జాన్ పాకలో ఎక్సైజ్ దాడులు,ఇద్దరిపై కేసు నమోదు.

జాన్ పాకలో ఎక్సైజ్ దాడులు,ఇద్దరిపై కేసు నమోదు.  

పరకాల నేటిధాత్రి

గుడుంబా నిర్ములన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా శనివారంరోజున పరకాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని జాన్ పాక శివారులో దాడులు నిర్వహించారు.గుడుంబా తయారీ కోసం నిల్వ ఉంచిన 500 లీటర్ల షుగర్ పానకం ను ధ్వంసం చేసి,5 లీటర్ల గుడుంబా,25 కేజీల షుగర్ ను స్వాధీనం చేసుకొని బాదావత్ శ్రీను,బానోత్ సురేష్ ల పై కేసు నమోదు చేసినట్టు సీఐ తాతజీ తెలిపారు.ఈ దాడులలో ఎక్సైజ్ ఎస్ఐ వై.జ్యోతి
సిబ్బంది లక్ష్మణ చారి,రవీందర్,సమ్మయ్య,విజయ్ కుమార్ పాల్గొన్నారు.

వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.

వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

 

నడికూడ,నేటిధాత్రి:

మండలంలోని వివేకానంద గ్రామైక్య సంఘం నర్సక్కపల్లి, కనకదుర్గ గ్రామ ఐక్య సంఘం చర్లపల్లి, సోనియా గ్రామీక సంఘం నార్లాపూర్ ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఏపిఎం రమాదేవి,కాంగ్రెస్ పార్టీ నడికూడ మండల అధ్యక్షు డు బుర్ర దేవేందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కుడ్ల మలహల్ రావు,పర్నెం మల్లారెడ్డి,సమన్వయ కమిటీ సభ్యులు,సిసి కుమారస్వామి,రైతులు తదితరులు పాల్గొన్నారు.

పోషణ లోపం లేని సమాజాన్ని నిర్మిద్దాం.!

పోషణ లోపం లేని సమాజాన్ని నిర్మిద్దాం- 7 వ రాష్ట్రీయ పోషణ పక్షం

 

నడికూడ,నేటిధాత్రి:

స్వాతి సిడిపిఓ అధ్యక్షతన పరకాల ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో నడికూడ మండలంలోని నర్సక్కపల్లి గ్రామంలో జాతీయ పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి
ముఖ్యఅతిథిగా జిల్లా సంక్షేమ అధికారి జెట్టి జయంతి హాజరై మాట్లాడుతూ అంగన్వాడి సెంటర్లో ముఖ్యంగా నిర్వహించే కార్యక్రమాలు మొదటిది ఆరోగ్య లక్ష్మి, రెండవది ప్రీస్కూల్,మూడోది లోపోషణతో బాధ పడే పిల్లల పోషణస్థితిని మెరుగుపరిచే విధంగా అంగన్వాడి టీచర్స్ పని చేయాలని సూచించారు. పోషణ పక్షంలో భాగంగా ఏప్రిల్ 8 నుండి 22 వరకు ప్రతి గ్రామంలో పోషణ కార్యక్రమాలు నిర్వహించి పోషణ లోపం లేని సమాజం నిర్మించేలా కృషి చేయాలన్నారు.గర్భిణీలు, బాలింతలు అంగన్వాడి కేంద్రాల ద్వారా అందించే ఒక్కపూట భోజనం సద్వినియోగం చేసుకోవాలి, పౌష్టిక ఆహారం తీసుకుంటేనే పుట్టే పిల్లలు ఆరోగ్యవంతంగా పుడతారన్నారు.ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీల కు శ్రీమంతాలు,6 నెలలు నిండిన పిల్లలకి అన్నప్రాసనలు,అంగన్వాడి పూర్వ ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్న
చిన్నారులకు గ్రాడ్యుయేషన్
డే,చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పరకాల తహసిల్దార్ టి. విజయలక్ష్మి,నడికూడ తహసిల్దార్ నాగరాజు, నడి కూడ మండల వైద్యాధికారి కే దివ్య,ఎంపీడీవో నడికూడ విమల,సఖి అడ్మిన్ హైమావతి,పోషణ అభియాన్ డిస్టిక్ కోఆర్డినేటర్ సుమల డిహెచ్ఈడబ్ల్యు కోఆర్డినేటర్ కళ్యాణి,ఐసిడిఎస్ సూపర్వైజర్లు శ్రీదేవి, హేమలత,పుణ్యవతి,రోజా రాణి,మంజుల,సునీత,రాణి, నజీమ,పర్వీన్,ఉమాదేవి, పోషణ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ బిక్షపతి,జిల్లా బాలల పరిరక్షణ విభాగం విజయకుమార్,అంగన్వాడీ టీచర్స్,ఆశ వర్కర్స్,గర్భిణీ స్త్రీలు,పిల్లలు మొదలగు వారు పాల్గొన్నారు.

