ఎక్సైజ్ కార్యాలయంలో వాహనాల వేలం.

ఎక్సైజ్ కార్యాలయంలో వాహనాల వేలం

కల్వకుర్తి నేటి దాత్రి:

కల్వకుర్తి పట్టణం లోని ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఈనెల 30వ తేదీన వాహనాల వేలంపాట నిర్వహిస్తున్నామని ఎక్సైజ్ సిఐ వెంకట్ రెడ్డి బుధవారం తెలిపారు. ఎక్సైజ్ కేసులో పట్టుబడిన ఆటోలు, బైకులు వాహనాలను వేలం నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 10 గంటలకు వేలంపాట ఉంటుందన్నారు. ఆసక్తి ఉన్నవారు డిపాజిట్ చేసి వేలం పాటలో పాల్గొనాలని సూచించారు.

నాటుసారాతో పట్టుబడిన వ్యక్తులను బైండొవర్ చేసిన.

నాటుసారాతో పట్టుబడిన వ్యక్తులను బైండొవర్ చేసిన

ఎక్సైజ్ ఎస్ ఐ సాయి కుమార్

ముత్తారం :- నేటి ధాత్రి

 

ముత్తరం మండలంలో గతంలో నాటు సారాయి కేసులలో పట్టుబడిన పారుపల్లి లక్కారం మచ్చుపేట ఖమ్మం పల్లి అడవి శ్రీరాంపూర్ గ్రామాలలోని వ్యక్తులను ఇకమీదట నాటు సారాయి అమ్మకుండా ఉండటానికి ఒక సంవత్సర కాలం పాటు ఒక లక్ష రూపాయల జరిమానతో తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి దగ్గర బైండోవర్ చేయడం జరిగిందని ఎక్సైజ్ ఎస్ ఐ సాయి కుమార్ తెలిపారు ఈ కార్యక్రమం లో ఎక్సైజ్ సిబ్బంది నిరంజన్ శ్రీనివాస్ రవి పాల్గొన్నారు

జాన్ పాకలో ఎక్సైజ్ దాడులు,ఇద్దరిపై కేసు నమోదు.

జాన్ పాకలో ఎక్సైజ్ దాడులు,ఇద్దరిపై కేసు నమోదు.  

పరకాల నేటిధాత్రి

గుడుంబా నిర్ములన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా శనివారంరోజున పరకాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని జాన్ పాక శివారులో దాడులు నిర్వహించారు.గుడుంబా తయారీ కోసం నిల్వ ఉంచిన 500 లీటర్ల షుగర్ పానకం ను ధ్వంసం చేసి,5 లీటర్ల గుడుంబా,25 కేజీల షుగర్ ను స్వాధీనం చేసుకొని బాదావత్ శ్రీను,బానోత్ సురేష్ ల పై కేసు నమోదు చేసినట్టు సీఐ తాతజీ తెలిపారు.ఈ దాడులలో ఎక్సైజ్ ఎస్ఐ వై.జ్యోతి
సిబ్బంది లక్ష్మణ చారి,రవీందర్,సమ్మయ్య,విజయ్ కుమార్ పాల్గొన్నారు.

పరకాల ఎక్సైజ్ స్టేషన్ లో వాహనాల వేలం.

పరకాల ఎక్సైజ్ స్టేషన్ లో వాహనాల వేలం

పరకాల నేటిధాత్రి

పరకాల నందు వివిధ నేరాల పై పట్టుబడిన వాహనాలను జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి వరంగల్ రూరల్ ఆదేశానుసారం బుధవారం రోజున ఉదయం 11గంటలకు ప్రోహిభిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరకాల నందు వేలం నిర్వహించడం జరుగుతుందని కావున ఆసక్తి కలిగినవారు వాహనం అప్ ప్రైస్ పై 50శాతం డిపాజిట్ గా చెల్లించి వేలం లో పాల్గొనవచ్చని ఎక్సయిజ్ సిఐ
పి.తాతాజీ తెలిపారు.

గీసుకొండ మండలం లో ఎక్సైజ్ దాడులు 5 అరెస్ట్.

