బెల్లంపల్లి లో రన్ ఫర్ జీసస్.

బెల్లంపల్లి లో రన్ ఫర్ జీసస్.

బెల్లంపల్లి నేటిధాత్రి :

 

 

గుడ్ ఫ్రైడే ఈస్టర్ పండుగల సందర్భముగా యేసు క్రీస్తు ప్రభు మరణ పునరుత్థానములను స్మరించు కొంటూ , బెల్లంపల్లి నియోజకవర్గ మండలాల్లోని క్రైస్తవ విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొని బెల్లంపల్లి పట్టణంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించారు. బెల్లంపల్లి పట్టణం లోని క్రైస్తవ మత పెద్దలు రెవ సి హెచ్ అశోక్, ఫాదర్ కురియన్, జార్జ్ మాత్యు , జోషి, స్వామి జాకబ్ వారి ఆద్వర్యం లోని సంఘాల విశ్వాసులు ప్రార్ధనా పూర్వకంగా పాల్గొని కార్యక్రం జయప్రదం చేశారు.

జహీరాబాద్ లో రన్ ఫర్ జీసస్.

జహీరాబాద్ లో రన్ ఫర్ జీసస్.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

 

 

జహీరాబాద్ పట్టణంలో శనివారం మెథడిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా చర్చి వద్ద ప్రత్యేక ప్రార్ధన నిర్వహించి, ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఈ ర్యాలీ రైల్వే గేట్ వరకు, అక్కడి నుండి పస్తపూర్ కూడలి వరకు, తిరిగి మెథడిస్ట్ చర్చ్ గార్డెన్ నగర్ వరకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో క్రైస్తవ మతపెద్దలు, భక్తులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

ఈ నెల 19 నజహీరాబాద్ లో రన్ ఫర్ జీసస్.

ఈ నెల 19 నజహీరాబాద్ లో రన్ ఫర్ జీసస్.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణం లో ఈ నెల 19 న రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని నిర్వహకులు తెలిపారు. ఉదయం 6:30 నిముషాలకు స్థానిక ఎం ఆర్ ఎచ్ ఎస్ గ్రౌండ్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు ఉంటుంది అని తెలిపారు. నియోజకవర్గం కు చెందిన క్రిస్టియన్ యూత్ అధిక సంఖ్య లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version