కోట్లతో వాటర్ షెడ్ల నిర్మాణం: మంత్రి.

కోహిర్: 10. 50 కోట్లతో వాటర్ షెడ్ల నిర్మాణం: మంత్రి

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

10. 50 కోట్లతో వాటర్ షేట్ల నిర్మాణం పూర్తి చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. కోహిర్ మండలం పీచే రాగడి గ్రామంలో వివిధ అభివృద్ధి పనులను శనివారం ప్రారంభించారు. మహిళా సంఘాలకు 1. 56 కోట్ల రుణాలను పంపిణీ చేశారు. ఉన్నత పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు కేటాయిస్తారని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీ సురేష్ షెట్కార్ పాల్గొన్నారు.

దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం.

దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం. 

దమ్మాయిగూడ నేటి ధాత్రి

 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా

దమ్మాయిగూడ మున్సిపల్ సిబ్బందికి గత రెండు నెలలు గా జీతాలు రానందున ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు పక్కన ఉన్న నాగారం మున్సిపాలిటీ ఫిబ్రవరి జీతాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ దమ్మైగూడలో ఎందుకు ఇవ్వడం లేదు అని మున్సిపల్ సిబ్బంది ప్రశ్నించడం జరిగింది వారికీ మద్దతుగా బీజేపీ నాయకులు మున్సిపల్ కమిషనర్ కు విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి తక్షణమే చేర్యా తీసుకోవాలని కోరడం జరిగింది లేనిపక్షంలో సోమవారం నాడు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో బిజెపి నాయకులు నాగారం మాజీ చైర్మెన్ కౌకుట్ల చెంద్రారెడ్డి,( బి ఎం ఎస్ ) నాయకులు రాము, మోర నాగమల్లా రెడ్డి, సామల భరత్ రెడ్డి , డొంకెన రవీందర్ గౌడ్, రామిడి బాపి రెడ్డి, మహిళా మోర్చా మునిసిపల్ అధ్యక్షురాలు రోత్తమ్ ప్రశాంతి, దాసరి సరెండర్ రెడ్డి, దసారం సతీష్ కుమార్, కే కుమార్, జరిపిటి ఆంజనేయులు, తడుక కృష్ణ, సాయికృష్ణ చారీ, చక్రపాణి, ర్ సురేష్, మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

మినిస్టేడియంలో కొనసాగుతున్నకబడ్డీ రెజ్లింగ్ క్రీడలశిక్షణ.

మిని స్టేడియంలో కొనసాగుతున్న కబడ్డీ,రెజ్లింగ్ క్రీడల శిక్షణ

నర్సంపేట,నేటిధాత్రి:

 

వరంగల్ జిల్లా యువజన,క్రీడల అధికారిని టీవీఎల్ సత్యవాణి ఆధ్వర్యంలో నర్సంపేట మిని స్టేడియంలో కబడ్డీ ఇంచార్జ్ కోచ్ యాట రవికుమార్ ముదిరాజ్, రెజ్లింగ్ ఇంచార్జ్ కోచ్ సిరపురపు మహేశ్ శిక్షణలో ప్రతిరోజు ఉదయం 5:30 గంటల నుండి 7:30 గంటల వరకు సాయంత్రం 5:30 గంటల నుండి 7:30 గంటల వరకు బాల బాలికలకు కబడ్డీ,రెజ్లింగ్ క్రీడల శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి.

