25లక్షల గంజాయి పట్టివేత..

25లక్షల గంజాయి పట్టివేత..

ఇద్దరు యువకుల అరెస్టు

నేటిధాత్రి, వరంగల్.

వరంగల్ లోని నార్కోటిక్ పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ సైదులు ఆధ్వర్యంలో ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. వరంగల్ నర్సంపేట రోడ్డులో పోలీసులు తనిఖీలు చేయగా గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అందులో ఒకరు మైనర్ గా గుర్తించారు. ఒడిశాకు చెందిన పండు అనే వ్యక్తి సుపారీతో గంజాయి రవాణా చేస్తున్నట్లు తెలిపారు. నిందితుల వద్ద 51.081కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోగా. దీని విలువ 25,54,050 గా అంచనా వేస్తున్నారు.

55 లక్షల తో సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన.

సంకేపల్లి గ్రామంలో 55 లక్షల తో సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన
*శంకర్ పల్లి, నేటి ధాత్రి :-

 

 

 

 

 

శంకర్ పల్లి మండల పరిధిలోని సంకేపల్లి గ్రామంలో 55 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కాలే యాదయ్య గ్రామస్థులతో కలసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చేవెళ్ల నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూ, సమస్యలని పరిష్కరిస్తామని పేర్కొన్నారు.

సీసీ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా, నిర్మాణ పనులలో తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, పనులలో జాప్యం జరగకుండా పనులను త్వరితగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్ కు ఆదేశాలు ఇచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ లో మరింత అభివృద్ధి జరుగుతుందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, మాజీ సర్పంచ్ ఇందిరా లక్ష్మణ్, మాజీ ఎంపిటిసి సంజీవరెడ్డి, ఫిల్డ్ అసిస్టెంట్ ఉబాగుంట రాజు, మాజీ సర్పంచ్ భద్రయ్య, వార్డు మెంబర్లు, కావాలి గోపాల్, సురేష్, మౌనేష్ , తదితరులు పాల్గొన్నారు.

కోట్లతో వాటర్ షెడ్ల నిర్మాణం: మంత్రి.

కోహిర్: 10. 50 కోట్లతో వాటర్ షెడ్ల నిర్మాణం: మంత్రి

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

10. 50 కోట్లతో వాటర్ షేట్ల నిర్మాణం పూర్తి చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. కోహిర్ మండలం పీచే రాగడి గ్రామంలో వివిధ అభివృద్ధి పనులను శనివారం ప్రారంభించారు. మహిళా సంఘాలకు 1. 56 కోట్ల రుణాలను పంపిణీ చేశారు. ఉన్నత పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు కేటాయిస్తారని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీ సురేష్ షెట్కార్ పాల్గొన్నారు.

కుటుంబానికి 20వేల కుట్టు మిషన్ సహాయం.

కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ ఆమెరికా ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామానికి చెందిన ముంజల సుజాత కుటుంబానికి 20వేల రూపాయల ఖరీదు గల కుట్టు మిషన్ సహాయం
——————
KANA ప్రతినిధులకు తెలంగాణ గౌడ సంఘం తరఫున అభినందనలు ధన్యవాదాలు
——————-
వర్దన్నపేట (నేటిదాత్రి):

 

 

