కబడ్డీ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా పోలేపాక జనార్ధన్.

తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా పోలేపాక జనార్ధన్

ములుగు జిల్లా, నేటిధాత్రి

ములుగు జిల్లా పత్తిపల్లి గ్రామస్తుడైన పోలేపాక జనార్దన్ చిన్నప్పటినుండి గురుకులంలో చదువుకుంటూ కబడ్డీలో రాణిస్తూ చాలా రోజులుగా ములుగు జిల్లా కబడ్డీ అసోసియేషన్ లో సెక్రెటరీ గ ఉంటూ అదనంగా జనార్ధన్ కు తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గ ఎన్నిక కావడం జరిగింది. పోలెపాక జనార్దన్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో నాకు బాధ్యతలు అప్పగించినందుకు అదేవిధంగా దీనికి ప్రత్యక్షంగా తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాసాని వీరేశం అదేవిధంగా రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ సెక్రెటరీ మరియు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇండియన్ కబడ్డీ ప్లేయర్ కబడ్డీ రథసారథి మహేందర్ కి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం.

లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

రామడుగు, నేటిధాత్రి:

 

 

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లయన్స్ క్లబ్ ఆఫ్ గోపాలరావుపేట వారి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం జరిగినది. అధ్యక్షులుగా రాంపల్లి శ్రీనివాస్ కార్యదర్శిగా పాకాల మోహన్, కోశాధికారిగా గొడుగు అంజయ్యలను ఎన్నుకున్న అనంతరం ప్రమాణస్వీకారం చేశారు. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మోర బద్రేషం, రీజియన్ చైర్మన్ కొల్లూరి జితేందర్, జోన్ చైర్మన్ కర్ర ప్రభాకర్ రెడ్డి, డిస్ట్రిక్ట్ మైక్రో కాబినెట్ మెంబెర్ గోలి మధుసూదన్ రెడ్డి, ప్రోగ్రాం చైర్మన్ కర్ర శ్యాంసుందర్ రెడ్డి, కోచైర్మన్ కొడిమ్యాల వెంకటరమణ, రీజియన్ సెక్రెటరీ యం.మల్లేశం, డైరెక్టర్స్ కర్ర రాజిరెడ్డి, ముదుగంటి రాజిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, చాడ దామోదర్ రెడ్డి, కోట్ల మల్లేశం, మచ్చ గంగయ్య, మోర కేత, శారద, కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల ను గెలిపించండి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్

రామడుగు నేటిధాత్రి:

భారతీయ జనతా పార్టీ రామడుగు మండల శాఖ వెంకట్రావుపల్లి శక్తి కేంద్రం ఇంఛార్జి బద్ధం లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో లక్ష్మీపూర్ గ్రామంలో వికసిత భారత్ రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్, మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ లు హాజరై మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్రమోదీ బీజేపీ ప్రభుత్వంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్రంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విఫలం అయిందని, రెండున్నర సంవత్సరాలు పూర్తి కాకముందే కాంగ్రెస్ పాలనను ప్రజలు చీకొడుతున్నారన్నారు. తెలంగాణలో త్వరలో జరుగబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని వారు కోరారు. తెలంగాణ వచ్చే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమేనని వారు జోస్యం చెప్పారు. బీజేపీ పాలనలో ప్రజలు సురక్షితంగా ఉన్నారని తెలిపారు. ఈకార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శిలు పోచంపెల్లి నరేష్, పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, బూత్ కమిటీ అధ్యక్షులు గుర్రం శ్రీనివాస్ గౌడ్, దైవల తిరుపతి గౌడ్, మడికంటి శేఖర్, యువ మోర్చా మండల అధికార ప్రతినిధి వంచ మనోజ్, మల్లయ్య, గోపు అనంత రెడ్డి, నాయకులు, ప్రజలు, తదితరులు హాజరయ్యారు.

సిరిసిల్ల పట్టణ బిజెపి నూతన కార్యవర్గం నియామకం.