Kabaddi

ఈ శిక్షణలో పాల్గొనే విద్యార్థులు ప్రతిరోజు ఉదయం,సాయంత్రం మిని స్టేడియం నర్సంపేటలో జరిగే కబడ్డీ,రెజ్లింగ్ క్రీడల శిక్షణకు హాజరై శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు కబడ్డీ శిక్షణ కొరకు 9666623438, రెజ్లింగ్ శిక్షణ కొరకు 6305271260 నెంబర్లను సంప్రదించాలని డివైస్ ఓ టీవీఎల్ సత్యవాణి ఒక ప్రకటనలో తెలిపారు.

పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత అవసరం

పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత అవసరం

*బిట్స్ స్కూల్ విద్యార్థులకు
గ్రీన్ ఒలంపియాడ్ టెస్ట్ సర్టిఫికెట్ల ప్రదానోత్సవం*

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

సమాజంలో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందడం, వాహనాల వినియోగం ఎక్కువ కావడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందనీ, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని బాలాజీ టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ పెరుమాండ్ల రాజేంద్రప్రసాద్ అన్నారు.పర్యావరణ అటవీ మరియు వాతావరణ మంత్రిత్వ శాఖ సూచనల మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో గత నవంబర్ మాసంలో నిర్వహించిన గ్రీన్ ఒలంపియాడ్ టెస్ట్ లో పాల్గొన్న బాలాజీ టెక్నో స్కూల్ విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు.ఈ పర్యావరణ పరిరక్షణా చర్యలు చేపట్టడాన్ని మీ వ్యక్తిగత జీవితంలో ఒక ప్రధాన బాధ్యతగా స్వీకరించాలని విద్యార్థులకు సూచించారు.
బాలాజీ విద్యార్థులు మొత్తం 183 మంది ఈ ఒలంపియాడ్ టెస్ట్ రాశారు. అందులో పదిమంది విద్యార్థులు మెరిట్ సర్టిఫికెట్ పొందగా 173 మంది విద్యార్థులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లను ప్రిన్సిపల్ రాజేంద్రప్రసాద్ అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎం.డి. రియాజుద్దీన్, ప్రదీప్ చౌదరి, క్రాంతి కుమార్ మరియు ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

కోహిర్ మండలంలోని పిచారగడి గ్రామంలో.!

కోహిర్ మండలంలోని పిచారగడి గ్రామంలో వాటర్ షెడ్ ప్రారంభోత్సవా కార్యక్రమంలో పాల్గొన్న.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

➡ తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ
➡ జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్
➡ మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ ఇంచార్జ్ డా౹౹ఏ. చంద్రశేఖర్

inauguration ceremony of a water

 

శనివారం నాడు, కోహిర్ మండలంలోని పిచారగడి గ్రామంలో వాటర్ షెడ్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఇండస్ట్రియల్ చైర్మెన్ తన్వీర్,కోహిర్ మండల అధ్యక్షులు రామలింగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్షద్ అలీ గారు,మహిళ సంఘాల అధ్యక్షులు&సభ్యులు, మరియు మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

డ్రైనేజీ పొంగిపొర్లుతు కాలనీలో దుర్గంధం.

