ఘనంగా ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం

ఘనంగా ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం వేడుకలు

నస్పూర్ నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా పరిధిలోని సిసిసి కార్నర్ లోని ఆటో కార్మికులు ఘనంగా ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తూముల నరేష్ ఆదేశాల మేరకు శుక్రవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు చిలుక మల్లేష్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలోని ఆటో కార్మికులు నియమ నిబంధనలను పాటిస్తూ ప్రజలు,ప్రయాణికుల పట్ల గౌరవ మర్యాదలతో నడుచుకుంటున్నారని అన్నారు.ప్రతి ఆటో కార్మికుడు క్రమశిక్షణతో నడుచుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బచ్చలి మల్లేష్, పట్టణ అధ్యక్షులు అంకతి సత్తన్న,ప్రధాన కార్యదర్శి రాజు,వైస్ ప్రెసిడెంట్ చంద్ర య్య,బింగి రవి,అంజన్న, జగదీష్,నస్పూర్ మండల గౌరవ అధ్యక్షులు భూపతి శ్రీను,సిసిఎక్స్ రోడ్ల అడ్డా అధ్యక్షులు రామన్న పాల్గొ్నారు.

అంగరంగ వైభవంగా శ్రావణమాసం ఉత్సవం

అంగరంగ వైభవంగా శ్రావణమాసం ఉత్సవం

రామాలయం అభివృద్ధికి నగదు అందజేత

శ్రావణ మాస ఉత్సవం లో ప్రత్యేక పూజలు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ పట్టాభి సీతా రామచంద్రస్వామి ఆలయంలో శ్రావణమాస ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆలయ అర్చకులు ముసునూరి నరేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు అదేవిధంగా గణపురం మండల కేంద్రానికి చెందిన సిరంగి ధనుజ పటేల్ వెంకటేశ్వర పటేల్ దంపతులు శుక్రవారం శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అదేవిధంగా పూజ అనంతరం ఆలయ అభివృద్ధిలో పాల్గొంటానని చెప్పి అభివృద్ధి కొరకు
10. 116 రూపాయలను ఆలయ అధ్యక్షుడు తాళ్లపల్లి గోవర్ధన గౌడ్ కి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బండారు శంకర్ మూలా శ్రీనివాస్ గౌడ్ బటిక స్వామి మాదాసు అర్జున్ బూర రాజగోపాల్ దైవాల భద్రయ్య మాదాసు మొగిలి ఉయ్యాల బిక్షపతి పాండవుల భద్రయ్య తదితర భక్తులు పాల్గొన్నారు

ఘనంగా సి.నా.రే జయంతి వేడుకలు.

ఘనంగా సి.నా.రే జయంతి వేడుకలు

కేసముద్రం/ నేటి దాత్రి

కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వివేకవర్ధిని హైస్కూల్ లో మంగళవారం తెలుగు కవి సి.నారాయణ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ సినారే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం యాకాంతం గౌడ్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో అనేక కవితలు, పాటలు, వ్యాసాలు రచించి తెలుగు భాషా సాహిత్య అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు.
సినారె రచించిన విశ్వంబర కావ్యానికి 1988లో జ్ఞానపీఠ పురస్కారం పొందాడన్నారు. 1970లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్ అవార్డులు కూడా అందుకున్నాడన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

ఘనంగా జరుపుకున్న నాగుల పంచమి.

ఘనంగా జరుపుకున్న నాగుల పంచమి.