వరంగల్ జిల్లా వర్ధన్నపేట నల్లబెల్లి గ్రామానికి ముంజల సుజాత భర్త అనిల్ వయసు 30 సంవత్సరాలు భర్త అనిల్ ప్రమాదవశాత్తు తాటి చెట్టు మీదనుండి కిందపడి హాస్పిటల్ తీసుకువెళ్లగా చనిపోవడం జరిగింది. సుజాత అతి చిన్న వయసులో భర్త ను కోల్పోయి ఇద్దరు పిల్లలతో నిరాశ్రయురాలుగా జీవనం గడుపుతున్నది. పేదరికంలో ఉన్నారని వీరికి సంబంధించిన వివరాలు తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పట్టాపురం ఏకాంతం గౌడ్ మరియు జనగామ జిల్లా అధ్యక్షులు గడ్డం రాజు గౌడ్ గారి ద్వారా విషయం తెలుసుకున్న. కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా టెస్ట్ సభ్యులు వెంటనే వారి కుటుంబానికి రూ.20 వేల ఖరీదు గల కుట్టు మిషన్ మరియు గార్మెంట్స్ ను సాయం చేశారు ఈరోజు గడ్డం రాజు గౌడ్, మరియు పట్టాపురం ఏకాంత గౌడ్ KANA స్థానిక వాలంటీర్లు నాతి గణేష్ వారి సహకారంతో అందజేశారు. ముందుకి వచ్చి సహాయం చేసినందుకు KANA కానా సంస్థని తెలంగాణ గౌడ సంఘం ప్రతినిధులు మరియు నల్లవెల్లి గ్రామ గౌడ సంఘం తరపున కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర నల్లబెల్లి గ్రామం మాజీ సర్పంచ్ ముత్యం సంపత్ గౌడ్ గౌడ సంఘం గిరగాని యాదగిరి గౌడ్ ముత్యం పాపయ్య అంబాల సంపత్ గౌడ్ అంబాల యాకన్నా బొమ్మెర రాజు గౌడ్ బొమ్మెర ఎల్లగౌడ్ ముత్యం అనిల్ సంఘ సభ్యులు పాల్గొన్నారు

రూ. 45లక్షల విలువ గల ఎర్రచందనం స్వాధీనం.

*రూ. 45లక్షల విలువ గల ఎర్రచందనం స్వాధీనం..

*కారులో అక్రమ రవాణా చేస్తుండగా 112 ఎర్రచందనం దుంగలు పట్టుకున్న టాస్క్ ఫోర్స్…

*ఇద్దరు స్మగ్లర్లు అరెస్టు..

*కారును స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు..

తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 13:

తిరుపతి జిల్లా పుత్తూరు అటవీ ప్రాంతంలో అక్రమ రవాణా చేస్తున్న 112 ఎర్రచందనం దుంగలతో పాటు, రవాణాకు ఉపయోగించిన కారును తిరుపతి ఎర్రచందనం టాస్క్ ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకుని, దీనికి సంబంధించి ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్ సుబ్బారాయుడు ప్రత్యేక కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్ అదేశాల మేరకు డీఎస్పీ (ఆపరేషన్స్)
జి. బాలిరెడ్డి మార్గనిర్దేశకత్వంలో ఆర్ఐ సాయి గిరిధర్ కు చెందిన ఆర్ఎస్ఐ కేఎస్ కే లింగాధర్ టీమ్ స్థానిక అటవీ అధికారులు వడమాలపేట, నారాయణవనం ఎఫ్బీఓలు కుమారస్వామి, నూర్ అబ్జలాల్ ల సహకారంతో పుత్తూరు మీదుగా నారాయణవనం వరకు ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లను తనిఖీ చేసుకుంటూ వెళ్లారు. బుధవారం తిరుమలకుప్పం మెయిన్ రోడ్డులోని రామసముద్రం గ్రామం వద్ద వాహనాలను తనిఖీ చేపట్టారు. వాహనాల తనిఖీలను గమనించిన ఇద్దరు వ్యక్తులు వారి వాహనం దిగి పారిపోడానికి ప్రయత్నించారు. టాస్క్ ఫోర్సు పోలీసులు వెంటనే స్పందించి, వారిని వెంబడించి పట్టుకున్నారు. వాహనం తనిఖీ చేయగా అందులో 112ఎర్రచందనం దుంగలు లభించాయి. వీటి విలువ సుమారు రూ. 45లక్షలు ఉంటుందని అంచనా వేశారు. దుంగలతో పాటు స్మగ్లర్లను తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ కు తరలించగా, ఎస్ఐ రఫీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version