భ్రమరాంబ మల్లికార్జున స్వామివారికి లక్ష పుష్పార్చన…

భ్రమరాంబ మల్లికార్జున స్వామివారికి లక్ష పుష్పార్చన

నేటి ధాత్రి , పఠాన్ చేరు :

 

కార్తీకమాస ఏకాదశి సందర్భంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారికి శనివారం నాడు లక్ష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ
ధర్మకర్తల మండలి సభ్యులు, సిబ్బంది అందరి సహకారంతో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగిందని
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు
వచ్చే బుధవారం కార్తీక పౌర్ణమి దీపోత్సవం ప్రత్యేకంగా
నిర్వహించడం జరుగుతుందని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు
ఈకార్యక్రమంలో ఈవో శశిధర్, ఆలయ అర్చకులు ప్రహ్లాద్,
భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి ఆధ్వర్యంలో సామూహిక చాలీసా పారాయణం

శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి ఆధ్వర్యంలో సామూహిక చాలీసా పారాయణం

సేవ కమిటీ అధ్యక్షులు ఆకుల సుభాష్ యాదవ్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం ధర్మారావుపేట ఉత్తరముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలొ శ్రావణమాసం శుక్లపక్షం ఏకాదశి మంగళవారం రోజునా శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి ఆధ్వర్యంలో స్వామి వారికీ చందనోత్సవం తమలపాకుల తోరణాలు జిల్లేడు దండలతో పాటు సామూహిక చాలీసా పారాయణం చేయడం జరిగిందని సేవ సమితి అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్ తెలిపారు వచ్చిన భక్తులకు సకల్పం చెప్పి తీర్థ ప్రసాదాలు ఆలయ అర్చకులు బెనికి రాజేందర్ అందించారు. ఈ సంవత్సరం పాడిపంటలు సమృద్ధిగా ఉండి ఆయురారోగ్యాలతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని అందరిపై ఆ స్వామి కరుణకటాక్షలు మెండుగా ఉండాలని ఉత్తరముఖ ఆంజనేయ స్వామిని కోరామన్నారు.ఈ కార్యక్రమంలొ కమిటీ సభ్యులు వాలా నర్సింగరావు బెతి రవీందర్ దూలం శంకర్ ఆకుల దామోదర్ బాపని సాంబయ్య పనికెలా శివకృష్ణ సింగం రాజవిరు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి ప్రత్యేక పూజలు

వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి సందర్భంగా

లక్ష తులసి పుష్పార్చన

వనపర్తి నేటిదాత్రి :

వనపర్తి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం నాడు ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పుష్పార్చన ప్రత్యేక పూజలు నిర్వహించామని ఆలయ చైర్మన్ అయ్యలూరి రఘునాథంచార్యులు ఇ ఓ ఎస్ ఆంజనేయులు 33 వ వార్డు మాజీ కౌన్సిలర్ తిరుమల్ నాయుడు ఆలయ పూజారి ఒక ప్రకటనలో తెలిపారు తొలి ఏకాదశి సందర్భంగా శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజలకు వనపర్తి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై తీర్థ ప్రసాదాలు స్వీకరించారని వారు తెలిపారు

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో.!

వనపర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా

లక్ష తులసి పుష్పార్చన

వనపర్తి నేటిదాత్రి :

వనపర్తి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పుష్పార్చన ప్రత్యేక పూజలు సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభమవుతాయని ఆలయ చైర్మన్ అయ్యలూరి రఘునాథంచార్యులు ఇ ఓ ఎస్ ఆంజనేయులు 33 వ వార్డు మాజీ కౌన్సిలర్ తిరుమల్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు తొలి ఏకాదశి సందర్భంగా శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజలకు వనపర్తి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని వారు కోరారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version