సిరిసిల్ల పట్టణ బిజెపి నూతన కార్యవర్గం నియామకం

సిరిసిల్ల టౌన్(నేటిధాత్రి):

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డి బోయిని గోపి ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణ శాఖ నూతన బిజెపి కార్యవర్గం నియమించడం జరిగినది. ఇందులో భాగంగా ఉపాధ్యక్షులుగా మోర శ్రీహరి మరియు అంకారపు రాజు, కాంభోజ శ్రీధర్, పల్లికొండ నరసయ్య, ప్రధాన కార్యదర్శిగా కొండ సురేష్, మేర్గు శ్రీనివాస్, పట్టణ కార్యదర్శులుగా కోడంతవి సురం వినయ్ పంపరి అర్జున్, కోడం శ్రీనివాస్, కోశాధికారిగా ఇoజపురి మురళి బిజెపి సిరిసిల్ల పట్టణ శాఖగా నియమితులయ్యారని జిల్లా బిజెపి అధ్యక్షుడు తెలిపారు.

కోహీర్ మండల ఫొటో వీడియో గ్రఫీ నూతన కార్యవర్గం ఏక గ్రీవంగా ఎన్నిక.

కోహీర్ మండల ఫొటో వీడియో గ్రఫీ నూతన కార్యవర్గం ఏక గ్రీవంగా ఎన్నిక…

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లాలో ని జహీరాబాద్ నియోజకవర్గ కోహీర్ మండలం ఫొటో వీడియో గ్రఫీ నూతన కమిటీ ఏర్పాటు చేసారు.. మండలం లోని ఆయా గ్రామ ల ఫొటో వీడియో గ్రాఫర్లు గురువారం నాడు సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్ను కున్న కమిటీ ని అందరు ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు కోహీర్ మండల ఫొటో వీడియో సంక్షేమ కార్యవర్గ వ్యవస్థాపకులుగ శ్యామ్ రావు, అధ్యక్షులు రచన్న,ప్రధాన కార్యదర్శి రాజు,కోశాధికారి పరమేష్,సoయక్త సహాయ కార్యదర్శులు సంజువు, ప్రవీణ్ కుమార్, సంయుక్త కోశాధికారి కృష్ణ,ఉపాధ్యక్షలు ప్రకాష్, రాజు జనార్దన్ ఆర్గానేజర్ సెక్రటరీ శేఖర్, నవీన్ కుమార్, లక్ష్మాన్, నాగరాజు, మీడియా ఇంచార్జి కె.అశోక్, కార్యవర్గ సభ్యులు రవి, జకీర్, నందు, కాశినాథ్, వినోద్,ఎన్నుకొన్నారు.

నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం.

నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం నిర్వహించడం జరిగింది

జహీరాబాద్ నేటి ధాత్రి:

శ్రీ సిద్దేశ్వర స్వామి దేవస్థానం అల్గోల్ రోడ్ జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం నిర్వహించడం జరిగింది . దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు ఈవో శివ రుద్రప్ప ఆధ్వర్యంలో సభ్యులు వి ప్రభాకర్ గౌడ్ కే సురేందర్ రెడ్డి రమేష్ బాబు బరోరు లక్ష్మి బి. శ్రీనివాస్ అఫీషియల్ మెంబర్ ఎం సంగమేశ్వర స్వామి స్వీకారం చేయడం జరిగింది.

కనపర్తి గ్రామ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక.

కనపర్తి గ్రామ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక

రేగొండ, నేటిధాత్రి

 

రేగొండ మండలం కనపర్తి గ్రామ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గంతో పాటు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల కమిటీలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశానుసారం ఎన్నుకున్నట్లు కనపర్తి ఎంపీటీసీ పరిధి ఇంఛార్జ్ బోయిన వినోద్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా శ్రీపతి మల్లయ్య, ఉపాధ్యక్షుడిగా రమేష్, భరత్, ప్రధాన కార్యదర్శిగా ప్రకాష్ మరియు యూత్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడిగా కర్ణాకర్ ను ఎన్నుకున్నట్లు వినోద్ తెలిపారు. వినోద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేరవేసే విధంగా చొరవ చూపాలని కోరారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో భూపాలపల్లి మరింతగా అభివృద్ధి చెందుతున్నారు. నూతనంగా ఎన్నికైన గ్రామ కమిటీ అధ్యక్షుడు మల్లయ్య మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.

