పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు…

పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు…

సుభాష్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామాముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు
ఆకుల సుభాష్ ముదిరాజ్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం ధర్మ రావు పేట ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు ఆకుల సుభాష్ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాని ఈ విషయాన్ని ముందుగా శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు కి సమాచారం ఇచ్చి 24 గంటల తర్వాత పత్రిక ద్వారా తెలియపరస్తునని వారు తెలపడం జరిగింది. ఆనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు వారితో నేరుగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఈరోజు వారికీ సమాచారం ఇచ్చి పార్టీనుండి తప్పుకోవడం ఇరువురి మధ్యలో జరిగిన విషయమే పార్టీలో చేరిన రోజు ఇప్పుడు పార్టీ నుండి తప్పుకుంటున్న రోజు మధ్యవర్తి ఎవరు లేరు ఈ రాజీనామా నా ఇష్టాపూర్వకముగా చేస్తున్నది. ఆవేశంగా.తొందరపాటు నిర్ణయం కాకుండా ఒక ఆలోచన చేసి మంచి భావనతో
కొద్దీ రోజులు రాజకీయాలకు దూరంగా ఉంటానని భవిష్యత్తు కార్యాచరణ కాలం నిర్ణయిస్తుందని ఆకుల సుభాష్ తెలిపారు

శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి ఆధ్వర్యంలో ఆలయాల శుద్ధి కార్యక్రమం

శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి ఆధ్వర్యంలో ఆలయాల శుద్ధి కార్యక్రమం

ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆకుల సుభాష్ ముదిరాజ్

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలంలోని ధర్మారావుపేటలొ ఆదివారం చంద్రగ్రహణం కారణగా ఆలయాల మూసిన సందర్బంగా తిరిగి సోమవారం శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి ఆధ్వర్యంలో ఆలయాలు శుద్ధి కార్యక్రమం.

 

దేవత మూర్తులను గ్రామ దేవతలకు పవిత్ర గంగా నది జలలతో స్నానాలు జరిపించడం జరిగిందని అర్చకులు రాజేందర్ సంప్రోక్షణ చేసి దూప దీప నైవేద్యలతో యధావిధిగా పూజ కార్యక్రమాలు పునః ప్రారంభం చేశారని సేవ సమితి అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్ అన్నారు..ఈ కార్యక్రమంలొ సమితి సభ్యులు వాల నర్సింగరావు దూలం శంకర్ ఆకుల దామోదర్ బెతి రవీందర్ రెడ్డి గందే ప్రకాష్ సింగం రాజవిరు ఎల్లంకి శ్రీనివాస్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారని తెలిపారు

శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి ఆధ్వర్యంలో సామూహిక చాలీసా పారాయణం

శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి ఆధ్వర్యంలో సామూహిక చాలీసా పారాయణం

సేవ కమిటీ అధ్యక్షులు ఆకుల సుభాష్ యాదవ్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం ధర్మారావుపేట ఉత్తరముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలొ శ్రావణమాసం శుక్లపక్షం ఏకాదశి మంగళవారం రోజునా శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి ఆధ్వర్యంలో స్వామి వారికీ చందనోత్సవం తమలపాకుల తోరణాలు జిల్లేడు దండలతో పాటు సామూహిక చాలీసా పారాయణం చేయడం జరిగిందని సేవ సమితి అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్ తెలిపారు వచ్చిన భక్తులకు సకల్పం చెప్పి తీర్థ ప్రసాదాలు ఆలయ అర్చకులు బెనికి రాజేందర్ అందించారు. ఈ సంవత్సరం పాడిపంటలు సమృద్ధిగా ఉండి ఆయురారోగ్యాలతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని అందరిపై ఆ స్వామి కరుణకటాక్షలు మెండుగా ఉండాలని ఉత్తరముఖ ఆంజనేయ స్వామిని కోరామన్నారు.ఈ కార్యక్రమంలొ కమిటీ సభ్యులు వాలా నర్సింగరావు బెతి రవీందర్ దూలం శంకర్ ఆకుల దామోదర్ బాపని సాంబయ్య పనికెలా శివకృష్ణ సింగం రాజవిరు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version