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-29T133017.770.wav?_=1

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గ ఆయా మండలంలో మంగళవారం రోజు హిందువుల పండుగ అయినటువంటి నాగుల పంచమిని ఘనంగా నిర్వహించారు. ఉదయం పూట ని ప్రతి ఇంటిలో పండుగ సందడి నెలకొంది. ఈ రోజు ప్రత్యేకంగా జొన్నపేలాలు, వేయించిన శనగలు, పూజ సామాగ్రి,ఆవు పాలు, నాగులు (ఇంట్లోలోహంతో తయారు చేసేవి,) తదితరాలు తీసుకెళ్లి పాముల పుట్ట వద్ద నాగ దేవతకు పూజలు చేసి పుట్టలో పాలు పోసి ధూప దీప నైవేద్యాలు సమర్పించి టెంకాయలు కొట్టి నాగదేవతకు ఘనంగా పూజలు చేశారు. అనంతరము ఇళ్లల్లోకి చేరుకున్న పిదప ఆడపడుచులు ముందు మిత్రులను కలుసుకుని కళ్ళు కలగడం ఆనవాయితీగా వస్తోంది. ఆడపడుచులకు వారి సోదరులు ఎంతో కొంత నగదును లేదా సారె లాంటివి సమర్పించుకొని ఆడపడుచుల ఆశీర్వాదం తీసుకుంటారు. ఈ విధంగా పంచమి రోజు బంధుమిత్రులు కలుసుకోవటం ఇది ఒక మంచి అవకాశంగా ఆనాటి పెద్దలు నిర్ణయించిన పండుగ నే నాగుల పంచమి. అనంతరం కొన్ని ఊళ్లలో ఉయ్యాలలు, నిచ్చెనలు ఏర్పాటుచేసి ఆనందంతో ఆడ మగ అందరు కలిసి అక్కడ ఊయలలు ఊగడం, నిచ్చెనలు ఎక్కడం ఈ రోజంతా ఆనందంగా గడుపుతారు. మంగళవారం రోజు జహీరాబాద్ మొగుడంపల్లి నాల్కల్ కోహిర్ ఝరాసంగం మండలకి చెందిన పలువురు మహిళలు శివాలయం వద్ద గల పుట్ట వద్ద నాగ దేవతకు పూజలు చేశారు. కొంతమంది ఊరి బయట చేను లలో గల పుట్టల వద్దకెళ్లి అక్కడ పూజలు చేశారు. ఈరోజు శివాలయంలో భక్తులతో సందడి నెలకొంది. నాగ దేవతకు పూజలు చేసిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానంలో ఉండే శివలింగానికి పూజలు చేసి టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఊరిలో గల జంట నాగుల ఆలయంలో కూడా భక్తులతో సందడి నెల కొంది. హనుమాన్ మందిరంలో కూడా ఆయా గ్రామాలలో పూజలు చేసి పండుగ జరుపుకున్నారు.

ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం ఘనంగా నిర్వహించిన..

ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం ఘనంగా నిర్వహించిన వైద్యాధికారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

కోహిర్ మండల బిలాల్పూర్ గ్రామంలో
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ హెపటైటిస్ జూలై 28/ 2025 దినోత్సవం సందర్భంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నరేందర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో
ఎం పి హెచ్ ఈ ఓ నిరంజన్ స్టాఫ్ సోనీ ల్యాబ్ టెక్నీషియన్ వసంతరావు డి ఈ ఓ సురేఖ సిహెచ్ పాండు గ్రామ పెద్దలు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొనడం జరిగింది,

బాలాజీ టెక్నో స్కూల్లో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్

బాలాజీ టెక్నో స్కూల్లో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట మండలంలోని లక్నేపెల్లిలో గల బాలాజీ టెక్నో స్కూల్లో ఎన్.సి.సి పదవ బెటాలియన్ ఆదేశాల మేరకు కార్గిల్ విజయ్ దివస్ ను ఎన్.సి.సి థర్డ్ ఆఫీసర్ ఎం.డి రియాజుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.పాఠశాల స్కూల్ ప్రిన్సిపాల్ పి.రాజేంద్రప్రసాద్ హాజరై మాట్లాడుతూ మే, 1999 న పాకిస్తాన్ చొరబాటుదారులు దొంగ చాటున నియంత్రణ రేఖను దాటి భారత భూభాగాన్ని ఆక్రమించారని అలాగే శ్రీనగర్, లేహ్ ను కలిపే కీలకమైన జాతీయ రహదారి 1-ఏ ను విడదీయడం వారి దుష్ట లక్ష్యంగాచేసుకొని భారత సైన్యంపై దాడి జరిపారని పేర్కొన్నారు. అందుకు తగ్గట్టుగానే భారత సైన్యం కళ్ళలో జాతీయ జెండాను,గుండెల్లో దేశభక్తిని కలిగి శత్రుతూటాలకు ఎదురొడ్డి తరిమికొట్టి కార్గిల్ యుద్ధంలో గెలిచిన రోజు గుర్తుగా కార్గిల్ విజయ్ దివస్ గా జరుపుకుంటారని తెలిపారు. అనంతరం కార్గిల్ యుద్ధంలో అమరులైన వీరుల చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె. రమేశ్, రామ్మూర్తి ,విజయ్, గౌతమ్, కనకయ్య , రామ్ కిషోర్, ఓదేలు, కనకరాజు, అనిత,వ్యాయామ ఉపాధ్యాయులు భవాని చందు, పార్వతి, ఎన్.సి.సి క్యాడేట్లు , విద్యార్థులు పాల్గొన్నారు.