రాయపల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక.

రాయపల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక

నేటిధాత్రి, రేగొండ..

 

 

రేగొండ మండలంలోని రాయపల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశానుసారం ఎన్నుకున్నట్లు కనపర్తి ఎంపీటీసీ పరిధి ఇంఛార్జ్ బోయిన వినోద్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా గుర్రం జగన్, ఉపాధ్యక్షుడిగా దండవేన రమేష్, రాజయ్య, సాంబయ్య, ప్రధాన కార్యదర్శిగా మంద మొగిలి, క్యాతం రమేష్, అశోక్ ను ఎన్నుకున్నట్లు వినోద్ తెలిపారు. వినోద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేరవేసే విధంగా చొరవ చూపాలని కోరారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో భూపాలపల్లి మరింతగా అభివృద్ధి చెందుతున్నారు. నూతనంగా ఎన్నికైన గ్రామ కమిటీ అధ్యక్షుడు సాగర్ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు..ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు క్యాతం సదయ్య, పున్నం రవి, బొజ్జం రవి, తదితరులు పాల్గొన్నారు.

సోమశిల పుణ్యక్షేత్రంలో టీ యూ డబ్ల్యూ జె ఐ జే యు.!

సోమశిల పుణ్యక్షేత్రంలో టీ యూ డబ్ల్యూ జె ఐ జే యు రాష్ట్ర కార్యవర్గ సమావేశం

వనపర్తి నేటిదాత్రి :

సోమశిల శివుని పుణ్యక్షేత్రంలో టీ యూ డబ్ల్యూజే ఐ జే యు విలేకరుల సమావేశం
నిర్వహించారు ఈ సమావేశములో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి జాతీయ నాయకులు దేవులపల్లి అమర్ రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణ రాష్ట్ర కార్యదర్శి గుండ్రాతి మధు గౌడ్ పాల్గొన్నారు . రాష్ట్ర విలేకరుల కమిటీ సోమశీల లో సమావేశం నిర్వహించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి దేవులపల్లి అమర్ ను విలేకరులు సన్మానించారు.ఈ కార్యక్రమంలో టి యు డబ్ల్యూ జే ఐ జే యు మాజీ జాతీయ కౌన్సిల్ సభ్యులు సీనియర్ విలేకరులు మల్యాల బాలస్వామి పోలిశెట్టి బాలకృష్ణ కొంతం ప్రశాంత్ డి మాధవరావు కల్వరాల రాజేందర్ విజయ్ డి మన్యం అంజి వహీద్ నరసింహ రాజు శ్రీనివాసరావు నాకొండ అరుణ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉమ్మల్ల రాములు  పాల్గొన్నారు

సిరిసిల్ల జిల్లా (IAP) చిన్నపిల్లల వైద్యుల.!

సిరిసిల్ల జిల్లా (IAP) చిన్నపిల్లల వైద్యుల కార్యవర్గం ఎన్నిక. 

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి )

 

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని పిల్లల వైద్యులు (పీడియాట్రిషియన్లు) ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (IAP) రాజన్న సిరిసిల్ల శాఖ కొత్త కార్యవర్గం బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అధ్యక్షుడిగా డా. నల్ల మధు మరియు జనరల్ సెక్రటరీగా డా. తడుకా సాయికుమార్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రానున్న సంవత్సరానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికపై చర్చలు జరిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రముఖ సీనియర్ పిల్లల వైద్యులు డా. కె ప్రసాద్ రావు, డా. మురళీధర్ రావు, డా. శ్రీనివాస్, డా. సురేంద్రబాబు గారులతో పాటు, ఇతర పీడియాట్రిషియన్లు పాల్గొన్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమం ద్వారా( IAP) రాజన్న సిరిసిల్ల శాఖ సామూహిక కార్యకలాపాల శక్తివంతమైన ఆరంభాన్ని సూచిస్తూ, భవిష్యత్తులో పిల్లల ఆరోగ్య అభివృద్ధికి మరింత తోడ్పాటు అందించనుంది అని వైద్యులు తెలిపారు.

BJP కిసాన్ మోర్చా మండల కార్యవర్గo ఎన్నిక.

భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మండల కార్యవర్గo ఎన్నిక

చందుర్తి, నేటిధాత్రి:

ఈ రోజు చందుర్తి మండల కేంద్రంలో బీజేపీ మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు చింతకుంట సాగర్ ఆధ్వర్యంలో నూతన మండల కమిటీ నియామకం చేయడం జరిగింది. ఇందులో ప్రధాన కార్యదర్శి గా ముడపెల్లి ముకేష్ (మల్యాల ), ఉపాధ్యక్షులు గా బోరగాయ తిరుపతి (జోగాపూర్ ) బంబోతుల ప్రశాంత్
(మర్రిగడ్డ) లను, కార్యదర్శులు గా నీరటి శేఖర్ (నర్సింగపూర్), పగిడే మల్లేశం (ఎన్గల్ ), లంబ రాకేష్ (మూడపెల్లి ), తోట శంకర్(మూడపెల్లి) లను,
కార్యవర్గ సభ్యులు గా ఈగ శ్రీధర్ (లింగంపేట), అట్టేపెళ్లి సాయి (తిమపూర్) లను నియమించారు.

ఈ నియామకలు తక్షణమే అమలోకి వస్తాయి అని తెలియజేరశారు.
ఈ కార్యక్రమంలో వేములవాడ నియోజకవర్గ బిజెపి కన్వీనర్ మార్తా సత్తయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు సిరికొండ శ్రీనివాస్ మండల అధ్యక్షుడు మొఖిల విజేందర్, మండల ప్రధాన కార్యదర్శిలు పెరుక గంగరాజు,మర్రి మల్లేశం బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ పొంచెట్టి రాకేష్, బిజెపి నాయకులు చింతకుంట గంగాధర్, చినుముల హనుమయ్య చారి, లింగాల రాజయ్య, మట్కా మల్లేశం, పాటి సుధాకర్, చిర్రం తిరుపతి, పెరుక రంజిత్,బద్దం తిరుమల్ రెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షుడు మోతుకుపెల్లి రాజశేఖర్,మెంగాని శ్రీనివాస్, మర్రి రాజు, కుసుంబ లింగ రావు తదితర నాయకులు పాల్గొన్నారు.

నూతనంగా ఎన్నుకోబడిన బిజేపి మండల కార్యవర్గానికి సన్మానం

చందుర్తి, నేటిధాత్రి:

చందుర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు మొకిలె విజేందర్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నుకోబడిన మండల కార్యవర్గ సభ్యులకి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ అసెంబ్లీ కన్వీనర్ మార్త సత్తయ్య పాల్గొని నూతనంగా ఎన్నికైన ఉపాధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులకు, కార్యదర్శులకు,కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ శాలువాతో సన్మానం చేశారు. అనంతరం చందుర్తి మండలంలోని అన్ని గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ ని పటిష్ట పరచాలని కోరారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బిజేపి పార్టి బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించుకోనె విధంగా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఉపాధ్యక్షులుగా. 1 లోకోజీ సతీష్ ( మల్యాల ) 2ఎల్లలా తిరుపతి రెడ్డి రామారావుపల్లి) 3 మట్కo మల్లేశం చందుర్తి ప్రధాన కార్యదర్శులుగా 1 మర్రి మల్లేశం చందుర్తి కార్యదర్శులుగా 1.అయోధ్య పర్షరాములు. జోగాపూర్ 2.కొక్కుల నరేష్ .లింగoపేట 3.నాయుని బాపు రెడ్డి. మరిగడ్డ 4.పత్తిపాక శ్రీనివాస్. మల్యాల కార్యవర్గం సభ్యులు గా 1.గంగిపెల్లి మల్లేశం సనుగుల 2.ఉగిలే శ్రీనివాస్ కిష్టంపేట మరియు కార్యకర్తలు సీనియర్ నాయకులు చిలుముల హనుమయ్య చారి, బద్దం తిరుమల్ రెడ్డి,చిర్ల మహేష్, అజమెరా రవి నాయక్, నరగుల సాగర్, గడ్డం రగు, జలగం శ్రీనివాస్ రావు, సునికి రాజు, ఈగ శ్రీధర్, చక్యాల లక్ష్మి నారాయణ నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version