చల్మెడ వాగు వద్ద..
గేట్లు ఏర్పాటు..
నిజాంపేట: నేటి ధాత్రి
గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వాగుల వద్ద పోలీసులు భారీ గేట్లు ఏర్పాటు చేశారు. ఈ మేరకు నిజాంపేట – చల్మెడ గ్రామాల మధ్య వాగు నిన్న రాత్రి కురిసిన వర్షానికి పొంగిపోర్లడం తో స్థానిక ఎస్ఐ. రాజేష్, ఎంపీడీఓ రాజీరెడ్డీ రోడ్డుకు ఇరువైపులా గేట్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. భారీ వర్షాల నేపథ్యంలో లో ప్రజలు అప్రమత్తం గా ఉండాలన్నారు. చెరువులు కుంటలు నిండుకుండాల మారడం తో ప్రజలు చెరువుల వద్దకు వెళ్ళవద్దన్నారు. అత్యవసర సమయంలో 100 కు డయాల్ చేయాలన్నారు.