గీసుకొండ మండలం లో ఎక్సైజ్ దాడులు ఐదుగురు అరెస్ట్

పరకాల నేటిధాత్రి

 

 

ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఆదేశానూసారం గుడుంబా నిర్మూలన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా శనివారంరోజున పరకాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని గీసుకొండ,మనుగొండ,ఎలుకుర్తి ల లో దాడులు నిర్వహించి గీసుకొండ కు చెందిన పోలేపాక సబిత,కోట స్రవంతి,ఎలుకుర్తి కి చెందిన బొడిగే దేవేంద్ర,బొల్లు సాంబ లక్ష్మి,మనుగొండ కు చెందిన ఎంబడి మల్లమ్మ లను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి (25) లీటర్ల గుడుంబా ను స్వాధీనం చేసుకున్నారు.ఈ దాడులలో ఎస్ఐ జ్యోతి,సిబ్బంది లక్ష్మణ చారి, విజయ్ కుమార్ పాల్గొన్నారు.

వైన్స్ ను తనిఖీ చేసిన ఎక్స్సైజ్ అధికారులు.

— వైన్స్ ను తనిఖీ చేసిన ఎక్స్సైజ్ అధికారులు

నిజాంపేట: నేటి ధాత్రి

 

మండలంలోని రెండు వైన్స్ లను రామాయంపేట ఎక్స్సైజ్ సీఐ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం తనిఖీ చేశారు. మద్యం షాపులో రికార్డులను పరిశీలించి మాట్లాడారు .. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే మద్యం అమ్మకాలు జరపాలని నిర్వాహకులకు సూచించడం జరిగిందన్నారు. వైన్స్ లో స్టాక్ నిల్వ ఉండేలా చూసుకోవాలని సూచించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో ఎక్స్సైజ్ ఎస్ఐ సిద్దార్థ, సిబ్బంది ఉన్నారు.

పరకాల ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వాహనాల వేలం

పరకాల ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వాహనాల వేలం

 

పరకాల నేటిధాత్రి :

ఎక్సైజ్ స్టేషన్ పరకాల పరిధిలో వివిధ కేసులలో సీజ్ చేయబడిన టువంటి వాహనం లకు బుధవారం రోజున ఉదయం 11 గంటలకు డిస్టిక్ ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ వరంగల్ రూరల్ ఆధ్వర్యంలో పరకాల ఎక్సైజ్ స్టేషన్ నందు వేలం నిర్వహించబడునని ఆసక్తి కలవారు వాహనంలో వేలంలో పాల్గొనవలెనని పరకాల ఎక్సైజ్ సీఐ పి.తాతజీ తెలిపారు

సేఫ్టీ మోకులు ప్రతి గీత కార్మికుడు వినియోగించుకోవాలి : చండూరుఎక్సైజ్ ఇంచార్జ్ సిఐ కుర్మ నాయకులు

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :
సేఫ్టీ మోకులు ప్రతి గీత కార్మికుడు వినియోగించుకోవాలని చండూరు ఎక్సైజ్ ఇంచార్జ్ సిఐ కుర్మ నాయకులు , తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శిజెర్రిపోతుల ధనంజయ గౌడ్ అన్నారు. శుక్రవారంచండూరు మండల పరిధిలోని బోడంగిపర్తి గ్రామంలోసేఫ్టీ మోకులపైగీత కార్మికులకుశిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సేఫ్టీ మోకులు వినియోగించడం వలన ప్రతి గీత కార్మికుడు తాటి చెట్టు ఎక్కేటప్పుడు ప్రమాదం నుండి బయటపడాలంటే కాటమయ్య రక్షణకవచం చాలా అవసరమని ప్రతి గీత కార్మికుడు వినియోగించుకోవాలనివారు తెలిపారు. సేఫ్టీ మోకులు లేకపోవడం వలన చాలామంది గీత కార్మికులు ప్రమాదాలకు గురవుతున్నారని వారు అన్నారు. కల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్టు ఒక వరమని వారు అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం కల్పించినఈ అవకాశాన్ని గీత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని వారు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికుల కోసం సేఫ్టీ మోకులపై తీసుకున్న నిర్ణయాన్ని గీత కార్మికులు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారులు రామారావు, రాకేష్,ఎక్సైజ్ కానిస్టేబుల్ ప్రభాకర్, నల్లగొండ టీంట్రైనర్స్ వీరయ్య, శంకర్ గీత కార్మికులు అంజయ్య, నరసింహతదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version