వాగ్దేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ఘనంగా పోచమ్మ బోనాలు..

వాగ్దేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ఘనంగా పోచమ్మ బోనాలు

చందుర్తి, నేటిధాత్రి :

చందుర్తి మండలం జోగాపూర్ గ్రామం వాగ్దేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో అంగరంగ వైభవంగా బోనాల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పిల్లలు అమ్మవారి, పోతరాజుల విన్యాసాలతో ఆకట్టుకున్నారు. తెలంగాణ బోనాల సాంస్కృతిక పాటలతో నృత్యాలతో పిల్లలు గ్రామ ప్రధాన కూడలిల వద్ద నృత్యాలతో ప్రజలను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ సద్గుణ చారి మాట్లాడుతూ ….. ఆషాడ మాసంలో బోనాల పండుగను ఘనంగా జరుపుకుంటారని తెలిపారు. ఈ పండగను దేవతకు ఒక ప్రతిరూపంగా భావిస్తారు. బోనం వండి అమ్మవారికి నైవేద్యం పెడతారు. మహిళలు కొత్త మట్టి, ఇత్తడి కుండలో పాలు బెల్లం బియ్యం కలిపి వండుతారు. దీనిని వేప ఆకులు, పసుపు మరియు సింధూరంతో అలంకరిస్తారు. మహిళలు ఈ బోనాలను తలపై మోసుకొని దేవాలయంలో అమ్మ దేవతకు గాజులు మరియు చీరతో సహా బోనం నైవేద్యం పెడతారు. బోనాలు అంటే కాలిని మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ మొదలైన వివిధ రూపాల్లో పూజించడం అని వివరించారు. పాఠశాల విద్యార్థులు వివిధ వేషధారణలో బోనాలు నెత్తిన పెట్టి పోతరాజుల విన్యాసాలతో గ్రామంలోని ప్రధాన కూడలి వెంట పోచమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు. చిన్నప్పటినుండి మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల విద్యార్థులకు అవగాహన పెంపొందించడానికి పాఠశాలలో అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని పాఠశాల కరస్పాండెంట్ సద్గుణ చారి అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

శాయంపేటలో పండుగలా కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు..

శాయంపేటలో పండుగలా కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు

శాయంపేట నేటిధాత్రి;

శాయంపేట మండలకేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి వర్యులు కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుక లను అత్యంత వైభవంగా జరుపుకున్నారు.బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంగుల మనోహర్ రెడ్డి మరియు మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి ఆధ్వ ర్యంలో కూడలి వద్ద కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేటీఆర్ ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, తెలంగాణ ప్రజలకు ఎంతో సేవ చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ వంగాలనారాయణ రెడ్డి, మండల యూత్ అధ్యక్షు లు మారేపల్లి మోహన్, సీని యర్ నాయకులు లక్ష్మారెడ్డి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ దూదిపాల తిరుపతిరెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ మారపల్లి నందం, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు మేకల శ్రీని వాస్, గ్రామ శాఖ అధ్యక్షులు గాదె రాజేందర్, మేకల వెంకటే శ్వర్లు,సవాసి రమేష్, లక్ష్మణ్, గంట శ్యాంసుందర్ రెడ్డి, మండ ల కోఆప్షన్ సభ్యులుమొహిబు ద్దిన్, మాజీ సర్పంచులు వలప దాస్ చంద్రమౌళి,పోతురమణా రెడ్డి, చింతనిప్పుల భద్రయ్య, గడిపే విజయ్, ధైనంపల్లిసుమ న్, కొమ్ముల శివ, చెన్నబోయిన అజయ్, విద్యాసాగర్, నర్ర రాజు, అట్ల తిరుపతి, రంగు మహేందర్, కుసుమ రమేష్ , కోల మచ్చయ్య, రాజ మహ మ్మద్, సదాశివరెడ్డి, ఆదిరెడ్డి, నారాయణరెడ్డి, ప్రభాకర్, వైద్యుల సాంబరెడ్డి, మస్కి సుమన్ ,నాగరాజు , రేణిగుంట్ల సంతోష్ , ఎండి పాష, వినయ్, శ్రీను, సునీల్, శివ,మండల సోషల్ మీడియా కన్వీనర్ దాసి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

భారతీయ మజ్దూర్ సంఘ్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించిన..

