పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత అవసరం

పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత అవసరం

*బిట్స్ స్కూల్ విద్యార్థులకు
గ్రీన్ ఒలంపియాడ్ టెస్ట్ సర్టిఫికెట్ల ప్రదానోత్సవం*

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

సమాజంలో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందడం, వాహనాల వినియోగం ఎక్కువ కావడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందనీ, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని బాలాజీ టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ పెరుమాండ్ల రాజేంద్రప్రసాద్ అన్నారు.పర్యావరణ అటవీ మరియు వాతావరణ మంత్రిత్వ శాఖ సూచనల మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో గత నవంబర్ మాసంలో నిర్వహించిన గ్రీన్ ఒలంపియాడ్ టెస్ట్ లో పాల్గొన్న బాలాజీ టెక్నో స్కూల్ విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు.ఈ పర్యావరణ పరిరక్షణా చర్యలు చేపట్టడాన్ని మీ వ్యక్తిగత జీవితంలో ఒక ప్రధాన బాధ్యతగా స్వీకరించాలని విద్యార్థులకు సూచించారు.
బాలాజీ విద్యార్థులు మొత్తం 183 మంది ఈ ఒలంపియాడ్ టెస్ట్ రాశారు. అందులో పదిమంది విద్యార్థులు మెరిట్ సర్టిఫికెట్ పొందగా 173 మంది విద్యార్థులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లను ప్రిన్సిపల్ రాజేంద్రప్రసాద్ అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎం.డి. రియాజుద్దీన్, ప్రదీప్ చౌదరి, క్రాంతి కుమార్ మరియు ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version