సదాశివపేట సబజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు.

సదాశివపేట సబజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

సదాశివపేట సబ్ రిజిస్ట్రార్ శాఖ కార్యాలయంలో గురువారం అవినీతి నిరోధక అధికారులు సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ నేతృత్వంలో సీఐలు రమేష్, వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు కార్యాలయానికి చేరుకుని తనిఖీలు ప్రారంభించారు. తనిఖీలు ప్రారంభంలో కార్యాలయంలో నలుగురు డాక్యుమెంట్ రైటర్లు, సబ్ రిజిస్ట్రార్ సహా అధికారులు ఉన్నారు. వారిని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తూ, కార్యాలయంలో ఉన్న డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. ఐదు గంటలుగా తనిఖీలు కొనసాగుతుండగా, ఏ విధమైన అవినీతి లావాదేవీలు జరిగాయా అన్న కోణంలో ఏసీబీ అధికారులు ఆధారాలను సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

నెక్కొండలో టాస్క్ ఫోర్స్ దాడులు.

నెక్కొండలో టాస్క్ ఫోర్స్ దాడులు

రేషన్ బియ్యం పట్టివేత

#నెక్కొండ, నేటి ధాత్రి:

మండలంలోని చిరుధాన్యం కొనుగోలు కేంద్రంలో బియ్యం దందాను కొనసాగిస్తుండగా మంగళవారం టాస్క్ ఫోర్స్ సిఐ పవన్ నెక్కొండ ఎస్సై మహేందర్ సంయుక్తంగా దాడులు నిర్వహించారు ఈ దాడులలో నెక్కొండ మండలంలోని చిరుధాన్యం కొనుగోలు వ్యాపారస్తుడు నిలువుంచిన రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి సంబంధిత సివిల్ సప్లై అధికారులకు అప్పగించి సంబంధిత వ్యాపారిపై కేసు నమోదు చేసినట్లు నెక్కొండ ఎస్సై మహేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది, నెక్కొండ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

పేకాట స్థావరంపై దాడులు ఐదుగురి అరెస్ట్.

పేకాట స్థావరంపై దాడులు ఐదుగురి అరెస్ట్, రూ. 25వేలు స్వాధీనం

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం
మండలం గుంత మర్పల్లి గ్రామంలో పేకాడుతున్న వారిని అరెస్టు చేసినట్లు ఎస్సె నరేష్ తెలిపారు. నమ్మద గిన సమాచారంతో ఆదివారం సాయంత్రం గుంత మర్పల్లి గ్రామ శివారులో పేకాట ఆడుతున్న స్థావరంపై దాడులు నిర్వహించి ఐదుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 25,090ల నగదుతో పాటు పేక ముక్కలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.

జాన్ పాకలో ఎక్సైజ్ దాడులు,ఇద్దరిపై కేసు నమోదు.

జాన్ పాకలో ఎక్సైజ్ దాడులు,ఇద్దరిపై కేసు నమోదు.  

పరకాల నేటిధాత్రి

గుడుంబా నిర్ములన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా శనివారంరోజున పరకాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని జాన్ పాక శివారులో దాడులు నిర్వహించారు.గుడుంబా తయారీ కోసం నిల్వ ఉంచిన 500 లీటర్ల షుగర్ పానకం ను ధ్వంసం చేసి,5 లీటర్ల గుడుంబా,25 కేజీల షుగర్ ను స్వాధీనం చేసుకొని బాదావత్ శ్రీను,బానోత్ సురేష్ ల పై కేసు నమోదు చేసినట్టు సీఐ తాతజీ తెలిపారు.ఈ దాడులలో ఎక్సైజ్ ఎస్ఐ వై.జ్యోతి
సిబ్బంది లక్ష్మణ చారి,రవీందర్,సమ్మయ్య,విజయ్ కుమార్ పాల్గొన్నారు.

గీసుకొండ మండలం లో ఎక్సైజ్ దాడులు 5 అరెస్ట్.

గీసుకొండ మండలం లో ఎక్సైజ్ దాడులు ఐదుగురు అరెస్ట్

పరకాల నేటిధాత్రి

 

 

ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఆదేశానూసారం గుడుంబా నిర్మూలన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా శనివారంరోజున పరకాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని గీసుకొండ,మనుగొండ,ఎలుకుర్తి ల లో దాడులు నిర్వహించి గీసుకొండ కు చెందిన పోలేపాక సబిత,కోట స్రవంతి,ఎలుకుర్తి కి చెందిన బొడిగే దేవేంద్ర,బొల్లు సాంబ లక్ష్మి,మనుగొండ కు చెందిన ఎంబడి మల్లమ్మ లను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి (25) లీటర్ల గుడుంబా ను స్వాధీనం చేసుకున్నారు.ఈ దాడులలో ఎస్ఐ జ్యోతి,సిబ్బంది లక్ష్మణ చారి, విజయ్ కుమార్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version