భారతీయ మజ్దూర్ సంఘ్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించిన జిల్లా కమిటీ

మంచిర్యాల జులై 23, నేటి ధాత్రి

ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సున్నం బట్టి వాడ 100 పిట్ల రోడ్డులో గల భారతీయ మజ్దూర్ సంఘ్(బి.ఎమ్.ఎస్) జిల్లా కార్యాలయంలో భారతీయ మజ్దూర్ సంఘ్ ఆవిర్భావించి నేటితో 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ మజ్దూర్ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కుంటాల శంకర్ బి.ఎమ్.ఎస్. జెండా ఎగరవేసి కార్మికులతో కలిసి మిఠాయిలు పంచుకోవడం జరిగింది. అదేవిధంగా కుంటాల శంకర్ మాట్లాడుతూ, జూలై 23, 1955 సంవత్సరంలో బాల గంగాధర్ తిలక్ జన్మదినం సందర్భంగా దత్తోపంత్ టెన్గ్డే జీ భారతీయ మజ్దూర్ సంఘ్(బి.ఎమ్.ఎస్) కార్మిక సంఘాన్ని ప్రారంభించారు,కార్మిక హక్కుల సాధన కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు.మరియు భారతీయ మజ్దూర్ సంఘ్ దేశములోని రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్న ఏకైక సంఘం బి.ఎమ్.ఎస్. అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బి.ఎం.ఎస్. జిల్లా కార్యదర్శి మద్దూరి రాజు యాదవ్, ఉపాధ్యక్షులు కృష్ణ రెడ్డి, రత్నాకర్ మహానంద్,సంగెం లక్ష్మణ్, వేల్పుల స్వామి,బండి వెంకటేశ్వర్లు, సిద్దు, సంతోషం లో పాల్గొన్నారు

ఘనంగా ఇందిరా భవన్ లో మీనాక్షి నటరాజన్ జన్మదిన వేడుకలు..

ఘనంగా
ఇందిరా భవన్ లో మీనాక్షి నటరాజన్ జన్మదిన వేడుకలు..

జగిత్యాల. రాయికల్. జులై 23, నేటి ధాత్రి:

 

కేక్ కట్ చేసి సంబురాలు..

ఏ ఐ సీ సీ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ జన్మదిన వేడుకలను మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మీనాక్షి నటరాజన్ చిత్రం తో కూడిన కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేసి,జన్మదిన వేడుకలు నిర్వహించారు.

అనంతరం మాజీ మంత్రి వర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ..

అఖిల భారత కాంగ్రెస్ కార్యదర్శి తెలంగాణ ఇంచార్జి గా క్షేత్ర స్థాయిలో
పార్టీ బలోపేతమే ధ్యేయంగా పని చేస్తున్నారు.

రాహుల్ గాంధీ ను ప్రధానిగా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారు.

పదేళ్లు బీ ఆర్ ఎస్ అరాచకాలను ను ఎదురించి నిల్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇస్తామని కార్యకర్తల్లో భరోసా నింపారు.

దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నారు.

మహిళలకు ఉచిత రవాణా, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, ప్రతి క్వింటాల్ పై రూ.500 బోనస్, రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం..

గృహ అవసరాలకు 200 యూనిట్లు ఉచితంగా అందిస్తున్న రాష్ట్రం ఒక్కటే అని స్పష్టం చేశారు.

జనాభా ప్రతిపాదకన రిజర్వేషన్ కల్పించాలనే రాహుల్ గాంధీ ఆలోచన తో
కుల గణన చేపట్టి,42 శాతం రిజర్వేషన్ అమలుకు కృషి చేస్తున్నారు.

బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేయడం తో పాటు విద్య, ఉద్యోగాలలో అమలు చేస్తాం.

2017 నాటికి కాంగ్రెస్ లో ఉన్న వారికి మాత్రమే ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని చెప్పి, కార్యకర్తల్లో ఆత్మ విశ్వాసం నింపారు.

రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం గా ప్రతి ఒక్కరు కృషి చేయాలని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఇల్లందకుంటలో మల్లికార్జున ఖర్గే .!

 

ఇల్లందకుంటలో మల్లికార్జున ఖర్గే ఘనంగా జన్మదిన వేడుకలు

జమ్మికుంట (నేటిధాత్రి)

ఈరోజు ఇల్లంధకుంట మండల కేంద్రంలో హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్ బాబు గారి ఆదేశానుసారం అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి జన్మదిన పురస్కరించుకొని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్ది కుమార్ గారి ఆధ్వర్యంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ప్రత్యేక అర్చనలు చేపించి వారు ఆయురారోగ్యాలతో మరియు మరెన్నో పదవులు పొందాలని పూజలు నిర్వహించి అనంతరం కేక్ కట్ చేయడం జరిగింది.

