద్ధిగా ఉండి ఆయురారోగ్యాలతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని అందరిపై ఆ స్వామి కరుణకటాక్షలు మెండుగా ఉండాలని ఉత్తరముఖ ఆంజనేయ స్వామిని కోరామన్నారు.ఈ కార్యక్రమంలొ కమిటీ సభ్యులు వాలా నర్సింగరావు బెతి రవీందర్ దూలం శంకర్ ఆకుల దామోదర్ బాపని సాంబయ్య పనికెలా శివకృష్ణ సింగం రాజవిరు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version