డ్రైనేజీ పొంగిపొర్లుతు కాలనీలో దుర్గంధం

15,20 రోజుల నుంచి రోడ్డుపై ఏరులై పారుతున్న డ్రైనేజీ పట్టించుకోని అధికారులు

డ్రైనేజీ సమస్య శాశ్వితంగా పరిష్కారం చూపించండి

స్థానిక కాలనీవాసులు

మల్కాజ్ గిరి నేటిదాత్రి

మల్కాజిగిరి డివిజన్ బాల సరస్వతి నగర్ లో (ఆత్మ లింగ మహా గణపతి ఆ లయ రోడ్డులో) గత 20 రోజులుగా డ్రైనేజీ పొంగిపొర్లు తున్న అధికారులు పట్టించుకోవడం లేదని తెలుపుతున్నారు. డ్రైనేజీ పొంగి పొర్లుతుందని వాటర్ వర్క్స్ సంబంధించిన అధికారులకు ఫిర్యాదు చేసిన ఇటువైపు చూడడం లేదని, చూస్తాము చేస్తాము పంపిస్తున్నామని మాటలు చెబుతూ కాలనీవాసులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు స్థానికులు తెలుపుతున్నారు.గత వారం ఇదే సమస్యను కార్పొరేటర్ దృష్టికి తీసుకువెళ్లగా సంబంధిత వారికి చెప్పగా తూతూ మంత్రంగా చర్యలు తీసుకొని వదిలేసారని, డ్రైనేజీ పొంగి కాలనీ రోడ్లన్నీ కూడా వాసనతో ఇండ్లలోకి దుర్గంధం వస్తుంటే ఇండ్లలో స్థానికులు ఉండలేకపోతున్నారని ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారుల పైన ఉన్నత అధికారులు చర్యలు తీసుకో వాలని కోరుతున్నారు.చిన్న చిన్న సమస్యలనే పరిష్కరించలేని అధికారులు, నాయకులు ప్రజా సమస్యలను ఇంకా ఏదైనా ఇబ్బందులు వస్తే ఎలా పరిష్కరిస్తారని స్థానికులు అడుగుతున్నారు.సమస్య పరిష్కరించకుండా వదిలేస్తే కాలనీ వాసులు,ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని రోడ్డుపై నడవడానికి కూడా సమస్యగా ఉందని చెబుతున్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఏఎంసీ మార్కెట్ చైర్మన్ రాజిరెడ్డి

 

పరకాల నేటిధాత్రి

మండలంలోని పోచారం,లక్ష్మీపురం గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డితో పాటు ఐకేపీ నోడల్ ఆఫీసర్ జ్యోతి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ దాసరి బిక్షపతి,బుడిమె రాజయ్య మరియు పోచారం గ్రామ కమిటీ అధ్యక్షులు నీరటి అశోక్, పరకాల సమన్వయ కమిటీ సభ్యులు కొలిపాక చందు,కోరే శ్రీనివాస్,పిఏసీఎస్ డైరెక్టర్ కొలిపాక అర్జున్ పిఏసీఎస్ పరకాల కార్యనిర్వహణాధికారి నాగరాజు,రాయపర్తి మాజీ ఎంపీటీసీ పర్నం మల్లారెడ్డి, లక్ష్మీపురం గ్రామంలో మాజీ ఎంపీటీసీ పల్లెబోయిన శ్రీనివాస్,మాజీ సర్పంచ్ ఆలేటి రవింర్,చిలువేరు మల్లయ్య మరియు గ్రామ కమిటీ సభ్యులు పల్లెబోయిన భాస్కర్,బండారి నరేష్,మంగళపెల్లి సాంబయ్య,మొగిలి సెంటర్ ఇంచార్జీ రమేష్ మరియు ఇందిరమ్మ కమిటీ సభ్యులు కార్యకర్తలు రైతులు,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఆర్టీసీ నర్సంపేట డిపో జేఏసీ చైర్మన్ గా కొలిశెట్టి రంగయ్య.

ఆర్టీసీ నర్సంపేట డిపో జేఏసీ చైర్మన్ గా కొలిశెట్టి రంగయ్య

వైస్ చైర్మన్ గా గొలనకొండ వేణు

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట ఆర్టీసీ డిపో జేఏసీ చైర్మన్ గా కొలిశెట్టి రంగయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.శనివారం స్థానిక నర్సంపేట పురపాలక సంఘంలో ఆర్టీసీ డిపోకు చెందిన వివిధ యూనియన్ల నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా నూతన డిపో జేఏసీ కమిటీని ఎన్నుకున్నారు.

RTC

డిపో జేఏసీ చైర్మన్ గా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్. డబ్ల్యూఎఫ్) డిపో అధ్యక్షులు కొలిశెట్టి రంగయ్య,తెలంగాణ జాతీయ మజ్దార్ యూనియన్ (టీజేఎంయూ) డిపో సెక్రెటరీ గొలనకొండ వేణును వైస్ చైర్మన్ గా ఎన్నుకున్నారు. కన్వీనర్లుగా ఎంకే.స్వామి (టీఎంయూ), పీసీ. పాలన్ (ఈయూ), బూర ప్రవీణ్ కుమార్, కందికొండ మోహన్, బొడిగె రాజు,ఎండి. జానీపాషా, మంద రాజు, నామాల అశోక్ కుమార్, డ్యాగల వెంకట్రాం నర్సయ్య, ఎన్.రాజాలు తదితరులు పాల్గొన్నారు.