 

 

 

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మల్లికార్జున ఖర్గే గారు కర్ణాటక రాష్ట్రంలో ఎమ్మెల్యే స్థాయి నుంచి ఒక ఎంపీగా ఒక రాజ్యసభ సభ్యుడిగా మరియు ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షునిగా తన ప్రయాణం సాగిందని కాంగ్రెస్ పార్టీ ఒక దళితుడిని ప్రతిష్టాత్మకమైన హోదాలలో నియమింపచేయడం జరిగింది అని వారు తెలిపారు కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడే పార్టీ అని తెలియజేస్తూ అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సేవలు మరియు ప్రజలకు అందిస్తున్న పథకాలు అన్నీ కూడా పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాల ప్రజలకి లబ్ధి చెందే విధంగా ముందుకు వెళుతుంది యావత్ భారత దేశంలోనే కాంగ్రెస్ పార్టీ సోనియాగాంధీ మరియు రాహుల్ గాంధీ నాయకత్వంలో దళితులకు బహుజన వర్గాలకు న్యాయం చేసే విధంగా ముందుకు వెళుతుందని అన్నారు.

 

 

రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేద ప్రజలకి మరియు రైతులకి మరియు విద్యార్థులకు, యువతకు ప్రతి ఒక్క పౌరునికి లబ్ధి చెందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం హర్షనీయంగా పేర్కొంటూ భావితరాలకు కూడా ఇంకా మరెన్నో సేవలు చేసేలా నాయకులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది మల్లికార్జున ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ కి నాయకులు, కార్యకర్తలు సైనికులుగా వర్ణిస్తూ వారిని రానున్న కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలలో నాయకులుగా తీర్చిదిద్దే బాధ్యత నాదే అని ఖర్గే గారని చెప్పడం జరిగింది.

 

 

 

ఈకార్యక్రమంలో:- గూడపు సారంగపాణి, ఎక్కటి సంజీవరెడ్డి, అన్నం ప్రవీణ్, మంకు అయిలయ్య, మోత్కూరి శ్రీనివాస్, మురహరి రాజు, దాంసాని తిరుపతి, మూడెత్తుల మల్లేష్, గురుకుంట్ల స్వామి, మ్యాడద తిరుపతి రెడ్డి, భోగం సాయి బొమ్మ శ్రీనివాస్, మారేపల్లి వంశీ, గూడెపు ఓదెలు, రాజబాబు, రెడ్డి సారంగం, పుట్ట రాజు ,ఎండి లాల్ మొహమ్మద్, గడ్డి శ్రీనివాస్, మోటపోతుల స్వామి, ఆరే రమేష్ రెడ్డి ,మూడెడ్ల రమేష్ ,తోడేటి కిషన్, బిజిగిరి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

శ్రీ ఆదర్శవాణి పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ..

*శ్రీ ఆదర్శవాణి పాఠశాలలో ఘనంగా
బోనాల పండుగ*

నర్సంపేట,నేటిధాత్రి:

బోనాల పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని దుగ్గొండి మండల కేంద్రంలోని శ్రీ ఆదర్శవాణి విద్యానికేతన్ పాఠశాలలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.వేడుకలలో భాగంగా అధ్యాపకుల బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక బోనాలు తయారు చేసి సంబరాలకు ముస్తాబు చేశారు.అలాగే విద్యార్థులు పోతురాజుల వేషధారణ నృత్యాలతో బ్యాండ్ మేళాలతో అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీ ఆదర్శవాణి విద్యాసంస్థల చైర్మన్ నాగనబోయిన రవి, డైరెక్టర్ బత్తిని బిక్షపతి బోనాల విశిష్టత గూర్చి తెలియజేశారు. చైర్మన్ రవి మాట్లాడుతూ వర్షాకాలంలో చేసుకునే గొప్ప పండుగ బోనాల పండుగ అని, ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగ బోనాల పండుగ పట్ల సంస్కృతి సాంప్రదాయాలను ముందు తరాలకు తెలియజేయాలని కోరారు.ప్రిన్సిపల్ స్రవంతి మాట్లాడుతూ ఆడపడుచులు అమ్మవారికి ఉపవాసం ఉండి భక్తితో బోనం ఎత్తుకొని ఆడంబరంగా బోనాన్ని సమర్పిస్తారని అన్నారు. అందరూ ఆయురారోగ్యాలు, పాడిపంటలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు నృత్యాలు పాటలతో ఎంతగానో అలరించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

బాలాజీ ఇంటిగ్రేటెడ్,అక్షర ద స్కూల్ లో.!

