ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ 186 దినోత్సవ వేడుకలు
భూపాలపల్లి నేటిధాత్రి
ఘనంగా 186 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను
ఫోటో కెమెరా టెక్నాలజీని అభివృద్ధి చేసి, ఫోటోగ్రఫీ సాంకేతికతను , కళను ప్రపంచానికి తెలియజేసిన లూయిస్ మాండే డాగురే జన్మదినాన్ని ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవంగా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుందని ప్రోటోగ్రాఫర్ మండల అధ్యక్షుడు కార్కురి సతీష్ అన్నారు
జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండల ఫోటోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో జయశంకర్ సెంటర్ లో జిల్లా మాజీ అధ్యక్షులు ఎండి రఫీ మండల అధ్యక్షులు కార్కురి సతీష్ ఆధ్వర్యంలో జయశంకర్ విగ్రహానికి, డాగురే చిత్రపటానికి , పూలమాలలు వేసి కేక్ కట్ చేయడం జరిగింది. అనంతరం ఎండి రఫీ కార్కురి సతీష్ మాట్లాడుతూ డాగురె సృష్టించిన ఫోటోగ్రఫీ టెక్నాలజీ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది నిరుద్యోగులు , ఈ ఫోటోగ్రఫీ రంగాన్ని ఆధారం చేసుకొని జీవనాన్ని కొనసాగిస్తూ, ఆర్థికంగా నిలదొక్కుకుంటూ, కుటుంబాలను పోషించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఒక ఫోటో ఎన్నో జ్ఞాపకాలను సజీవంగా ఉంచుతూ, తరతరాలకు అందిస్తుంది, ఫోటోగ్రఫీ ద్వారా ఎన్నిరంగాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా, ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యవర్గ సభ్యులు రంగు రవీందర్, మండల కోశాధికారి కార్కురి శ్రీనివాస్ , సీనియర్ ఫోటోగ్రాఫర్ రాచర్ల సుధాకర్, శ్రీరాముల రమణ, కోరే సదానందం, అడ్డగట్ల శ్రీనివాస్, దిడ్డి సత్యం,మాదాసి శ్రీనివాస్, మాదాసి సతీష్, మనీషా శ్రీనివాస్, నేరేళ్ల శ్రీనివాస్, ఆముదాల మహేందర్, కన్నం కుమార్, బండ మోహన్, కిషోర్,సుమన్, మనోహర్, పూర్ణచందర్, భాస్కర్, రాజు శ్రీకాంత్, సురేష్, వెంకటేష్, కళ్యాణ్, శ్రీనివాస్, అనిల్, రాకేష్, శ్రీధర్, రాజేష్, వినయ్, మధు, శ్రీకాంత్, మోహన్, తదితరులు పాల్గొన్నారు.