గ్రామాలలో కలిస్తే గెలుస్తాం.

గ్రామాలలో కలిస్తే గెలుస్తాం..నిలుస్తాం

బిసా రమేష్,తాళ్ళ రవి ముదిరాజ్

నేటిధాత్రి:

ముదిరాజ్ ల జాతి అభివృద్ధి కోసం విద్యా,ఉద్యోగం,సాధికారత లక్ష్యంగా అడుగులు వేద్దామని అవిశ్రాంతంగా ముదిరాజ్ కుల బంధువుల అభ్యున్నతికి పాటుపడుతున్న మెపాకు సంఖ్యాపరంగా అధికంగా ఉన్నప్పటికీ ఆర్థిక రాజకీయ సామాజికతలో ముదిరాజ్ ల వెనుకబడి ఉన్నారని విద్యతోనే అభివృద్ధి సాధ్యమని మెపా చేస్తున్న ప్రగతి కార్యక్రమాల కొనసాగింపుగా అన్ని రంగాలలో ముదిరాజ్ లు రాణించేలా అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని మెపా అభివృద్ధికి విస్తరణకు మూలాలలోకి వెళ్తూ గ్రామ గ్రామాన కలిస్తే గెలుస్తాం.. నిలుస్తాం అని మెపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిసా రమేష్ ముదిరాజ్,మెపా రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ రవి ముదిరాజ్ తెలిపారు.వారు మాట్లాడుతూ ముదిరాజ్ లకు చైతన్య కార్యక్రమాలు,విద్యతో అన్ని సమస్యలకు పరిష్కారం అవుతాయి కాబట్టి ముదిరాజ్ యువత విద్య,ఉద్యోగ అవకాశాల వైపు రాజకీయ సాధికారతవైపు అడుగులు వేసేందుకు ముదిరాజ్ లు ఒక తాటిపైకి వచ్చి పూర్తిస్థాయిలో కలిసికట్టుగా సహకరిద్దామని తెలియజేశారు.

ఘనంగా టిఎస్ఎస్ సిసిడిసి.!

ఘనంగా టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చేర్మెన్ వై.నరోత్తం జన్మదిన వేడుకలు..

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్)మాజీ చేర్మెన్ వై.నరోత్తం గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు బి.దిలీప్ డబ్లూ హెచ్ ఆర్ పి సి ఆద్వర్యంలో టపాకాయలు కాల్చి జన్మదిన కేక్ ను కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరిగింది,ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు శంకర్, శివరాజ్ పాటిల్,నబి సాబ్, యం.జైపాల్,కె.నర్శింలు,చెంగల్ జైపాల్,జి.జగన్,బాల్ రాజ్, ఇమ్రాన్,సి.యం.అశోక్ రెడ్డి, పెంటన్న,అనిల్,తదితరులు పాల్గొన్నారు