బాలాజీ ఇంటిగ్రేటెడ్,అక్షర ద స్కూల్ లో ఘనంగా బోనాల పండగ.

నర్సంపేట,నేటిధాత్రి:

బాలాజీ విద్యాసంస్థల్లో విద్యాసంస్థల్లో ఒక్కటైన బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ మరియు అక్షర స్కూల్ లో శనివారం బోనాల పండుగ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా బాలాజీ విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఏ. రాజేంద్రప్రసాద్ రెడ్డి, ట్రెజరర్ వనజ,ఎంఈఓ సారయ్య పాల్గొని బోనాల జాతర పండగ యొక్క ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు.ఆషాడ మాసంలో తెలంగాణలో బోనాల జాతరలో ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి జరుపుకోవడం జరుగుతుంది అన్నారు. విద్యార్థులు బోనాలు ఇంటి వద్ద తయారు చేసుకుని వచ్చారు. మరికొందరు పోతురాజుల వేషధారణలో ఆకట్టుకున్నారు.ఈ కార్యక్రమంలో
బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ ప్రిన్సిపల్ జ్యోతి గౌడ్,అక్షర స్కూల్ ప్రిన్సిపల్ భవాని,బాలాజీ మహిళా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ రామ్ రాజ్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.

బాలాజీ టెక్నో స్కూల్లో తెలంగాణ బోనాల సంబరాలు..

నర్సంపేట మండలంలోని లక్నేపల్లి లో గల బాలాజీ టెక్నో స్కూల్లో తెలంగాణ బోనాలు సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.భారతీయ సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా విద్యార్థిని ,విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి మహంకాళి ,పోతరాజు వేషధారణలతో వచ్చి అందరినీ ఆకట్టుకునేలా బోనం ఎత్తుకొని ప్రదర్శనలు చేశారు.ఈ కార్యక్రమానికి బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఏ. రాజేంద్ర ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆషాడ మాసంలో జరుపుకునే అతిపెద్ద హిందూ పండుగ. హైదరాబాద్ నగరంలో 1813 సంవత్సరంలో ప్లేగు వ్యాధి బారి నుండి బయటపడేందుకు ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారికి ప్రార్థనలు చేశారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా నిలిచిపోవడంతో భక్తులు అమ్మవారికి బోనం సమర్పించారు.బోనం అంటే భోజనం అని అర్థం.ఇది మాతృదేవికి నైవేద్యం. ఇంట్లోమహిళలు పాలు, బెల్లం కలిపి మట్టి కుండలో గానీ ఇత్తడి పాత్రలో గాని భోజనం వండుతారు.వీటిని వేప ఆకులతో,పసుపుతో అలంకరిస్తారు అట్టి బోనాన్ని నెత్తిపై ఎత్తుకొని పోతరాజు విన్యాసాలతో వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారని ఈ సందర్భంగా వివరించారు.స్కూల్ ప్రిన్సిపల్ పి.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ మహిళలు సాంప్రదాయ చీరలో ఆభరణాలు ఇతర ఉపకరణాలు ధరించి అమ్మవారికి బోనంతో పాటు చీర ,గాజులు సమర్పిస్తారని,మాతృదేవతను ఎల్లమ్మ, పోచమ్మ, డెక్కలమ్మ, మారేమ్మ, పోలేరమ్మ, అంకాలమ్మ, నూకలమ్మ, పెడమ్మ వివిధ రూపాలలో అమ్మవారిని పూజిస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఘనంగా పోచమ్మ తల్లి బోనాల జాతర.

ఘనంగా పోచమ్మ తల్లి బోనాల జాతర

నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలోని 23వ వార్డులో ఆదివారం ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు అమ్మవారికి సమర్పించినట్లు ఆలయ కమిటీ వారు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వేడుకలు జరపడం తృతీయ సంవత్సరమని ప్రతి సంవత్సరం అమ్మవారిని అలంకరించి బోనాలతో అమ్మవారికి మొక్కలు చెల్లిస్తామని అన్నారు.అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అమ్మవారి వద్ద పెద్ద ఎత్తున బోనాల సందడి నెల కోవడం జరిగింది.నస్పూర్ లోని తెలంగాణ తల్లి విగ్రహం నుండి పోచమ్మ దేవాలయం వరకు మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో అక్కడికి చేరుకొని, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి మొక్కులు సమర్పించుకున్నారు.డప్పు చప్పుళ్ళు తీన్మార్ దరువులతో ఆ ప్రాంతమంతా మారు మోగింది.శివ సత్తుల ఆటలతో జాతర శోభ సంతరించుకుంది.ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించడం చాలా సంతోషంగా ఉందని,అమ్మవారి ఆశీస్సులు ప్రజల అందరిపై ఉండి సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో చల్లగా చూడాలని అమ్మవారికి ఆలయ కమిటీ వారు ప్రత్యేక పూజలు సమర్పించారు.

