ఆంజనేయస్వామి నూతన దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన

ఆంజనేయస్వామి నూతన దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవo.

కల్వకుర్తి/నేటి ధాత్రి:

 

కల్వకుర్తి మండలం జంగారెడ్డిపల్లి గ్రామంలో గురువారం ఆంజనేయస్వామి నూతన దేవాలయంలో విగ్రహప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి హాజరైన ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి దేవాలయంలో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో పాల్గొని,స్వామి వారి తీర్ధప్రసాదాలు స్వీకరించి,స్వామి వార్ల ఆశీస్సులతో గ్రామస్తులు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగింది…ఈసందర్భంగా
ఆలయ కమిటీ సభ్యులు,గ్రామస్తులు మాట్లాడుతూ…తమ గ్రామంలో ఆంజనేయ స్వామి నూతన దేవాలయ నిర్మాణంలో బాగంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కలిసిన వెంటనే దేవాలయానికి తన వంతు సహకారంగా దాదాపు రూ.5,00,000/-(ఐదు లక్షలతో) పెయింటింగ్ పనులు పూర్తి చేసి దేవాలయ అభివృద్ధికి సహకారం అందించినందుకు గ్రామస్తులందరి తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ శాలువాతో సత్కరించడం జరిగింది..ఈ కార్యక్రమంలో…గ్రామ మాజీ సర్పంచ్ పి.లింగారెడ్డి, సీనియర్ నాయకులు అల్వాల్ రెడ్డి బన్నె శ్రీధర్,పి.పరమేశ్వర్, ఎల్.తిరుపతయ్య, ఎల్.లాలయ్య, జి.బాలస్వామి,లింగం శ్రీను,బన్నె శ్రీను,బన్నె మల్లయ్య,ఎం.బుచ్చిరెడ్డి లతో పాటు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version