బీసీలంతా ఐక్యంగా పోరాడితేనే బీసీ బిల్లు సాధ్యం

బీసీలంతా ఐక్యంగా పోరాడితేనే బీసీ బిల్లు సాధ్యం

-వేముల మహేందర్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

కులాలకతీతంగా, పార్టీలకతీతంగా బీసీలంతా ఏకమై ఐక్యంగా పోరాడితేనే పార్లమెంటులో బీసీ బిల్లు సాధ్యమవుతుందని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ అన్నారు. శనివారం ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల కోటాలో బీసీలకు కల్పించిన 42 శాతం రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ఆమోదించి, 9వ షెడ్యూల్లో చేర్చాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అడుక్కుంటే వచ్చేది బిచ్చం..పోరాడితే సాధించుకునేది మన వాటా అని అన్నారు. బీసీలు ఉవ్వెత్తున ఉద్యమాలు చేసినప్పుడే రాజ్యాధికారం సాధించుకుంటామన్నారు. బీసీలంతా ఐక్యంగా ఉన్నప్పుడే బీసీ బిల్లుకు న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీసీల పక్షపాతేనన్నారు. దేశంలో బీసీ వాదం బలంగా ఉందని, బీసీలు అగ్గిరాల్చితే అందరూ భయపడతారన్నారు. తమిళనాడులో దివంగత జయలలిత మాదిరిగా మనం కూడా మిలిటెంట్ పోరాటాలు చేయాలన్నారు. రాజ్యాంగ స్వరూపాన్ని మార్చైన మన రిజర్వేషన్లను సాధించుకోవాలని, బీసీ బిల్లు కోసం పార్లమెంట్ సభ్యులతో చర్చించాలని, బీసీలు అంటే ఓట్లు వేసే యంత్రాలు, పార్టీల జెండాలు మోసే కార్యకర్తలుగా మిగలవద్దన్నారు. బీసీలు బిచ్చగాళ్లు కాదు..రాజ్యాధికారం వైపు పయాణించే బ్రిలియంట్ క్యాస్ట్ అని తెలిపారు.

ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా.!

ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి

రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

కార్యక్రమాలు పాల్గొన్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

* సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )*

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని యాసంగి పంట కొనుగోలు రైతులకు ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సన్న బియ్యం సరఫరా , ధాన్యం కొనుగోలు పై పౌరసరఫరాల శాఖ కమిషనర్ డి.ఎస్. చౌహాన్ తో కలిసి జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా,సిరిసిల్ల ఇన్చార్జ్ ఆర్డి.ఓ రాదాబాయి తో కలిసి ఇల్లంతకుంట తహసిల్దార్ కార్యాలయం నుంచి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, అకాల వర్షాలు కారణంగా రైతులు నష్టపోకుండా నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని మంత్రి సూచించారు. దేశంలో అత్యధికంగా వరి పంట పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందని, వానాకాలంలో 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం, యాసంగి లో 127.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పంట పండిందని అన్నారు. వానాకాలం పంట కొనుగోలు సజావుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించినందుకు కలెక్టర్లకు, అదనపు కలెక్టర్ లు, పౌర సరఫరాల అధికారులకు, ఇతర సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు. వాన కాలం కంటే అదనంగా యాసంగి సీజన్ లో 70 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు.ధాన్యం కొనుగోలు అంశంపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేకంగా మానిటర్ చేయాలని అన్నారు. రైస్ మిల్లర్లు తాళ్ళు, తరుగు పేరు మీద ఎటువంటి కోతలు లేకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేందుకు అధిక ప్రాధాన్యత అందించాలని , దీనికి అనుగుణంగా జిల్లాలలో ఐకెపి, ప్యాక్స్ కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలలో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలలో ఎక్కడైనా కొనుగోలు కేంద్రాలలో మౌలిక వస్తువుల కొరత ఉంటే కలెక్టర్లు వాటిని కొనుగోలు చేయవచ్చని మంత్రి తెలిపారు.
భారత ఆహార సంస్థ మార్గదర్శకాలు ప్రకారం నూకల శాతం 25 దాటకుండా చూడాలని అన్నారు. ప్రభుత్వం అందించే ధర కంటే అధికంగా అందిస్తే మాత్రమే రైతులు ప్రైవేట్ గా బియ్యం అమ్ముకోవాలని, తక్కువ ధరకు ఎట్టి పరిస్థితుల్లో అమ్మడానికి వీలు లేదని అన్నారు. మన రాష్ట్రంలో అత్యధిక జనాభా దొడ్డు బియ్యం తినడం ఆపేసారని, దీనిని గమనించి రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం 84 శాతం జనాభాకు ఉచితంగా సరఫరా చేసే కార్యక్రమం చేపట్టామని అన్నారు. సన్న బియ్యం సరఫరా పంపిణీ విజయవంతం అవుతుందని, పేదలు, ప్రజలు సన్న బియ్యం సంతోషంతో స్వీకరిస్తున్నారని, 84 శాతం జనాభా ఆహార భద్రతకు సుస్థిరత ఏర్పడిందని అన్నారు.
13 వేల కోట్లు ఖర్చు చేసి 30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రేషన్ కార్డుదారులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా చూడాలని అన్నారు. సన్న బియ్యం నాణ్యత పై సామాజిక మాధ్యమాల్లో అక్కడక్కడ వస్తున్న వ్యతిరేక వార్తలను పరిశీలించి తప్పుడు వార్తలైతే వెంటనే ఖండించాలని మంత్రి అధికారులకు సూచించారు.నీటిపారుదల ప్రాజెక్టుల పరిధిలో ఎక్కడైనా త్రాగు నీటి సరఫరా ఇబ్బందులు, కొరత ఎక్కడైనా ఉంటే సమాచారం అందించాలని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 241 కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామని, మొత్తం 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించనున్నామని తెలిపారు. జిల్లాల 36 బాయిల్డ్ రైస్ మిల్లులు ఉండగా, ఒక్కరు మాత్రమే బ్యాంక్ గ్యారంటీ ఇచ్చారని, మిగతావారు ఇచ్చేలా ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు. రైస్ మిల్లర్లు ముందుకు రాకపోతే ప్రత్యామ్నాయంగా గోదాములలో రైతుల ధాన్యం నిలువ చేస్తామని తెలిపారు.వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ నుండి అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్,జిల్లా నీటి పారుదల శాఖ అధికారి అమరేందర్ రెడ్డి, అధికారులు కిషోర్, మిషన్ భగీరథ అధికారులు జానకి, శ్రీనివాస్, జిల్లా పౌర సరఫరాల అధికారి వసంత లక్ష్మి, డిఎం రజిత తదితరులు పాల్గొన్నారు.