స్థానిక మంజీరా విద్యాలయంలో వనమహోత్సవాన్ని.

స్థానిక మంజీరా విద్యాలయంలో వనమహోత్సవాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

రామంపేట జూలై 14 నేటి ధాత్రి (మెదక్)

ఈ కార్యక్రమంలో భాగంగా ఎఫ్.ఆర్.ఓ అంబర్ సింగ్ గారు, వనమహోత్సవం మరియు చెట్ల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. చెట్లు లేకపోతే మానవ మనుగడ లేదని ,చెట్లు మాత్రమే చెడును తీసుకొని మంచిని ఇస్తాయని. మానవులు వదిలేటటువంటి కార్బన్డయాక్సైడ్ ను తీసుకొని ,ఆక్సిజన్ మానవులకు ఉపయోగపడేటటువంటి ఆక్సిజన్ ఇస్తాయని ఇనుము ఎలా అయితే అయస్కాంతాన్ని ఆకర్షిస్తుందో ఆ విధంగా చెట్లు మేఘాలను ఆకర్షించే వర్షాలను కురిపింప చేస్తాయని ప్రతిరోజు మానవుడికి మూడు సిలిండర్ల ఆక్సిజన్ అవసరం ఉంటుందని ఒక సిలిండర్ విలువ 700 రూపాయలు అయినట్లయితే రోజుకి 2100 ఖర్చు అవుతుందని సంవత్సరానికి 7,66,500 అలాంటి ఆక్సిజన్ ని మనం ఉచితంగా తీసుకోగలుగుతున్నాం. అందరికీ ఆక్సిజన్ సిలిండర్ల అవసరము పడితే సిలిండర్లు దొరకక ఏ విధమైనటువంటి క్లిష్ట పరిస్థితి ఏర్పడుతుందో కరోనా సమయంలో అందరం చూసినటువంటిదే కాబట్టి చెట్లను నాటడం వాటిని సంరక్షించడం చెట్లతో పాటుగా అడవిని, జంతువులను ,నీటిని పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి విద్యార్థి అమ్మ పేరు పైన ఒక చెట్టును నాటాలని అమ్మను ఏ విధంగా చూసుకుంటారో ఆ చెట్టుని ఆ విధంగా చూసుకోవాలని విద్యార్థులకు వివరించడం జరిగింది. అమ్మ పేరు పైన చెట్టు నాటడం అనేది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడి గారు చెప్పినటువంటి నినాదం. క్రమం తప్పకుండా మనం అందరం పాటించాలని చెప్పడం జరిగింది.

Forest Festival

మంజీరా పాఠశాలలో ఎఫ్ఆర్ఓ అంబర్ సింగ్ గారు, డిప్యూటీfro శ్రీనివాస్ గారు ,గీత ,కృష్ణ గారు చెట్లను నాటడం జరిగింది .విద్యార్థుల చేత మొక్కలు నాటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ జితేందర్ రెడ్డి వాసవి, ప్రిన్సిపల్ సురేష్ ,అనిల్ ,శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా జరుపుకున్న ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు.

ఘనంగా జరుపుకున్న ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జన హృదయ నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బి ఆర్ ఎస్ పార్టీ జహీరాబాద్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు
స్థానిక ముద్దు బిడ్డ, శాసనసభ్యులు కొనింటి మానిక్ రావు గారి జన్మదిన పురస్కరించుకొని ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో కేక్ కటింగ్ నిర్వహించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు, ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే మాణిక్ రావు ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, సంపూర్ణ ఆయురారోగ్యాలతో జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలకు మరిన్ని సేవలను అందించాలని కోరారు…
ఈ కార్యక్రమంలో మాజీ ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేషం, న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ తాంజిమ్, సీనియర్ నాయకులు నామ రావికిరణ్, ఎస్సి సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్, మాజీ పట్టణ అధ్యక్షులు యాకుబ్, మోహిద్దీన్,మాజీ కౌన్సిల్లర్ అబ్దుల్లా, మాజీ కేతకీ సంగమేశ్వర ఆలయ చైర్మన్ నర్సింహా గౌడ్, బిఆర్ఎస్వి అధ్యక్షులు రాకేష్,ఎస్సి సెల్ పట్టణ్ణ అధ్యక్షులు శివప్ప,
పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు కమిటీ సభ్యులు తాజా మాజీ సర్పంచ్ లు, మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు గ్రామ పార్టీ అధ్యక్షులు కమిటీ సభ్యులు ఉప సర్పంచులు ఉద్యమకారులు, బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, సోషల్ మీడియా వారియర్స్ ,బిఆర్ఎస్వి నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఐకెపి ఆధ్వర్యంలో ఇందిరా మహిళా.!

ఘనంగా ఐకెపి ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు.

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగే గ్రామపంచాయతీ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐకెపిసిసి రమణాదేవి పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇందిరా మహిళా శక్తి సంబరాలలో భాగంగా బుధవారం రోజున చల్లగరిగ గ్రామంలోని సింధు మహిళా సంఘంలోని మొదటి లీడర్ అయిన సంత పూరి భాగ్యను ఆదర్శ మహిళగా ఎంపిక చేసి ఇందిరా మహిళా శక్తి సంబరాలలో భాగంగా బుధ వారం రోజున ఘనంగా సన్మానం చేయడం జరిగిందని అన్నారు ,ఈమె మహిళా సంఘం ద్వారా తీసుకున్న రుణాల ద్వారా అభివృద్ధి చెంది గ్రామంలోని మహిళలందరికీ అందరికీ ఆదర్శంగా నిలిచిందని అన్నారు, ఈమెను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క మహిళ అభివృద్ధి చెందాలని అన్నారు, అలాగే 60 సంవత్సరాలు నిండిన మహిళలను, సంఘంలో చేర్పించాలని అలాగే 15 నుండి 18 సంవత్సరాల లోపు అమ్మాయిలను కుడా సంఘాలోకి ఆహ్వానించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఐకెపిసిసి రమణాదేవి , గ్రామైక్య సంఘం ప్రతినిధులు మరియు వివో ఏ తడక శ్వేత మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

కోటగుళ్ళ లో ఘనంగా తొలి ఏకాదశి పూజలు

కోటగుళ్ళ లో ఘనంగా తొలి ఏకాదశి పూజలు

భారీగా తరలివచ్చిన భక్తులు

స్వామివారికి ప్రత్యేక అలంకరణ

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి ఘనంగా పూజలు నిర్వహించారు. కోట గుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు ఉదయం గణపతి, నందీశ్వరుడు, గణపేశ్వరునికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించగా ఏడాది లో తొలి పండుగ కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అర్చకులు నాగరాజు భక్తులకు ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు.

మందకృష్ణ మాదిగ జన్మదినాన్ని ఘనంగా.!

మందకృష్ణ మాదిగ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు

మందమర్రి నేటి ధాత్రి

మందమర్రి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ గౌరవ మందకృష్ణ మాదిగ గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు జరుపుకోవడం జరిగింది ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు జెండా ఎగరవేయడం జరిగింది సీనియర్ నాయకులు నల్లాల చలపతి గారి చేతుల మీదుగా స్థానిక నాయకులు జీడి సారంగం పట్టణ అధ్యక్షులు చిలుముల రాజ్ కుమార్ మాదిగ సీనియర్ నాయకుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ చిలుముల రాజు ఉప్పులేటి నరేష్. కంబాల రాజనర్స్. సుమన్ కందిపాటి రవి సంగి సది దాసరి ఎల్లారం దాసరి రాజనర్సు వాసాల శంకర్ ఈసంపల్లి మల్లేష్ కలవల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

ఘనంగా జరుపుకున్న జన్మదిన వేడుకలు..

ఘనంగా జరుపుకున్న జన్మదిన వేడుకలు..

జహీరాబాద్ నేటి ధాత్రి;

బిజెపి జహీరాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ నౌబాద్ జగన్ జన్మదిన వేడుకలు నిన్న రాత్రి జహీరాబాద్ లో డాల్ఫిన్ బర్త్డే సెలబ్రేషన్స్ పాయింట్ లో శాలువా పూలమాలలతో సన్మానించి కేక్ కట్ చేసి చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ బిజెపి సీనియర్ నాయకులు,మండల అధ్యక్షులు, నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version