ఉద్యమకారుల గ్రామ కమిటీ ఎన్నిక. 

ఉద్యమకారుల గ్రామ కమిటీ ఎన్నిక. 

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలంలోని మైలారం గ్రామ ఉద్యమకా రుల గ్రామ కమిటీని మండల అధ్యక్షుడు ఇమ్మడిశెట్టి రవీందర్, ప్రధాన కార్యదర్శి చల్లా శ్రీనివాస్ రెడ్డిల ఆధ్వర్యంలో శనివారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా దుదిపాలజోగిరెడ్డి, ఉపాధ్య క్షుడు అరికిల్ల వీరయ్య, ప్రధానకార్యదర్శిలు గొర్రె కుమారస్వామి, దూదిపాల రాజిరెడ్డి, కోశాధికారి బొంతల నాగరాజు, కార్యవర్గ సభ్యులు దూదిపాల రాంరెడ్డి, సోంటెడ్డి శంకర్, బొంతల సాంబయ్య, ఆకారపు ఐలయ్య, బొంతల భిక్షపతి ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమం లో జిల్లా ఉపాధ్యక్షుడు పల్లెబోయిన సారయ్య తదితరులు పాల్గొన్నారు.

బెల్లంపల్లి లో రన్ ఫర్ జీసస్.

బెల్లంపల్లి లో రన్ ఫర్ జీసస్.

బెల్లంపల్లి నేటిధాత్రి :

 

 

గుడ్ ఫ్రైడే ఈస్టర్ పండుగల సందర్భముగా యేసు క్రీస్తు ప్రభు మరణ పునరుత్థానములను స్మరించు కొంటూ , బెల్లంపల్లి నియోజకవర్గ మండలాల్లోని క్రైస్తవ విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొని బెల్లంపల్లి పట్టణంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించారు. బెల్లంపల్లి పట్టణం లోని క్రైస్తవ మత పెద్దలు రెవ సి హెచ్ అశోక్, ఫాదర్ కురియన్, జార్జ్ మాత్యు , జోషి, స్వామి జాకబ్ వారి ఆద్వర్యం లోని సంఘాల విశ్వాసులు ప్రార్ధనా పూర్వకంగా పాల్గొని కార్యక్రం జయప్రదం చేశారు.

సిరిసిల్ల జిల్లా (IAP) చిన్నపిల్లల వైద్యుల.!

సిరిసిల్ల జిల్లా (IAP) చిన్నపిల్లల వైద్యుల కార్యవర్గం ఎన్నిక. 

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి )

 

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని పిల్లల వైద్యులు (పీడియాట్రిషియన్లు) ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (IAP) రాజన్న సిరిసిల్ల శాఖ కొత్త కార్యవర్గం బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అధ్యక్షుడిగా డా. నల్ల మధు మరియు జనరల్ సెక్రటరీగా డా. తడుకా సాయికుమార్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రానున్న సంవత్సరానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికపై చర్చలు జరిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రముఖ సీనియర్ పిల్లల వైద్యులు డా. కె ప్రసాద్ రావు, డా. మురళీధర్ రావు, డా. శ్రీనివాస్, డా. సురేంద్రబాబు గారులతో పాటు, ఇతర పీడియాట్రిషియన్లు పాల్గొన్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమం ద్వారా( IAP) రాజన్న సిరిసిల్ల శాఖ సామూహిక కార్యకలాపాల శక్తివంతమైన ఆరంభాన్ని సూచిస్తూ, భవిష్యత్తులో పిల్లల ఆరోగ్య అభివృద్ధికి మరింత తోడ్పాటు అందించనుంది అని వైద్యులు తెలిపారు.

అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమం.

అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమం

జైపూర్,నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని వివిధ గ్రామాల్లో సంబంధిత ఆయా గ్రామ అంగన్వాడీ టీచర్స్ పోషణ పక్షం కార్యక్రమాలు నిర్వహించారు.శనివారం మిట్టపల్లి,కుందారం గ్రామపంచాయతీలలో అంగన్వాడి సిబ్బందీలు వేరువేరుగా పోషణ పక్షం కార్యక్రమాలు చేపట్టారు.మిట్టపల్లిలో కూరగాయలు ఆకుకూరలు పండ్లు వాటి ప్రాముఖ్యతను తెలిపారు.అనంతరం గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు,పిల్లలకు అక్షరాభ్యాసాలు, అన్నప్రాసనలు చేశారు. కుందారంలో వివో సంఘం మహిళలకు పోషణ పక్షం గురించి చెప్పారు. రక్తహీనతను అధిగమించడానికి తీసుకునే వివిధ పోషక పదార్థాల గురించి వివరించారు. చిరుధాన్యాల ప్రాముఖ్యతను తెలియజేసి,ప్రతి ఒక్కరు వాటిని రోజువారి ఆహార దినచర్యలో చేర్చుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్, మహిళలు,వివో సంఘం సభ్యులు పాల్గొన్నారు.

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ).!

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)కరీంనగర్ నగర నూతనకమిటీఎన్నిక

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

సిపిఐ కరీంనగర్ నగర 11వ మహాసభలో నగర నూతన కమిటీని శుక్రవారం రోజున ఎన్నుకోవడం జరిగిందని సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. సిపిఐ నగర కార్యదర్శిగా కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శులుగా పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజు, కోశాధికారిగా బీర్ల పద్మలతో పాటు పదకోండు మంది కార్యవర్గ సభ్యులు ఇరవై తోమ్మిది మంది కౌన్సిల్ సభ్యులను నూతనంగా ఎన్నుకోనైనదని వారు తెలిపారు. నూతనంగా ఎన్నికైన వారు మాట్లాడుతూ నగరంలో సిపిఐ పార్టీని వాడవాడనా బలోపేతం చేస్తూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ జెండా మున్సిపల్ పై ఎగిరే విధంగా పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేస్తామన్నారు. నగరంలో అభివృద్ధి పనుల్లో పూర్తిగా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని వీటిపై రానున్న కాలంలో ఉద్యమాలు చేస్తామని వారు పేర్కొన్నారు. నగరంలో వేలాది మంది ప్రజలు ఇండ్లు లేక కిరాయి ఇండ్లలో ఉంటూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇండ్లులేని నిరుపేదలకు ఇండ్లు వచ్చేంతవరకు పోరాటాలు చేస్తామని, రేషన్ కార్డులు,పెన్షన్లు ఇతర సంక్షేమ పథకాలన్నీ పేద ప్రజలకు అందేందుకు కృషి చేస్తామన్నారు. ఎన్నికకు సహకరించిన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకట్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామికి ధన్యవాదాలు తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version